బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి
బకాయి.. బకాయి... బకాయి...! రోడ్లు వేసిన గుత్తేదారులకు... భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు... ఆఖరికి ఆసుపత్రుల్లో భోజనం పెట్టిన వారికీ బకాయిలే... ప్రజా సంక్షేమానికి ఎన్నోసార్లు బటన్లు నొక్కానని నిత్యం బడాయికి పోయే జగన్కు...
ప్రభుత్వాసుపత్రుల్లోని ఇన్పేషెంట్లను పట్టించుకోని జగన్
వారికి రోజూ రుచీపచీ లేని భోజనం వడ్డన
ఏడాదిన్నరగా రూ.25 కోట్లు కూడా చెల్లించని దుర్మార్గం
భారం భరించలేక నాణ్యతను వదిలేసిన గుత్తేదారులు
20 ఆసుపత్రుల్లో ‘న్యూస్టుడే’ పరిశీలన
ఈనాడు, అమరావతి
బకాయి.. బకాయి... బకాయి...!
రోడ్లు వేసిన గుత్తేదారులకు... భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు...
ఆఖరికి ఆసుపత్రుల్లో భోజనం పెట్టిన వారికీ బకాయిలే...
ప్రజా సంక్షేమానికి ఎన్నోసార్లు బటన్లు నొక్కానని నిత్యం బడాయికి పోయే జగన్కు...
రోగుల బాగోగుల కోసం పాతిక కోట్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదు!
పైగా తమది సంక్షేమ పాలనంటూ ఊరూరా బాకాలు ఊదుతున్నారు!!
ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చామని పదేపదే చెప్పే సీఎం జగన్... నిజానికి రోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. వారికి నాణ్యమైన ఆహారం అందించడంలో దారుణంగా విఫలమయ్యారు. ఏ ఆసుపత్రిలో చూసినా చాలీచాలని అల్పాహారం, ఉడికీ ఉడకని అన్నం, నీళ్లలాంటి కూరలు, సాంబారే ఇస్తున్నా పట్టనట్లు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ పనులు చేసిన గుత్తేదార్లకు రూ.కోట్లలో బిల్లుల పెండింగ్ పెట్టిన సర్కారు ఐదేళ్లలో అన్ని రంగాలను అల్లాడించింది. అదేకోవలో... ఆసుపత్రుల్లోని రోగులకు భోజనాలు అందిస్తున్న గుత్తేదారులకు కూడా ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించడంలేదు. ఇవేవో వందలు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటే అదీ కాదు... అన్నీ కలిపి రాష్ట్రవ్యాప్తంగా రూ.25 కోట్ల వరకు మాత్రమే ఉన్నాయి. ఈ మాత్రం విడుదల చేయడానికి ముఖ్యమంత్రికి తీరిక లేకుండా పోయింది. ఈ నిర్లక్ష్యం ప్రభావం రోగులకు వడ్డించే ఆహార నాణ్యతపై పడుతోంది. మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అదించడంలేదు. తక్కువ ధరకు అందుబాటులో ఉండే కూరగాయలతోనే వంటలు తయారవుతున్నాయి. ఫలితంగా చికిత్స పొందుతున్న రోగులు కోలుకునే సమయం పెరుగుతోంది. ఈ దుస్థితిపై రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులను ‘న్యూస్టుడే’ ప్రతినిధులు ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా తాము అనుభవిస్తున్న బాధలను గుత్తేదారులు, సరైన ఆహారం అందక తాము పడుతున్న ఇబ్బందులను రోగులు వివరించారు. నెలల తరబడి ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోతే నాణ్యమైన ఆహారాన్ని ఎలా అందించగలమంటూ గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు.
చిమిడిన అన్నం... రుచిలేని కూరలు
అన్ని ఆసుపత్రుల్లో అల్పాహారంగా ఎక్కువగా పులిహోర, కిచిడీ, ఉప్మా పెడుతున్నారు. ఉదయం ఇచ్చే పాలు పలుచగా ఉంటున్నాయి. భోజనంలో... చిమిడిన అన్నం, రుచీపచి లేని కూరలు, పప్పే కనిపించని నీళ్లలాంటి సాంబారు ఇస్తున్నారు. మజ్జిగ సైతం నీళ్లలా ఉంటోంది. మధ్యాహ్నం ఇస్తున్న అరటిపండ్లు, గుడ్లు పరిమాణంలో చిన్నగా ఉంటున్నాయి.
- ఖర్చు తగ్గించుకునేందుకు గుత్తేదారులు సిబ్బందిని తగ్గించేశారు. దాంతో భోజన వడ్డనకు వేళలు పాటించడంలేదు. ఒక్కోసారి అల్పాహారం ఉదయం 11.30 గంటలకు, మధ్యాహ్న భోజనం 1.30 గంటల తర్వాత అందిస్తున్నారు. ఈ కారణంగా వార్డుల్లోని 20% మంది రోగులకు భోజనం అందడం లేదు.
- వడ్డనలోనూ వేగం పెంచారు. గతానికి భిన్నంగా కంచంలో ఒకేసారి అన్ని ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. దాంతో రోగులకు తక్కువ పరిణామంలో ఆహారం అందుతోంది. కొన్నిచోట్ల 50-60 మందికే వండుతూ వంద మందికి సరిపెడుతున్నారు.
- ప్రసూతి ఆసుపత్రుల్లో బాలింతలకు ప్రత్యేక మెనూ పాటిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. కొన్నిచోట్ల భోజనాలను వార్డుల వద్ద కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలోని కౌంటర్లో అందిస్తున్నారు.
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏడు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్సీ) ఏడాదిగా భోజనం అందడంలేదు.
ఒక రోగికి రోజుకు రూ.80
ఇన్పేషెంట్లకు పోషకాహారం అందించేందుకు మెనూ రూపొందించారు. ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం సరఫరా చేయాలి. దీన్ని పాటిస్తూనే ప్రతిరోజూ ఒక గుడ్డు, అరటిపండు ఇవ్వాలి. షుగర్ బాధితులకు రాగి సంగటి పెట్టాలి. ఇందుకు ఒక సాధారణ రోగికి రోజుకు రూ.80, బాలింతలకు రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.
అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి
వంట గదుల పరిశుభ్రత, కూరగాయలు, బియ్యం, పప్పులు, నూనెల నాణ్యతను వైద్యాధికారులు నిత్యం పరిశీలించాలి. వీరు రుచి చూసిన తర్వాతే రోగులకు భోజనం అందించాలి. కానీ, ఆచరణలో ఇవేమీ జరగడంలేదు.
ఇవీ ‘న్యూస్టుడే’ పరిశీలించిన ఆసుపత్రులు
గుంటూరు జీజీహెచ్, తిరుపతి రుయా ఆసుపత్రి, నరసరావుపేట, పాడేరు, భీమవరం, అనంతపురం, అనకాపల్లిల్లోని జిల్లా ఆసుపత్రులు.... నర్సీపట్నం, గుడివాడ, బాపట్ల, చీరాల, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఉరవ కొండ, కళ్యాణదుర్గం, ధర్మవరంలోని ప్రాంతీయ ఆసుపత్రులు... మచిలీపట్నం, విజయనగరం, ఏలూరులోని సర్వజన ఆసుపత్రులు, అవనిగడ్డలోని సీహెచ్సీ.
అప్పులు తెచ్చి... బంగారం కుదువపెట్టి అవస్థలు
- తిరుపతి రుయా ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్టరుకు రూ.1.50 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల గుత్తేదారులందరికీ కలిపి రూ.2 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది.
- మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో వైకాపాకు చెందిన ఓ బడా గుత్తేదారు నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకున్న ఉప గుత్తేదారుకు నెలకు రూ.5లక్షల వరకు ఖర్చు అవుతోంది. 2022 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు రూ.70 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బంగారం అమ్మి, అప్పులు తెచ్చి రోగుల ఆకలి తీరుస్తున్నానని, రూ.40 లక్షల వరకు అప్పులు చేసినట్లు గుత్తేదారు వాపోతున్నారు.
- అవనిగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రం గుత్తేదారుకు 15 నెలల నుంచి బిల్లులు ఆగిపోయాయి. గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి గుత్తేదారుకు రూ.1.25 కోట్లు చెల్లించాల్సి ఉంది.
- విజయనగరం సర్వజన ఆసుపత్రి(ఘోష కలుపుకొని)లో కాంట్రాక్టరుకు రూ.1.09 కోట్ల వరకు, మన్యం జిల్లాలోని వారికి రూ.40 లక్షల వరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్