త్రిమూర్తులును సస్పెండ్ చేశాకే జగన్ ఓట్లడగాలి
సీఎం జగన్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... దళితులకు శిరోముండనం కేసులో దోషిగా నిర్ధారణైన తోట త్రిమూర్తుల్ని ఎమ్మెల్సీ పదవి నుంచి, మండపేట అభ్యర్థిత్వం నుంచి తొలగించాలని దళిత, ప్రజాసంఘాలు డిమాండు చేశాయి.
ఎమ్మెల్సీ పదవితో పాటు, పార్టీ అభ్యర్థిగానూ తప్పించాలి
లేకపోతే పోరాటం కొనసాగిస్తాం
దళిత, ప్రజాసంఘాల హెచ్చరిక
శిరోముండనం బాధితులకు అండగా 28 ఏళ్లుగా పోరాటం
ఈనాడు, విశాఖపట్నం, కాకినాడ, న్యూస్టుడే-రామచంద్రపురం, ద్రాక్షారామ: సీఎం జగన్కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... దళితులకు శిరోముండనం కేసులో దోషిగా నిర్ధారణైన తోట త్రిమూర్తుల్ని ఎమ్మెల్సీ పదవి నుంచి, మండపేట అభ్యర్థిత్వం నుంచి తొలగించాలని దళిత, ప్రజాసంఘాలు డిమాండు చేశాయి. దళితులు తనకు మేనమామలని చెప్పుకొనే జగన్... త్రిమూర్తులును పార్టీనుంచి తొలగించాలని, లేకపోతే పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించాయి. ఆ కేసులో ప్రధానదోషి త్రిమూర్తులుకు 18 నెలల జైలుశిక్షే విధించడంపై అసంతృప్తి వ్యక్తం చేశాయి. తీర్పును సవాలు చేస్తూ హైకోర్టుకు వెళతామని తెలిపాయి. సుదీర్ఘ న్యాయపోరాటంలో ప్రజా, దళితసంఘాలు బాధితులకు అండగా నిలిచాయి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా అలుపెరగని పోరాటం చేశాయి. ఎట్టకేలకు దోషులకు శిక్ష పడిందంటే ఆ సంఘాల పాత్ర కీలకం..! అయితే కోర్టు తీర్పుపై ఆ సంఘాలు సంతృప్తిగా లేవు.
మడమ తిప్పని పోరాటం
శిరోముండనం బాధితులకు న్యాయం కోసం విశాఖ దళితసంఘాల ఐక్యవేదిక (విదసం), వెంకటాయపాలెం దళిత ఐక్యపోరాట వేదిక మడమ తిప్పకుండా పోరాడాయి. కేసు నమోదైనప్పటి నుంచి న్యాయం కోసం బాధితులు, వారి పక్షాన దళితసంఘాల ప్రతినిధులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. వివిధ ప్రజా, దళితసంఘాలు కలసి... రైతుకూలీ సంఘం నాయకుడు వెంటపల్లి భీమశంకరం కన్వీనర్గా... వెంకటాయపాలెం దళిత ఐక్య పోరాటవేదికగా ఏర్పాటై ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద 2018లో 75 రోజులు నిరాహారదీక్ష చేశారు. పోలీసులు వారి దీక్షను భగ్నం చేసి, అరెస్టుచేసి కేసులు పెట్టారు.
కేసు కొట్టేయకుండా అడ్డుపడ్డ విదసం
కొవిడ్ సమయంలో 2020 ఆగస్టు నాటి వర్చువల్ విచారణలో... నెట్వర్క్లో సాంకేతిక సమస్యతో బాధితుల న్యాయవాది వాదనలు వినిపించలేకపోయారు. దాంతో నిందితుల తరఫు న్యాయవాదులు... తీర్పు చెప్పేయాలని న్యాయమూర్తిని కోరారు. జడ్జి తీర్పు చెప్పేందుకూ సిద్ధమయ్యారు. ఆ దశలో బాధితుల వాదనలు వినేలా చేయడంలో విదసం ప్రత్యేకకృషి చేసింది. కేసును రీఓపెన్ చేయించడంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం కీలకంగా వ్యవహరించారు.
దళితులపై దాడులు చేసేవారికి ఇదో హెచ్చరిక
- బూసి వెంకట్రావు, విదసం ఐక్యవేదిక కన్వీనర్
సరైన సమయంలో తీర్పు రాలేదని భావిస్తున్నాం. సకాలంలో శిక్షపడి ఉంటే రాష్ట్రంలో మరో రెండు ఘటనలు జరిగేవి కావు. ఈ ధైర్యంతోనే అనంతబాబు దళిత యువకుడిని హత్యచేసి డోర్ డెలివరీ చేశారు. అలాంటివారికి సరైన శిక్షపడి రాజకీయ భవిష్యత్తు సమాధి అవ్వాలని పోరాటం చేశాం. దళితులపై దాడులు చేసినవారికి ఇది ఒక హెచ్చరిక.
పూర్తిన్యాయం జరగలేదు
- వెంటపల్లి భీమశంకర్, దళిత ఐక్య పోరాటవేదిక కన్వీనర్
‘‘ఈ కేసు ఇంతకాలం కొనసాగడానికి ప్రధాన కారణం ఉంది. ఎస్సీ ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు కనుక కుల ధ్రువీకరణ పత్రం కీలకమైంది. బాధితులు ఎస్సీలు కారని, క్రిస్టియన్లని అన్నారు. ఇప్పటికీ పూర్తి న్యాయం జరగలేదనే భావిస్తున్నాం.’’
ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి
- చీకట్ల వెంకటేశ్వరరావు, దళిత ఐక్య పోరాటవేదిక కోకన్వీనర్
‘‘28 ఏళ్లుగా పోరాడుతూ కోర్టు న్యాయం చేస్తుందని ఎదురుచూస్తున్న బాధితులను ఈ తీర్పు నిరాశపరిచింది. త్రిమూర్తులుకు రెండేళ్లకు మించి జైలుశిక్ష విధిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదని 18 నెలల జైలుశిక్ష మాత్రమే విధించడం సరికాదు. తీర్పును హైకోర్టులో సవాలు చేస్తాం. జగన్ ఓటు అడిగేందుకు ప్రజల దగ్గరకు వెళ్లాలంటే... ముందు త్రిమూర్తులును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి.’’
పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
- ఆకుమర్తి చినమాదిగ, రాష్ట్ర మాదిగ పోరాట సమితి అధ్యక్షుడు
‘‘న్యాయం కోసం పోరాడుతున్న దళిత సంఘాల్ని త్రిమూర్తులు ఎన్నో ఇబ్బందులు పెట్టారు. జగన్కు ఏమాత్రం మాత్రం చిత్తశుద్ధి ఉన్నా త్రిమూర్తులును పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఆయనను అభ్యర్థిగా తప్పించకపోతే దళితసంఘాలు వైకాపాకు వ్యతిరేకంగా పోరాటం చేస్తాయి.’’
తగిన శిక్ష పడలేదు: సీనియర్ న్యాయవాది సత్యప్రసాద్
ఈనాడు, అమరావతి: శిరోముండనం కేసులో నిందితులకు తగిన శిక్ష పడలేదని హైకోర్టు సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉన్నా.. న్యాయస్థానం కేవలం 18 నెలలకే పరిమితం కావడం కొంత నిరుత్సాహపరుస్తోందన్నారు. శిక్షా కాలాన్ని పెంచాలని కోరుతూ బాధితులు హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయవచ్చన్నారు. న్యాయం జరగడానికి 28ఏళ్లు పట్టడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
కొంత ఉపశమనం: న్యాయవాది జాహా ఆరా
నిందితులకు శిక్ష పడినందుకు ప్రజాసంఘాలు, దళిత సంఘాలు హర్షిస్తున్నాయని న్యాయవాది జాహా ఆరా అన్నారు. శిక్షా కాలమే కొంత నిరాశాజనకంగా ఉందని తెలిపారు. ‘దళితులకు గుండు కొట్టించడం ఎస్సీ, ఎస్టీ చట్టం సెక్షన్ 3 కిందకు వస్తుంది. దాని ప్రకారం ఆరు నెలల నుంచి అయిదేళ్ల వరకు శిక్ష వేయొచ్చు. ఈ కేసులో గరిష్ఠంగా 18 నెలల శిక్ష మాత్రమే విధించారు. ఇంకొంచెం శిక్షా కాలం ఎక్కువగా పడినట్లయితే బాగుండేది’ అని పేర్కొన్నారు.
తీర్పు ఊహించిన విధంగానే వచ్చింది: పీపీ సత్యనారాయణమూర్తి
తీర్పు ఊహించిన విధంగానే వచ్చిందని పీపీ సత్యనారాయణమూర్తి అన్నారు. ‘28 ఏళ్ల సుదీర్ఘ విచారణ జరిగింది. సంచలనమైన కేసుల్లో ఇటువంటి జాప్యం అనివార్యమైంది. అనేక అంశాల మీద ముద్దాయిలు హైకోర్టుకు వెళ్లారు, కొన్ని విషయాల్లో బాధితులు సైతం హైకోర్టును ఆశ్రయించారు. తీర్పుపై అప్పీలుకు వెళ్లడం దోషులు హక్కులను వినియోగించుకోవడం కిందకే వస్తుంది’ అని అన్నారు.
బాధితులకు న్యాయం: ముప్పాళ్ల సుబ్బారావు
రాజమహేంద్రవరం(దానవాయిపేట), న్యూస్టుడే: డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం వెంకటాయపాలెంలో 1996లో జరిగిన శిరోముండనం కేసులో తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో బాధితులకు న్యాయం జరిగిందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు పేర్కొన్నారు. ఈ కేసులో నిందితులైన వైకాపా నాయకుడు తోట త్రిమూర్తులుతో పాటు మరో ఎనిమిది మందికి ఒక్కొక్కరికి 18 నెలల చొప్పున శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘ఇప్పటికే అధికార వైకాపా తోట త్రిమూర్తులుకు మండపేట ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం జగన్ తోట త్రిమూర్తులను తప్పిస్తారా లేక దళిత వ్యతిరేకి అనే ముద్రను ఆస్వాదిస్తారా తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని సుబ్బారావు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్