కిడ్నాప్ చేసి.. ‘డ్రగ్స్’ చేతిలో పెట్టి వీడియో!
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి.
పుంగనూరులో తెదేపా కార్యకర్తపై మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల దాష్టీకం
తెదేపా తరఫున ప్రచారం చేస్తే చంపేస్తామని బెదిరింపులు
బాధితుడిపైనే తిరిగి ఫిర్యాదు
ఈనాడు, చిత్తూరు: ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా పుంగనూరులో వైకాపా నాయకులు, కార్యకర్తల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. నియోజకవర్గంలో వైకాపా తప్ప మరో పార్టీ ఉండకూడదనేలా తెదేపా సానుభూతిపరులు, కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. బుధవారం పుంగనూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. తెదేపా కార్యకర్త హేమాద్రి ఉదయం 11 గంటల సమయంలో పట్టణంలోని సంతగేటుకు వెళుతుండగా.. వైకాపా కార్యకర్తలు కిడ్నాప్ చేశారు. రాష్ట్ర జానపద కళల సంస్థ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం ఇంట్లోకి తీసుకెళ్లి చొక్కా చించి చితకబాదారు. ఇకపై తెదేపా తరఫున ప్రచారం చేసినా, తెదేపా నాయకులతో కలిసి తిరిగినా చంపేస్తామంటూ బెదిరించారు. అంతటితో ఆగకుండా రెండు తెల్లని పొడి ప్యాకెట్లు చేతులో పెట్టి, ముఖంపై కూడా చల్లారు. ఈ డ్రగ్స్ తెదేపా నాయకులు సీవీరెడ్డి, గిరి, ఎ.నాగరాజ, ఎస్.సుహేల్ బాషా, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు ఇచ్చారని బలవంతంగా చెప్పించి వీడియో తీశారు. ఇంతలో కిడ్నాప్ విషయం తెదేపా శ్రేణులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. హేమాద్రిని బయటకు పంపాలంటూ వైకాపా నాయకుడు కొండవీటి నాగభూషణం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో హేమాద్రి వైకాపా కార్యకర్తల నుంచి తప్పించుకుని బయటకు వచ్చారు. ‘వైకాపా వాళ్లు తెల్లని పొడి ప్యాకెట్లు చేతిలో పెట్టి..ఈ డ్రగ్స్ తెదేపా నాయకులు ఇచ్చినట్లు చెప్పాలంటూ బలవంతంగా వీడియో తీశారు. ఆ ప్యాకెట్లలో ఏముందో నాకు తెలియదు. నా సెల్ఫోన్, బంగారు గొలుసు లాక్కున్నారు’ అని హేమాద్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకులు మదనపల్లె మున్సిపల్ వైస్ ఛైర్మన్ జింకా చలపతి, కొండవీటి నాగభూషణం, అమ్ము, సాయి, ఇర్ఫాన్, ప్రభు, అమ్ముకుట్టి, మంజు నిందితులని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఠాణాపై దండెత్తిన అధికార పార్టీ నాయకులు
తెలుగుదేశం నాయకులు స్టేషన్లో ఫిర్యాదు చేస్తుండగానే వైకాపా శ్రేణులు భారీగా అక్కడికి చేరుకుని స్టేషన్ను ముట్టడించినట్లు వ్యవహరించారు. బాధితుడైన తెదేపా కార్యకర్త హేమాద్రిపై సీఐ రాఘవరెడ్డికి ఫిర్యాదు చేశారు. పుంగనూరు మున్సిపల్ వైస్ ఛైర్మన్ లలిత, కౌన్సిలర్లు లలిత, రేష్మలను ప్రభు అనే వ్యక్తి ఆలయానికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో హేమాద్రి అసభ్యంగా దూషించి దాడి చేశారని అందులో పేర్కొన్నారు. దీంతో హేమాద్రిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. వైకాపా నాయకులపై ఏ కేసు పెట్టారో మాత్రం పోలీసులు వెల్లడించలేదు.
వైకాపా నేతలకు ‘డ్రగ్స్’ ఎక్కడి నుంచి వచ్చాయి?
వైకాపా శ్రేణులు తెదేపా కార్యకర్త హేమాద్రిని అపహరించి..చేతిలో డ్రగ్స్(తెల్లని పొడి) ప్యాకెట్లు చేతిలో పెట్టినట్లు వార్తలు వ్యాప్తికావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఆ మాదకద్రవ్యం వైకాపా నాయకుల చేతికి ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేయాలని తెదేపా శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. ఎవరి నుంచైనా వాటిని కొనుగోలు చేసి పుంగనూరులో వైకాపా కార్యకర్తలు విక్రయిస్తున్నారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ‘డ్రగ్స్’ మరకలను ప్రణాళిక ప్రకారం తెదేపా నాయకులకు అంటగట్టి, అరెస్టులు చేసి ఎన్నికల వరకు పుంగనూరులో బయటకు రాకుండా చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారా? అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు తప్పు చేసినా కేసులు నమోదు చేసి జైళ్లకు పంపే పరిస్థితి లేదు. పోలీసు యంత్రాంగం మొత్తం వైకాపాకే వత్తాసు పలుకుతోంది. ఎన్నికల కోడ్ వచ్చినా ఇదేవిధంగా వ్యవహరిస్తూ అపఖ్యాతి మూటగట్టుకుంటోంది. డ్రగ్స్ ఆరోపణలపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట