ఆధారాల కోసం ఆపసోపాలు!
ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడి ఘటనకు సంబంధించి 48 గంటలు గడిచినా పోలీసులు ఎటువంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ ఘటనపై సీపీ కాంతిరాణా 8 బృందాలతో ప్రత్యేక దర్యాప్తు చేయిస్తున్నారు.
జగన్పై రాయి దాడి కేసులో సీసీ కెమెరాలు, వీడియోల్లో కనిపించని నిందితుడి జాడ
అనుమానితుల ఇంటరాగేషన్లోనూ బయటపడని క్లూ
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్పై రాయి దాడి ఘటనకు సంబంధించి 48 గంటలు గడిచినా పోలీసులు ఎటువంటి ఆధారాలు సంపాదించలేకపోయారు. ఈ ఘటనపై సీపీ కాంతిరాణా 8 బృందాలతో ప్రత్యేక దర్యాప్తు చేయిస్తున్నారు. గంజాయి బ్యాచ్, సస్పెక్ట్, రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు, తదితర 100 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నా ఇప్పటి వరకు ఒక్క ఆధారం కూడా దొరకలేదు. ఆ మార్గంలోని సీసీ కెమెరాల్లో దృశ్యాలను పరిశీలించినా, రోడ్షోకు వచ్చినవారు చిత్రీకరించిన వీడియోలను కూడా తరచిచూసినా ఫలితం శూన్యం. సీఎంపై రాయి పడిన సమయంలో జగన్ కాన్వాయ్ డాబా కొట్ల రోడ్డులోని వివేకానంద పాఠశాల వద్దకు చేరింది. ఆ పాఠశాల వైపు నుంచే అరచేతిలో పట్టేంత రాయి వచ్చిందని.. తొలుత సీఎంకు, తర్వాత మాజీ మంత్రి వెలంపల్లికి తగిలిందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఆ సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో రాయి ఎవరు వేశారనేది తెలియడం లేదు.
షెడ్యూల్లో లేకపోయినా బస్సెక్కి జగన్ అభివాదం
విజయవాడలో ‘మేమంతా సిద్ధం’ రోడ్షోలో నాలుగు చోట్ల మాత్రమే సీఎం ఓపెన్ టాప్పై నిలబడి అభివాదం చేస్తారని, మిగతా అన్ని చోట్ల బస్సులో నుంచే చేయి ఊపుతారని వైకాపా షెడ్యూల్ తయారు చేసినట్లు సమాచారం. కానీ జగన్ నగరంలో షో జరిగిన దాదాపు 22 కి.మీ. మేర ఓపెన్ టాప్పైనే నిలబడ్డారు. అన్నీ రద్దీ ప్రాంతాలు కావడం, బస్సుపైన నిలబడితే చేతికందే ఎత్తులోనే కరెంటు తీగలు ఉండడంతో విద్యుత్తు సరఫరా ఆపేశారు. ఆ చీకట్లోనే రాయి దాడి జరిగిందని పోలీసులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
సంక్షిప్త వార్తలు
జీతాలు ఎప్పుడు పడతాయో తెలియట్లేదని చెప్పినందుకు నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కరణం హరికృష్ణను సస్పెండ్ చేయడం సరికాదని రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకాల కొండయ్య మండిపడ్డారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!