జగన్పై రాయితో దాడి చేస్తే హత్యాయత్నమా?
ముఖ్యమంత్రి జగన్పైకి విజయవాడలో ఎవరో ఆగంతకుడు రాయి విసరడం... విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా దృష్టిలో హత్యాయత్నం.
అదే చంద్రబాబుపై జరిగితే పూలతో వచ్చి తగిలిందంటారా?
అప్పుడూ, ఇప్పుడూ సీపీగా ఉన్నది కాంతిరాణానే
చంద్రబాబుపై దాడి దర్యాప్తులో మాత్రం బాధ్యతారాహిత్యం
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్పైకి విజయవాడలో ఎవరో ఆగంతకుడు రాయి విసరడం... విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా దృష్టిలో హత్యాయత్నం. ఆ ఘటన తీవ్రత, పరిస్థితుల్నిబట్టే ఐపీసీ సెక్షన్ 307 కింద హత్యాయత్నం కేసు నమోదు చేశామని సోమవారం ఆయన విలేకర్లతో చెప్పారు. ముఖ్యమంత్రికి పూలదండ వేసినప్పుడు గాయమైందని అంటున్నారు కదా అని విలేకర్లు ప్రశ్నిస్తే.. కాదు, రాయి విసరడం వల్లే దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. రాయి ఎవరు విసిరారో, ఎలా విసిరారో తెలియకుండానే, దాడి చేసిన దుండగుల్ని పట్టుకోకుండానే, సీఎంకి తగిలిందని చెబుతున్న రాయి దొరక్కుండానే, దర్యాప్తు కొలిక్కి రాకముందే.. అది రాయి దాడేనని ఆయన తేల్చేశారు.
2022 నవంబరు 4న మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నందిగామలో రాళ్ల దాడి జరిగింది. ప్రమాదాన్ని పసిగట్టి చంద్రబాబుకు అడ్డుగా నిలబడిన ముఖ్య భద్రతాధికారి మధుసూదనరావు గెడ్డానికి ఓ రాయి బలంగా తగలడంతో రక్తగాయమైంది. చంద్రబాబుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అప్పుడూ ఇదే కాంతిరాణా సీపీగా ఉన్నారు. చంద్రబాబుపైకి పూలు వేసినప్పుడు.. వాటితో పాటు రాయి వచ్చి ఉండొచ్చని ఆయన ఆ ఘటనను తేలిక చేసి మాట్లాడారు. ఆ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. వెంటనే కేసు కూడా నమోదు చేయలేదు. తెదేపా నేతలు ఒత్తిడి పెంచడంతో అతి కష్టం మీద సెక్షన్ 324 (ప్రమాదకర ఆయుధంతో దాడి) కింద కేసు కట్టారు. ఇంత వరకు నిందితులెవరో గుర్తించలేదు. అసలా కేసు దర్యాప్తు జరుగుతుందో లేదో కూడా తెలీదు.
ఒకే సీపీ.. ఒకే తరహా ఘటనలు.. స్పందన మాత్రం వేరు
అప్పుడూ, ఇప్పుడూ సీపీ ఒక్కరే. జరిగింది ఒకే తరహా ఘటనలు. ఒకరు ప్రస్తుత ముఖ్యమంత్రి. మరొకరు జెడ్ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి. కానీ అప్పుడూ, ఇప్పుడూ సీపీ స్పందించిన తీరే ఆయన ఏకపక్ష వైఖరికి అద్దం పట్టింది. ఎంత అధికార పార్టీతో అంటకాగితే మాత్రం.. బాధ్యతాయుతమైన పోలీసు కమిషనర్ పోస్టులో ఉన్న అధికారి స్పందించేది ఇలాగేనా? తన వైఫల్యాల్ని, పక్షపాతధోరణిని ప్రశ్నించిన మీడియా, విపక్షాలపై కాంతిరాణా ఎన్నికల సంఘానికే ఫిర్యాదు చేశారే.. తమపై నిరాధార, అసత్య ఆరోపణలు చేస్తున్నారని గింజుకున్నారే..! పోలీసు నాయకత్వాన్ని ఆత్మరక్షణలో నెట్టేయడానికి అవమానకరమైన ఆరోపణలతో కథనాలు రాస్తున్నారని తెగ బాధపడిపోయారే..! పోలీసు అధికారులు ఏ పార్టీకీ కొమ్ముకాయకుండా, నిష్పాక్షికంగా వ్యవహరిస్తే ఎవరైనా వారిని ఎందుకు తప్పుపడతారు? మీరు ఏ మాత్రం నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదనడానికి... సీఎం జగన్, ప్రతిపక్షనేత చంద్రబాబుపై దాడి జరిగిన సందర్భాల్లో మీరు స్పందించిన తీరే అద్దంపడుతోంది కదా!
