ఐదేళ్లుగా ముంచేస్తున్న.. జగన్మొండి సర్కారు!
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు తరతరాలుగా ఉంటున్న ఈ నేలను వదిలిపెట్టి వెళ్లలేమని నెత్తీనోరూబాదుకున్నాం.
వరదల్లో కునారిల్లిన పోలవరం విలీన మండలాలు
లక్షమంది నిర్వాసితులకు కష్టాలే కష్టాలు
కనీసం పునరావాసానికి తరలించలేని దుస్థితి!
న్యూస్టుడే, కుక్కునూరు
కొన్ని వేల కుటుంబాల త్యాగఫలమే ఆంధ్రావనికి పోల‘వరం’.. ప్రతిపక్ష నేతగా వారిపైన వల్లమాలిన ప్రేమని చూపించారు.. ముఖ్యమంత్రి అయ్యాక.. హామీల వర్షం కురిపించారు.. కానీ ఐదేళ్లలో పరిహారం చెల్లించకుండా, పునరావాసం ఊసెత్తకుండా.. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు జగన్. గోదావరి వరదల తీవ్రతకు ఐదేళ్లుగా లక్షమంది నిలువునా మునిగిపోతున్నా.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది వైకాపా సర్కారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పినప్పుడు తరతరాలుగా ఉంటున్న ఈ నేలను వదిలిపెట్టి వెళ్లలేమని నెత్తీనోరూబాదుకున్నాం. అయినా, కాదూ కూడదన్నారు. ఆఖరికి ఒప్పించారు. మా భూములు స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణం మొదలు పెట్టారు. పునరావాసం చూపించకుండా గోదావరికి అడ్డంగా కాఫర్ డ్యాంలు నిర్మించారు. వరదలొస్తే మా ఊళ్లలోకి నీళ్లొస్తున్నాయి, ఇళ్లు మునిగిపోతున్నాయి. జీవచ్ఛవాలుగా బతుకులీడుస్తున్నా... అయ్యో పాపం అనే నాథుడే లేడు..’
ఇదీ పోలవరం ప్రాజెక్టులో విలీన మండలాల నిర్వాసితుల ఆక్రందన, ఆవేదన. ప్రతిపక్ష నేతగా జగన్ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా ఈ ఐదేళ్లలో నెరవేర్చకుండా వరదల్లో ఇలా ముంచేస్తున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.
పోలవరం నిర్వాసితులను ఆదుకోకపోవడం ఒక ఎత్తయితే.. ‘ఏం ఇంతకుముందు వరదల్లో ఊళ్లు మునగలేదా? ఈ ఐదేళ్లలోనే మీరు మునిగిపోతున్నారా?’ అని అధికార వైకాపా నాయకగణం ఎదురు ప్రశ్నించడం మరో ఎత్తు. ఇంతకుముందూ వరదలు వచ్చిందీ నిజం.. కానీ ఇన్ని ఇబ్బందులు పడలేదు. ఇన్ని రోజులు ఊళ్లలో ముంపు నిలిచింది లేదు. గోదావరికి అడ్డంగా 42.5 మీటర్ల ఎత్తుతో ఎగువ కాఫర్ డ్యాం నిర్మించిన తర్వాత వరద ఎగదన్నుతోంది. స్పిల్ వే మీదుగా మొత్తం నీరు వెళ్లడం లేదు. ఆ ప్రభావం ఈ ఊళ్లపై రోజుల తరబడి ఉంటోంది. నిర్వాసితులకు పునరావాసం పూర్తి చేయనందున ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం పూర్తి చేయలేదని మొదట్లో వైకాపా ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఆ తర్వాత పునరావాసం పూర్తి చేయకుండానే ఎగువ కాఫర్ డ్యాం నిర్మాణం 42.5 మీటర్ల మేరకు పూర్తి చేసింది. ఈ నిర్మాణం పూర్తయ్యాక పోలవరం పునరావాస గ్రామాల్లో దాదాపు లక్షమంది మీద ముంపు ప్రభావం పడుతోంది. గతంలో భద్రాచలం వద్ద 60 అడుగులు పైబడి నీరు నిలిస్తేనే గ్రామాలపైకి వరద దండెత్తేది. ఇప్పుడు 50 అడుగులు దాటగానే చాలా గ్రామాల్లో ప్రజలు బతుకుజీవుడా అంటూ కొండలు, గుట్టలపైకి వెళ్లిపోవాల్సి వస్తోంది.
ఐదేళ్లూ వరదలే..
జగన్ సర్కారు వచ్చిన తర్వాత రెండు భారీ వరదలు గోదావరిని ముంచెత్తాయి. మరో మూడు సార్లు ప్రమాద హెచ్చరిక స్థాయికి సమీపంలో వరదలు వచ్చాయి. ఐదేళ్లూ విలీన ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నా జగన్ వీరిని పట్టించుకోనేలేదు. కాఫర్డ్యాం కట్టి, నది మార్గాన్ని మళ్లించారు. దీంతో వర్షాకాలంలో ఎగువ నుంచి ఉవ్వెత్తున వచ్చి పడుతున్న వరద ప్రవాహానికి పోలవరం వద్ద ఆటంకం ఏర్పడుతోంది. విలీన గ్రామాల(రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ నుంచి ఆంధ్రాలో విలీనం చేసినవి) మీద ఆ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అక్కడ గోదావరి సహజ మార్గం స్పిల్వే వైపు మళ్లింది. దీంతో అక్కడ వేగం మందగించి మొత్తం వరద విలీన గ్రామాలవైపు ఎగదన్నుతోంది.
ముంపు గ్రామాలపై సరైన లెక్కలే లేవా?
పోలవరం ప్రాజెక్టు వద్ద 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిలిస్తే 54 రెవెన్యూ గ్రామాలు.. అందులోని 115 ఆవాసాల్లోని 20,946 కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయని కాంటూరు సర్వే ప్రకారం లెక్కించారు. ఒకవేళ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ మట్టం 45.72 మీటర్ల వరకు నీరు నిలిస్తే మొత్తం మీద 222 రెవెన్యూ గ్రామాల్లోని 373 ఆవాసాల్లో 1,06,000 కుటుంబాలు ముంపులో చిక్కుకుంటాయని గణించారు. వీళ్లందరికీ పునరావాసం కల్పించకుండా ఏటా జగన్ సర్కారు వరదల్లో ముంచేసింది. 2022లో గోదావరి నది చరిత్రలోనే రెండో అతి పెద్ద వరద వచ్చింది. ఆ వరదల్లో వందల గ్రామాలు నీటమునిగాయి. రూ.కోట్లలో నష్టం సంభవించింది. ఆ వరదల తాకిడిని తట్టుకోలేక పోలవరం, దేవీపట్నం మండలాల వాసులు స్వచ్ఛందంగా వారి కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన పునరావాస కాలనీలకు శాశ్వతంగా వెళ్లిపోయారు. ఆ కాలనీల్లో ఇంకా పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా జగన్ పట్టించుకోవడం లేదు. ఇక మిగిలిన గ్రామాలకు పునరావాసం కల్పించడంలోనూ ఆయన విఫలమయ్యారు. ముంపు సమయంలో వచ్చి మాటలు చెప్పడం తప్ప ఈ ముఖ్యమంత్రి చేసిందేమీ లేదు.
2022 వరదలు ఒక పెద్ద గుణపాఠం...
2022 జులైలో సంభవించిన వరదలు ఈ కాంటూరు లెక్కలను ప్రశ్నించే విధంగా ఉన్నాయి. ఆ వరదల సమయంలో పోలవరం స్పిల్వే వద్ద 36.545 మీటర్ల, కాఫర్డ్యాం వద్ద 36.89 మీటర్ల గరిష్ఠ నీటిమట్టాలు నమోదయ్యాయి. నిజానికి పోలవరం ప్రాజెక్టులో నీరు నిలబెడితేనే ఈ నిర్వాసిత గ్రామాలు ముంపులో చిక్కుకోవాలి. అలాంటిది నీరు నిలబెట్టకుండా స్పిల్వే మీదుగా మొత్తం నీరు వదిలేసినా ముంపు తప్పలేదు. 41.15 మీటర్ల స్థాయికి నీటిమట్టం రాకున్నా తొలిదశ, మలిదశ గ్రామాలు అనేకం మునిగిపోయాయి. జలవనరుల శాఖ అధికారులు లెక్కించిన కాంటూరు స్థాయిలను ఆ వరదలు ప్రశ్నించేవిగా కనిపించాయి. ప్రాజెక్టులో నిండా నీరు నిలిపితే మునుగుతాయని లెక్కించిన గ్రామాలెన్నో.. 2022 నాటి వరదల తీవ్రతకు ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయాయి. ఉదాహరణకు 41.15 కాంటూరులో అల్లూరి జిల్లా కూనవరం మండలంలో ఒక్క గ్రామమే ఉంది. మిగిలిన గ్రామాలన్నీ 45.75 కాంటూరు వరకు నీళ్లు నిలిపితేనే ముంపులోకి రావాలి. అలాంటిది నీరు నిలపకపోయినా ఆ మండలంలోని గ్రామాలన్నీ వరద ముంపులో చిక్కుకున్నాయి. కుక్కునూరు మండలంలో తొలిదశలో ఎనిమిది గ్రామాలకే ముంపు ఉంటుందని లెక్కించారు. ఆ వరదల్లో 76 ఆవాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ తరహా లెక్కలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోంటే, ఎన్నేళ్లని ఈ వరదలను తట్టుకొని జీవించాలని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. అయినా, ఈ జగమొండి సర్కారు నుంచి సమాధానం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
భూ హక్కు చట్టంపై ధర్మాన ద్వంద్వ వైఖరి
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
కృష్ణా జలాల్లో 1,144 టీఎంసీలు కావాలి: ఆంధ్రప్రదేశ్
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ తీర్పు వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) తీర్పును వాయిదా వేసింది. -
నన్నెవరూ అపహరించలేదు
గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి నామినేషన్ వేసే క్రమంలో స్వతంత్ర అభ్యర్థి విడదల రజనిని వైకాపా నేతల కనుసన్నల్లో పోలీసులు అడ్డుకొని, నిర్బంధించారంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణను మూసివేసింది. -
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.