చెరలోనే అనుమానితులు!
సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
సీఎంపై రాయి విసిరిన కేసులో పోలీసుల అదుపులో మరో ముగ్గురు
వడ్డెర కాలనీ వాసుల ఆవేదన.. ఆందోళన
తమ వారి ఆచూకీ చెప్పాలని డిమాండ్
కమిషనర్ కార్యాలయం, అజిత్సింగ్నగర్ స్టేషన్ వద్ద ఆందోళన
ఈనాడు-అమరావతి, న్యూస్టుడే - విజయవాడ నేరవార్తలు: సీఎం జగన్పై రాయి విసిరిన కేసులో వడ్డెర కాలనీకి చెందిన అనుమానితులు ఇంకా పోలీసుల చెరలోనే ఉన్నారు. వారి ఆచూకీ గురించి చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. విజయవాడ అజిత్సింగ్ నగర్లోని వడ్డెరకాలనీకి చెందిన పలువురు మైనర్లను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. వారిని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలిసింది. వైకాపా నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెవరిని ఇరికిస్తారో అనే భయంతో కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. రెండు, మూడు వీధులు జన సంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున అయిదుగురిని, సాయంత్రం.. ఆటోడ్రైవర్, తెదేపా నాయకుడు వేముల దుర్గారావును పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. బుధవారం ఉదయం మరో ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసినా వారి వివరాలు తెలియడంలేదు. తమ సామాజికవర్గాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని పోలీసులను నిలదీస్తున్నారు. ఆటో డ్రైవరు దుర్గారావు తెదేపా పథకాల పట్ల ఆకర్షితులై రెండు నెలల క్రితమే ఆ పార్టీలో చేరారు. దీంతో వైకాపా నేతల మాటలు విని పోలీసులు ఆయనను అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డుకున్న పోలీసులు.. ఆటోల్లో బలవంతంగా తరలింపు
రెండు రోజులుగా పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. బుధవారం మధ్యాహ్నం అజిత్సింగ్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద బాధితులు ఆందోళన చేశారు. స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపిన బాలల కుటుంబ సభ్యులకు కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తరఫున వాదించిన న్యాయవాది సలీం సంఘీభావం ప్రకటించారు. వారి తరఫున వకల్తా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. పోలీస్స్టేషన్ వద్ద ఉత్కంఠ వాతావరణం నెలకొనడంతో.. అధికారులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. న్యాయవాదితో కలిసి స్టేషన్లోకి వెళ్లిన కుటుంబ సభ్యులకు.. తమవారు ఎవరూ కనిపించకపోవడంతో తిరిగి వచ్చారు. సాయంత్రం పోలీస్ కమిషనర్ కార్యాలయానికి బయలుదేరారు. పోలీసులు వారిని రోడ్డు మొదట్లోనే నిలిపివేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధితులంతా రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు వారిని బలవంతంగా ఆటోల్లో ఎక్కించి, అయోధ్యనగర్లోని నార్త్ ఏసీపీ కార్యాలయానికి తరలించారు. కాలనీవాసులు, కుటుంబ సభ్యులతో అక్కడ 15 నిమిషాల పాటు చర్చించారు. తమ అదుపులో ఉన్న వారిని గురువారం సాయంత్రం ఇంటికి పంపించేస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు కాలనీవాసులు చెప్పారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో కొందరిని గురువారం కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
న్యాయాధికారి ఇంటికి వెళ్లిన న్యాయవాది
పోలీసుల అదుపులో ఉన్నవారి ఆచూకీ తెలపాలని కోరుతూ న్యాయవాది సలీం సెర్చ్ వారెంట్ పిటిషన్ వేసేందుకు సమాయత్తం అయ్యారు. ఇందులో భాగంగా బుధవారం రాత్రి ఆయన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి రమణారెడ్డి నివాసానికి వెళ్లారు. అత్యవసరంగా వినాలని కోరారు. ఈరోజు సెలవు దినం కావడంతో.. గురువారం నేరుగా కోర్టులో దాఖలు చేయాలని మేజిస్ట్రేట్ సూచించారు.
జగన్ బండారం బయటపెట్టేందుకే వచ్చా..
- సలీం, న్యాయవాది
‘‘జగన్పై గులకరాయి దాడి ఘటనకు.. విశాఖ విమానాశ్రయంలో జరిగిన కోడికత్తి కేసుకు పోలిక ఉంది. అది బాహుబలి- 1 అయితే.. ఇది బాహుబలి-2. జగన్మోహన్రెడ్డికి ఎన్నికల ముందు ఇలాంటి డ్రామాలు అలవాటే. అమాయకులైన ప్రజలను నమ్మించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈ వ్యవహారాన్ని బయట పెట్టేందుకే నేను ఇక్కడికి వచ్చా. కేసులో పలువురు మైనర్లు, ఆటోడ్రైవర్ దుర్గారావును రెండు రోజుల నుంచి పోలీసులు అక్రమంగా కస్టడీలో ఉంచుకున్నారు. వారి తరఫున వకల్తా తీసుకున్నా. న్యాయస్థానంలో సెర్చ్ వారెంట్ పిటిషన్ వేస్తున్నా. మైనర్లను వారి కుటుంబ సభ్యులకు చెప్పకుండా తమ కస్టడీలో ఎలా ఉంచుకుంటారు? ఈ అంశంపైనే పిటిషన్ వేయబోతున్నా’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపాకు మద్దతిస్తున్నారని.. ఎస్టీ కాలనీకి తాగునీరు బంద్
తెదేపాకు సానుకూలంగా ఉన్నారన్న అక్కసుతో ఎస్టీ కాలనీకి తాగునీటి సరఫరాను నిలిపేసిన దారుణ ఘటన పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలో చోటుచేసుకుంది. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఆలయం నుంచి బయటకెళ్లు.. దళిత సర్పంచిని అవమానించిన వైకాపా నాయకులు
నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామంలోని రామాలయానికి వెళ్లిన తనను వైకాపా నాయకులు లోకేశ్వరరెడ్డి, జగదీశ్వరరెడ్డిలు అవమానించారంటూ అదే పార్టీకి చెందిన గ్రామ దళిత సర్పంచి మాధవరం ప్రకాశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఇచ్చింది రూ.50 వేలు.. లాగింది రూ.3.5 లక్షలు
డ్రైవర్ అన్నలు... నా మిత్రులు అన్నారు ఎప్పటికీ అండగా ఉంటామన్నారు... జగన్ మాటకు చేతకు పొంతన ఉండదుగా... ఏదో మొక్కుబడిగా సాయం చేశారు. -
‘ప్రభుత్వానికి భజన చేస్తూ.. కొన్ని సంఘాలు దిగజారాయి’
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు అంశాలకు పరిష్కారం లభించకపోయినా.. ఒకటో తేదీన వేతనాలు, పింఛన్లు రాకపోయినా కొన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వానికి ఆహా, ఓహో అంటూ భజన చేస్తూ దిగజారిపోయాయని ఏపీ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ మండిపడ్డారు. -
కంట్రోల్లోనే ఉన్నాం.. చెప్పినట్లు సమావేశాలు పెడుతున్నాం
సకల శాఖ మంత్రిగా ప్రచారంలో ఉన్న ఓ ప్రభుత్వ సలహాదారు కళ్లలో ఆనందం చూసేందుకు ఏపీ ఎన్జీఓ సంఘం నాయకులు తహతహలాడుతున్నారు. -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
మే 1న బ్యాంకు ఖాతాల్లో పింఛను జమ
వచ్చేనెల సామాజిక పింఛన్ల సొమ్మును మే 1న లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తీవ్ర అనారోగ్యం, అస్వస్థత, నడవలేని స్థితిలో ఉన్నవారు, మంచం పట్టినవారు, వీల్ ఛైర్లో ఉన్నవారు, దివ్యాంగులు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇళ్ల దగ్గరే అందించనున్నారు. -
వారికి నో.. వీరికి ఎస్
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డిలు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని.. వారు ఆ పోస్టుల్లో కొనసాగితే రాష్ట్రంలో ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరగవని.. వారిని తక్షణం బదిలీ చేయాలని విపక్ష పార్టీలన్నీ నెత్తీనోరూ కొట్టుకుంటున్నా.. ఈసీ పట్టించుకోలేదు. -
రూ.3000,00,00,000.. మూడేళ్లలో ఇసుకలో చేసిన లూటీ ఇది
జగన్ ప్రభుత్వం రాగానే ఉచిత ఇసుక విధానం రద్దుచేసి.. తొలుత ప్రభుత్వరంగ సంస్థకు ఇసుక వ్యాపారం అప్పగించింది. అది విఫలమైందని సాకుచూపించి.. బినామీలను గుత్తేదారులుగా రంగంలోకి దింపింది. -
పోలా.. ‘పరువు పోలా!’
‘రోడ్లు ఇట్లా ఉంటే మీ ప్రభుత్వానికే ఓట్లు పడవు. మీరు మరమ్మతులు చేయిస్తారా? లేకుంటే మా రాష్ట్ర నిధులతో మమ్మల్నే ప్యాచ్ వర్క్ చేయించమంటారా?’ -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
ఉత్తీర్ణత పెంచడం ఓట్ల కోసమేనా?
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత పెంచడం, మార్కులు అధికంగా వేయడం తల్లిదండ్రుల ఓట్ల కోసమేనా అని సామాజిక వేత్త గుంటుపల్లి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రశ్నించారు. -
కొండల్ని మింగి.. గోతులు మిగిల్చారు!
విజయవాడ సమీపం జక్కంపూడి, కొత్తూరు తాడేపల్లి, కొండపావులూరు పరిసరాల్లో కొండ ప్రాంతాల్లో విచ్చలవిడిగా తవ్వేశారు. -
వైకాపా బాణసంచా పేల్చడంతో అగ్ని ప్రమాదం
వైకాపా ఎన్నికల ప్రచారంలో భారీగా బాణసంచా కాల్చడంతో అగ్నిప్రమాదం సంభవించి జామాయిల్ తోటలు, పశువుల మేత, మోటార్లు కాలిపోయాయి. -
ఉపాధి లేదు.. ఉద్యోగం అడగొద్దు
రాష్ట్రంలో చదువుకుని, లక్షల సంఖ్యలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఆలోచన లేదు! ఉపాధి అవకాశాల్లేక యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు తరలిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ వృద్ధుల రాష్ట్రంగా మిగిలిపోతోందన్న బాధ లేదు! -
నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని గ్రామానికి నీటి సరఫరా నిలిపివేత
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ నామినేషన్ ర్యాలీకి వెళ్లలేదని ఓ గిరిజన గ్రామానికి నీటి సరఫరా నిలిపివేసిన దారుణ ఉదంతమిది. -
మాటల ఏలిక.. మీటలో మెలిక!
అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలనే ఆలోచనతో వారికి వ్యాపార అవకాశాలను కల్పించాలని నిర్ణయించాం. హిందుస్థాన్ లీవర్, పీఅండ్జీ, ఐటీసీ, రిలయన్స్, అమూల్ సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
దండుకో.. వాటాలు పంచుకో!
జగన్ పాలనలో దోచుకున్నోళ్లకు దోచుకున్నంత.. అన్న విధంగా వైకాపా నాయకులు, కొందరు ఐఏఎస్ అధికారులు చెలరేగిపోతున్నారు. -
రోగుల సమాచారం మీకెందుకు?
వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లే రోగుల సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేకరిస్తోందని, అలా ఎందుకు తీసుకుంటుందో చెప్పాలని భారత వైద్య మండలి(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డా.ఆర్వీ.అశోకన్ ప్రశ్నించారు.