వివేకా హత్య కేసులో అవినాష్రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు.
శాస్త్రీయమైన ఆధారాలున్నాయి
అవినాష్రెడ్డి ఆరోపణలకు సమాధానమిచ్చిన సునీత
ఈనాడు, కడప: వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సాధ్యం కాదని.. ప్రజలను నమ్మించడానికి చేసే ప్రయత్నాలు చెల్లుబాటుకావని హెచ్చరించారు. కడపలో మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎంపీ అవినాష్రెడ్డి ఆరోపణలు, విమర్శలకు ఆమె సమాధానాలిచ్చారు. గత ఎన్నికల్లో అవినాష్రెడ్డి గెలుపు కోసం వివేకానందరెడ్డి కష్టపడి పని చేసింది నిజమైతే.. ఆయన చివరి కోరిక తీర్చుకునే అవకాశం వారికి వచ్చిందని తెలిపారు. షర్మిలను కడప ఎంపీగా చేయాలనే వివేకా కోరికను నెరవేర్చే అవకాశం వచ్చింది..చేస్తారా అని ప్రశ్నించారు. నిజంగా వారికి వివేకా మీద ప్రేమ ఉంటే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొని షర్మిలకు మద్దతు ఇవ్వాలని సవాల్ విసిరారు. వివేకా హత్యతో తనకు సంబంధం లేకపోయినా.. సునీత, దస్తగిరి, సీబీఐ కుమ్మక్కై తనను కేసులో ఇరికించారంటూ అవినాష్రెడ్డి చేసిన ఆరోపణలపై సునీత తీవ్రంగా స్పందించారు. మీ ఫోన్ దర్యాప్తు అధికారికి అప్పగించి.. కడిగిన ముత్యంలా బయటపడాలని అవినాష్కు సవాల్ విసిరారు.
దస్తగిరి ఇప్పటికీ నిందితుడే
వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారినంత మాత్రాన దస్తగిరి తప్పించుకునే అవకాశం లేదని సునీత తెలిపారు. సీఎంగా జగన్, ఎంపీగా అవినాష్రెడ్డి ఉన్నారని, అయినా తమకు న్యాయం చేశారా? అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు, దస్తగిరి, తాను సీబీఐని ప్రభావితం చేస్తున్నామంటే ఎవరైనా నమ్ముతారా అని ప్రశ్నించారు. సీఎంగా జగన్ కేంద్రంలో భాజపాతో అంటకాగుతున్నారని..
వారికి లేని శక్తి తనకు ఎక్కడి నుంచి వస్తుందన్నారు. చంద్రబాబు తన కేసుల్లోనే కొన్ని ఇబ్బందుల్లో ఉన్నారని.. నా కేసులో సీబీఐని ఎలా ప్రభావితం చేస్తారని ప్రశ్నించారు. ‘దారుణ హత్య విషయంలోనూ రాజకీయాలే చూస్తారా? రాజకీయాలే కాకుండా జీవితం కూడా ఉంటుందని గుర్తించాలి’ అని ఆమె పేర్కొన్నారు. ‘అవినాష్ కోసం వివేకా ఎన్నికల ప్రచారం చేశారంటున్నారు.. మీ కోసం అంతగా కష్టపడిన వ్యక్తి కోసం మీరేం చేశారు. వివేకా చేసిన మంచి పనుల గురించి ఈ అయిదేళ్లలో ఒక్కమాట చెప్పారా’ అని నిలదీశారు. మీ కోసం కష్టపడిన షర్మిలకు 2014లో ఎందుకు ఎంపీ సీటు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. అవినాష్ పోటీ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. హంతకులకు ఓటు వేయకండి.. మీ కోసం పోరాటం చేసేవారికి ఓటేయాలని పిలుపునిచ్చారు.
జగన్కు ఏమని సమాచారం ఇచ్చావు?
వివేకా ఘటనను చూడటానికి వెళ్లిన అవినాష్రెడ్డి.. ఆ తర్వాత సీఎం జగన్కు గుండెపోటు అని చెప్పారా?.. హత్య అని చెప్పారా అని ప్రశ్నించారు. హత్య జరిగినట్లు జగన్ తెలుసుకుని ఉంటే ఎందుకు అప్పట్లో డీజీపీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయలేదన్నారు. గూగూల్ టేకౌట్ ప్రకారం అవినాష్రెడ్డి ఇంట్లో ఉదయ్కుమార్రెడ్డి అనే నిందితుడు ఉన్నారని తెలిపారు. గూగుల్ టేకౌట్ ఫ్యాబ్రికేటెడ్ అని అవినాష్రెడ్డి అంటున్నారని.. టేకౌట్ రిపోర్టును సీబీఐ, సర్వే ఆఫ్ ఇండియా, ఎఫ్ఎస్ఎల్ శాస్త్రీయంగా తయారు చేస్తాయని గుర్తు చేశారు. అవినాష్పై సర్వే ఆఫ్ ఇండియాకు, ఎఫ్ఎస్ఎల్కూ కోపం ఉంటుందా? ఇదందా ఎందుకు?.. అవినాష్ ఫోన్ సీబీఐకి ఇస్తే అన్ని విషయాలు బయటికి వస్తాయని.. ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. సిట్, సీబీఐలకు వేరువేరు విధాలుగా స్టేట్మెంట్లు ఇచ్చానని అవినాష్ అంటున్నారని వారు అర్థం పర్థంలేని స్టేట్మెంట్లు రాసుకున్నారని విమర్శించారు. అందుకే కేసును స్థానిక పోలీసు నుంచి సీబీఐకి బదిలీ చేసినట్లు గుర్తు చేశారు. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణకు సుప్రీంకోర్టు మార్చిందని, సాక్షులు చనిపోతున్నారనే కారణంగానే తెలంగాణకు మార్చారని పేర్కొన్నారు.
45 సెకన్లలో ఎలా సాధ్యమైంది?
హత్య జరిగిన రోజు శివప్రకాష్రెడ్డి ఉదయం 6.26 గంటలకు అవినాష్కు ఫోన్ చేయడానికి ఒక నిమిషం ముందే నిందితుడు ఉదయ్కుమార్రెడ్డి ఎంపీ ఇంట్లో ఉన్నట్లు గూగుల్ టేక్అవుట్ ద్వారా తేలిందని సునీత చెప్పారు. జమ్మలమడుగు వెళ్తుంటే విషయం తెలిసి వచ్చానని చెబుతున్న అవినాష్.. 45 సెకన్లలో హత్యా స్థలానికి ఎలా చేరుకున్నారని ప్రశ్నించారు. ఎంపీ ఇంటి నుంచి రావడంతోనే ఇది సాధ్యమైందని వివరించారు. వివేకా ఇంట్లో దృశ్యాలను చూసి సీఎం ఓఎస్డీకి, ఇంట్లో పని చేసే నవీన్ ద్వారా జగన్కు సమాచారం ఇచ్చానని అవినాష్ చెపుతున్నారని..అప్పుడు తక్షణమే జగన్ ఏం చేయాలని ప్రశ్నించారు. ఎలాంటి చర్యలూ తీసుకోకుండా ఎందుకున్నారని నిలదీశారు. తన ఈ న్యాయ, ప్రజా పోరాటం ఎంత వరకు సాగుతుందో తెలియదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?