వేకువనే పోలీసు పంజా
పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
జగన్పై రాయి విసిరిన కేసులో బలవంతంగా అదుపులోకి బాలలు
తెల్లవారుజామునే కాలనీపై దాడి
దాష్టీకంపై భగ్గుమన్న వడ్డెర కాలనీ వాసులు
అమాయకులను తీసుకెళ్లారని ఆవేదన
విడుదల చేయాలని ధర్నా, రాస్తారోకో
రాత్రి వరకు తెలియని ఆచూకీ
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే-విజయవాడ నేరవార్తలు: పోలీసుల దాష్టీకం మరోసారి బయటపడింది. సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో బాలలను వారు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ అజిత్సింగ్నగర్లోని వడ్డెర కాలనీపై మంగళవారం తెల్లవారుజామున పోలీసులు దాడి చేసి తల్లిదండ్రులు చూస్తుండగానే పట్టుకెళ్లారు. విచారించి ఇప్పుడే పంపుతామంటూ మంగళవారం రాత్రి వరకూ వారి ఆచూకీ చెప్పలేదు. బాలల తల్లిదండ్రులు క్షణమొక యుగంలా గడుపుతున్నారు. వారి రోదనలు మిన్నంటుతున్నాయి. అభంశుభం తెలియని పిల్లలను తీసుకెళ్లి వేధిస్తున్నారని వాపోతున్నారు. సీఎం జగన్ వస్తున్నప్పుడు వైకాపా జెండా పట్టుకుంటే రూ.200 ఇస్తామన్న మాయమాటలే తమను ఇంతలా మనోవ్యథకు గురిచేశాయని రోదిస్తున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం మంగళవారం తెల్లవారుజామున ఎనిమిది మంది మైనర్లను అదుపులోకి తీసుకుంది. వారిని రహస్య ప్రాంతానికి తరలించి విచారిస్తున్నారు. సంఘటన స్థలానికి వడ్డెర కాలనీ కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది. తమ పిల్లలను రెండు గంటల్లో వదిలిపెడతామని చెప్పి తీసుకెళ్లారని కాలనీవాసులు వివరిస్తున్నారు. వారంతా అమాయకులని, దాడితో సంబంధం లేదని, తక్షణమే విడిచిపెట్టాలని మంగళవారం సాయంత్రం డాబాకొట్ల రోడ్డును దిగ్బంధించి రాస్తారోకో చేశారు. కేసుకు సంబంధించి ఇప్పటివరకు దాదాపు 200 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
పుట్టిన రోజు వేడుక చేసుకున్నాడనే అనుమానంతో..
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో సతీష్ ఒక్కరే మేజర్. సీఎంపై సతీష్ రాయి విసిరినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. జగన్పై దాడి జరిగిన రోజు పొద్దుపోయాక సతీష్ తన మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలు చేసుకున్నాడు. వారు బైక్లపై చక్కర్లు కొట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వారిపై అనుమానంతో మంగళవారం వేకువజామున కాలనీకి వచ్చి నిద్రపోతున్న వారిని బలవంతాన తీసుకెళ్లారు. పిల్లలు సొల్యూషన్ పీలుస్తున్నారని, విచారించి రెండు గంటల్లో వదిలిపెడతామని తల్లిదండ్రులకు చెప్పారు. అనంతరం తల్లిదండ్రులు ఆందోళనతో సింగ్నగర్ పోలీసుస్టేషన్కు, అక్కడినుంచి సీసీఎస్ స్టేషన్కు తరువాత కమిషనర్ కార్యాలయానికి వెళ్లారు. ఎక్కడాలేరని పోలీసులు చెప్పడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. కాలనీవాసులు, పిల్లలు మట్టి, బేల్దారి పనులు చేస్తారు.
డబ్బు ఆశచూపి రోడ్డుషోకు తీసుకెళ్లారు..
రూ.200 ఆశ చూపి తమను జగన్ బస్సు యాత్రకు తీసుకువెళ్లారని, ఆ డబ్బులూ ఇవ్వలేదని స్థానికులు వివరించారు. సంఘటన జరిగిన సమయంలో అసలు నగరంలో లేని ఇద్దరినీ పోలీసులు తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమపై వేధింపులు ఆపాలని లేని పక్షంలో జగన్ పేరు చెప్పి తామంతా పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని కన్నీటి పర్యంతమయ్యారు. తమ పిల్లలకు ఏమీ తెలియదని, సంఘటన జరిగిన రోజు పుట్టిన రోజు వేడుకలు చేసుకున్నారని వివరించారు. జగన్ మామయ్య అని అభిమానించినందుకు మమ్మల్ని సీఎం నట్టేట ముంచారని పోలీసుల అదుపులో ఉన్న ఓ బాలుడి పిన్ని మండిపడ్డారు.
మా పిల్లవాడిని పోలీసులు తీసుకెళ్లారు
- ఓ బాలుడి తల్లి భవాని
ఎక్కడో జరిగినదానికి మా పిల్లవాడిని పోలీసులు తీసుకెళ్లారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవటం లేదు. పోలీసుస్టేషన్కు వెళితే మా వద్దకు రావద్దన్నారు. అక్కడికి వెళ్లండి.. ఇక్కడికి వెళ్లండని తిప్పుతున్నారు. ఎక్కడికి వెళ్లినా మా పిల్లాడి జాడ లేదు. మనిషికి రూ.200 ఇస్తామంటే మా కాలనీ ఆర్చి వద్ద వైకాపా జెండా పట్టుకుని నిలబడ్డాం. మా వాడికి ఏమీ తెలియదు.కొంతమంది పిల్లలను తీసుకెళ్లారు. ఇప్పటివరకు చూపించలేదు.
డబ్బులు ఇస్తామని రోడ్డెక్కించారు
- పిల్లల బంధువు
రోడ్డుషో రోజు మగపిల్లవాడికి రూ.300, ఆడవాళ్లకు రూ.200 తలుపు కొట్టి ఇస్తామని తీసుకెళ్లారు. ఆ డబ్బులూ ఇవ్వలేదు. ఇప్పుడేమో మా పిల్లలు తప్పు చేశారనడం న్యాయమా చెప్పండి? మేం పేదలం. హత్యలు చేసేటోళ్లం కాదు. సొల్యూషన్ పీలుస్తున్నారు.. నోరు చెక్ చేసి పంపిస్తామని పిల్లలను తీసుకెళ్లారు. ముందు సతీష్ను, తర్వాత నలుగురు పిల్లలను తీసుకువెళ్లారు. జెండా ఇచ్చి మా మీదే హత్య కేసు పెడతారా? జగన్ అంటే మాకేమైనా పగా?
రూ.200 కోసం రోడ్డుషోకు వెళ్తే నేరం మోపుతారా?
మీ అబ్బాయి సొల్యూషన్ పీలుస్తున్నాడు.. విచారించి వెంటనే పంపిస్తామని వాడు నిద్రపోతున్నప్పుడు పోలీసులు తీసుకెళ్లారు. ఆధార్ కార్డు తీసుకుని పోలీసుస్టేషన్కు రమ్మన్నారు. మా వాడికి ఏమీ తెలియదు. మా ఆర్చి వద్దకు జగన్ వచ్చినప్పుడు వైకాపా జెండా పట్టుకుని నిలబడితే మహిళలకు రూ.200, పురుషులకు రూ.300 ఇస్తామన్నారు. దీంతో మేము వెళ్లి రోడ్డుపై నిలబడ్డాం. వారిచ్చే డబ్బులకు ఆశపడి వెళ్లకుండా మా ఇంట్లో ఉంటే ఈ అవస్థలు తప్పేవి. వెళ్లినందుకు మా పిల్లాడిపై నేరం మోపుతారా?
సతీష్ తల్లి వెంకటరమణ
గులకరాయి డ్రామాతో బీసీ బిడ్డను బలి చేస్తున్నారు
సీఎం జగన్పై లోకేశ్ ఆగ్రహం
ఈనాడు డిజిటల్, అమరావతి: గతంలో కోడికత్తి డ్రామా ఆడి ఎస్సీ యువకుడిని వేధించిన జగన్.. ఇప్పుడు గులకరాయి డ్రామాతో బీసీ బిడ్డను బలి చేయాలని చూస్తున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మంగళవారం ఓ ప్రకటనలో ఆరోపించారు. ‘అధికారమే పరమావధిగా సాగుతున్న జగనాసుర రక్తచరిత్రలో తన, మన తేడా లేదు. సానుభూతితో సీఎం సీటు దక్కించుకోవాలని సొంత బాబాయ్ని లేపేశారు. అదే సమయంలో కోడికత్తి డ్రామాతో దళితుల్ని వేధించారు. ప్రజా వ్యతిరేకతలో ఓటమి ఖాయమని తేలడంతో ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. నా ఎస్సీలు అన్నారు.. వందల మందిని బలిచ్చారు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
అమాయకులను ఇరికించే పన్నాగం?: పట్టాభిరామ్
విశాఖపట్నం(వన్టౌన్), న్యూస్టుడే: విజయవాడలో సీఎం జగన్పై జరిగిన రాయి దాడి ఘటన కోడికత్తి డ్రామా 2.0ను తలపిస్తోందని, ఈ వ్యవహారంలో అమాయకులను బలి చేయాలని చూస్తున్నారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. మంగళవారం విశాఖలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కోడి కత్తి కేసులో అమాయకుడైన శ్రీనివాసరావును బలి చేశారు. ఇప్పుడు మరికొందరు యువకులను ఇరికించే పనిలో ఉన్నారన్నారు. రాష్ట్రంలో పోలీసు అధికారులు జగన్ పర్సనల్ సర్వీస్ (జేపీఎస్)గా మారిపోయారని ధ్వజమెత్తారు. జగన్పై దాడి ఘటనకు సంబంధించి విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా చెబుతున్న దానికి, వాస్తవంగా అక్కడ జరిగిన దానికి పొంతన లేదన్నారు. అరచేతి పరిమాణంలో ఉన్న రాయి సీఎంకు తగిలి, తర్వాత మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ను తాకి ఎక్కడో పడిపోయిందని సీపీ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే