బెవరేజస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిపై వేటు
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది.
జగన్ ప్రభుత్వ మద్యం దోపిడీలో ఆయనదే ప్రధాన పాత్ర
ఎట్టకేలకు బదిలీ చేసిన ఎన్నికల సంఘం
ఈనాడు - అమరావతి
జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లుగా మద్యం ద్వారా కొనసాగిస్తున్న దోపిడీ పర్వాన్ని ముందుండి నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) ఎండీ డి.వాసుదేవరెడ్డిపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. అధికార వైకాపాకు కరడుగట్టిన మద్దతుదారైన ఆయన.. ఈ ఎన్నికల వేళ ఆ పార్టీకి అనుచిత లబ్ధి కలిగించేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేస్తున్నారన్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని ఈ చర్యలు చేపట్టింది. ఆయన తర్వాత స్థానంలో ఉన్న అధికారికి బాధ్యతలు అప్పగించేసి, తక్షణమే ఆ విధుల నుంచి ఆయన్ను రిలీవ్ చేయాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ వాసుదేవరెడ్డికి ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి విధులూ అప్పగించొద్దని నిర్దేశించింది. ఆయన స్థానంలో మరొకర్ని నియమించేందుకు వీలుగా ముగ్గురు ఐఏఎస్ అధికారుల పేర్లతో మంగళవారం సాయంత్రం 5 గంటల్లోగా ప్యానల్ జాబితా సమర్పించాలని ఆదేశించింది. గత అయిదేళ్లలో వారి ఏపీఏఆర్ గ్రేడింగ్, విజిలెన్స్ క్లియరెన్స్ల వివరాలను ప్యానల్తో పాటు పంపాలని సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో వాసుదేవరెడ్డిని ఎక్సైజ్ శాఖ నుంచి ఉపసంహరిస్తూ, సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని సీఎస్ ఉత్తర్వులిచ్చారు.
ప్రభుత్వ పెద్దలు సూత్రధారులు.. వాసుదేవరెడ్డి పాత్రధారి
2009 బ్యాచ్ ఐఆర్టీఎస్ అధికారి, కేంద్ర సర్వీసుల్లో ఉన్న డి.వాసుదేవరెడ్డిని జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు, మూడు నెలల్లోనే డిప్యుటేషన్పై తెచ్చుకుని ఏపీఎస్బీసీఎల్ ఎండీగా నియమించుకుంది. 2019 అక్టోబరు 1 నుంచి నూతన మద్యం విధానం పేరిట ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించిన జగన్ అంతకు 20 రోజుల ముందు 2019 సెప్టెంబరు 16 నుంచి ఆయన్ను నియమించారు. ఆ తర్వాత డిస్టిలరీస్, బ్రూవరీస్ కమిషనర్గా కూడా ఆయనకు బాధ్యతలప్పగించారు. అప్పటి నుంచి దాదాపు నాలుగున్నరేళ్లుగా అదే పోస్టులో కొనసాగుతున్న వాసుదేవరెడ్డి.. ఈ మద్యం విధానం ద్వారా ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ముఖ్య నాయకులు కొనసాగించిన దోపిడీకి అన్నీ తానై వ్యవహరించారన్న ఫిర్యాదులున్నాయి. మద్యంపై ఆదాయాన్ని తాకట్టు పెట్టి ప్రభుత్వం రూ.వేల కోట్ల అప్పులు తీసుకురావడంలోనూ వాసుదేవరెడ్డిదే ప్రధాన పాత్ర.
ప్రతి మద్యం కేసుకూ రూ.200- 250 చొప్పున కమీషన్
గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని ‘జే బ్రాండ్లు’ తీసుకురావటంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవీ అందుబాటులో లేకుండా చేశారు. ప్రభుత్వ, పెద్దలు అధికార పార్టీ ముఖ్య నాయకులకు ప్రతి మద్యం కేసుకు రూ.200 నుంచి రూ.250 చొప్పున, ప్రతి బీరు కేసుకు రూ.100 నుంచి రూ.150 చొప్పున కమీషన్ చెల్లించిన మద్యం సరఫరా కంపెనీలకే 99 శాతం మేర కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారన్న ఫిర్యాదులున్నాయి. వైకాపా అధికారం చేపట్టాక రాష్ట్రంలోని డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైకాపా ముఖ్య నేతల చేతుల్లోకి వెళ్లిపోయేలా చేయటంలో వాసుదేవరెడ్డిదే కీలక పాత్ర. వైకాపా ఎంపీ విజయ సాయిరెడ్డి అల్లుడైన పెనక రోహిత్రెడ్డి బినామీ కంపెనీ అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న అదాన్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, వైకాపా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి గుప్పిట్లో నడుస్తోందని ఫిర్యాదులున్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ తదితర చోట్ల తయారయ్యే ‘జే బ్రాండ్ల’ మద్యాన్ని రోజువారీ లక్ష్యాలు విధించి మరీ ప్రభుత్వ దుకాణాల్లో అమ్మించిన ఘనత వాసుదేవరెడ్డిదే. రాష్ట్రంలో మద్యం తయారీ, కొనుగోలు, సరఫరా, విక్రయాలన్నీ ప్రభుత్వ పెద్దలు, వైకాపా ముఖ్య నేతల గుత్తాధిపత్యంలో కొనసాగుతున్నాయి. ఈ దందాను క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేసింది వాసుదేవరెడ్డేనని ఫిర్యాదులున్నాయి. అలాగే అధికార పార్టీ నాయకులు, ప్రభుత్వ పెద్దలు బినామీల పేరుతో ఏర్పాటు చేసిన మద్యం సరఫరా కంపెనీలు తయారు చేసే కొత్త కొత్త బ్రాండ్ల మద్యాన్ని మాత్రమే ప్రభుత్వ దుకాణాల్లో దొరికేలా చేశారు.
సీఎంవో అధికారి ఆదేశిస్తారు.. వాసుదేవరెడ్డి ఆచరిస్తారు: ఏ మద్యం సరఫరా కంపెనీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇవ్వాలి? ఏయే బ్రాండ్లకు అనుమతులివ్వాలి? ఇలా ప్రతి అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లోని కీలక అధికారి నుంచి వాసుదేవరెడ్డికి ఆదేశాలందుతుంటాయి. వాటిని ఆయన తు.చ.తప్పకుండా ఆచరిస్తుంటారు. ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ ముఖ్య నాయకులకు అనుచిత లబ్ధి కలిగించటమే లక్ష్యంగా ఈ వ్యవహారం సాగుతోందన్న ఫిర్యాదులున్నాయి.
ఎన్నికల షెడ్యూల్కు ముందు, తర్వాత వైకాపా నాయకులకే మద్యం: ప్రస్తుతం ఎన్నికల కోడ్ నేపథ్యంలో.. గతేడాది ఇదే తేదీన ఎంత మద్యం అమ్మారో అంతకు మించి జరగటానికి వీల్లేదని ఎన్నికల సంఘం ఆదేశించింది. దీంతో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మద్యాన్ని వైకాపా నేతలకు చేరేలా చేసి.. ఆ తర్వాత విక్రయాలను నిలిపేసి, ఇతరులెవరికీ అందుబాటులో లేకుండా వాసుదేవరెడ్డి చేస్తున్నారన్నది ప్రతిపక్షాల ఫిర్యాదు. ఎన్నికల షెడ్యూల్కు ముందే వైకాపా నేతలకు భారీ ఎత్తున మద్యం నిల్వలు చేర్చారన్న ఫిర్యాదులున్నాయి.
రూ.లక్ష కోట్లకు పైగా నగదు లావాదేవీలే
రాష్ట్రంలో చిన్న చిల్లర దుకాణం వద్ద చూసినా డిజిటల్ లావాదేవీలు ఉంటాయి. కానీ జగన్ ప్రభుత్వం గత అయిదేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల విలువైన మద్యాన్ని కేవలం నగదు రూపంలోనే అమ్మింది. మూడున్నరేళ్లపాటు అసలు డిజిటల్ చెల్లింపులకు చోటే కల్పించలేదు. గతేడాది ప్రభుత్వ దుకాణాల్లో డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రవేశపెట్టినా అది పేరుకే పరిమితమైంది. ఈ మొత్తం దందాలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ప్రభుత్వంలోని కీలక పెద్దకు అవినీతి సొత్తంతా చేరుతోందని, నల్లధనం పోగుపడుతోందని ప్రతిపక్షాలు తొలి నుంచీ గగ్గోలు పెడుతున్నాయి. ఈ వ్యవహారమంతటిలోనూ కీలకపాత్ర పోషిస్తున్నది వాసుదేవరెడ్డేనని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండు చేస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్