కార్టూనిస్ట్‌ శ్రీధర్‌ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్‌ వర్క్‌షాప్‌

ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్‌ ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్‌ శ్రీధర్‌ తెలిపారు.

Updated : 20 Apr 2024 20:38 IST

హైదరాబాద్‌: ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్‌ ఆర్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్‌ శ్రీధర్‌ తెలిపారు. ‘ఎ ప్యాలెట్‌ ఆఫ్‌ డ్రీమ్స్‌’ పేరున ఈ నెల 21న నిర్వహించనున్న ఈ శిబిరంలో 13 సంవత్సరాలు దాటిన వారెవరైనా పాల్గొనవచ్చన్నారు. ఈ శిబిరంలో పాల్గొన్న వారితో పెయింటింగ్స్‌ వేయించటంతో పాటు స్కెచింగ్‌, డ్రాయింగ్‌ అంటే ఏమిటి, ఎలా సాధన చేయాలి, కార్టూన్స్‌ వేయటం ఎలా, ఆర్టిస్టులు ఎలాంటి మెటీరియల్స్‌ వాడాలి లాంటి విషయాల్లో శిక్షణనిస్తారని వివరించారు. ఆసక్తి ఉన్నవారు 91770 04848 నంబరులో సంప్రదించి ఈ నెల 20 లోగా తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని