మావాడైతే చాలు.. మమ్మల్ని అడిగేదెవరు?
విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిబంధనలు తుంగలోకి తొక్కి, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా అర్హత లేని వి.శ్రీకాంత్రెడ్డిని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ)గా జగన్ సర్కార్ నియమించింది.
అర్హత లేకపోయినా శ్రీవేంకటేశ్వర వర్సిటీ ఉపకులపతిగా శ్రీకాంత్రెడ్డి నియామకం
ప్రొఫెసర్గా పదేళ్ల సర్వీసు ఉండాలనే నిబంధనను తుంగలోకి తొక్కిన ఉన్నత విద్యామండలి
వీసీ పింఛన్ ఆగిపోవడంతో అసలు విషయం వెలుగులోకి
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) నిబంధనలు తుంగలోకి తొక్కి, సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా అర్హత లేని వి.శ్రీకాంత్రెడ్డిని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉపకులపతి(వీసీ)గా జగన్ సర్కార్ నియమించింది. వైకాపాలో కీలకమైన ‘పెద్దాయన’ సిఫార్సు చేయడంతో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి వాస్తవాలు దాచి, సెర్చ్ కమిటీ జాబితాలో శ్రీకాంత్రెడ్డి పేరు చేర్చేలా చక్రం తిప్పినట్లు సమాచారం. శ్రీకాంత్రెడ్డికి వీసీ అర్హత లేదనే విషయం ఉన్నత విద్యామండలి ఛైర్మన్కు ముందుగానే తెలిసినా ఈ విషయాన్ని సెర్చ్ కమిటీ దృష్టికి తీసుకురాకుండా రహస్యంగా ఉంచినట్లు ఆరోపణలున్నాయి. వీసీగా నియమితులయ్యే వారికి ప్రొఫెసర్గా పదేళ్ల అనుభవం ఉండాలి. శ్రీకాంత్రెడ్డికి అయిదేళ్ల అనుభవం మాత్రమే ఉంది. ప్రొఫెసర్గా పదవీ విరమణ పొందిన ఆయనకు ప్రస్తుతం పింఛన్ ఆగిపోవడంతో అసలు విషయం వెలుగు చూసింది. విచిత్రమేమిటంటే ద్రవిడ విశ్వవిద్యాలయంలో పనిచేసే రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి మేనల్లుడిని.. బోధనేతర పోస్టులో నుంచి బోధన పోస్టులోకి మార్చేందుకు వేసిన కమిటీలో శ్రీకాంత్రెడ్డి సభ్యుడిగా ఉన్నారు. బోధనేతర పోస్టులను బోధన పోస్టులుగా మార్చేందుకు ఈయన సిఫార్సు చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇలా వైకాపాతో అంటకాగినందుకే నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వీసీ పదవీలో నియమించింది.
ఇదీ అసలు కథ..
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సైకాలజీ విభాగంలో ఒకటే ప్రొఫెసర్ పోస్టు ఉంది. అయినా 2006 జులై 7న అప్పటి వీసీ జయరామ్రెడ్డి.. డి.జమున, శ్రీకాంత్రెడ్డిలకు ఒకేసారి ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. ఒకటే పోస్టు ఉండటంతో అధికారికంగా డి.జమునను ప్రొఫెసర్గా నియమించి, శ్రీకాంత్రెడ్డిని అనధికారికంగా ప్రొఫెసర్గా కొనసాగించారు. ఈయనకు వర్సిటీ నిధుల నుంచి ప్రొఫెసర్గా జీతాలు చెల్లించేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే అనుమతి ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని శ్రీకాంత్రెడ్డి నియామక సమయంలో వర్సిటీ అధికారులు పేర్కొన్నారు.
2006లో అధికారికంగా ప్రొఫెసర్గా నియమితులైన జమున 2017లో పదవీ విరమణ చేయడంతో ఆ పోస్టులోకి శ్రీకాంత్రెడ్డి వచ్చారు. ఈయన 2022లో పదవీ విరమణ చేశారు. 2006 జులై 7 నుంచి 2017 వరకు శ్రీకాంత్రెడ్డి నియామకం లీగల్ కాదు. దీంతో ఆయన సర్వీసు పరిగణనలోకి రాదు. లీగల్ కాని సర్వీసును పరిగణనలోకి తీసుకోకూడదని గతంలో సుప్రీంకోర్టు సైతం తీర్పునిచ్చింది. 2017 నుంచి 2022 వరకు మాత్రమే ఆయన మంజూరు పోస్టులో ప్రొఫెసర్గా ఉన్నారు. అయిదేళ్లు ప్రొఫెసర్గా పనిచేసిన వ్యక్తి ఉపకులపతి పోస్టుకు అనర్హులు. ఈ విషయాన్ని ఉపకులపతి అభ్యర్థుల ఎంపికకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీకి ఉన్నత విద్యామండలి చెప్పలేదు. వైకాపాలోని ‘పెద్దాయన’ సిఫార్సు ఉండటంతో అంతా గుట్టుగా చేసేసి, చివరికి గవర్నర్నూ తప్పుదోవ పట్టించారు.
ఇలా వెలుగులోకి..
శ్రీవేంకటేశ్వర వర్సిటీ నుంచి పదవీ విరమణ పొందిన శ్రీకాంత్రెడ్డి పింఛన్ కోసం.. వర్సిటీ దస్త్రాన్ని రాష్ట్ర ఆడిట్ విభాగానికి పంపించింది. ఆయన సర్వీసును పరిశీలించిన ఆడిట్ విభాగం పింఛన్ మంజూరుకు అభ్యంతరం తెలిపింది. 2006 నుంచి 2017 వరకు ఆయన సర్వీసు లీగల్ కానందున పింఛన్కు అనర్హుడని పేర్కొంది. పింఛన్కే సర్వీసు పరిగణనలోకి రాదని ఆడిట్ విభాగం తేల్చిచెప్పినా.. జగన్ సర్కార్ పట్టించుకోకుండా ఆయన్ని వీసీగా నియమించింది. ప్రస్తుతం వీసీగా ఉన్న శ్రీకాంత్రెడ్డి ఇప్పుడు కొత్త ఎత్తుగడ వేశారు. తన సర్వీసును క్రమబద్ధీకరించుకునేందుకు రిజిస్ట్రార్ ద్వారా ప్రభుత్వానికి ఓ ప్రతిపాదన పంపారు. వర్సిటీలోని ఇతర విభాగాల్లో ఉండే ఓ పోస్టును మార్పు చేసి, 2006 నుంచి 2017 వరకు సర్వీసును క్రమబద్ధీకరించాలంటూ అందులో పేర్కొనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
భూ హక్కు చట్టంపై ధర్మాన ద్వంద్వ వైఖరి
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.