సంక్షిప్త వార్తలు(5)
వృద్ధులైన పింఛన్దారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ పేర్కొన్నారు.
పెన్షనర్లను మోసం చేయడమే జగన్ లక్ష్యం
ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్
నెల్లూరు, న్యూస్టుడే: వృద్ధులైన పింఛన్దారులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్న జగన్ ప్రభుత్వాన్ని తిప్పికొట్టాలని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ పేర్కొన్నారు. నెల్లూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను రీస్టోర్ చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లెటర్ రాస్తామని జగన్ మనల్ని నమ్మించే ప్రయత్నం చేయనున్నారు. ఎలాగూ వారు అనుమతి ఇవ్వరు. చూశారా నేను ఇద్దామని అనుకుంటే చంద్రబాబు అడ్డుపడ్డారని చెప్పి సానుభూతి పొందాలని చూస్తున్నారు. 1వ తేదీన రావాల్సిన పింఛన్లు రావడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా డీఏ, ఎరియర్స్ ఊసు లేదు’ అని సుబ్బరాయన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
వేతనాల కోసం ఏపీవీవీపీ, ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఎదురుచూపులు
ఈనాడు, అమరావతి: వైద్య విధాన పరిషత్ (ఏపీవీవీపీ), జాతీయ ఆరోగ్య మిషన్ల (ఎన్హెచ్ఎం) కింద పనిచేసే ఉద్యోగులకు మార్చి నెల వేతనాలు ఇప్పటివరకు చెల్లించలేదు. ఏప్రిల్ ప్రారంభమై.. 2 వారాలు గడిచినా వేతనాలు చెల్లించలేదని వారు ఆందోళన చెందుతున్నారు. ఏపీవీవీపీ కార్యాలయాలు, ఆసుపత్రుల్లో సుమారు 14వేల మంది పనిచేస్తున్నారు. వీరికి 010 పద్దు కింద వేతనాలు చెల్లించాలన్న నిర్ణయం తీసుకుని చాలా కాలమైనప్పటికీ...అందుకు తగ్గట్లు తదుపరి చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవడంతో వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు జాతీయ ఆరోగ్య మిషన్ కింద పొరుగు, ఒప్పంద విధానంలో పనిచేసే సుమారు 22 వేల మందికి కూడా మార్చి నెల వేతనాలు ఇంతవరకు ఇవ్వలేదు. ప్రతినెలా కనీసం రూ.70 కోట్ల వరకు వేతనాలుగా చెల్లించాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే కార్యక్రమాల కింద వీరు పనిచేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు సక్రమంగా వస్తున్నా...రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ.. ప్రభుత్వ వాటి ఇంతవరకు జమకాలేదు. ఈ కారణంగానే ప్రస్తుతం వేతనాల చెల్లింపుల్లో జాప్యం జరుగుతోందని ఉద్యోగులు చెబుతున్నారు.
‘ఐకాయ్’తో వాణిజ్య పన్నులశాఖ ఒప్పందం
ఈనాడు-అమరావతి: జీఎస్టీ విధానంపై ఉద్యోగులకు శిక్షణ, సాంకేతిక నైపుణ్యం మెరుగుదల నిమిత్తం ‘ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐకాయ్)తో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రెండేళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమం మంగళగిరిలోని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ మాట్లాడుతూ.. ఆడిటర్లు, పన్నుల శాఖ అధికారులు ఉత్తర, దక్షిణ ధ్రువాలనే అభిప్రాయాన్ని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. డివిజన్, రాష్ట్రస్థాయిలో ట్రేడ్ అడ్వయిజరీ కమిటీలు ఏర్పాటు చేశామని.. విధానపరమైన నిర్ణయాలు, సాంకేతికత ఆధారంగా పన్ను ఎగవేసే వారిని గుర్తిస్తున్నట్లు తెలిపారు. వ్యక్తుల ప్రమేయాన్ని నియంత్రిస్తూ డేటా అనలిటిక్ సెంటర్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. తాజా ఒప్పందం ద్వారా అపోహలు తగ్గుతాయని, పన్ను చెల్లింపు వ్యవస్థను పటిష్ఠం చేసేందుకు పరస్పరం సహకరించుకోవాలని పేర్కొన్నారు. ఐకాయ్ కార్యదర్శి జయకుమార్ భాత్ర, ఐకాయ్ జీఎస్టీ, పరోక్ష పన్నుల కమిటీ ఛైర్మన్ సుశీల్కుమార్ గోయల్, వైస్ఛైర్మన్ రాజేంద్రకుమార్ మాట్లాడుతూ.. ‘ఆత్మ నిర్భర్ భారత్’ కార్యక్రమంలో తాము ముఖ్య భాగస్వామిగా ఉన్నట్లు తెలిపారు. గోవా, జమ్మూకశ్మీర్ రాష్ట్రాలతోనూ ఇలాంటి ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సీనియర్ అధికారులు రమేశ్, కృష్ణమోహన్రెడ్డి, రవిశంకర్ పాల్గొన్నారు.
22న కృష్ణా బోర్డు సమావేశం
ఈనాడు, హైదరాబాద్: కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) సమావేశం ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయిపురే తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సమాచారం పంపారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి బోర్డుకు సంబంధించిన బడ్జెట్పై ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించనున్న ఈ సమావేశంలో బోర్డు ఛైర్మన్ శివ్నందన్ కుమార్, తెలంగాణ నీటిపారుదల కార్యదర్శి, ఏపీ జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి పాల్గొననున్నారు.
రాష్ట్రంలో పట్టుబడిన సొత్తు రూ.125.96 కోట్లు
ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో మొత్తం రూ.125.96 కోట్లు పట్టుబడినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా వెల్లడించారు. ఇందులో రూ.32.15 కోట్ల నగదు, రూ.19.72 కోట్ల విలువైన మద్యం, రూ.4.06 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.57.14 కోట్ల విలువైన ప్రెషస్ మెటల్స్, రూ.12.89 కోట్ల విలువైన ఇతర వస్తువులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు