శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు శిక్ష
దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది.
వైకాపా ఎమ్మెల్సీ సహా 9 మందికి 18 నెలల జైలు
1996 నాటి కేసులో విశాఖ కోర్టు తీర్పు
నేరం చేసినట్లు నిరూపణ అయ్యిందని వెల్లడి
నిందితులందరికీ రూ.3.78 లక్షల జరిమానా విధింపు
ఇద్దరు బాధితులకు రూ.1.50 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశం
అప్పీలుకు వీలుగా శిక్ష అమలు నిలిపివేత
ఈనాడు, అమరావతి: దళిత యువకులకు అమానవీయంగా శిరోముండనం చేసి, మీసాలు, కనుబొమలు తీసేయించిన ఘటనలో వైకాపా ఎమ్మెల్సీ, మండపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు దోషి అని విశాఖపట్నం కోర్టు తేల్చింది. ఆయనతో పాటు మరో 8 మందీ దోషులేనని స్పష్టం చేసింది. దళితులకు శిరోముండనం, వారిపై దాడిచేశారని నేర నిరూపణ అయినట్లు తెలిపింది. ఐపీసీ, ఎస్సీ, ఎస్టీ చట్టాల ప్రకారం మొత్తం 9మంది నిందితులకు 18 నెలల సాధారణ జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.42 వేల జరిమానా విధించింది. జరిమానా చెల్లించడంలో విఫలమైతే మరో రెండు నెలల జైలుశిక్ష అనుభవించాలని స్పష్టంచేసింది. శిక్షలన్నీ ఏకకాలంలో అనుభవించాలని పేర్కొంది. దోషులందరూ కలిసి చెల్లించే రూ.3.78 లక్షల జరిమానా సొమ్ము నుంచి అప్పీల్ గడువు ముగిశాక.. బాధితులైన దళిత యువకులు (ఇద్దరు) ఒక్కొక్కరికి రూ.1.50 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఆదేశించింది. విశాఖ 11వ అదనపు జిల్లా న్యాయస్థానం/ఎస్సీ ఎస్టీ అత్యాచారాల (నిరోధక) కోర్టు న్యాయాధికారి లాలం శ్రీధర్ మంగళవారం ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చారు.
1996 డిసెంబరు 29న దళితులకు శిరోముండనం చేశారన్న ఆరోపణలతో తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామ ఠాణాలో అప్పటి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు, మరికొందరిపై 1997 జనవరి 4న కేసు నమోదైంది. మొత్తం 10 మంది నిందితులపై పోలీసులు కేసు నమోదుచేసి అభియోగపత్రం దాఖలుచేశారు. ఆరో నిందితుడు మరణించగా, మిగిలిన నిందితులపై విశాఖ కోర్టు విచారణ జరిపి తీర్పును వాయిదా వేసింది. మంగళవారం నిర్ణయాన్ని వెల్లడిస్తూ నిందితులకు జైలుశిక్ష, జరిమానా విధించింది.
శిక్ష అమలు తాత్కాలికంగా నిలుపుదల
తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తామని, ఈ నేపథ్యంలో శిక్ష అమలును 30 రోజులు తాత్కాలికంగా నిలుపుదల చేయాలని కోరుతూ నిందితులు మంగళవారం విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జరిమానా సొమ్ము మొత్తాన్ని చెల్లించామని తెలిపారు. ఈ పిటిషన్ను పరిగణనలోకి తీసుకున్న న్యాయాధికారి.. శిక్ష అమలును తాత్కాలికంగా నిలుపుదల చేశారు.
పదిమంది నిందితులలో ఒకరు మృతిచెందగా.. మిగిలిన తొమ్మిది మందిని దోషులుగా తేలుస్తూ జైలుశిక్ష, జరిమానా విధించింది. ఐపీసీ సెక్షన్ 342, 506(2), 323, ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(3), 3(1)(10) కింద జైలుశిక్ష విధించింది.
ఏ సెక్షన్లకు ఎంత శిక్ష
- ఐపీసీ 342(అక్రమ నిర్బంధం) కింద ఆరునెలల సాధారణ జైలుశిక్ష
- ఐసీసీ సెక్షన్ 506(2) (చంపేస్తామని నేరపూరిత బెదిరింపు) కింద ఆరు నెలల సాధారణ జైలుశిక్ష, రూ.2వేల జరిమానా.
- బాధితులు కోటి చినరాజు, దడాల వెంకటరమణలను గాయపరిచినందుకు.. నిందితులు తోట బాబులు (ఏ2) తోట రాము (ఏ3)కి ఐపీసీ సెక్షన్ 323 (గాయపరచడం) కింద ఒక్కొక్కరికి 12 నెలల సాధారణ జైలుశిక్ష.
- బాధితులను గాయపరచాలన్న ఉమ్మడి ఉద్దేశంతో వ్యవహరించినందుకు ఐపీసీ సెక్షన్ 34 ప్రకారం.. నిందితులు తోట త్రిమూర్తులు(ఏ1), తోట పుండరీకాక్షుడు(ఏ4), తోట పుండరీకాక్షుడు అలియాస్ బాబీ(ఏ5), ఇతర నిందితులు దేవల కిశోర్, తోట శ్రీను, మంచం ప్రకాశ్, ఆచంట రామ సత్యనారాయణలకు ఒక్కొక్కరికి 12 నెలల సాధారణ జైలుశిక్ష.
- ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(3) ప్రకారం నిందితులందరికీ 18 నెలల సాధారణ జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.20వేల చొప్పున జరిమానా.
- ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్ 3(1)(10) ప్రకారం నిందితులందరికీ 18 నెలల సాధారణ జైలుశిక్ష, రూ.20వేల చొప్పున జరిమానా.
28 ఏళ్లు... 256 వాయిదాలు
1996 డిసెంబరు 29 రాత్రి జరిగిన ఈ ఘటనలో 28 ఏళ్ల పాటు విచారణ కొనసాగింది. 2019 వరకు 143 వాయిదాలు జరగ్గా, 2019 జనవరి 8 నుంచి ఇప్పటివరకు మరో 113 వాయిదాలు పూర్తయ్యాయి. కేసు విచారణ అంశాలను క్రోడీకరించి వంద పేజీలకు పైగా తీర్పు సిద్ధం చేసి న్యాయమూర్తి లాలం శ్రీధర్ మంగళవారం వెల్లడించారు. ఈ కేసులో 29 మంది సాక్షులను న్యాయస్థానం విచారించగా, అందులో 11 మంది మృతిచెందారు. వాయిదాల్లో అత్యధిక శాతానికి ప్రధాన నిందితుడు తోట త్రిమూర్తులు హాజరుకాలేదన్న అభియోగం ఉంది. రాజకీయ పలుకుబడితో కోర్టుకు తక్కువగా హాజరయ్యారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.
హైకోర్టులో అప్పీలు చేస్తా: తోట త్రిమూర్తులు
ఈనాడు, విశాఖపట్నం: ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పుపై తాను హైకోర్టులో అప్పీలు చేస్తానని తోట త్రిమూర్తులు చెప్పారు. మంగళవారం ఆయన కోర్టు నుంచి బయటకొస్తూ విలేకర్లతో మాట్లాడారు. తాను నిజాయతీగా కోర్టుకు సహకరిస్తూ వచ్చానన్నారు. ‘న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే.. సంబంధం లేని కేసులో నాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకొనేందుకు హైకోర్టులో అప్పీలు చేసుకుంటున్నా. అది నా హక్కు’ అని చెప్పారు.
వారికి ఈ తీర్పు మింగుడు పడదు
‘ఈ కేసును అడ్డం పెట్టుకొని నాకు రాజకీయ జీవితం లేకుండా చేయాలని చూసినవారికి ఈ తీర్పు మింగుడుపడదు. వారు ఆశించిన ఫలితం రాలేదని చాలా బాధపడతారు’ అని త్రిమూర్తులు వ్యాఖ్యానించారు. ‘నాలుగు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచా. ఈ ఎన్నికల్లోనూ దళిత సోదరులే నన్ను గెలిపిస్తారు’ అని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్