మావాడైతే చాలు.. మమ్మల్ని అడిగేదెవరు?
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిబంధనలు తుంగలోకి తొక్కి, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా అర్హత లేని వి.శ్రీకాంత్రెడ్డిని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ)గా జగన్ సర్కార్ నియమించింది.
అర్హత లేకపోయినా శ్రీవేంకటేశ్వర వర్సిటీ ఉపకులపతిగా శ్రీకాంత్రెడ్డి నియామకం
ప్రొఫెసర్గా పదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధనను తుంగలోకి తొక్కిన ఉన్నత విద్యామండలి
వీసీ పింఛన్ ఆగిపోవడంతో అసలు విషయం వెలుగులోకి
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిబంధనలు తుంగలోకి తొక్కి, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా అర్హత లేని వి.శ్రీకాంత్రెడ్డిని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ)గా జగన్ సర్కార్ నియమించింది. వైకాపాలో కీలకమైన ‘పెద్దాయన’ సిఫార్సు చేయడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి వాస్తవాలు దాచి, సెర్చ్ కమిటీ జాబితాలో శ్రీకాంత్రెడ్డి పేరు చేర్చేలా చక్రం తిప్పినట్లు సమాచారం. శ్రీకాంత్రెడ్డికి వీసీ అర్హత లేదనే విషయం ఉన్నత విద్యామండలి ఛైర్మన్కు ముందుగానే తెలిసినా ఈ విషయాన్ని సెర్చ్ కమిటీ దృష్టికి తీసుకురాకుండా రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలున్నాయి. వీసీగా నియమితులయ్యే వారికి ప్రొఫెసర్గా పదేళ్ల అనుభవం ఉండాలి. శ్రీకాంత్రెడ్డికి అయిదేళ్ల అనుభవం మాత్రమే ఉంది. ప్రొఫెసర్గా పదవీ విరమణ పొందిన ఆయనకు ప్రస్తుతం పింఛన్ ఆగిపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. విచిత్రమేమిటంటే ద్రవిడ విశ్వవిద్యాలయంలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మేనల్లుడిని.. బోధనేతర పోస్టులో నుంచి బోధన పోస్టులోకి మార్చేందుకు వేసిన కమిటీలో శ్రీకాంత్రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. బోధనేతర పోస్టులను బోధన పోస్టులుగా మార్చేందుకు ఈయన సిఫార్సు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా వైకాపాతో అంటకాగినందుకే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వీసీ పదవీలో నియమించింది.
ఇదీ అసలు కథ..
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో ఒకటే ప్రొఫెసర్ పోస్టు ఉంది. అయినా 2006 జులై 7న అప్పటి వీసీ జయరామ్రెడ్డి.. డి.జమున, శ్రీకాంత్రెడ్డిలకు ఒకేసారి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. ఒకటే పోస్టు ఉండటంతో అధికారికంగా డి.జమునను ప్రొఫెసర్గా నియమించి, శ్రీకాంత్రెడ్డిని అనధికారికంగా ప్రొఫెసర్గా కొనసాగించారు. ఈయనకు వర్సిటీ నిధుల నుంచి ప్రొఫెసర్గా జీతాలు చెల్లించేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతి ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని శ్రీకాంత్రెడ్డి నియామక సమయంలో వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
2006లో అధికారికంగా ప్రొఫెసర్గా నియమితులైన జమున 2017లో పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టులోకి శ్రీకాంత్రెడ్డి వచ్చారు. ఈయన 2022లో పదవీ విరమణ చేశారు. 2006 జులై 7 నుంచి 2017 వరకు శ్రీకాంత్రెడ్డి నియామకం లీగల్ కాదు. దీంతో ఆయన సర్వీసు పరిగణనలోకి రాదు. లీగల్ కాని సర్వీసును పరిగణనలోకి తీసుకోకూడదని గతంలో సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చింది. 2017 నుంచి 2022 వరకు మాత్రమే ఆయన మంజూరు పోస్టులో ప్రొఫెసర్గా ఉన్నారు. అయిదేళ్లు ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి ఉపకులపతి పోస్టుకు అనర్హులు. ఈ విషయాన్ని ఉపకులపతి అభ్యర్థుల ఎంపికకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీకి ఉన్నత విద్యామండలి చెప్పలేదు. వైకాపాలోని ‘పెద్దాయన’ సిఫార్సు ఉండటంతో అంతా గుట్టుగా చేసేసి, చివరికి గవర్నర్నూ తప్పుదోవ పట్టించారు.
ఇలా వెలుగులోకి..
శ్రీవేంకటేశ్వర వర్సిటీ నుంచి పదవీ విరమణ పొందిన శ్రీకాంత్రెడ్డి పింఛన్ కోసం.. వర్సిటీ దస్త్రాన్ని రాష్ట్ర ఆడిట్ విభాగానికి పంపించింది. ఆయన సర్వీసును పరిశీలించిన ఆడిట్ విభాగం పింఛన్ మంజూరుకు అభ్యంతరం తెలిపింది. 2006 నుంచి 2017 వరకు ఆయన సర్వీసు లీగల్ కానందున పింఛన్కు అనర్హుడని పేర్కొంది. పింఛన్కే సర్వీసు పరిగణనలోకి రాదని ఆడిట్ విభాగం తేల్చిచెప్పినా.. జగన్ సర్కార్ పట్టించుకోకుండా ఆయన్ని వీసీగా నియమించింది. ప్రస్తుతం వీసీగా ఉన్న శ్రీకాంత్రెడ్డి ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశారు. తన సర్వీసును క్రమబద్ధీకరించుకునేందుకు రిజిస్ట్రార్ ద్వారా ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపారు. వర్సిటీలోని ఇతర విభాగాల్లో ఉండే ఓ పోస్టును మార్పు చేసి, 2006 నుంచి 2017 వరకు సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ అందులో పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు