చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ 7కి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది.
ఈనాడు, దిల్లీ: స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ను రద్దుచేయాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మే 7వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. తొలుత ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్కుమార్ వాదనలు వినిపిస్తూ గత ఏడాది నవంబరు 28న ఈ కోర్టు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వుల్లో సమావేశాలు, బహిరంగసభల్లో పాల్గొనడం మినహాయించి హైకోర్టు విధించిన మిగిలిన అన్ని షరతులనూ ప్రతివాది పాటించాలని చెప్పారని గుర్తుచేశారు. తర్వాత ప్రతివాది, ఆయన కుమారుడు బహిరంగసభల్లో మాట్లాడుతూ రాష్ట్రంలో కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తున్న అధికారులపై తాము అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారన్నారు.
ఈ వాదనలను చంద్రబాబు తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తోసిపుచ్చారు. ప్రతివాది కుమారుడి వ్యాఖ్యలను ఈ కేసులోకి తీసుకురావడం సరికాదన్నారు. ఈ సందర్భంగా న్యాయవాది రంజిత్కుమార్ నారా లోకేశ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి కోర్టు దృష్టికి తెచ్చారు. అనంతరం ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వుల గురించి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్కుమార్ జోక్యం చేసుకుంటూ మీరు కోర్టు షరతులను పాటించాలని చెప్పిన తర్వాత కూడా ప్రతివాది ఇలాంటి ప్రకటనలు చేయడం తగదన్నారు. అప్పుడు న్యాయమూర్తి స్పందిస్తూ చంద్రబాబు ఏవైనా ప్రకటనలు చేసి ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అందుకు రంజిత్కుమార్ స్పందిస్తూ ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలపైనా డిసెంబరు 16న ఐఏ నెం.263771/2023 దాఖలుచేసినట్లు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. అది కోర్టు రికార్డుల్లో కనిపించకపోవడంతో న్యాయమూర్తి కేసు విచారణను మే 7వ తేదీకి వాయిదావేశారు. తర్వాత చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థలూథ్రా జోక్యం చేసుకుంటూ ఈ కేసు గురించి ఏపీ ప్రభుత్వ ఏఏజీ మీడియా ముందు ఇష్టానుసారం మాట్లాడారని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
కంప్యూటర్లో కనిపించని కేసు దస్త్రం
ఈ కేసు విచారణకు పిలవగానే జస్టిస్ బేలా ఎం.త్రివేది కేసు దస్త్రాన్ని తన కంప్యూటర్లో చూడటానికి ప్రయత్నించగా అది కనిపించలేదు. దాంతో, ఎందుకు కనిపించలేదని కోర్టు సిబ్బందిని ప్రశ్నించారు. అందుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్కుమార్ స్పందిస్తూ ఆ విషయంతో తమకేమీ సంబంధం లేదని నవ్వుతూ సమాధానమిచ్చారు. తర్వాత న్యాయమూర్తి స్పందిస్తూ మిగతా అన్ని కేసులూ కనిపిస్తున్నాయని, ఇదొక్కటే కనిపించలేదని, ఏదో జరిగిందని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అందుకు చంద్రబాబు న్యాయవాది స్పందిస్తూ ‘కోర్టు దాన్ని తెరవాల్సిన అవసరం లేదు. అది దైవసంకేతం’ అని నవ్వుతూ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
భూ హక్కు చట్టంపై ధర్మాన ద్వంద్వ వైఖరి
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
కృష్ణా జలాల్లో 1,144 టీఎంసీలు కావాలి: ఆంధ్రప్రదేశ్
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ తీర్పు వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) తీర్పును వాయిదా వేసింది. -
నన్నెవరూ అపహరించలేదు
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసే క్రమంలో స్వతంత్ర అభ్యర్థి విడదల రజనిని వైకాపా నేతల కనుసన్నల్లో పోలీసులు అడ్డుకొని, నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణను మూసివేసింది. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.