చర్మకారులకు ఏమిటీ ఖర్మ?
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు.
లెదర్ పార్కుల ఏర్పాటుకు కేంద్రం రూ.12 కోట్ల నిధులు
అందులో రూపాయైనా ఖర్చు చేయని జగన్ ప్రభుత్వం
ఎస్సీ యువత ఉపాధి కల్పనపై చిత్తశుద్ధి ఇదేనా?
ఈనాడు, అమరావతి
ఒక్కసారి అవకాశమంటూ... అధికారంలోకి వచ్చీ రాగానే ఎస్సీలకు ఉన్న పథకాలను ఎత్తేశారు.. వారికిచ్చే స్వయం ఉపాధి రుణాలను తీసేశారు.. ఆఖరికి లెదర్ పార్కుల కోసం... కేంద్రం ఇచ్చిన నిధుల్నీ ఖర్చుచేయకుండా.. ఐదేళ్ల పుణ్యకాలం గడిపేశారు! ఇదీ ఎస్సీల అభివృద్ధిపై జగన్కున్న చిత్తశుద్ధి!
ఏ ప్రభుత్వానికైనా యువతకు ఉపాధి కల్పించడం అత్యంత కీలకమైన అంశం. కానీ ఐదేళ్లు పాలన వెలగబెట్టిన జగన్ దీన్ని పూర్తిగా పక్కన పెట్టారు. గత ఎన్నికల ముందు ప్రతిపక్షనేతగా ఊరూరా తిరుగుతూ యువతకు ఉద్యోగాల కల్పనపై ఊదరగొట్టిన ఆయన.. అధికారం చేపట్టగానే.. వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. వారు ఉద్యోగాలు పొందితే.. ఇక తన అబద్ధాలను నమ్మరనుకున్నారేమో.. కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా.. ఉన్న వాటిపైనా కక్షకట్టినట్టు వ్యవహరించి రాష్ట్రం నుంచి తరిమికొట్టారు. చివరికి ఎస్సీల ఉపాధికి ఉపయోగపడే లెదర్పార్కుల ఏర్పాటుకూ ఆయన మనసొప్పలేదు. గత ఎన్నికల్లో రిజర్వుడ్ నియోజకవర్గాల్లోని అత్యధిక స్థానాల్లో ఎస్సీలు వైకాపాకే వెన్నుదన్నుగా నిలిచారనే కృతజ్ఞత కూడా చూపించలేదు. ‘నా ఎస్సీ..’ అని పదే పదే అనడమే తప్ప ఆయన వారి ఉపాధికి చేపట్టిన చర్యలేమీ లేవు.
కేంద్రం నిధులిచ్చినా ఖర్చు చేయలేదు...
లెదర్పార్కుల ఏర్పాటుకు రాష్ట్రప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. కేంద్రమే నిధులిస్తుంది. వాటిని సక్రమంగా ఖర్చు చేస్తే చాలు. కానీ ఎస్సీలకు ఉపాధి కల్పించే ఆలోచనే లేదు జగన్కు. గత ఐదేళ్లలో రాయితీ రుణ పథకాలను ఎత్తేసి వారి ఉపాధి అవకాశాల్ని తెగ్గోసిన ఆయన.. చివరికి కేంద్రమిచ్చే నిధులనూ ఖర్చు చేయలేదంటే వారిపై ఎంతగా పగబట్టారో ఇట్టే తెలిసిపోతుంది. లెదర్పార్కుల ఏర్పాటు కోసం 2021-22లో ‘పీఎం అజయ్’ పథకం కింద కేంద్రం రూ.12 కోట్లు ఇస్తే రెండేళ్లయినా ఒక్క రూపాయి ఖర్చు పెట్టింది లేదు. నిర్మాణాలు చేపట్టాలని గతేడాది మార్చిలో ఆదేశాలు జారీ చేసి వదిలేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయని.. ఎస్సీల ఓట్లకు గాలం వేసేందుకు ఇటీవల టెండర్లు పిలుస్తున్నట్టు హడావుడి చేశారు.
తెదేపా ప్రభుత్వం 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్మకారుల ఉపాధికి పెద్దపీట వేస్తూ లెదర్ పార్కుల ఏర్పాటుకు ఊతమిచ్చింది. అప్పట్లోనే 72 చోట్ల వీటి ఏర్పాటుకు స్థలాన్ని, నిధులనూ కేటాయించింది. ఆ తర్వాత ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. ఇవి ఏర్పాటైతే వేల మంది ఎస్సీ యువతకు ఉపాధి దక్కుతుంది. 2021-22లో కేంద్రం వీటికోసం నిధుల్ని రాష్ట్రానికి కేటాయించింది. వీటితో ప్రకాశం జిల్లా యడవల్లి, ఎన్టీఆర్ జిల్లా వెల్లటూరులో మినీ లెదర్ పార్కులను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించింది. లెదర్ పార్కుల ఏర్పాటుకు భూములు కేటాయించింది కూడా తెదేపా ప్రభుత్వమే. కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఒక్కో చోట పార్కు ఏర్పాటుకు రూ.5.50 కోట్లు వినియోగించాలి. మిగతా రూ.50 లక్షలతో తోలు వస్తువులు, పాదరక్షల తయారీకిగాను చర్మకారులకు నైపుణ్య శిక్షణ అందించాలి. ఇది ఆ వర్గానికి ఎంతో ఉపయోగపడేది. ప్రస్తుతం తిరుపతి కేంద్రంగా నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మరో చోట ఏర్పాటు చేయాల్సి ఉన్నా అతీగతీ లేదు. పార్కుల ఏర్పాటుపైనా ఎలాంటి కదలికా లేదు.
ఎస్సీల ఉపాధికి అవకాశమున్నా...
రాష్ట్రం సొంతంగా నిధుల్ని ఖర్చు చేయడం అటుంచితే... కేంద్రమిచ్చిన నిధుల్ని ఖర్చు చేసేందుకూ మీనమేషాలు లెక్కించింది. వెల్లటూరులో 2003లోనే ఏడెకరాల స్థలాన్ని మినీ లెదర్ పార్కు ఏర్పాటుకు కేటాయించగా.. జగన్ అధికారంలోకి వచ్చాక ఇందులో ఆరు ఎకరాల్ని జగనన్న కాలనీకి బదలాయించారు. మిగిలిన ఎకరంలో లెదర్పార్కు ఏర్పాటు కావాల్సి ఉంది. ఇక్కడ పార్కు ఏర్పాటు చేస్తే 400 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అంతకు రెట్టింపు సంఖ్యలో యువతకు చేయూత అందుతుంది. ఎస్సీలు ఇలా ప్రగతిబాట పట్టడం జగన్కు నచ్చదు కదా! అందుకే పట్టించుకోనట్టున్నారు. ఆయన నిర్వాకంతో ఇప్పుడు నిర్మాణానికి కేటాయించిన స్థలం పిచ్చి మొక్కలతో దర్శనమిస్తోంది.
ప్రకాశం జిల్లా రాచర్ల మండలం యడవల్లిలో లెదర్పార్కు ఏర్పాటు విషయంలోనూ అంతే. 2003లో తెదేపా ప్రభుత్వం 27.18 ఎకరాల్ని లెదర్ పార్కు కోసం కేటాయించింది. రూ.2 కోట్లతో కార్మికుల శాశ్వత నివాస గృహాలు, పాఠశాల, బ్యాంకు, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని అప్పట్లో నిర్ణయించారు. ఇందులో రూ.18 లక్షలు వెచ్చించి షెడ్డు నిర్మాణం కూడా పూర్తి చేశారు. కొంతమందికి నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించారు. ఇప్పుడు కేంద్రం నిధులిచ్చి రెండేళ్లు దాటినా మిగతా పనులు పూర్తి చేయడానికీ చేతులు రావడం లేదు. ఇక్కడ పరిశ్రమ ఏర్పాటయితే 500 మందికి ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరింత మందికి ప్రయోజనం ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు