సీబీఐ వెతుకుతున్న నిందితుడు.. సీఎం జగన్ పక్కనే
సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు.
న్యాయమూర్తులపై అసభ్య దూషణల కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డి
నెల్లూరు జిల్లాలో వైకాపాకు మద్దతుగా చురుగ్గా ఎన్నికల ప్రచారం
కావలి ‘మేమంతా సిద్ధం’ సభలో వేదికపై హల్చల్
సీఎం జగన్, విజయసాయిరెడ్డితో కలిసి ఫొటోలు కూడా...
మణి అమెరికాలో ఉన్నారని అప్పట్లో కోర్టుకు చెప్పిన సీబీఐ
అరెస్టుకు ఇంటర్పోల్ సహకారం తీసుకుంటున్నామని వెల్లడి
ఇప్పుడిక్కడ బహిరంగంగా తిరుగుతున్నా పట్టించుకోరు ఎందుకో?
ఈనాడు, అమరావతి: సుప్రీంకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవ్యవస్థను అసభ్యకరంగా దూషిస్తూ, కించపరుస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన కేసులో రెండో నిందితుడైన మణి అన్నపురెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ‘సిద్ధం’ సభల్లో దర్జాగా పాల్గొంటున్నారు. ఇటీవల వరకూ అమెరికాలో ఉన్న ఆయన ప్రస్తుతం స్వదేశానికి తిరిగొచ్చి నెల్లూరు లోక్సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి తరఫున ఉద్ధృత స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మణి అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతుంటే ఆయన ఏకంగా సీఎం జగన్మోహన్రెడ్డి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిలతో కలిసి కులాసాగా ఫొటోలు దిగుతున్నారు. న్యాయమూర్తులను అత్యంత హేయమైన భాషలో దూషిస్తూ, వారికి దురుద్దేశాలు ఆపాదిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినందుకుగాను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 2020 నవంబరులో మణి అన్నపురెడ్డితో పాటు మొత్తం 17 మంది నిందితులపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరిలో కొంతమందిని అరెస్టు చేసింది. మణి అమెరికాలో ఉన్నట్లు గుర్తించి, ఆయన అరెస్టు కోసం సంబంధిత న్యాయస్థానం నుంచి వారంట్ సైతం తీసుకుంది. ఆయన్ను అరెస్టు చేసేందుకు ఎంఎల్ఏటీ (మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ), ఇంటర్పోల్ సహకారం కూడా తీసుకుంటున్నామని సీబీఐ అధికారులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు చెప్పారు. ఆయనపై బ్లూ నోటీసు జారీ చేశామన్నారు. అలాంటి నిందితుడు అమెరికా నుంచి దర్జాగా స్వదేశానికి వచ్చేసి.. బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంటే సీబీఐకి ఎందుకు కనిపించదు? ఎందుకు అరెస్టు చేయట్లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఫేస్బుక్ ఖాతా పేరు, లుక్కు మార్చేసుకుని
సామాజిక మాధ్యమాల్లో న్యాయమూర్తులను దూషిస్తూ పోస్టులు పెట్టిన మణి అన్నపురెడ్డి.. సీబీఐ కేసుతో ఆ ఖాతాలన్నింటినీ తొలగించేశారు. ప్రస్తుతం శివ అన్నపురెడ్డి పేరుతో ఫేస్బుక్ ఖాతా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న ఆంధ్రప్రదేశ్కు వచ్చినట్లు అందులో పోస్టు చేశారు. ఈ 6న నెల్లూరు జిల్లా కావలిలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాల్గొన్న ‘మేమంతా సిద్ధం’ సభకు హాజరైన మణి అన్నపురెడ్డి అలియాస్ శివ అన్నపురెడ్డి.. డయాస్ పాస్ పెట్టుకుని ఏకంగా ర్యాంప్పై తిరిగారు. అక్కడ తీసుకున్న ఫొటోలను ‘మేమంతా సిద్ధం’ అంటూ ఫేస్బుక్లో పెట్టారు. సీఎం జగన్మోహన్రెడ్డి చేతిలో చెయ్యేసి, నెల్లూరు లోక్సభ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డితో కలిసి ఆయన తీసుకున్న ఫొటోనూ అదే రోజు ఫేస్బుక్లో పోస్టు చేశారు. ‘అన్న చెప్పిన లెక్కపై నాకు పూర్తి నమ్మకముంది’ అని దానికి వ్యాఖ్య కూడా జత చేశారు. వైకాపా యూఎస్ఏ కన్వీనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తన ఫేస్బుక్ బయోలో రాసుకున్నారు. ఫేస్బుక్లో మణి అన్నపురెడ్డి గతంలో బట్టతల, చిన్న మీసం, ఫ్రెంచ్కట్ గడ్డంతో కనిపించేవారు. తాజాగా గుండు, పెద్ద మీసాలతో కనిపిస్తున్నారు. పేరు, రూపం రెండూ మార్చేస్తే ఉనికి చిక్కకుండా ఉంటుందనే ఎత్తుగడతోనే ఇలా చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐ వెతుకుతున్న నిందితుణ్ని పక్కనే తిప్పుకొంటున్నారు...
న్యాయమూర్తులను దూషించిన కేసులో సీబీఐ వెతుకుతున్న నిందితుడు తమ పక్కన తిరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఏం చేస్తున్నట్లు? ఆయన్ను దర్యాప్తు సంస్థకు పట్టించాల్సిన బాధ్యత వాళ్లపై లేదా? ఇది నిందితుల్ని కాపాడటం కాకపోతే మరేంటి? న్యాయమూర్తులను దుర్భాషలాడిన వారిని వెనకేసుకురావటం కాకపోతే ఇంకేంటి? చిన్న కేసులోనైనా సరే నిందితులు తప్పించుకు తిరుగుతుంటే... వారి వివరాలు తెలిసినప్పుడు పోలీసులకు, దర్యాప్తు సంస్థలకు తెలియజేయటం పౌరుల బాధ్యత. అలాంటిది ఉన్నత పదవుల్లో ఉన్న అధికార పార్టీ నేతలు.. సీబీఐ వెతుకుతున్న నిందితుడ్ని వెనక తిప్పుకుంటున్నారు. ఆయనకు యూఎస్ఏ వైకాపా కన్వీనర్గా పార్టీ పదవి ఇచ్చారు. న్యాయవ్యవస్థ పట్ల వాళ్లకున్న ‘గౌరవానికి’ ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి!
పోలీసులూ... మీకైనా కనిపించదా?
మణి అన్నపురెడ్డి అలియాస్ శివ అన్నపురెడ్డి కోసం సీబీఐ వెతుకుతోందనేది బహిరంగ రహస్యం. అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి సభల్లో, వైకాపా ఎన్నికల ప్రచారంలో దర్జాగా పాల్గొంటుంటే.. రాష్ట్ర పోలీసులకు కనిపించకపోవటం ఏంటి? నెల్లూరు జిల్లాలో ఆయన గత కొన్ని రోజులుగా విజయసాయిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నా గుర్తించకపోవటమేంటి? ఆయనపై అరెస్టు వారంటున్నా ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ‘న్యాయమూర్తులపై దూషణల కేసులో మీరు వెతుకుతున్న నిందితుడు మా జిల్లాలో తిరుగుతున్నారు’ అని సీబీఐకి సమాచారమివ్వాల్సిన బాధ్యతైనా పోలీసులపై ఉంటుంది కదా! ఎందుకు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు?
ఆ మణి.. ఈ శివ ఒక్కరే
ఫోరెన్సిక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుల అభిప్రాయమిదే
మణి అన్నపురెడ్డి పేరుతో ఉన్న ఫొటోలు, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫొటోల్ని బెంగళూరు, హైదరాబాద్లోని ఫోరెన్సిక్ నిపుణులకు పంపించి వాటిలో ఉన్నది ఒకరేనా? వేర్వేరు వ్యక్తులా? అని అభిప్రాయం కోరగా.. ఒకే వ్యక్తి అని నిర్ధారించారు. ‘మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేర్లతో ఉన్న ఫొటోలను పోల్చి చూస్తే ఆ రెండింటిలో ఉన్న వ్యక్తి ముఖకవళికలు (ఫేషియల్ ఫీచర్స్) ఒకేలా ఉన్నాయి. అయితే ఆ ఫొటోలు వేర్వేరు సంవత్సరాల్లో తీసుకున్నవి’ అని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులకు ఈ ఫొటోలు పంపించగా సాంకేతిక పరిజ్ఞానంతో విశ్లేషించారు. మణి అన్నపురెడ్డి, శివ అన్నపురెడ్డి పేరిట ఉన్న ఫొటోల్లోని వ్యక్తి ఒకరేనని తేల్చి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా