గోదారి సాక్షిగా జగన్నాటకం!
‘పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఆక్వాకల్చర్ పరిజ్ఞానాన్ని పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మొదటి ఆక్వా విశ్వవిద్యాలయానికి నాంది పలుకుతున్నాం.
సీఎం హమీలన్నీ నీటిమూటలే
ఫిషింగ్ హార్బర్ నిర్మించలేదు
ఆక్వా యూనివర్సిటీ భవనాలకు దిక్కు లేదు
వైద్య కళాశాల నిర్మాణం ఎక్కడిదక్కడే
నేడు పశ్చిమగోదావరిలో జగన్ బస్సు యాత్ర
‘పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారం రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నాం. ఆక్వాకల్చర్ పరిజ్ఞానాన్ని పిల్లలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్రంలో మొదటి ఆక్వా విశ్వవిద్యాలయానికి నాంది పలుకుతున్నాం. ఆరు వేల మంది మత్స్యకారులకు మేలు చేసేలా నరసాపురం పరిధిలోని బియ్యపుతిప్పలో ఫిషింగ్ హార్బర్ పనులకు శంకుస్థాపన చేశాం. పాలకొల్లులో రూ.500 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు మొదలయ్యాయి’
ముఖ్యమంత్రి జగన్ 2022 నవంబర్ 21న పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పర్యటనలో చెప్పిన మాటలు
ఈనాడు, ఏలూరు: ప్రజలను ఊహల పల్లకిలో ఎల్లకాలం ఊరేగించడం కష్టం. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్ మాటలు అందమైన కలల ప్రపంచాన్ని సృష్టించేవి. ఆయన బాసలు జీవితాలను తీర్చిదిద్దే ఊసుల్లా ఉండేవి. ఆయన నోట్లోంచి మాట వచ్చిన వెంటనే పని జరిగిపోతున్నట్లుగానే ఒక ఊహా ప్రపంచాన్ని కళ్ల ముందు ఆవిష్కరించేవారు. ఇప్పటికీ అలాంటి మాటలు వినిపిస్తూనే ఉన్నారు. వాటిని వినీవినీ జనం విసిగిపోయారు. అడుగు ముందుకు పడని పనులు వెక్కిరిస్తుంటే.. ఆయన చెప్పిన మాటలన్నీ గాలికబుర్లుగా మిగిలిపోతుంటే జనం మాటల్లో నిరసన పెల్లుబుకుతోంది. తమ జిల్లాకు జగన్ ఏం చేయలేదన్న ఆగ్రహం కనిపిస్తోంది. సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేస్తూ పశ్చిమగోదావరి జిల్లా ప్రజల ముంగిటకు ముఖ్యమంత్రి జగన్ మంగళవారం రానున్న నేపథ్యంలో ఆయన మళ్లీ కొత్తగా ఏం ‘కబుర్లు’ చెబుతారో అంటూ నొసళ్లు వెక్కిరిస్తున్నాయి. నోళ్లు నిరసన ధ్వనులు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ జిల్లా పర్యటనకు ఎన్నోసార్లు వచ్చారు. పాదయాత్రలోనూ ఎన్నో హామీలిచ్చారు. అవేమీ నెరవేరలేదు. 2022లో హడావుడిగా శంకుస్థాపన చేసి, నరసాపురం వేదికగా ఆయన వల్లించిన మాటలు గుర్తు తెచ్చుకుంటున్న ప్రజానీకం.. జగన్ మాట తప్పేశారు, మడమ తిప్పేశారని బహిరంగంగా నిందిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్, ఆక్వా యూనివర్సిటీ, పాలకొల్లు వైద్య కళాశాల నిర్మాణాలు పూర్తికాలేదు. ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్తు ఇస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేరనేలేదు. గోదావరి డెల్టా కాలువలయితే నిర్లక్ష్యానికి ఆనవాళ్లుగా నిలిచిపోయాయి.
పునాది పడని ఫిషింగ్ హార్బర్
నరసాపురం మండలం బియ్యపుతిప్ప వద్ద 150 ఎకరాల్లో రూ.429.43 కోట్ల అంచనా వ్యయంతో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి జగన్ శంకుస్థాపన చేశారు. ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ అతీగతీ లేదు. భారీ ప్లాట్ఫామ్స్, వేలం కోసం హాళ్లు, డ్రైయింగ్ యార్డ్, బోట్ పార్కింగ్ ఏరియా, మత్స్యకారులకు విశ్రాంతి గదులు, శీతలగదులు తదితర సదుపాయాలు కల్పిస్తామని సీఎం జగన్ అట్టహాసంగా ప్రకటించారు. అత్యంత సామర్థ్యమున్న మోటరు బోట్లలో సముద్రంలో ఎక్కువ దూరం వెళ్లి వేటాడేందుకు వీలుంటుందని చెప్పారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు ఆరు వేల మందికి లబ్ధి జరుగుతుందని భారీ ఎత్తున ప్రచారం చేశారు. నిధులు విడుదల చేయకపోవడంతో క్షేత్రస్థాయిలో నిర్మాణానికి ఒక్క ఇటుక పడలేదు. ఈ హార్బర్కు వెళ్లే దారంతా ముళ్లపొదలతో నిండిపోయి ఉందంటే అక్కడ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
తుపాను భవనంలోనే ఆక్వా విశ్వవిద్యాలయం
మెరైన్ ఉత్పత్తి, ఎగుమతుల్లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉన్నందున.. అందుకు కేంద్రస్థానమైన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం నాడు ఆర్భాటంగా ప్రకటించారు. కానీ ఇప్పటికీ లక్ష్మణేశ్వరంలోని తుపాను భవనంలోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ యూనివర్సిటీ భవనాల కోసం నరసాపురం మండలం లిఖితపూడి, సరిపల్లి గ్రామాల మధ్య 40 ఎకరాల స్థలం కూడా కేటాయించారు. రూ.332 కోట్లతో భవనాలు నిర్మించాల్సి ఉండగా మొదటి దశలో విశ్వవిద్యాలయం, పరిపాలన భవనం, విద్యార్థుల వసతిగృహాల నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేశారు. కానీ నిధులు విడుదల చేయకపోవడంతో ఇప్పటి వరకు ఆ భవనాల నిర్మాణమే ప్రారంభం కాలేదు.
ఆక్వా రైతుకు గుండె కోత
2018లో అప్పటి ప్రభుత్వం ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రాయితీపై రూ.2కే అందించింది. ప్రతిపక్ష నేతగా భీమవరం పరిధిలో జగన్ ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు రొయ్యల సాగుకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆక్వా జోన్ పరిధిలో అదీ పదెకరాల్లోపు సాగు చేస్తున్న వారికే రాయితీ అంటూ కొర్రీ పెట్టారు. దీంతో 33 వేల మంది రైతులు విద్యుత్తు రాయితీకి దూరమయ్యారు. పెట్టుబడి తడిసిమోపెడవటంతో సాగు నష్టాలు మిగులుస్తోందని వేలాది మంది రైతులు సాగుకు దూరమయ్యారు. 2021లో 1.52 లక్షల ఎకరాల్లో ఉన్న సాగు విస్తీర్ణం ప్రస్తుతం 1.18 లక్షల ఎకరాలకు పడిపోవడమే దీనికి నిదర్శనం.
డెల్టా కాలువలను పట్టించుకోని జగన్
ఉమ్మడి పశ్చిమగోదావరిలో వ్యవసాయమే ప్రధాన వనరు. కాలువల వ్యవస్థే దానికి గుండెకాయ. ఎప్పుడో కాటన్ హయాంలో రూపుదిద్దుకున్న ఈ వ్యవస్థను ఎప్పటికప్పుడు ఆధునీకరించుకోవడం అత్యవసరం. జగన్ ప్రభుత్వంలో ఈ అయిదేళ్లలో కాలువలు కనీస స్థాయిలోనూ మరమ్మతులకు నోచలేదు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 1,700 కి.మీ. పొడవున ప్రధాన, ఉపకాలువల కింద 5.29 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. విపత్తుల వల్ల ఏటా 2.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కోల్పోయి రూ.599 కోట్ల వరకు పంట నష్టం జరుగుతోంది. సిరులు పండే గోదావరి జిల్లాలో రైతులు పంట విరామం ప్రకటించే స్థాయికి వ్యవసాయాన్ని జగన్ దిగజార్చారు.
వైద్య కళాశాలకు గ్రహణం
సీఎం 2021లో నరసాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ వైద్యకళాశాల పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో చూస్తే అతీగతీ లేదు. పాలకొల్లులో వైద్యకళాశాల నిర్మాణానికి 2021లో పరిపాలన అనుమతులు వచ్చాయి. పాలకొల్లు పరిధిలోని దగ్గులూరులో 61 ఎకరాల భూమిని సేకరించారు. నిధుల సమస్యతో పునాదుల్లో మట్టి పోసేందుకే రెండేళ్లు పట్టింది. ప్రస్తుతం పునాదులకు బోర్లు పోసి, కాంక్రీట్ నింపుతున్నారు. నిర్మాణానికి రూ.475 కోట్లు అంచనా వ్యయం కాగా ఇప్పటికి ఖర్చు పెట్టింది కేవలం రూ.30 కోట్లేనంటే దీన్ని ఏ స్థాయిలో నిర్లక్ష్యం చేశారో వేరే చెప్పనక్కర్లేదు. ఈ స్థలం పూర్తిగా పల్లపు ప్రాంతం. వర్షం పడితే పూర్తిగా ముంపులో ఉంటుంది. నీరు తగ్గే వరకు నెలల తరబడి నిర్మాణ పనులకు అంతరాయం ఏర్పడుతోంది. వైద్యకళాశాలలో ప్రవేశాలు, తరగతులు జరగాలంటే కళాశాలకు 300 పడకల ఆసుపత్రిని అనుసంధానం చేయాలి. జిల్లాలో అంత సామర్థ్యమున్న ఆసుపత్రుల్లేవు. వైద్యకళాశాల నిర్మాణం పూర్తి చేసి, 300 పడకల ఆసుపత్రిని అనుసంధానం చేసి, ప్రవేశాలు, తరగతులు జరగడానికి మామూలుగానే ఏళ్లు పడుతుంది. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో అది ఇంకా పెరిగిపోతోందని విమర్శలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్