ఇది మీ ఘోర వైఫల్యం కాదా?
విజయవాడ నడిబొడ్డున, పోలీసు కమిషనర్ నివాసానికి ఐదు కి.మీ.ల దూరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతలో ఉండే ముఖ్యమంత్రిపై ఎవరో ఆగంతకుడు రాయితో దాడి చేయడం, జెడ్ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే ప్రధాన ప్రతిపక్షనేత చంద్రబాబుపై రాయితో దాడిచేసిన దుండగుల్ని ఏడాదిన్నరైనా ఇప్పటికీ పట్టుకోలేకపోవడం సీపీగా కాంతిరాణా ఘోర వైఫల్యమే. చిన్నదైనా, పెద్దదైనా ముఖ్యమంత్రిపై దాడి ఘటనే జరగకూడదు. ప్రతి ఒక్కరూ దాన్ని ఖండించాల్సిందే. తీవ్రంగా పరిగణించాల్సిందే. ముఖ్యమంత్రిపై దాడి ఘటనకు ఘోర భద్రతా వైఫల్యమే కారణం. కానీ దానికి బాధ్యత తీసుకోవడానికి కాంతి రాణా సిద్ధంగా లేరు. ఆయనపై చర్యలు తీసుకోవాల్సిన సీఎస్, డీజీపీ, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వంటివారు మౌనంగా ఉన్నారు. కాంతిరాణా ప్రభుత్వ పెద్దలకు అస్మదీయుడు కాబట్టి ఆయనపై చర్య తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేకపోవచ్చు. సీఎంపై దాడికి సంబంధించి రెండు రోజుల తర్వాతైనా సీపీ మీడియా ముందుకొచ్చారు. ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు. జగన్కి రాయి తగులుతున్న దృశ్యాల సీసీటీవీ ఫుటేజ్ను మరింత మెరుగ్గా చూపేందుకు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించినట్టు చెప్పారు. రాయి విసిరిన వారి ఆచూకీ చెప్పినవారికి రూ.2 లక్షల రివార్డూ ప్రకటించారు.
మరి అప్పుడెందుకు స్పందించలేదు?
మరి తెదేపా అధినేత చంద్రబాబుపై దాడి జరిగి ఇన్నాళ్లయినా ఇదే చొరవా, స్పందనా కాంతి రాణా ఎందుకు చూపించలేదు? అప్పట్లోనూ సిట్ ఏర్పాటు చేసి, రివార్డు ప్రకటిస్తే నిందితులు దొరికేవారేమో? చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, మరో పదిహేనేళ్లు ప్రధాన ప్రతిపక్షనేతగా పనిచేసిన సీనియర్ నాయకుడు. గతంలో మావోయిస్టులు క్లెమోర్మైన్స్తో దాడి చేస్తే చంద్రబాబుతో పాటు సహచర నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఆయనకు జెడ్ప్లస్ కేటగిరీ భద్రత కల్పించింది. దక్షిణ భారతదేశంలోనే ఎన్ఎస్జీ దళాల భద్రత కలిగిన ఏకైక నాయకుడు ఆయనే. అలాంటి నేతపై దాడి జరిగితే సీపీ ఎంత వేగంగా స్పందించాలి? అప్పట్లో సీఎస్వో అడ్డుగా వచ్చారు కాబట్టి చంద్రబాబుకు ప్రమాదం తప్పింది. అదే రాయి నేరుగా ఆయనకు తగిలితే ఏమయ్యేది? సీఎం జగన్పైకి విసిరిన రాయి సున్నితమైన ప్రదేశాల్లో తగిలితే ఎంతో ప్రమాదం జరిగేదో అంటూ సీపీ ఆందోళన కనబరిచారు. మరి చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు ఎందుకంతగా స్పందించలేదు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో వాడే ‘సిరా’ చుక్క ఎందుకు చెరిగిపోదు.. ఆసక్తికర విషయాలు
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?