అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
శంకుస్థాపన ప్రాంతంలో నమూనా గ్యాలరీ ధ్వంసం
ప్రతి నమూనానూ పగలగొట్టిన వైనం
భద్రత కల్పించకపోవడంతో దుండగుల దుశ్చర్య
ఈనాడు - అమరావతి, తుళ్లూరు, న్యూస్టుడే: అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. రాజధాని నిర్మాణం బృహత్తర ప్రణాళిక, అమరావతి నవనగరాల రూపురేఖలను వివరించేలా ఏర్పాటు చేసిన మ్యూజియంలో నమూనా గ్యాలరీని జగన్ సర్కారుతో పాటు సీఆర్డీఏ యంత్రాంగం గాలికొదిలేయడంతో అసాంఘిక శక్తులు దీనిని ధ్వంసం చేశాయి. రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలను పరిశీలించడానికి బుధవారం ఎన్డీయే కూటమి గుంటూరు లోక్సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఉద్దండరాయునిపాలెం వెళ్లినప్పుడు రాజధాని రైతులు ఈ విషయాన్ని గుర్తించారు. 2015 అక్టోబరు 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా ఇక్కడ రాజధానికి శంకుస్థాపన జరిగింది. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి నిర్మాణం ఎలా ఉండబోతుందో తెలియజేయడానికి గత ప్రభుత్వం ఇక్కడ త్రీడీ నమూనాలను ఏర్పాటు చేసింది. ప్రజలు ఈ మ్యూజియాన్ని సందర్శించి భవిష్యత్తులో నగరం ఎలా ఉంటుందో అంచనాకు వచ్చేవారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం బ్లూ, గ్రీన్ సిటీగా అమరావతి భవిష్యత్ ముఖచిత్రాన్ని తెలిపే నమూనా, రాజధాని రహదారులు, ఎల్పీఎస్ లేఔవుట్లు, భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ, భూగర్భ విద్యుత్తు, తాగునీటి సరఫరా విధానాలు, అమరావతి ప్రాంత చరిత్ర, చారిత్రక నిర్మాణాలు, అధునాతన రాజధాని కట్టడాలు, అసెంబ్లీ, సచివాలయం భవనాలను కళ్లకు కట్టినట్లు చూపే నమూనాలు, బోర్డులు, మ్యాపులు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అప్పటి ప్రభుత్వం దీని నిర్వహణకు, భద్రతకు సిబ్బందిని ఏర్పాటు చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక అమరావతి నమూనాలను కూడా సందర్శకులకు అందుబాటులో లేకుండా చేస్తూ, గ్యాలరీని మూసేసింది. భద్రతా సిబ్బందిని తొలగించింది. సీఆర్డీఏ పట్టించుకోకపోవడంతో పిచ్చిమొక్కలు పెరిగి ఆ ప్రాంతం కళావిహీనంగా తయారైంది. ఇదే సందుగా దుండగులు భవనం తాళం పగలగొట్టి మ్యూజియంలో ఉన్న వస్తువులను, త్రీడీ నమూనాలను పాడుచేశారు. అద్దాలను రాళ్లతో పగలగొట్టారు. ప్రాంగణం లోపలికి వెళ్లే ద్వారం దగ్గర గేట్లను పీకి పడేశారు. కుర్చీలు, బల్లలు సహా దొరికిన వస్తువునల్లా ధ్వంసం చేశారు. అమరావతి ప్రాశస్త్యం, చరిత్ర తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఆనవాళ్లు ఏవీ లేకుండా చేశారు.
నిర్వహణ లేకపోవడంతోనే..
వైకాపా ప్రభుత్వం వచ్చాక అమరావతి విషయంలో కక్ష సాధింపు ధోరణితో నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దుండగులు ఇనుము, ఇసుక, కంకర నిర్మాణ సామగ్రి ఎత్తుకుపోతున్నా చివరకు రోడ్లను ధ్వసం చేసి మట్టి తవ్వుకుపోతున్నా ఏమాత్రం చర్యలు లేవు. ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరని స్థానికులు చెబుతున్నారు. చివరకు అది ప్రదర్శనశాలలో విధ్వంసం వరకు దారి తీసిందని రాజధాని రైతులు ఆరోపిస్తున్నారు. శంకుస్థాపన ప్రాంతం, మ్యూజియం నిర్వహణను ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు పలుమార్లు నిరసనలు వ్యక్తం చేశారు. అమరావతి నమూనాలను కూడా ధ్వంసం చేయడం దారుణమని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం జగన్ది రాక్షసానందం
తుళ్లూరు, న్యూస్టుడే: ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి తెదేపా అధినేత చంద్రబాబు రూపకల్పన చేస్తే.. అమరావతిని నిర్వీర్యం చేసి సీఎం జగన్ రాక్షసానందం పొందుతున్నారని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో ఆగిపోయిన నిర్మాణాలను బుధవారం ఆయన నాయకులు, రాజధాని రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తరువాత అర్ధంతరంగా నిర్మాణాలు నిలిచి పోవడంతో ఆ ప్రాంతమంతా ముళ్ల పొదలతో నిండిపోయిందని, మ్యూజియంలో నమూనాలను సైతం ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆధునిక రీతిలో బ్లూ, గ్రీన్ సిటీ నిర్మించడానికి సంకల్పించారని, ఆ పనులు కొనసాగి ఉంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 10 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేవని, 125 కేంద్ర ప్రభుత్వ సంస్థల నిర్మాణాలు జరిగేవని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని చిట్టడవిలా మార్చిందని మండిపడ్డారు. పేదల అవసరాల కోసం ఆర్-3 జోన్లో 5 శాతం భూమిని గత ప్రభుత్వం కేటాయిస్తే.. దాన్ని విస్మరించి అమరావతి బృహత్ ప్రణాళికను నాశనం చేయాలనే తలంపుతో ఆర్-5 జోన్ను తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూములు ఇచ్చిన వారిలో 20 వేల మంది బడుగు, బలహీన వర్గాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులే ఉన్నారన్నారు. రాజధానిలో పాడైపోతున్న కట్టడాలను చూస్తుంటే ఎంతో బాధగా ఉందన్నారు. ఎన్నికల్లో జగన్కు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.
విధ్వంసపు చర్యలు మానుకోరా?
అమరావతి గ్యాలరీ విధ్వంసంపై చంద్రబాబు ఆగ్రహం
ఈనాడు డిజిటల్, అమరావతి: ఉద్దండరాయునిపాలెంలోని రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేసిన ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. ‘మీరు మారరా.. మీ బుద్ధి మారదా?’ అంటూ వైకాపా వాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ వికృత పోకడలను ఇంటికి పోయే ముందు కూడా మార్చుకోరా? విధ్వంసం, విషం చిమ్మే, మీ నీచమైన చర్యల్ని మానుకోరా?’ అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
ఇదే మా రిలేషన్షిప్ సీక్రెట్: జ్యోతిక
-
‘ఆ వీడియోలు నేనే ఇచ్చా’.. ప్రజ్వల్ మాజీ డ్రైవర్
-
జెఫ్ బెజోస్ నుంచి విలువైన పాఠం నేర్చుకున్నా: నెట్ఫ్లిక్స్ ఛైర్మన్
-
డీల్ కుదిరినా.. కుదరకపోయినా రఫాపై దండయాత్రే: నెతన్యాహు
-
ముత్యాల దండతో శ్రీలీల.. రాశీఖన్నా ‘బాక్’ స్టిల్.. మీనాక్షి స్మైల్
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న