జులై శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల రేపు

భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.

Updated : 17 Apr 2024 06:47 IST

24న రూ.300 టికెట్ల జారీ

తిరుమల, న్యూస్‌టుడే: భక్తుల సౌకర్యార్థం జులై నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను తితిదే ఈనెల 18న నుంచి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఆర్జిత సేవా టికెట్ల ఎలక్ట్రానిక్‌ లక్కీడిప్‌ను 18న ఉదయం 10 గంటల నుంచి ఈనెల 20న ఉదయం 10 గంటల వరకూ నమోదు చేసుకోవచ్చు. 20న మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌ జాబితా వెల్లడిస్తారు. ఇందులో పేర్లున్న వారు రుసుము చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది.

  • ఈనెల 22న ఉదయం 10 గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌సేవ, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఈ సేవల వర్చువల్‌ టికెట్లు, వాటి దర్శన టికెట్ల కోటానూ విడుదల చేస్తారు.
  • 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు, దివ్యాంగులకు ఉచిత దర్శన టోకెన్ల కోటాను అందుబాటులో ఉంచుతారు.
  • 24న ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.
  • ఈ నెల 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవా కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, మధ్యాహ్నం ఒంటి గంటకు పరకామణి సేవా కోటాను విడుదల చేస్తారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్‌లో సేవా టికెట్లను బుక్‌ చేసుకోవచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని