ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు.
వారిపై వచ్చిన ఫిర్యాదులకు వివరణ తీసుకుని దిల్లీకి పంపాం
విచారించుకుని తుది నిర్ణయం తీసుకుంటుంది
ఉద్దేశపూర్వకంగానే ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయలేదన్న ఫిర్యాదుపైనా వివరణ తీసుకున్నాం
సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతావైఫల్యం ఉంటే బాధ్యులపై చర్యలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా
ఈనాడు, ఈనాడు డిజిటల్- అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. ఆ ఫిర్యాదుల్లోని అంశాలపై సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకుని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. దీంతోపాటు కేంద్ర నిఘా విభాగం ద్వారా, ఇతర పద్ధతుల్లో ఆ ఫిర్యాదులపైన విచారించుకుని ఈసీఐ తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. ‘ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథరెడ్డి, నిఘా విభాగాధిపతి పీఎస్ఆర్ ఆంజనేయులు తదితర ఉన్నతాధికారులపై అందిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకుంటున్నారు?’ అంటూ విలేకరులు ప్రశ్నించగా.. ముకేశ్కుమార్ మీనా ఈ మేరకు సమాధానమిచ్చారు.
వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు అవకాశమున్నా.. ఉద్దేశపూర్వకంగానే అలా పంపిణీ చేయకుండా ఇబ్బందులు కల్పించారని, దీంతో కొంతమంది వృద్ధులు చనిపోయారని ఫిర్యాదులందాయి. దీనిపై సంబంధిత శాఖ నుంచి వివరణ తీసుకుని ఈసీఐకి నివేదించాం. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై రాయి విసిరిన ఘటనకు భద్రతావైఫల్యమే కారణమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఈ ఘటన జరిగిన వెంటనే విజయవాడ పోలీసు కమిషనర్ను పిలిపించి నివేదిక తీసుకున్నాం. దర్యాప్తు తీరుపై రోజువారీ నివేదికలు తీసుకుంటున్నాం. కేసు దర్యాప్తు నడుస్తోంది. ఒకర్ని అరెస్టు చేశారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి జరిగిన సమయంలో వెలుతురు లేదు.. స్పాటర్లు లేరు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా జెడ్ ప్లస్, ఎస్పీజీ సెక్యూరిటీ ఉన్న ప్రముఖుల భద్రత విషయంలో అనుసరించాల్సిన ప్రామాణిక నిర్వహణ పద్ధతులను (ఎస్ఓపీ) అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ఫిర్యాదులందుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంపై ప్రత్యేక దృష్టిసారించింది. అందులో భాగంగా 18 మంది పోలీసు పరిశీలకుల్ని నియమించింది’ అని మీనా వివరించారు. ఆయన మాటల్లోని ఇతర ప్రధానాంశాలివీ.
ఆ వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించడంపై ఈసీఐదే నిర్ణయం
వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కాదు. వారు రాజీనామా చేసి బయటకు వెళ్లిపోతే వారిపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ ఉండదు. నిబంధనల ప్రకారం ఓటరు జాబితాలో పేరున్న స్థానికులు పోలింగ్ ఏజెంట్గా ఉండేందుకు అర్హులు. అయితే ఎవరిపైనైనా నిషేధం విధించాలంటే కొత్త ప్రొవిజన్ పెట్టాలి. ఆ అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంది. వాలంటీర్లుగా రాజీనామా చేసిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా అనుమతించొచ్చా లేదా అనే అంశంపై ఈసీఐ నిర్ణయం తీసుకుంటుంది.
సమస్యాత్మక కేంద్రాల్లో రెండు కెమెరాలతో నిఘా
‘రాష్ట్రవ్యాప్తంగా 30,111 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాం. ఆయా కేంద్రాల్లో హింసాత్మక ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రం లోపల, బయట కూడా ఒక్కో సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తాం. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి ఒకరు చొప్పున సాధారణ ప్రత్యేక పరిశీలకుడు, ప్రత్యేక పోలీసు పరిశీలకుడు, ప్రత్యేక వ్యయ పరిశీలకులను ఇప్పటికే నియమించింది. 175 శాసనసభ నియోజకవర్గాలకు 50 మంది సాధారణ పరిశీలకులు, 18 మంది పోలీసు పరిశీలకులు నియమించింది. వ్యయ పరిశీలకులుగా లోక్సభ స్థానాలకు 25 మందిని, శాసనసభ స్థానాలకు 50 మందిని పంపింది. వారు ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఓటింగ్ సరళిని పర్యవేక్షించి ఈసీకి నివేదిస్తారు. మద్య నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రత్యేక పోలీసు పరిశీలకుడు ఆదేశించిన నేపథ్యంలో అన్ని తయారీ కేంద్రాలు, గోదాంలో పాటు, వాటి వాహనాలకు కూడా జీపీఎస్ను అనుసంధానం చేయాలని ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేశాం. తయారీ కేంద్రం నుంచి విక్రయానికి కాకుండా మధ్యలో ఎక్కడికీ వెళ్లకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, ఉద్యోగులు, పాత్రికేయులు, అత్యవసర సేవల ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ను మే 10లోపు పూర్తి చేయాలని నిర్ణయించాం. ఎన్నికల విధుల కోసం సుమారు 5.50 లక్షల మంది ఉద్యోగులను వినియోగించనున్నాం. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే ఇంటింటి ప్రచారానికి ముందస్తు సమాచారమివ్వాలని రాజకీయ పార్టీలకు సూచించాం.
కేసుల నమోదు
ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనకు సంబంధించి వైకాపా వారిపై 136, తెదేపా వారిపై 126, ఇతరులపై 76 కేసులు నమోదు చేశాం. జనవరి 1 నుంచి గురువారం వరకు సుమారు రూ.180 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నాం. ఈ నెల 17 వరకు నగదు, నగలు తదితరాల స్వాధీనానికి సంబంధించి 7,336 కేసులు నమోదు చేశాం. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లఘించిన 1,017 మంది వాలంటీర్లను, 181 మంది ఒప్పంద, 127 మంది రెగ్యులర్ ఉద్యోగులను తొలగించాం.
అభ్యంతరకర పదజాలం వినియోగిస్తే చర్యలు
ఎన్నికల ప్రచారంలో అభ్యంతరకర పదజాలం వినియోగిస్తున్నారన్న ఫిర్యాదులపై కొందరు ముఖ్య నాయకులకు నోటీసులు జారీ చేశాం. వారిచ్చిన సమాధానాలను పరిశీలిస్తున్నాం. వారు మళ్లీ అలాంటి పదాలు వాడితే చర్యలు తీసుకుంటాం. ఇతర రాష్ట్రాల అధికారులతో ఎన్నికల నిర్వహించాల్సినంత అసాధారణ పరిస్థితులేమీ రాష్ట్రంలో లేవు. మంత్రులకు ఎన్నికల నియమావళి ఎలా అమలవుతుందో.. క్యాబినెట్ హోదా కలిగిన ప్రభుత్వ సలహాదారులకు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులు సస్పెండైన తర్వాత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, బీటెక్ రవిల వ్యాజ్యాల నుంచి తప్పుకొన్న మరో ధర్మాసనం
మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి జస్టిస్ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్ జె.సుమతిలతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. -
భూ హక్కు చట్టంపై మంత్రి ధర్మాన ద్వంద్వ వైఖరి.. అప్పుడలా..ఇప్పుడిలా..
మాటల గారడీలో ఆరితేరిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ‘భూహక్కు చట్టం’ అమలుపై ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు. -
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
మీ నాన్న విగ్రహ పనులూ నాసిరకమేనా జగన్!
పనుల్లో తన, మన భేదం లేదు.. అంతా నాసిరకంగా చేయడమే ఈ ప్రభుత్వ మార్కు అని నేలకొరిగిన రాజశేఖరరెడ్డి విగ్రహం వెక్కిరిస్తోంది. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
పింఛన్లపై సర్కారు మరో కుట్ర!
ఇంటింటికీ పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ససేమిరా అంది. మండుటెండల్లో పింఛనుదారుల్ని గ్రామ, వార్డు సచివాలయాలకు బలవంతంగా రప్పించేలా గత నెలలో ఎత్తుగడ వేసింది. -
సర్వాధికారాలు ఉన్నా.. నోరు విప్పని జగన్
ముఖ్యమంత్రి జగన్.. రాష్ట్రానికి ఇప్పటికీ ఆయనే సుప్రీం. పరిపాలన యంత్రాంగం మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుని కనుసైగలతో నడిపిస్తున్నారు. -
వడ్డీకాసుల వాడికి ‘వంచన సేవ!’
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తుల నీరాజనాలందుకునే శ్రీనివాసుడు కొలువైన తిరుమల.. దేశ, విదేశాల్లోని కోట్లాది హిందువులకు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం..! -
ఈసారి పింఛనుకు పడవ ప్రయాణం చేయాల్సిందే!
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఈసారి బ్యాంకు ఖాతా ద్వారా పింఛను పొందేందుకు తీరప్రాంత వాసులు పడవ ప్రయాణం చేయాల్సి వస్తోంది. -
అక్రమాలతో చెట్ట‘పట్టాలు’!
ఎన్నికల్లో అనుచిత లబ్ధికి వైకాపా నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ముసుగులో నకిలీ పట్టాలను పంచుతున్నారు. -
స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్లతో ప్రజలపై రూ.1,274 కోట్ల భారం
ఎన్నికలకు ముందు స్వల్పకాలిక విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో(ఎస్టీవోఏ) సుమారు రూ.1,274 కోట్ల అదనపు భారాన్ని ప్రజలపై జగన్ ప్రభుత్వం మోపనుంది. -
అక్రమాల ఆధారాలను మా ముందు ఉంచండి
2018 నాటి గ్రూప్-1 నోటిఫికేషన్ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్ష (మెయిన్స్) జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనంలో (చేతితో దిద్దడం) అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయనేందుకు గల ఆధారాలను వరుస క్రమంలో కోర్టు ముందు ఉంచాలని పిటిషనర్లను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. -
చంద్రబాబు వాహనంపైకి గుర్తుతెలియని వ్యక్తులు
డోన్ సభలో చంద్రబాబు ప్రసంగం అనంతరం ప్రజలకు అభివాదం చేస్తుండగా కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బారికేడ్లు దాటుకుని ఏకంగా ఆయన వాహనంపైకి ఎక్కారు. -
మొక్కు‘బడి’లో ‘గ్లోబల్’ మోసం
పాఠశాలల్లో విద్యార్థులకు తగిన నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండాలన్నది ప్రాథమిక సూత్రం. ఘనత వహించిన జగన్ సర్కార్ మాత్రం అంతా రివర్స్. -
గ్రావెల్ గద్ద.. ఈ పెద్ద!
రాష్ట్రంలో వైకాపా నాయకులు ఒక్కొక్కరిది ఒక్కో తీరు. ‘నన్ను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా’ అని అందరూ చెబుతుంటారు. -
మల్లిక స్పైన్ సెంటర్కు అంతర్జాతీయ అవార్డు
స్పాండిలైటిస్ సమస్యపై చేసిన పరిశోధనకుగాను గుంటూరు మల్లిక స్పైన్ సెంటర్ డైరెక్టర్, ప్రముఖ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు నరేష్బాబుకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. -
‘కాపు’ కాస్తానని కాటేశారు!
దగా.. వంచన.. మోసం.. ఇలా ఏ పేరు పెట్టినా జగన్ దుర్మార్గపు ఆలోచనలకు సరితూగవు. పైకి అమాయకపు చక్రవర్తిలా నటిస్తూ.. ఆయన పాలనలో చేసిందంతా ఇదే! అది ఏ వర్గానికైనా సరే. -
జగన్ అహంభావంతో.. ఐదేళ్లలో పాలన అస్తవ్యస్తం
‘సీఎం జగన్ను సింహం అని ఆయన అనుచరులు పొగుడుతుంటారు. తనను తాను కారణ జన్ముడినని చిత్రించుకోవడానికి జగన్ ప్రయత్నిస్తుంటారు. -
‘నిప్పు రాజేస్తున్నా’ నిర్లిప్తతేనా?
అధికార పార్టీకి చెందిన రౌడీమూకలు తెదేపా కార్యాలయాలు, ఆ పార్టీ నాయకుల ఆస్తులను తగలబెట్టేస్తే ఒక్కటంటే ఒక్క ఘటనలోనూ నిందితుల్ని పట్టుకోలేదు. -
మద్యం కాదు.. మంచినీళ్లతో గొంతు తడపండి!
ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు అభ్యర్థుల వెంట వెళ్తే చాలు.. తాగినంత మద్యం పోయిస్తున్నారు. -
చేపా చేపా ఎందుకు ఎండావ్?
సుదీర్ఘ తీరప్రాంతం అపార జలవనరులు... ఆంధ్రావనికి ఆదాయ మార్గాల్లో ఆక్వా రంగం కూడా ఒకటి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు
-
భార్య దారుణ హత్య.. భారతీయుడికి జీవిత ఖైదు