పింఛన్ తుంచెన్.. పేదలను వంచించెన్!
మోసం.. దగా.. కుట్ర.. వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..! ‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని ఒంటరి మహిళలను ఆదుకుంటామని వితంతువులకు భరోసా కల్పిస్తామని వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!!
అట్టడుగు వర్గాలకు భరోసా ఇవ్వని ‘సామాజిక భద్రత’
‘నవరత్నాల’ మాటున అవ్వాతాతలు, వితంతువులకు జగన్ మోసం
నిబంధనల కొర్రీతో లక్షలాది పేర్ల తొలగింపు
తెదేపా హయాంలో రూ. 200 నుంచి రూ. 2000కు పెరిగిన పింఛను
రూ.వెయ్యి పెంపునకు ఆపసోపాలు పడ్డ వైకాపా సర్కారు
మోసం.. దగా.. కుట్ర..
వీటికి ప్యాంటు, చొక్కా తొడిగి ఓ రూపం కల్పిస్తే అచ్చం జగన్ మాదిరే ఉంటాయేమో..!
‘నవరత్నాల’ కింద పింఛను ఇచ్చి అవ్వాతాతలను నవ్విస్తామని
ఒంటరి మహిళలను ఆదుకుంటామని
వితంతువులకు భరోసా కల్పిస్తామని
వేదికలపై ఆయన ప్రదర్శించిన నటనాచాతుర్యాన్ని చూసి నంది అవార్డు కూడా ‘వామ్మో’ అని చిన్నబోవాల్సిందేనేమో..!!
ఐదేళ్లలో పింఛన్ల సంఖ్యను సాయాన్ని పెంచకపోగా..
ఉన్న సంఖ్యను, సొమ్మును తుంచి పేదలను వంచించిన ఘనుడు జగన్..!
గత ఎన్నికల ముందు జగన్ రాష్ట్రవ్యాప్తంగా ఆర్భాటంగా పాదయాత్ర చేశారు. ‘నవరత్నాల’తో మెరిపిస్తాం.. మురిపిస్తాం అంటూ ప్రజలకు గారడీ మాటలు చెప్పారు. తీరా అయిదేళ్ల పాలనను చూస్తే ప్రజలు మెరవడం.. మురవడం కాదు కదా.. వారి మొరను ఆలకించేవారే కరవయ్యారు. అవ్వాతాతలు, ఒంటరి మహిళలు, వితంతువులు, ఇతర వర్గాల వారికి సామాజిక భద్రత పింఛన్లు ఇవ్వకుండా దగా చేశారు.
కొండంత రాగం తీసి గోరంత పాట పాడిన చందంలా మారింది జగన్ పేదలకు అందజేసిన పింఛన్ల తీరు. లేనిపోని నిబంధనలు పెట్టి.. పెంచినట్టు కనికట్టు చేసి.. నిరుపేదలు,
అట్టడుగు వర్గాల వారి పింఛన్లకు అడ్డగోలుగా కోత కోశారు దయలేని జగన్. పొట్టకూటి కోసం వలస వెళ్లిన వారినీ వదల లేదు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. లక్షలాది పింఛన్లకు కత్తెర వేసి వారి నోటి దగ్గరి ముద్దను కాలదన్నారు. ఎంతమందికి కోత కోశారు అన్న వివరాలను ఇవ్వడానికి కూడా వైకాపా సర్కారుకు ధైర్యం రావడం లేదు! గతేడాది అక్టోబరు వరకు ఎన్ని పింఛన్లు తొలగించారు అంటూ స.హ.చట్టం ద్వారా అడిగిన వివరాలు ఇవ్వకుండా అధికారులు దాటవేశారు. గతేడాది ఆగస్టు- డిసెంబరు వరకు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్నవారిలో దాదాపు అందరికీ అర్హత ఉంది. అయినా.. గత జనవరి నెలలో దాదాపు లక్ష దరఖాస్తులను తొక్కిపెట్టి వారికి పింఛను రాకుండా కుట్రపన్నారు.
అభాగ్యులపై విషం..
బిడ్డల ఆదరణకు నోచుకోని తల్లిదండ్రులకు, అనారోగ్యంతో కుదేలవుతున్న రోగులకు, ఆదరువు లేని వృత్తిదారులకు గత ప్రభుత్వాలు పింఛన్లు మంజూరు చేసి అండగా నిలిచాయి. ఇలాంటి అభాగ్యులను ఆదుకోవాల్సిన జగన్ వారిపై విషం చిమ్మారు. కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉన్నా, 300 యూనిట్ల విద్యుత్తు వాడుతున్నా, పట్టణాల్లో 750 చ.అ.విస్తీర్ణంలో స్థలం ఉన్నా, ఆదాయపు పన్ను చెల్లిస్తున్నా.. వారిని అనర్హులుగా నిర్ణయించారు. కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఉన్నా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను పట్టించుకోని బిడ్డలు ఎంత మంది లేరు? దండిగా వ్యవసాయ, నివాస స్థలాలు కలిగి ఉన్నా తమ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోని పిల్లలు ఎందరు ఉండరు? ఇలాంటి వారికి సామాజిక భద్రత పింఛన్లను దూరం చేశారు జగన్. మరోవైపు 50 వేల మంది హెచ్ఐవీ రోగులకు రెండేళ్లుగా పింఛను ఇవ్వడం లేదు.
పారదర్శకతకు పాతర..
పథకాల్లో పారదర్శకత కోసమే సామాజిక తనిఖీ తెచ్చామని ఊదరగొట్టే జగన్.. చేతల్లోకి వచ్చేసరికి దానికి పాతరేశారు. ఎంత మంది పింఛన్లను ఏ కారణాలు చూపి తెగ్గోశారన్న వివరాలు బయటపడతాయన్న ఉద్దేశంతో సామాజిక తనిఖీని రెండేళ్లుగా పక్కన పెట్టారు. అర్హులు, అనర్హుల జాబితాను కూడా సచివాలయాల్లో ప్రదర్శించడం లేదు. గత జనవరిలో కొత్తగా పింఛన్ల కోసం 2.14 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. 1.17 లక్షల మందికి మాత్రమే మంజూరు చేశారు. అర్హత ఉన్న 97 వేల మందికి కారణాలు చెప్పకుండానే నిలిపేశారు.
వ్యూహాత్మకంగా కోతలు
మరణాల సంఖ్యను ఎక్కువగా చూపి కూడా పింఛన్లలో తగ్గించేశారు. జగన్ అధికారంలోకి వచ్చే సమయానికి పరిశీలిస్తే.. 2019 మే నెలలో 7,500, జూన్లో 8,300, జులైలో 9 వేల పింఛన్దారుల మరణాలు నమోదయ్యాయి. 2019 డిసెంబర్ వరకు కూడా 20 వేల సంఖ్యను ఎప్పుడూ దాటలేదు. తర్వాత జగన్ తొలగింపు కత్తెర మొదలుపెట్టారు. 2021 మేలో 50 వేలు, జూన్లో 45 వేల తగ్గుదల ఉంటే జులైలో ఏకంగా 1.30 లక్షల తగ్గుదల కనిపించింది. 2022 డిసెంబరులో 57 వేలు, 2023 అక్టోబరులో 24 వేల తగ్గుదల నమోదైంది.
కుటుంబానికి ఒకటే పింఛన్..
ఒకే కుటుంబంలో ఇద్దరు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఇతర వర్గాల వారు పింఛన్లు తీసుకోవడం జగన్కు నచ్చలేదు. తెదేపా ప్రభుత్వం.. ఒక కుటుంబంలో ఇద్దరు పింఛనుదారులు ఉన్నా భారంగా భావించలేదు. జగన్ మాత్రం ఒక బియ్యం కార్డుపై రెండు పింఛన్లు ఉండకూడదనే ఉత్తర్వును తెరమీదకు తెచ్చి విచ్చలవిడిగా కోత కోశారు.
ఒంటరి మహిళల వేదన
పట్టణాల్లో 35 ఏళ్లు, గ్రామాల్లో 30 ఏళ్లు దాటిన ఒంటరి మహిళలకు గత తెదేపా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వారి పింఛను అర్హత వయసును పెంచేశారు. 50 ఏళ్లు పైబడిన ఒంటరి మహిళలకు మాత్రమే పింఛను ఇస్తామని కొర్రీలు పెట్టారు.
ఆ మూడు వర్గాలకు మొండిచేయి
దివ్యాంగులు, డప్పు కళాకారులు, హిజ్రాల ఆదరువును జగన్ పట్టించుకోలేదు. గత తెదేపా ప్రభుత్వం అయిదేళ్ల వ్యవధిలో దివ్యాంగుల పింఛనును వైకల్య శాతం ఆధారంగా రూ.500 నుంచి రూ.3 వేలకు పెంచింది. డప్పు కళాకారులు, హిజ్రాలకు నెలకు రూ.3 వేల చొప్పున అందజేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ తన అయిదేళ్ల పాలనాకాలంలో వీరికి పైసా కూడా పెంచలేదు. ప్రస్తుతం 8.07 లక్షల మంది దివ్యాంగులు, 63 వేల మంది డప్పు కళాకారులు, 2,272 మంది హిజ్రాలు పింఛను పొందుతున్నారు.
కులవృత్తిదారులపై దొంగదెబ్బ..
గత ప్రభుత్వం చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులకు పింఛను ఇస్తుండేది. వెనకబడిన వర్గాల వారికి పింఛను ఇవ్వడం ఇష్టం లేని జగన్.. జనవరిలో కొత్తగా ఆయా వర్గాల వారు సమర్పించిన దరఖాస్తులను పక్కన పెట్టి వారిపై దొంగదెబ్బ తీశారు. చేనేత కార్మికుల పింఛనుపైనా దుర్మార్గంగా వ్యవహరించారు. సంఘాల్లో ఉన్న వారు నెలకు 15 రోజుల చొప్పున ఏడాది పాటు చేనేత వృత్తిలో ఉన్నట్టు, మాస్టర్ వీవర్ల వద్ద కూలి పనిచేస్తే.. ఆ మాస్టర్ చెల్లించిన డబ్బులు రెండేళ్లపాటు కార్మికుడి బ్యాంకు ఖాతాకు ఆన్లైన్ ద్వారా బదిలీ అయినట్టు ఆధారాలు చూపించాలని కొర్రీ పెట్టారు. ఈ నిబంధనల వల్ల ఒక్క చేనేత కార్మికుడికి కూడా పింఛను రాదు అని జిల్లా కలెక్టర్లు చెప్పినా జగన్ చెవికి ఎక్కించుకోలేదు. ఇతర కులవృత్తిదారుల విషయంలోనూ ఇలాంటి నిబంధనలే! ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 93 వేల మంది చేనేత కార్మికులు, 68 వేల మంది మత్స్యకారులు, 47 వేల మంది చర్మకారులు, 41 వేల మంది కల్లుగీత కార్మికులు పింఛన్లు తీసుకుంటున్నారు.
ఏ నెల పింఛను ఆ నెలనే తీసుకోవాలి..
గత తెదేపా ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులు ఏ కారణంగానైనా ఒక నెల గానీ, రెండో నెల గానీ పింఛను తీసుకోకపోతే తర్వాతి నెలలో కలిపి ఇచ్చేవారు. కానీ జగన్ ఏ నెల పింఛను ఆ నెల మాత్రమే తీసుకోవాలనే నిబంధన పెట్టారు. ఒక నెల పింఛను తీసుకోకపోతే మరుసటి నెలలో పాత పింఛను ఇవ్వరు. ఇతర ప్రాంతాలకు కూలీ, అత్యవసర పనులు, శుభకార్యాలకు వెళ్లేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నిబంధనల కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్లు ఆయా ప్రాంతాలకు వెళ్లి ఇస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ఆ వెసులుబాటును తీసేసింది. ప్రతి నెలా 4 వేల నుంచి 5 వేల వరకు పింఛన్లను తొలగిస్తూ లబ్ధిదారుల పొట్టకొడుతున్నారు. ఇలా మూడు నెలలు వరసగా పింఛను సొమ్ము తీసుకోలేదన్న సాకుతో దాదాపుగా 2.80 లక్షల మంది పింఛన్లను తెగ్గోశారు.
అబద్ధాలే అబద్ధాలు..
గత తెదేపా ప్రభుత్వ హయాంలో 53.85 లక్షల మందికి పింఛన్లు అందేవి. ఇందుకు ప్రతినెలా రూ.1,305 కోట్లు ఖర్చు అవుతుండేది. అధికారంలోకి వచ్చిన తర్వాత వైకాపా సర్కారు అధికారికంగా చెప్పిన లెక్కనే ఇది. కానీ, సీఎం జగన్ దాన్ని దాచిపెట్టి, తెదేపా ప్రభుత్వం 30 లక్షల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చేదని అబద్ధాలు వల్లెవేశారు. జగన్ అధికారం చేపట్టిన తర్వాత 4 లక్షల మంది పింఛన్లు తొలగించారు. తెదేపా ప్రభుత్వం 2014లో పింఛనుదారులకు అందే రూ. 200 మొత్తాన్ని 2019 నాటికి రూ.2 వేలకు పెంచింది. అంటే ఐదేళ్లలో
10 రెట్లు పెరిగింది. అధికారంలోకి వస్తే రూ.2 వేల పింఛనును రూ.3 వేల వరకు పెంచుకుంటూ పోతానన్న జగన్.. రూ.వెయ్యి పెంచేందుకు అయిదేళ్ల సమయం తీసుకున్నారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల