డిస్కంల నెత్తిన రూ.61,407 కోట్ల అప్పుల భారం
అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది.
పరపతికి మించి రుణాలు
వైకాపా పాలనలో దిగజారిన ఆర్థిక పరిస్థితి
ప్రతి నెలా వాయిదా చెల్లించడానికే రూ.1,600 కోట్లు అవసరం
ఈనాడు, అమరావతి: అప్పులకు అలవాటు పడిన జగన్ సర్కార్.. విద్యుత్ పంపిణీ సంస్థలనూ వాటికి అలవాటు చేసింది. డిస్కంల నెత్తిన గత నవంబరు నాటికి రూ.61,407 కోట్ల అప్పుల భారం వేసింది. అందరిలో వెలుగులు నింపే డిస్కంలు.. ఇప్పుడు అప్పులు తీర్చే దారి చూపే దీపం కోసం వెతుక్కునేలా దిగజార్చింది. రుణ పరపతికి సరిపడా ఆస్తులు లేకపోవడంతో కొత్త అప్పుల కోసం ప్రభుత్వ హామీ కోసం డిస్కంలు ఎదురుచూసే దుస్థితి కల్పించింది. గత రెండేళ్లలో వాటిపై రూ.24,031 కోట్ల కొత్త అప్పులు చేసింది. ఈ లెక్కన ప్రతి నెలా రూ.వెయ్యి కోట్లు అప్పు చేస్తేనే డిస్కంలకు ఆర్థికంగా వెసులుబాటు లభించే పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా మెరుగుపరిచే పేరుతో అస్మదీయ కంపెనీల నుంచి ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలు, అభివృద్ధి పనులను అప్పులు తెచ్చి మరీ చేసేలా ప్రతిపాదించాయి. విద్యుత్ పంపిణీ సంస్థల పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్) కింద స్మార్ట్ మీటర్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం పీఎఫ్సీ నుంచి రూ.10 వేల కోట్ల రుణం కోసం పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ మొత్తం కూడా కలిపితే అప్పుల భారం సుమారు రూ.71,500 కోట్లకు చేరుతుంది.
2 ఏళ్లలో రూ.24 వేల కోట్ల అప్పులు
2021 నవంబరు నాటికి వివిధ ఆర్థిక సంస్థలు, బ్యాంకుల నుంచి డిస్కంలు తీసుకున్న రుణాలు రూ.37,377 కోట్లు. నిరుడు నవంబరు నాటికి అది రూ.61,407 కోట్లకు పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఉన్న అప్పులతో పోలిస్తే.. గడిచిన రెండేళ్లలో డిస్కంలు 60.87 శాతం కొత్త అప్పులు తెచ్చాయి. ఈ మొత్తంపై ఏటా సుమారు రూ.6 వేల కోట్లు వడ్డీగా చెల్లించాల్సి వస్తోంది. అంటే నెలకు రూ.500 కోట్లు. డిస్కంలు ప్రతి నెలా సగటున తెచ్చే రూ.వెయ్యి కోట్ల కొత్త రుణాల్లో 50 శాతం మొత్తం పాత అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోతోంది. వైకాపా అయిదేళ్ల పాలనలో డిస్కంలను అప్పుల భారంతో నిర్వీర్యం చేసింది. సిబ్బందికి ప్రతి నెలా జీతాలు సకాలంలో చెల్లించలేని దుర్భర స్థితికి దిగజార్చింది. దేశవ్యాప్తంగా విద్యుత్ ఉత్పత్తిలో గుర్తింపు సాధించిన జెన్కో నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలో చేరే పరిస్థితి కల్పించింది.
వైకాపా అధికారం చేపట్టిన తర్వాత విద్యుత్ ఒప్పందాల (పీపీఏల) సమీక్ష పేరుతో వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. ఆ సమయంలో ఆయా సంస్థల నుంచి తీసుకోవాల్సిన విద్యుత్లో కర్టైల్మెంట్ విధించింది. కేంద్రం హెచ్చరికలు, ఇతర పరిణామాలతో వాటి నుంచి విద్యుత్ తీసుకోక తప్పలేదు. ఆ సమయంలో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొని, ఆ భారాన్ని వినియోగదారులపై వేసింది. కోర్టు ఆదేశాల మేరకు పీపీఏ ప్రకారం పూర్తి మొత్తాన్ని విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు చెల్లించడానికి డిస్కంలు మరో రూ.8 వేల కోట్లు అప్పులు తెచ్చాయి. ఆ మొత్తాన్ని నష్టాల్లో చూపాయి.
ఆర్థికంగా కుప్పకూలే పరిస్థితి
ప్రతి నెలా డిస్కంలకు వచ్చే ఆదాయం కంటే.. విద్యుత్ కొనుగోలు, రుణాలపై వాయిదాలు, సిబ్బంది జీతాలు, ఇతర ఖర్చులకు సర్దుబాటు చేయాల్సిన మొత్తమే ఎక్కువగా ఉంటోంది. ప్రతి నెలా విద్యుత్ విక్రయాల ద్వారా డిస్కంలకు వసూలయ్యే బిల్లుల మొత్తం సగటున రూ.4,839 కోట్లు ఉంటే నిర్వహణకు రూ.4,906 కోట్లు అవసరమవుతోంది. అంటే నెలకు రూ.67 కోట్ల వంతున.. ఏటా రూ.804 కోట్లు సర్దుబాటు చేయాల్సి వస్తోంది. దీంతోపాటు ఇప్పటికే ఉన్న రుణాలపై ప్రతి నెలా వాయిదా, వడ్డీ కలిపి రూ.1,609 కోట్లు చెల్లించాలి. ఇందుకోసం అంతర్గతంగా సర్దుబాటు చేసిన సొమ్మ పోను.. మిగిలిన మొత్తాన్ని అప్పు కింద తీసుకుంటేనే గట్టెక్కే పరిస్థితి. ఈ నేపథ్యంలో డిస్కంలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం.. వివిధ కేటగిరిల కింద సరఫరా చేసిన విద్యుత్కు తాను చెల్లించాల్సిన రూ.23వేల కోట్లకు పైగా బకాయిలనూ చెల్లించడం లేదు. దీంతో డిస్కంలకు ఊపిరాడటం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
షారుక్ విమానం కోరిక.. కమల్ హాసన్ ఫన్నీ కామెంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్పై సస్పెన్షన్ వేటు
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత