ఐదేళ్లుగా ముంచేస్తున్న.. జగన్మొండి సర్కారు!
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు తరతరాలుగా ఉంటున్న ఈ నేలను వదిలిపెట్టి వెళ్లలేమని నెత్తీనోరూబాదుకున్నాం.
వరదల్లో కునారిల్లిన పోలవరం విలీన మండలాలు
లక్షమంది నిర్వాసితులకు కష్టాలే కష్టాలు
కనీసం పునరావాసానికి తరలించలేని దుస్థితి!
న్యూస్టుడే, కుక్కునూరు
కొన్ని వేల కుటుంబాల త్యాగఫలమే ఆంధ్రావనికి పోల‘వరం’.. ప్రతిపక్ష నేతగా వారిపైన వల్లమాలిన ప్రేమని చూపించారు.. ముఖ్యమంత్రి అయ్యాక.. హామీల వర్షం కురిపించారు.. కానీ ఐదేళ్లలో పరిహారం చెల్లించకుండా, పునరావాసం ఊసెత్తకుండా.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు జగన్. గోదావరి వరదల తీవ్రతకు ఐదేళ్లుగా లక్షమంది నిలువునా మునిగిపోతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది వైకాపా సర్కారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు తరతరాలుగా ఉంటున్న ఈ నేలను వదిలిపెట్టి వెళ్లలేమని నెత్తీనోరూబాదుకున్నాం. అయినా, కాదూ కూడదన్నారు. ఆఖరికి ఒప్పించారు. మా భూములు స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు. పునరావాసం చూపించకుండా గోదావరికి అడ్డంగా కాఫర్ డ్యాంలు నిర్మించారు. వరదలొస్తే మా ఊళ్లలోకి నీళ్లొస్తున్నాయి, ఇళ్లు మునిగిపోతున్నాయి. జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్నా... అయ్యో పాపం అనే నాథుడే లేడు..’
ఇదీ పోలవరం ప్రాజెక్టులో విలీన మండలాల నిర్వాసితుల ఆక్రందన, ఆవేదన. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా ఈ ఐదేళ్లలో నెరవేర్చకుండా వరదల్లో ఇలా ముంచేస్తున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.
పోలవరం నిర్వాసితులను ఆదుకోకపోవడం ఒక ఎత్తయితే.. ‘ఏం ఇంతకుముందు వరదల్లో ఊళ్లు మునగలేదా? ఈ ఐదేళ్లలోనే మీరు మునిగిపోతున్నారా?’ అని అధికార వైకాపా నాయకగణం ఎదురు ప్రశ్నించడం మరో ఎత్తు. ఇంతకుముందూ వరదలు వచ్చిందీ నిజం.. కానీ ఇన్ని ఇబ్బందులు పడలేదు. ఇన్ని రోజులు ఊళ్లలో ముంపు నిలిచింది లేదు. గోదావరికి అడ్డంగా 42.5 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించిన తర్వాత వరద ఎగదన్నుతోంది. స్పిల్ వే మీదుగా మొత్తం నీరు వెళ్లడం లేదు. ఆ ప్రభావం ఈ ఊళ్లపై రోజుల తరబడి ఉంటోంది. నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేయనందున ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయలేదని మొదట్లో వైకాపా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆ తర్వాత పునరావాసం పూర్తి చేయకుండానే ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం 42.5 మీటర్ల మేరకు పూర్తి చేసింది. ఈ నిర్మాణం పూర్తయ్యాక పోలవరం పునరావాస గ్రామాల్లో దాదాపు లక్షమంది మీద ముంపు ప్రభావం పడుతోంది. గతంలో భద్రాచలం వద్ద 60 అడుగులు పైబడి నీరు నిలిస్తేనే గ్రామాలపైకి వరద దండెత్తేది. ఇప్పుడు 50 అడుగులు దాటగానే చాలా గ్రామాల్లో ప్రజలు బతుకుజీవుడా అంటూ కొండలు, గుట్టలపైకి వెళ్లిపోవాల్సి వస్తోంది.
ఐదేళ్లూ వరదలే..
జగన్ సర్కారు వచ్చిన తర్వాత రెండు భారీ వరదలు గోదావరిని ముంచెత్తాయి. మరో మూడు సార్లు ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపంలో వరదలు వచ్చాయి. ఐదేళ్లూ విలీన ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నా జగన్ వీరిని పట్టించుకోనేలేదు. కాఫర్డ్యాం కట్టి, నది మార్గాన్ని మళ్లించారు. దీంతో వర్షాకాలంలో ఎగువ నుంచి ఉవ్వెత్తున వచ్చి పడుతున్న వరద ప్రవాహానికి పోలవరం వద్ద ఆటంకం ఏర్పడుతోంది. విలీన గ్రామాల(రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనం చేసినవి) మీద ఆ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అక్కడ గోదావరి సహజ మార్గం స్పిల్వే వైపు మళ్లింది. దీంతో అక్కడ వేగం మందగించి మొత్తం వరద విలీన గ్రామాలవైపు ఎగదన్నుతోంది.
ముంపు గ్రామాలపై సరైన లెక్కలే లేవా?
పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిలిస్తే 54 రెవెన్యూ గ్రామాలు.. అందులోని 115 ఆవాసాల్లోని 20,946 కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయని కాంటూరు సర్వే ప్రకారం లెక్కించారు. ఒకవేళ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం 45.72 మీటర్ల వరకు నీరు నిలిస్తే మొత్తం మీద 222 రెవెన్యూ గ్రామాల్లోని 373 ఆవాసాల్లో 1,06,000 కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయని గణించారు. వీళ్లందరికీ పునరావాసం కల్పించకుండా ఏటా జగన్ సర్కారు వరదల్లో ముంచేసింది. 2022లో గోదావరి నది చరిత్రలోనే రెండో అతి పెద్ద వరద వచ్చింది. ఆ వరదల్లో వందల గ్రామాలు నీటమునిగాయి. రూ.కోట్లలో నష్టం సంభవించింది. ఆ వరదల తాకిడిని తట్టుకోలేక పోలవరం, దేవీపట్నం మండలాల వాసులు స్వచ్ఛందంగా వారి కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన పునరావాస కాలనీలకు శాశ్వతంగా వెళ్లిపోయారు. ఆ కాలనీల్లో ఇంకా పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా జగన్ పట్టించుకోవడం లేదు. ఇక మిగిలిన గ్రామాలకు పునరావాసం కల్పించడంలోనూ ఆయన విఫలమయ్యారు. ముంపు సమయంలో వచ్చి మాటలు చెప్పడం తప్ప ఈ ముఖ్యమంత్రి చేసిందేమీ లేదు.
2022 వరదలు ఒక పెద్ద గుణపాఠం...
2022 జులైలో సంభవించిన వరదలు ఈ కాంటూరు లెక్కలను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. ఆ వరదల సమయంలో పోలవరం స్పిల్వే వద్ద 36.545 మీటర్ల, కాఫర్డ్యాం వద్ద 36.89 మీటర్ల గరిష్ఠ నీటిమట్టాలు నమోదయ్యాయి. నిజానికి పోలవరం ప్రాజెక్టులో నీరు నిలబెడితేనే ఈ నిర్వాసిత గ్రామాలు ముంపులో చిక్కుకోవాలి. అలాంటిది నీరు నిలబెట్టకుండా స్పిల్వే మీదుగా మొత్తం నీరు వదిలేసినా ముంపు తప్పలేదు. 41.15 మీటర్ల స్థాయికి నీటిమట్టం రాకున్నా తొలిదశ, మలిదశ గ్రామాలు అనేకం మునిగిపోయాయి. జలవనరుల శాఖ అధికారులు లెక్కించిన కాంటూరు స్థాయిలను ఆ వరదలు ప్రశ్నించేవిగా కనిపించాయి. ప్రాజెక్టులో నిండా నీరు నిలిపితే మునుగుతాయని లెక్కించిన గ్రామాలెన్నో.. 2022 నాటి వరదల తీవ్రతకు ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఉదాహరణకు 41.15 కాంటూరులో అల్లూరి జిల్లా కూనవరం మండలంలో ఒక్క గ్రామమే ఉంది. మిగిలిన గ్రామాలన్నీ 45.75 కాంటూరు వరకు నీళ్లు నిలిపితేనే ముంపులోకి రావాలి. అలాంటిది నీరు నిలపకపోయినా ఆ మండలంలోని గ్రామాలన్నీ వరద ముంపులో చిక్కుకున్నాయి. కుక్కునూరు మండలంలో తొలిదశలో ఎనిమిది గ్రామాలకే ముంపు ఉంటుందని లెక్కించారు. ఆ వరదల్లో 76 ఆవాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ తరహా లెక్కలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంటే, ఎన్నేళ్లని ఈ వరదలను తట్టుకొని జీవించాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. అయినా, ఈ జగమొండి సర్కారు నుంచి సమాధానం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!