కొయ్.. రాజా.. కొయ్!
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట.
పెట్టుబడులపై జగన్ కట్టుకథలు
పదే పదే అవే ఒప్పందాలు
విదేశీ వేదికలపై స్వదేశీ సంస్థలతో సంతకాలు
రాష్ట్రానికి వచ్చిన ఎఫ్డీఐలు సున్నా
‘ఆకర్షణ’లో దిగజారిన ఆంధ్రావని
ఈనాడు, అమరావతి
ఇక్కడకు రండి అనడానికి హిందీలో ఏమనాలి..?
ఇదరాయీయే..!
మీరు అక్కడకు వెళ్లండి అనడానికి ఏమనాలి..?
ఏముందండీ..
నేను అక్కడకు వెళ్లి ఇదరాయీయే అంటానండి.. అంతే..!
ఓ సినిమాలో హాస్యాన్ని పండించే సన్నివేశమిది..
రాష్ట్రంలో విదేశీ పెట్టుబడుల విషయంలో జగన్ ప్రభుత్వం చెప్పిన కొత్త భాష్యం ఈ తరహాలోనే ఉంది. దేశీయ కంపెనీలు అదానీ, అరబిందో, గ్రీన్కో సంస్థలతో రాష్ట్రంలోనే ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇదే చేస్తుంది. అలా కాకుండా వాటిని అంతర్జాతీయ వేదికలకు తీసుకెళ్లి అక్కడ అవగాహన ఒప్పందాల(ఎంవోయూ)పై సంతకాలు చేసుకుని.. వాటినే ‘దావోస్ నుంచి తెచ్చిన విదేశీ పెట్టుబడులు’ అంటూ రాష్ట్ర ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టారు జగన్. తన అతితెలివి విధానాలతో జనాలను మోసం చేసి రాష్ట్రాన్ని నవ్వులపాలు చేయడం కాక.. దీన్ని ఏమంటారు?
రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి జగన్తోపాటు ఆయన అధికారుల బృందం వివిధ దేశాల్లో కాళ్లరిగేలా తిరిగిందట. వివిధ రంగాలకు చెందిన 75 మందికి పైగా సీఈవోలు, రాయబారులతో భేటీ అయిందట. పెట్టుబడిదారులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అనువైన వాతావరణం గురించి వివరంగా చెప్పిందట. ప్రభుత్వం ఇంతగా శ్రమిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువలా రావాలి. పెట్టుబడిదారులు బారులుతీరాలి. కానీ, జగన్ సర్కారు ఇంతచేసినా.. ఆంధ్రప్రదేశ్కు ఉత్సాహంగా వచ్చి పెట్టుబడులు పెట్టిన వారే లేరు. ఎవరైనా రాష్ట్రానికి వచ్చినా.. పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు అవసరమైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ వారికి లేదు. ప్రభుత్వం చెప్పిన చోటనే వాటిని ఏర్పాటు చేయాలి. లేదంటే వచ్చిన దారిలోనే వెళ్లిపోవాలి. పెట్టుబడుల కోసం ఇక్కడి దాకా వచ్చి ‘బేరం’ కుదరక వెనక్కు వెళ్లిన పరిశ్రమలు అనేకం ఉన్నాయి. ‘రాష్ట్రంలో పరిస్థితి ఏం బాగోలేదంటగా’ అని అంతర్జాతీయ వేదికలపై పెట్టుబడిదారులు వాకబు చేశారంటే వైకాపా సర్కారు ఎంతటి అధమ స్థాయికి దిగజారిందో అర్థం చేసుకోవచ్చు. జగన్ చెప్పే విదేశీ పెట్టుబడుల కట్టుకథలకు ఇంతకంటే సాక్ష్యాలు కావాలా..?
పొరుగు రాష్ట్రాల పరుగు
విదేశీ పెట్టుబడుల సమీకరణలో ఆంధ్రప్రదేశ్ చతికిలబడితే.. మన పొరుగు రాష్ట్రాలు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతోపాటు కేరళ, మహారాష్ట్ర పరుగులు తీస్తున్నాయి. తెలంగాణ 2019 అక్టోబరు నుంచి 2023 డిసెంబరు వరకు రూ.55,672.06 కోట్ల పెట్టుబడులతో దేశంలో ఏడో స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర అత్యధికంగా రూ.5,07,439.98 కోట్ల విదేశీ పెట్టుబడులతో మొదటి స్థానంలో నిలిస్తే.. కర్ణాటక రూ.3,65,276.08 కోట్లు, గుజరాత్ రూ.2,87,435.30 కోట్లతో ఆ తర్వాతి స్థానాలు సాధించాయి.
వచ్చిన వాటిని వెళ్లగొట్టారు..
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన జగన్.. తన ఐదేళ్ల కాలంలో ‘నాకేంటీ’ అన్న ధోరణిని ప్రదర్శించారన్న విమర్శలున్నాయి. రాష్ట్రం దాకా వచ్చిన పెట్టుబడులు వెనక్కుపోతున్నా.. ‘పోతేపోనీ’ అన్నట్లు వ్యవహరించారేగానీ.. రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు ఆకర్షించి యువతకు ఉపాధి కల్పించాలని అస్సలు ఆలోచించలేదు. ఒకటీ అరా వచ్చిన వాటినీ ప్రభుత్వమే దగ్గరుండి వెళ్లగొట్టినంత పని చేసింది. వాటిలో కొన్ని..
- దుబాయ్కు చెందిన అలానా గ్రూప్ రాష్ట్రంలో రిటైల్ దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు ఇక్కడకు వచ్చి స్థలాలను కూడా పరిశీలించింది. అనంతరం వెళ్లిన ఆ సంస్థ.. రాష్ట్రం వైపు కనీసం తొంగిచూడలేదు.
- గోల్డ్ ప్లస్ అనే సంస్థ రూ.4 వేల కోట్ల పెట్టుబడితో నగరి ప్రాంతంలో అద్దాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని వచ్చింది. ఆ పరిశ్రమను పులివెందులలో గానీ, కొప్పర్తి పారిశ్రామిక హబ్లో గానీ ఏర్పాటు చేయాలంటూ అధికారులు కంపెనీ ప్రతినిధితో సంప్రదింపులు జరిపారు. అనంతరం సీఎంను కలవకుండానే వెళ్లిపోయారు.
- కేరళకు చెందిన కైటెక్స్ గార్మెంట్ పరిశ్రమ రూ.3 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనతో వచ్చింది. దిల్లీలో పార్టీ వ్యవహారాలను చూసే ఓ నేత అడిగినంత ‘కిక్ బ్యాగ్స్’ ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అంతలోనే తెలంగాణ నుంచి ఆహ్వానం రావడంతో అక్కడికి వెళ్లిపోయింది.
దిగజారిన స్థానం
2016-19 మధ్య దాదాపు రూ.50 వేల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని ఎంపీ విజయసాయిరెడ్డి నేతృత్వంలోని వాణిజ్యశాఖ స్థాయీ సంఘం పార్లమెంటుకు నివేదించింది. దేశంలోని 18 రాష్ట్రాలకు 1,32,701 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, వాటిలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానంలో నిలిచిందని పేర్కొంది. తర్వాతి నుంచి పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్ర పరిస్థితి మరింత దిగజారిందని కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం(డీపీఐఐటీ) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
2019 అక్టోబరు నుంచి 2023 డిసెంబరు వరకు రాష్ట్రానికి వచ్చింది రూ.6,743.70 కోట్ల విదేశీ పెట్టుబడులు మాత్రమే. ఈ వ్యవధిలో దేశానికి రూ.16,83,780.24 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఈ లెక్కన నాలుగేళ్లలో మన రాష్ట్రానికి వచ్చింది 0.40 శాతం మాత్రమే. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో 2023 సెప్టెంబరులో దేశంలో 13వ స్థానంలో ఉన్న రాష్ట్రం రెండు నెలలు తిరిగేప్పటికి అంటే 2023 డిసెంబరు నాటికి మరింత దిగజారి 14వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఒప్పందాలు ఏమయ్యాయి?
పెట్టుబడుల ఆకర్షణ కోసం వివిధ దేశాలు వెళ్లి అక్కడ సదస్సులు నిర్వహించిన జగన్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోవడానికే పరిమితమైంది. గతంలో అనుమతులు ఇచ్చిన సంస్థలతో పదేపదే ఒప్పందాలు చేసుకుని భారీ మొత్తంలో పెట్టుబడులు వస్తున్నాయంటూ ప్రజలకు కట్టుకథలు చెప్పింది.
- విశాఖలో గతేడాది మార్చిలో నిర్వహించిన ప్రపంచ పెట్టుబడుల సదస్సులో రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలతో రూ.13.12 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలను కుదుర్చుకుంది. గతంలో అనుమతులు ఇచ్చిన అదానీ, అరబిందో, శిర్డీ సాయి ఎలక్ట్రికల్స్, ఇండోసోల్ సోలార్, గ్రీన్కో, జేఎస్డబ్ల్యూ సంస్థలతో మళ్లీ ఎంవోయూలు కుదుర్చుకుని.. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించింది.
- 2022 మే నెలలో దావోస్లో నిర్వహించిన ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సులో పాల్గొని.. రూ.1.26 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పింది. అందులో గ్రీన్కో రూ.37 వేల కోట్లు, అరబిందో రియాల్టీ సంస్థ రూ.28 వేల కోట్లు, అదాని సంస్థ రూ.60 వేల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. ఏస్ సంస్థ మచిలీపట్నంలో రూ.వెయ్యి కోట్లతో గ్రీన్ ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం చేసుకుంది. ఇందులో ఏ ఒక్కటీ వాస్తవ రూపందాల్చలేదు.
దేశాలు తిరిగి సాధించిందేంటి?
పరిశ్రమలు, సంస్థల్లో పెట్టుబడుల కోసం సీఎం జగన్ నేతృత్వంలోని అధికారుల బృందం దావోస్లో పర్యటించింది. అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, కుటుంబ యాజమాన్య పరిధిలోని ఫండింగ్ సంస్థలు, పారిశ్రామిక సంఘాలు, తెలుగు ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది.
పరిశ్రమలు, పర్యాటకం, ఆరోగ్యం, ఇంధన రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం సీఎం జగన్ నేతృత్వంలో 2019 ఆగస్టులో డిప్లొమాటిక్ ఔట్ రీచ్ ప్రోగ్రామ్ను నిర్వహించింది. 34 దేశాలకు చెందిన రాయబారులు, హై కమిషనర్లు, కాన్సుల్ జనరల్స్ పాల్గొన్నారు.
యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ), యూఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం(యూఎస్ఐఎస్పీఎఫ్), వరల్డ్ ఎకనమిక్ ఫోరం, సీఐఐ, ఫిక్కీ వంటి సంస్థలతో సమావేశాలు నిర్వహించింది.
యూకే, అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, తైవాన్, జర్మనీ, ఫ్రాన్స్, చైనా దేశాలకు చెందిన ఉన్నతస్థాయి విదేశీ ప్రతినిధులతో వివిధ రంగాల్లో పెట్టుబడులకున్న అవకాశాలపై చర్చించింది.
రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు కూడా పెట్టు బడుల కోసం విదేశాల్లో పర్యటించి ప్రసిద్ధ పరిశ్రమలు, సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. అవి కూడా పట్టాలెక్కలేదు.
మచ్చుకు కొన్ని..
- జర్మనీలోని హాన్ ఓవర్ మెస్సే ట్రేడ్ ఫెయిర్లో ఏబీబీ, ఎయిర్బస్, బోష్, జెస్సీ కర్ల్, ఫెస్టో, షెఫ్లర్ టెక్నాలజీస్ తదితర కంపెనీలతో సమావేశాలు జరిగాయి. ఈ కంపెనీలు రాష్ట్రానికి వచ్చిన జాడే లేదు.
- రక్షణ రంగంలో వినియోగించే తూటాల తయారీ సంస్థ కంపెనీ ప్రతినిధులతో.. 2020 ఫిబ్రవరిలో లఖ్నవూలో జరిగిన డిఫెన్స్ ఎక్స్పోలో ప్రభుత్వం చర్చలు జరిపింది. తర్వాత రాష్ట్రంలో దీని ఆనవాళ్లే రాష్ట్రంలో కరవయ్యాయి.
- రక్షణ రంగ, ఏరోస్పేస్ క్లస్టర్పై విదేశీ కంపెనీలు ఆసక్తి చూపాయని, బోయింగ్, ఎయిర్బస్, బీఏఈ సిస్టమ్స్, జాకబ్స్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడిపై ఆసక్తి చూపాయని ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంది. ఆ సంస్థలు రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయో తెలియని పరిస్థితి. మరెన్నో సంస్థలు తమ ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయని, అవి రాష్ట్రంలో రూ.వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని ప్రచారం చేసుకుంది. తీరా చూస్తే పరిస్థితి నేతి బీర చందమే..!
విహారయాత్రలైన పర్యటనలు!
పెట్టుబడుల ఆకర్షణ పేరిట నిర్వహించిన సమావేశాలు, పర్యటనలకు ప్రభుత్వం ఐదేళ్లలో సుమారు రూ.50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఒక్క దావోస్ పర్యటనకే రూ.14 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఇంత మొత్తం ఖర్చు చేసి పెట్టుబడులు తీసుకొచ్చారా? అంటే అదీ లేదు. ఈ పర్యటనలు కొందరు అధికారులు, ప్రజాప్రతినిధుల విహార యాత్రలుగా మారాయి.
పెట్టుబడుల ఆకర్షణ కోసం తలపెట్టిన పర్యటనలు, సమావేశాల్లో కొన్ని విచిత్రాలూ చోటుచేసుకున్నాయి. తనను దావోస్ పర్యటనకు తీసుకెళ్లలేదని అలకబూనిన ఓ ఉన్నతాధికారిని.. అధికారులు జర్మనీలో జరిగిన ఎగ్జిబిషన్కు ప్రభుత్వం తరఫున పంపి సంతృప్తి పరిచారు. ‘దుబాయ్ ఎక్స్పో’కు వెళ్లిన ఒక ఉన్నతాధికారి పారిశ్రామికవేత్తలతో జరిగే సమావేశాల కంటే.. ‘బోటు’ పార్టీకే ప్రాధాన్యం ఇచ్చారు. దావోస్ వెళ్లిన బృందంలో ఓ అధికారి.. ఐటీసీ నుంచి టీ ఎందుకు తీసుకురాలేదని నానా యాగీ చేశారు. బంకర్ బెడ్ విషయంలో పై బెర్తు కావాలంటూ కొందరు అలిగినట్లు సమాచారం. దావోస్కు వెళ్లాల్సిన ప్రత్యేక విమానం ముంబయి, రోమ్, లండన్లను చుడుతూ ఎందుకు వెళ్లిందో సమాధానం దొరకని చిక్కు ప్రశ్న..!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
భూ హక్కు చట్టంపై ధర్మాన ద్వంద్వ వైఖరి
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది.