ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు.
వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకుని దిల్లీకి పంపాం
విచారించుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది
ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపైనా వివరణ తీసుకున్నాం
సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతావైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా
ఈనాడు, ఈనాడు డిజిటల్- అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. ఆ ఫిర్యాదుల్లోని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. దీంతోపాటు కేంద్ర నిఘా విభాగం ద్వారా, ఇతర పద్ధతుల్లో ఆ ఫిర్యాదులపైన విచారించుకుని ఈసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు తదితర ఉన్నతాధికారులపై అందిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?’ అంటూ విలేకరులు ప్రశ్నించగా.. ముకేశ్కుమార్ మీనా ఈ మేరకు సమాధానమిచ్చారు.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు అవకాశమున్నా.. ఉద్దేశపూర్వకంగానే అలా పంపిణీ చేయకుండా ఇబ్బందులు కల్పించారని, దీంతో కొంతమంది వృద్ధులు చనిపోయారని ఫిర్యాదులందాయి. దీనిపై సంబంధిత శాఖ నుంచి వివరణ తీసుకుని ఈసీఐకి నివేదించాం. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై రాయి విసిరిన ఘటనకు భద్రతావైఫల్యమే కారణమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ ఘటన జరిగిన వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్ను పిలిపించి నివేదిక తీసుకున్నాం. దర్యాప్తు తీరుపై రోజువారీ నివేదికలు తీసుకుంటున్నాం. కేసు దర్యాప్తు నడుస్తోంది. ఒకర్ని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి జరిగిన సమయంలో వెలుతురు లేదు.. స్పాటర్లు లేరు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా జెడ్ ప్లస్, ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్న ప్రముఖుల భద్రత విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్ఓపీ) అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగా 18 మంది పోలీసు పరిశీలకుల్ని నియమించింది’ అని మీనా వివరించారు. ఆయన మాటల్లోని ఇతర ప్రధానాంశాలివీ.
ఆ వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించడంపై ఈసీఐదే నిర్ణయం
వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వారు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతే వారిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న స్థానికులు పోలింగ్ ఏజెంట్గా ఉండేందుకు అర్హులు. అయితే ఎవరిపైనైనా నిషేధం విధించాలంటే కొత్త ప్రొవిజన్ పెట్టాలి. ఆ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంది. వాలంటీర్లుగా రాజీనామా చేసిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొచ్చా లేదా అనే అంశంపై ఈసీఐ నిర్ణయం తీసుకుంటుంది.
సమస్యాత్మక కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా
‘రాష్ట్రవ్యాప్తంగా 30,111 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఆయా కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా ఒక్కో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ఒకరు చొప్పున సాధారణ ప్రత్యేక పరిశీలకుడు, ప్రత్యేక పోలీసు పరిశీలకుడు, ప్రత్యేక వ్యయ పరిశీలకులను ఇప్పటికే నియమించింది. 175 శాసనసభ నియోజకవర్గాలకు 50 మంది సాధారణ పరిశీలకులు, 18 మంది పోలీసు పరిశీలకులు నియమించింది. వ్యయ పరిశీలకులుగా లోక్సభ స్థానాలకు 25 మందిని, శాసనసభ స్థానాలకు 50 మందిని పంపింది. వారు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఓటింగ్ సరళిని పర్యవేక్షించి ఈసీకి నివేదిస్తారు. మద్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రత్యేక పోలీసు పరిశీలకుడు ఆదేశించిన నేపథ్యంలో అన్ని తయారీ కేంద్రాలు, గోదాంలో పాటు, వాటి వాహనాలకు కూడా జీపీఎస్ను అనుసంధానం చేయాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశాం. తయారీ కేంద్రం నుంచి విక్రయానికి కాకుండా మధ్యలో ఎక్కడికీ వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, ఉద్యోగులు, పాత్రికేయులు, అత్యవసర సేవల ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను మే 10లోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఎన్నికల విధుల కోసం సుమారు 5.50 లక్షల మంది ఉద్యోగులను వినియోగించనున్నాం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఇంటింటి ప్రచారానికి ముందస్తు సమాచారమివ్వాలని రాజకీయ పార్టీలకు సూచించాం.
కేసుల నమోదు
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వైకాపా వారిపై 136, తెదేపా వారిపై 126, ఇతరులపై 76 కేసులు నమోదు చేశాం. జనవరి 1 నుంచి గురువారం వరకు సుమారు రూ.180 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నాం. ఈ నెల 17 వరకు నగదు, నగలు తదితరాల స్వాధీనానికి సంబంధించి 7,336 కేసులు నమోదు చేశాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లఘించిన 1,017 మంది వాలంటీర్లను, 181 మంది ఒప్పంద, 127 మంది రెగ్యులర్ ఉద్యోగులను తొలగించాం.
అభ్యంతరకర పదజాలం వినియోగిస్తే చర్యలు
ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశాం. వారిచ్చిన సమాధానాలను పరిశీలిస్తున్నాం. వారు మళ్లీ అలాంటి పదాలు వాడితే చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల అధికారులతో ఎన్నికల నిర్వహించాల్సినంత అసాధారణ పరిస్థితులేమీ రాష్ట్రంలో లేవు. మంత్రులకు ఎన్నికల నియమావళి ఎలా అమలవుతుందో.. క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండైన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్