బటన్ల బడాయి.. రోగుల బువ్వకూ బకాయి
బకాయి.. బకాయి... బకాయి...! రోడ్లు వేసిన గుత్తేదారులకు... భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు... ఆఖరికి ఆసుపత్రుల్లో భోజనం పెట్టిన వారికీ బకాయిలే... ప్రజా సంక్షేమానికి ఎన్నోసార్లు బటన్లు నొక్కానని నిత్యం బడాయికి పోయే జగన్కు...
ప్రభుత్వాసుపత్రుల్లోని ఇన్పేషెంట్లను పట్టించుకోని జగన్
వారికి రోజూ రుచీపచీ లేని భోజనం వడ్డన
ఏడాదిన్నరగా రూ.25 కోట్లు కూడా చెల్లించని దుర్మార్గం
భారం భరించలేక నాణ్యతను వదిలేసిన గుత్తేదారులు
20 ఆసుపత్రుల్లో ‘న్యూస్టుడే’ పరిశీలన
ఈనాడు, అమరావతి
బకాయి.. బకాయి... బకాయి...!
రోడ్లు వేసిన గుత్తేదారులకు... భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు...
ఆఖరికి ఆసుపత్రుల్లో భోజనం పెట్టిన వారికీ బకాయిలే...
ప్రజా సంక్షేమానికి ఎన్నోసార్లు బటన్లు నొక్కానని నిత్యం బడాయికి పోయే జగన్కు...
రోగుల బాగోగుల కోసం పాతిక కోట్లు ఇవ్వాలనే ఆలోచన రాలేదు!
పైగా తమది సంక్షేమ పాలనంటూ ఊరూరా బాకాలు ఊదుతున్నారు!!
ప్రభుత్వాసుపత్రుల్లో కార్పొరేట్ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చామని పదేపదే చెప్పే సీఎం జగన్... నిజానికి రోగుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారు. వారికి నాణ్యమైన ఆహారం అందించడంలో దారుణంగా విఫలమయ్యారు. ఏ ఆసుపత్రిలో చూసినా చాలీచాలని అల్పాహారం, ఉడికీ ఉడకని అన్నం, నీళ్లలాంటి కూరలు, సాంబారే ఇస్తున్నా పట్టనట్లు ఉన్నారు. రాష్ట్రంలో వివిధ పనులు చేసిన గుత్తేదార్లకు రూ.కోట్లలో బిల్లుల పెండింగ్ పెట్టిన సర్కారు ఐదేళ్లలో అన్ని రంగాలను అల్లాడించింది. అదేకోవలో... ఆసుపత్రుల్లోని రోగులకు భోజనాలు అందిస్తున్న గుత్తేదారులకు కూడా ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించడంలేదు. ఇవేవో వందలు, వేల కోట్ల రూపాయలు ఉన్నాయంటే అదీ కాదు... అన్నీ కలిపి రాష్ట్రవ్యాప్తంగా రూ.25 కోట్ల వరకు మాత్రమే ఉన్నాయి. ఈ మాత్రం విడుదల చేయడానికి ముఖ్యమంత్రికి తీరిక లేకుండా పోయింది. ఈ నిర్లక్ష్యం ప్రభావం రోగులకు వడ్డించే ఆహార నాణ్యతపై పడుతోంది. మెనూ ప్రకారం ఆహార పదార్థాలను అదించడంలేదు. తక్కువ ధరకు అందుబాటులో ఉండే కూరగాయలతోనే వంటలు తయారవుతున్నాయి. ఫలితంగా చికిత్స పొందుతున్న రోగులు కోలుకునే సమయం పెరుగుతోంది. ఈ దుస్థితిపై రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులను ‘న్యూస్టుడే’ ప్రతినిధులు ఇటీవల పరిశీలించారు. ఈ సందర్భంగా తాము అనుభవిస్తున్న బాధలను గుత్తేదారులు, సరైన ఆహారం అందక తాము పడుతున్న ఇబ్బందులను రోగులు వివరించారు. నెలల తరబడి ప్రభుత్వం నుంచి చెల్లింపులు నిలిచిపోతే నాణ్యమైన ఆహారాన్ని ఎలా అందించగలమంటూ గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు.
చిమిడిన అన్నం... రుచిలేని కూరలు
అన్ని ఆసుపత్రుల్లో అల్పాహారంగా ఎక్కువగా పులిహోర, కిచిడీ, ఉప్మా పెడుతున్నారు. ఉదయం ఇచ్చే పాలు పలుచగా ఉంటున్నాయి. భోజనంలో... చిమిడిన అన్నం, రుచీపచి లేని కూరలు, పప్పే కనిపించని నీళ్లలాంటి సాంబారు ఇస్తున్నారు. మజ్జిగ సైతం నీళ్లలా ఉంటోంది. మధ్యాహ్నం ఇస్తున్న అరటిపండ్లు, గుడ్లు పరిమాణంలో చిన్నగా ఉంటున్నాయి.
- ఖర్చు తగ్గించుకునేందుకు గుత్తేదారులు సిబ్బందిని తగ్గించేశారు. దాంతో భోజన వడ్డనకు వేళలు పాటించడంలేదు. ఒక్కోసారి అల్పాహారం ఉదయం 11.30 గంటలకు, మధ్యాహ్న భోజనం 1.30 గంటల తర్వాత అందిస్తున్నారు. ఈ కారణంగా వార్డుల్లోని 20% మంది రోగులకు భోజనం అందడం లేదు.
- వడ్డనలోనూ వేగం పెంచారు. గతానికి భిన్నంగా కంచంలో ఒకేసారి అన్ని ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు. దాంతో రోగులకు తక్కువ పరిణామంలో ఆహారం అందుతోంది. కొన్నిచోట్ల 50-60 మందికే వండుతూ వంద మందికి సరిపెడుతున్నారు.
- ప్రసూతి ఆసుపత్రుల్లో బాలింతలకు ప్రత్యేక మెనూ పాటిస్తున్న దాఖలాలు కనిపించడంలేదు. కొన్నిచోట్ల భోజనాలను వార్డుల వద్ద కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలోని కౌంటర్లో అందిస్తున్నారు.
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని ఏడు సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో(సీహెచ్సీ) ఏడాదిగా భోజనం అందడంలేదు.
ఒక రోగికి రోజుకు రూ.80
ఇన్పేషెంట్లకు పోషకాహారం అందించేందుకు మెనూ రూపొందించారు. ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భోజనం సరఫరా చేయాలి. దీన్ని పాటిస్తూనే ప్రతిరోజూ ఒక గుడ్డు, అరటిపండు ఇవ్వాలి. షుగర్ బాధితులకు రాగి సంగటి పెట్టాలి. ఇందుకు ఒక సాధారణ రోగికి రోజుకు రూ.80, బాలింతలకు రూ.100 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది.
అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి
వంట గదుల పరిశుభ్రత, కూరగాయలు, బియ్యం, పప్పులు, నూనెల నాణ్యతను వైద్యాధికారులు నిత్యం పరిశీలించాలి. వీరు రుచి చూసిన తర్వాతే రోగులకు భోజనం అందించాలి. కానీ, ఆచరణలో ఇవేమీ జరగడంలేదు.
ఇవీ ‘న్యూస్టుడే’ పరిశీలించిన ఆసుపత్రులు
గుంటూరు జీజీహెచ్, తిరుపతి రుయా ఆసుపత్రి, నరసరావుపేట, పాడేరు, భీమవరం, అనంతపురం, అనకాపల్లిల్లోని జిల్లా ఆసుపత్రులు.... నర్సీపట్నం, గుడివాడ, బాపట్ల, చీరాల, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ఉరవ కొండ, కళ్యాణదుర్గం, ధర్మవరంలోని ప్రాంతీయ ఆసుపత్రులు... మచిలీపట్నం, విజయనగరం, ఏలూరులోని సర్వజన ఆసుపత్రులు, అవనిగడ్డలోని సీహెచ్సీ.
అప్పులు తెచ్చి... బంగారం కుదువపెట్టి అవస్థలు
- తిరుపతి రుయా ఆసుపత్రిలో డైట్ కాంట్రాక్టరుకు రూ.1.50 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని ఆసుపత్రుల గుత్తేదారులందరికీ కలిపి రూ.2 కోట్ల వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది.
- మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో వైకాపాకు చెందిన ఓ బడా గుత్తేదారు నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకున్న ఉప గుత్తేదారుకు నెలకు రూ.5లక్షల వరకు ఖర్చు అవుతోంది. 2022 డిసెంబరు నుంచి ఇప్పటి వరకు రూ.70 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. బంగారం అమ్మి, అప్పులు తెచ్చి రోగుల ఆకలి తీరుస్తున్నానని, రూ.40 లక్షల వరకు అప్పులు చేసినట్లు గుత్తేదారు వాపోతున్నారు.
- అవనిగడ్డ సామాజిక ఆరోగ్య కేంద్రం గుత్తేదారుకు 15 నెలల నుంచి బిల్లులు ఆగిపోయాయి. గుడివాడ ప్రాంతీయ ఆసుపత్రిలోనూ ఇదే పరిస్థితి. అనకాపల్లి జిల్లా ఆసుపత్రి గుత్తేదారుకు రూ.1.25 కోట్లు చెల్లించాల్సి ఉంది.
- విజయనగరం సర్వజన ఆసుపత్రి(ఘోష కలుపుకొని)లో కాంట్రాక్టరుకు రూ.1.09 కోట్ల వరకు, మన్యం జిల్లాలోని వారికి రూ.40 లక్షల వరకు చెల్లింపులు పెండింగులో ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.