బందిపోటు పాలన
‘నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా.. కేసులు పెట్టేస్తాం.. జైలులో వేసేస్తాం.. భూముల్ని లాక్కుంటాం.. గనులు, పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు.. అది బందిపోట్లు చేసే పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పాలించాలి.
సీఎంను కాబట్టి ఏదైనా చేసేస్తాననే ధోరణి సరికాదు
ఏ చట్టమైనా చేస్తా.. భూములు లాక్కుంటామంటే కుదరదు
గనుల్ని, పరిశ్రమల్ని బంధువులకు అప్పగిస్తాననడమేంటి?
మరో పారిశ్రామిక విప్లవం రాబోతోంది..
దాన్ని అందిపుచ్చుకుని 500 ఏళ్లకు పునాది వేయాలి
అలాంటి పాలకులు రావాలి
ఆర్థిక నిపుణులు, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి.రమేష్
ఈనాడు - అమరావతి
‘నేను సీఎంను కాబట్టి ఏ చట్టమైనా చేస్తా.. కేసులు పెట్టేస్తాం.. జైలులో వేసేస్తాం.. భూముల్ని లాక్కుంటాం.. గనులు, పరిశ్రమల్ని మా వాళ్లకు బదిలీ చేస్తామంటే కుదరదు.. అది బందిపోట్లు చేసే పని. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, చట్టబద్ధంగా పాలించాలి. ప్రభుత్వానికి ఉన్న బాధ్యతలు గుర్తెరగాలి. ప్రస్తుతం అక్కడక్కడ ఇలాంటి బందిపోటు పాలకులను చూస్తున్నాం’ అని ఆర్థిక నిపుణులు, మాజీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి.రమేష్ అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో సోమవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై చర్చాగోష్ఠి నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో తన అభిప్రాయాలను వెల్లడించారు.
సంక్షేమం అభివృద్ధి రెండూ అవసరమే..
ప్రజల ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎమ్మెల్యేను కాబట్టి ఇసుక.. మంత్రిని కాబట్టి గనుల్ని దోచేస్తాం.. నేను పట్టణాభివృద్ధి మంత్రిని కాబట్టి విశాఖ చుట్టూ ఉన్న భూముల్ని ఆక్రమిస్తా.. వాటిని బంధువులు, డ్రైవర్లు, అటెండర్ల పేరుతో మార్చుకుంటానంటే అది ప్రజాస్వామ్యం అవ్వదు. బందిపోట్ల పాలన అవుతుంది. సంక్షేమం, అభివృద్ధి వేర్వేరు కాదు.. ఒక్కటే. రెండూ అవసరమే. డబ్బు పంచడం సులభం. అందుకు బటన్ నొక్కితే సరిపోతుంది. దానికి ఇంటర్నెట్ ఉంటే చాలు. అదొక్కటే పాలన కాదు. ప్రజలకు అవసరమైన సమగ్ర సేవలు అందించడమే ప్రభుత్వ పాలన.
ఏ గణాంకాలు చూసినా రాష్ట్రం ముందుకెళ్తున్నట్లు అనిపించడం లేదు. రివర్స్ ఇంజిన్తో వేగంగా రాంగ్ రూట్లో వెళ్తున్నామేమోనన్న అనుమానం కలుగుతోంది. దానికి బాధ్యత రాజకీయ నాయకులు, ప్రభుత్వాన్ని పరిపాలించేవాళ్లదే. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులది కూడా. ఎన్నికలు అయిదేళ్లకు ఒకసారి వచ్చే పండగ కాదు. 500 ఏళ్లకు అవసరమైన పునాది ఇప్పుడు పడుతుంది. ఇవి చాలా కీలకమైన ఎన్నికలు. త్వరలో నాలుగో పారిశ్రామిక విప్లవం రాబోతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, రోబోటిక్స్లతో ప్రపంచమే మారిపోబోతోంది. వాటిని అందిపుచ్చుకోగల నాయకత్వం రాష్ట్రానికి కావాలి. ఆ నైపుణ్యాలు యువతకు నేర్పించగలగాలి. నాణ్యమైన విద్య, వైద్యం ప్రజలకు అందాలి. బోగస్ హామీల్ని నమ్మకుండా ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలి.
నేనూ ఇబ్బంది పడుతున్నా..
ఐఏఎస్లు, ఐపీఎస్లు రాష్ట్రంలో నిబంధనల ప్రకారం పని చేయాలి. మా తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత మా ఆస్తుల మ్యుటేషన్కు అక్కడి ఎమ్మార్వో, ఇతర అధికారులు ఇబ్బంది పెడుతున్నారు. ఒక ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేసిన నేను ఇబ్బంది పడుతుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? రాజ్యాంగం ప్రకారం పని చేయకుండా డబ్బు కోసమో, రాజకీయ నాయకులు చెప్పినట్లో చేస్తే సమాజం కూలిపోతుంది.
16వ స్థానంలో ఉన్నాం: ప్రొఫెసర్ కొండవీటి చిన్నయసూరి
తలసరి ఆదాయంలో రాష్ట్రం దేశంలో 16వ స్థానంలో ఉంది. స్థిరమైన రాజధాని లేదు. అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వానికి ఒక నమూనా లేదు. ఒక మార్గం లేకుండా ప్రయాణించడం సాధ్యం కాదు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేదు. విశాఖ రాజధాని అన్నారు. అక్కడేమైనా అభివృద్ధి చేశారా అంటే అదీ లేదు. అక్కడి వారితో మాట్లాడితే కేవలం భూకబ్జాలు తప్ప ఏమీ జరగలేదని చెబుతున్నారు. కొండ దిగువ భూముల్ని ఆక్రమించుకుని తమ వారి పేరున పట్టాలు ఇప్పించుకోవడం, ప్రయివేటు భూములుగా మార్చుకోవడం ఇదే విశాఖలో జరుగుతోంది.
అధికార పార్టీ కార్యకర్తల్లా సలహాదారులు
వల్లంరెడ్డి లక్ష్మణ్రెడ్డి, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి
ఏపీ ప్రభుత్వంలో జీతాలు తీసుకుంటున్న సలహాదారులు 46 మంది అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వారు రాజకీయాలు మాట్లాడకుండా నిలువరించాలి. మే నెలకు సామాజిక భద్రత పింఛన్లను ఇంటింటికీ అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికతో పని చేయాలి. వాలంటీర్లతో అధికార పార్టీ రాజీనామాలు చేయించి, వారిని పోలింగు కేంద్రాల్లో ఏజెంట్లుగా నియమించాలని ప్రయత్నిస్తోంది. ఇది సరికాదు. దీనిపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాలి.
హైకోర్టు న్యాయవాది రవితేజ మాట్లాడుతూ రాష్ట్రంలో క్రైం రేటు పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన విజయవాడ నగర మాజీ మేయర్ జంధ్యాల శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వనరులున్నా.. అభివృద్ధి లేకుండా పోయిందని పేర్కొన్నారు. అమరావతి వంటి అద్భుత నగర ప్రణాళికను మూడు రాజధానుల పేరుతో నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో అప్పులు దారుణం
రాష్ట్ర ప్రభుత్వం చేసినన్ని అప్పులు దేశంలో మరెక్కడా చేయలేదు. ఆయా రుణాలను కేవలం ప్రభుత్వ పథకాలకే వినియోగించడం ఎఫ్ఆర్బీఎం చట్టానికి, ఆర్థిక సంఘం సూత్రాలకు విరుద్ధం. కార్పొరేషన్ల నుంచి పెద్దస్థాయిలో అప్పులు చేస్తున్నారు. ఇన్ని ఉల్లంఘనలు అపాయం. రాష్ట్ర జీఎస్డీపీ ఎంత ఉందో దాదాపు అప్పులు, ఇతర భారాల మొత్తం కలిపి అంతే ఉంది. ఉన్న ఆదాయమంతా అప్పులు తీర్చడానికే సరిపెట్టాల్సిన పరిస్థితులు వస్తాయి. వడ్డీలు కట్టడానికే నిధులు సరిపోతాయి. వేరే రిజర్వు నిధులేమీ ప్రభుత్వం వద్ద లేవు. చాలా అపాయకరమైన పరిస్థితి కనిపిస్తోంది. పైౖవాళ్లు చెప్పారు కదా అని ఐఏఎస్లు విపరీతంగా అప్పులు తెస్తే అధోగతి పాలవుతాం. రాష్ట్రంలో మూలధన వ్యయం తగ్గిపోయింది. వనరులు ఎక్కడ పెట్టాలి? ఎలా పెంచాలన్నది ముఖ్యం. నగరాలు, పట్టణాలకు అధికారాలను వికేంద్రీకరించాలి. విజయవాడ, విశాఖ వంటి నగరాల్లో సైతం పూర్తిస్థాయిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేదు. నాణ్యమైన తాగునీరు ఇవ్వలేకపోతున్నారు. ప్రభుత్వాన్ని మూసేసి ఒక వ్యక్తి మాత్రమే పరిపాలించుకోవచ్చు అన్నట్లు ఉంది. నాయకులెన్ని వాగ్దానాలైనా చేయవచ్చు. వాటిని ఎలా నెరవేరుస్తారో చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం