చర్మకారులకు ఏమిటీ ఖర్మ?
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.
లెదర్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం రూ.12 కోట్ల నిధులు
అందులో రూపాయైనా ఖర్చు చేయని జగన్ ప్రభుత్వం
ఎస్సీ యువత ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి ఇదేనా?
ఈనాడు, అమరావతి
ఒక్కసారి అవకాశమంటూ... అధికారంలోకి వచ్చీ రాగానే ఎస్సీలకు ఉన్న పథకాలను ఎత్తేశారు.. వారికిచ్చే స్వయం ఉపాధి రుణాలను తీసేశారు.. ఆఖరికి లెదర్ పార్కుల కోసం... కేంద్రం ఇచ్చిన నిధుల్నీ ఖర్చుచేయకుండా.. ఐదేళ్ల పుణ్యకాలం గడిపేశారు! ఇదీ ఎస్సీల అభివృద్ధిపై జగన్కున్న చిత్తశుద్ధి!
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు. గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ఊరూరా తిరుగుతూ యువతకు ఉద్యోగాల కల్పనపై ఊదరగొట్టిన ఆయన.. అధికారం చేపట్టగానే.. వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. వారు ఉద్యోగాలు పొందితే.. ఇక తన అబద్ధాలను నమ్మరనుకున్నారేమో.. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా.. ఉన్న వాటిపైనా కక్షకట్టినట్టు వ్యవహరించి రాష్ట్రం నుంచి తరిమికొట్టారు. చివరికి ఎస్సీల ఉపాధికి ఉపయోగపడే లెదర్పార్కుల ఏర్పాటుకూ ఆయన మనసొప్పలేదు. గత ఎన్నికల్లో రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని అత్యధిక స్థానాల్లో ఎస్సీలు వైకాపాకే వెన్నుదన్నుగా నిలిచారనే కృతజ్ఞత కూడా చూపించలేదు. ‘నా ఎస్సీ..’ అని పదే పదే అనడమే తప్ప ఆయన వారి ఉపాధికి చేపట్టిన చర్యలేమీ లేవు.
కేంద్రం నిధులిచ్చినా ఖర్చు చేయలేదు...
లెదర్పార్కుల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేంద్రమే నిధులిస్తుంది. వాటిని సక్రమంగా ఖర్చు చేస్తే చాలు. కానీ ఎస్సీలకు ఉపాధి కల్పించే ఆలోచనే లేదు జగన్కు. గత ఐదేళ్లలో రాయితీ రుణ పథకాలను ఎత్తేసి వారి ఉపాధి అవకాశాల్ని తెగ్గోసిన ఆయన.. చివరికి కేంద్రమిచ్చే నిధులనూ ఖర్చు చేయలేదంటే వారిపై ఎంతగా పగబట్టారో ఇట్టే తెలిసిపోతుంది. లెదర్పార్కుల ఏర్పాటు కోసం 2021-22లో ‘పీఎం అజయ్’ పథకం కింద కేంద్రం రూ.12 కోట్లు ఇస్తే రెండేళ్లయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. నిర్మాణాలు చేపట్టాలని గతేడాది మార్చిలో ఆదేశాలు జారీ చేసి వదిలేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని.. ఎస్సీల ఓట్లకు గాలం వేసేందుకు ఇటీవల టెండర్లు పిలుస్తున్నట్టు హడావుడి చేశారు.
తెదేపా ప్రభుత్వం 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్మకారుల ఉపాధికి పెద్దపీట వేస్తూ లెదర్ పార్కుల ఏర్పాటుకు ఊతమిచ్చింది. అప్పట్లోనే 72 చోట్ల వీటి ఏర్పాటుకు స్థలాన్ని, నిధులనూ కేటాయించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇవి ఏర్పాటైతే వేల మంది ఎస్సీ యువతకు ఉపాధి దక్కుతుంది. 2021-22లో కేంద్రం వీటికోసం నిధుల్ని రాష్ట్రానికి కేటాయించింది. వీటితో ప్రకాశం జిల్లా యడవల్లి, ఎన్టీఆర్ జిల్లా వెల్లటూరులో మినీ లెదర్ పార్కులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. లెదర్ పార్కుల ఏర్పాటుకు భూములు కేటాయించింది కూడా తెదేపా ప్రభుత్వమే. కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఒక్కో చోట పార్కు ఏర్పాటుకు రూ.5.50 కోట్లు వినియోగించాలి. మిగతా రూ.50 లక్షలతో తోలు వస్తువులు, పాదరక్షల తయారీకిగాను చర్మకారులకు నైపుణ్య శిక్షణ అందించాలి. ఇది ఆ వర్గానికి ఎంతో ఉపయోగపడేది. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరో చోట ఏర్పాటు చేయాల్సి ఉన్నా అతీగతీ లేదు. పార్కుల ఏర్పాటుపైనా ఎలాంటి కదలికా లేదు.
ఎస్సీల ఉపాధికి అవకాశమున్నా...
రాష్ట్రం సొంతంగా నిధుల్ని ఖర్చు చేయడం అటుంచితే... కేంద్రమిచ్చిన నిధుల్ని ఖర్చు చేసేందుకూ మీనమేషాలు లెక్కించింది. వెల్లటూరులో 2003లోనే ఏడెకరాల స్థలాన్ని మినీ లెదర్ పార్కు ఏర్పాటుకు కేటాయించగా.. జగన్ అధికారంలోకి వచ్చాక ఇందులో ఆరు ఎకరాల్ని జగనన్న కాలనీకి బదలాయించారు. మిగిలిన ఎకరంలో లెదర్పార్కు ఏర్పాటు కావాల్సి ఉంది. ఇక్కడ పార్కు ఏర్పాటు చేస్తే 400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతకు రెట్టింపు సంఖ్యలో యువతకు చేయూత అందుతుంది. ఎస్సీలు ఇలా ప్రగతిబాట పట్టడం జగన్కు నచ్చదు కదా! అందుకే పట్టించుకోనట్టున్నారు. ఆయన నిర్వాకంతో ఇప్పుడు నిర్మాణానికి కేటాయించిన స్థలం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లిలో లెదర్పార్కు ఏర్పాటు విషయంలోనూ అంతే. 2003లో తెదేపా ప్రభుత్వం 27.18 ఎకరాల్ని లెదర్ పార్కు కోసం కేటాయించింది. రూ.2 కోట్లతో కార్మికుల శాశ్వత నివాస గృహాలు, పాఠశాల, బ్యాంకు, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందులో రూ.18 లక్షలు వెచ్చించి షెడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. కొంతమందికి నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించారు. ఇప్పుడు కేంద్రం నిధులిచ్చి రెండేళ్లు దాటినా మిగతా పనులు పూర్తి చేయడానికీ చేతులు రావడం లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటయితే 500 మందికి ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరింత మందికి ప్రయోజనం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
-
‘మీ బిడ్డను’ అంటూ.. జగన్ ఊరూరా తిరిగినప్పుడే అనుమానించా: లోకేశ్
-
అమిత్ షా ‘వీడియో సోర్స్’పై పోలీసుల దృష్టి.. సోషల్ మీడియా సంస్థలకు లేఖ
-
ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసు.. సుప్రీంలో దీదీ సర్కార్కు ఊరట
-
కంట్రోల్ తప్పిన హెలికాప్టర్.. అమిత్ షాకు త్రుటితో తప్పిన ప్రమాదం
-
4 నెలలకే ఓలా క్యాబ్స్ సీఈఓ రాజీనామా.. 10% మంది ఉద్యోగులకు ఉద్వాసన!