‘జగన్ ఏలుబడి..’ బలిపీఠంపై సాగుబడి!
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది.
రోజుకో రైతు బలవన్మరణం
రాష్ట్రంలో ఏ అన్నదాతను కదిలించినా రూ.లక్షల్లో అప్పులే
వాటిని తీర్చే దారి కనిపించకనే తీవ్ర నిర్ణయాలు
బాధిత కుటుంబాలకు సరిగా అందని పరిహారం
తన హయాంలోనే వ్యవసాయం సుభిక్షమంటూ సీఎం గొప్పలు
ఈనాడు - అమరావతి
దేశంలోనే మూడో స్థానం... ఇది వినడానికి బాగున్నా...
ఏ విభాగంలో, ఎందుకొచ్చిందో తెలిస్తే గుండెలు తరుక్కుపోతాయి...
అన్నదాతల ఆత్మహత్యల్లో ఏపీకి దక్కిన స్థానమిది!!
అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్లో...
పంటల దిగుబడుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రంలో...
ఇప్పుడు రైతుల బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారిన దైన్యమిది...
తన ఐదేళ్ల పాలనలో జగన్ తీసుకొచ్చిన అపకీర్తి ఇది...
రైతుల జీవితాలను అల్లకల్లోలం చేసిన పాపమిది...
చదువుల తల్లి చేతికి పలుగు, పార
కర్నూలు జిల్లా ఆలూరు మండలం అంగసకల్లుకు చెందిన జయరాముడు(56) కుటుంబానికి ఉమ్మడిగా ఆరెకరాల పొలముంది. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని పత్తి, ఆముదం వేసేవారు. బ్యాంకు నుంచి రూ.5.90 లక్షలు, ప్రైవేటుగా రూ.4 లక్షలు అప్పుగా తెచ్చి 14 బోర్లు వేయించినా అరకొర నీళ్లే వచ్చాయి. దాంతో ఏడేళ్లపాటు నష్టాలే మిగిలాయి. సొసైటీ అధికారులు నోటీసు పంపడంతో పొలం వేలానికి పోతుందనే ఆవేదనతో జయరాముడు తొమ్మిది నెలల కిందట ఉరేసుకున్నారు. ఆయనకు భార్య ఉచ్చీరమ్మ, ఆరుగురు కుమార్తెలున్నారు. అయిదుగురికి వివాహాలు చేశారు. చిన్న కూతురు పదో తరగతిలో ప్రథమ శ్రేణిలో పాసైనా చదువు మాన్పించారు. కాలేజీకి పంపాల్సిన బిడ్డను కూలీ పనులకు తీసుకెళ్తున్నానని ఉచ్చీరమ్మ కన్నీరు పెట్టుకున్నారు. వీరికి ఇప్పటికీ పరిహారం అందలేదు.
వైకాపా ఐదేళ్ల పాలనలో రైతులకు మిగిలింది అప్పులు... కన్నీళ్లే. బాధితుల్లో 90% మంది చిన్న, సన్నకారు రైతులే. వరి సాగు తమవల్ల కాదంటూ గోదావరి, కృష్ణా డెల్టాలో విరామం ప్రకటించే దుస్థితి జగన్ జమానాలోనే దాపురించింది. వరుస నష్టాలతో రాయలసీమలో వేరుశనగ రైతులు సాగు నుంచే బయటకొచ్చేస్తున్నారు. మిరప రైతులకు నష్టం నషాళానికి అంటింది. పత్తి రైతులు తెల్లబోయారు. ఉద్యాన రైతులైతే... జగన్ పేరు వింటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని కష్టాలకోర్చి వ్యవసాయం చేస్తున్నా కాలం కరుణించడం లేదు. సర్కారు దయ తలచడంలేదు. ఏడాదిలో రెండు, మూడుసార్లు పంటల మునక... ఆపై కరవు కాటకాలు. రూ.లక్షల్లో పెరుగుతున్న అప్పుల్ని, వాటిపై వడ్డీల్ని తలచుకుని.. రైతు కుటుంబాలకు అన్నం సయించడం లేదు. ఇదిగో ఈ ఏడాది కలిసొస్తుందేమో అంటూ ఆశల సేద్యం చేసి చేసి.. అలసిపోతున్నారు. నిస్సహాయ స్థితిలో... నమ్ముకున్న పొలంలోనే కొందరు నిర్జీవులవుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడాదికి సగటున 1,100 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడాదికి రూ.7లక్షలు ఇస్తామనే హామీనీ సక్రమంగా అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న 39 రైతు కుటుంబాల పరిస్థితిపై ‘ఈనాడు’ క్షేత్ర పరిశీలన చేసింది. యజమాని మరణంతో వీధిన పడిన కుటుంబాలు, పిల్లల ఆకలి తీర్చడానికి రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లుల కష్టాలు కళ్లకు కట్టాయి.
వ్యవ‘సాయం’పై జగన్ డాంబికాలు
‘‘మాది రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం. ఆర్బీకేల ద్వారా వారిని చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. దేశంలో మరెక్కడా లేనంతగా రైతు భరోసా ద్వారా పెట్టుబడిలో 80% మేమే ఇస్తున్నాం. ఆహార ధాన్యాల దిగుబడి పెరిగింది. రైతులంతా సంతోషంగా ఉన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం అద్భుతంగా మారింది. మా ఏలుబడిలో వ్యవసాయం సుసంపన్నం...’’ అంటూ సీఎం జగన్ కొన్ని వందల, వేలసార్లు బాకాలు ఊదారు. ఎన్నికల ప్రచారంలోనూ పదేపదే అదే వల్లెవేస్తున్నారు.
ఈ మాటలే నిజమైతే...
రాయలసీమలో ఎండిన పంటల సంగతేంటి? డెల్టాలో ధర దక్కని వరి రైతు పరిస్థితి ఏంటి? రాష్ట్రంలో సాగెందుకు తగ్గుతోంది... ఉత్పత్తి ఎందుకు పడిపోతోంది? పెట్టుబడిలో 80% ఇస్తుంటే(ఎకరాకు ఎంత పెట్టుబడి అవుతుందో సీఎంకి తెలిస్తే కదా?)... ఏ రైతును కదిలించినా రూ.లక్షల్లో అప్పులయ్యాయని ఎందుకు కన్నీరు పెడుతున్నారు... నిస్సహాయ స్థితిలో ఉరికొయ్యకు ఎందుకు వేలాడుతున్నారు. ప్రాణంకంటే మిన్నగా ప్రేమించే వృత్తినే ఎందుకు వదిలేస్తున్నారు..? కరవుతో అల్లాడుతున్న రైతులు, ప్రజల కష్టాలను పరిశీలించడానికి మనసు రాని ఈ పాలకుడికి, తుపానుతో నష్టపోయిన పంటలను చూడడానికి కార్పెట్ వేయించుకున్న ఈ ముఖ్యమంత్రికి అసలు వ్యవసాయమంటే ఏంటో తెలిస్తేగదా..!
ఒకే ఊరు నుంచి 15 రైతు కుటుంబాల వలస
కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంటు నుంచి ఏకంగా 15 రైతు కుటుంబాలు హైదరాబాద్కు వలస వెళ్లాయి. ఇళ్లకు తాళాలు వేసి కొందరు, తల్లిదండ్రులను ఇంటి వద్దనే ఉంచేసి మరికొందరు... పొట్టచేత పట్టుకుని, పుట్టిన గడ్డను, సొంతూరిని వదిలేసి వెళ్లిపోయారు. అప్పులను తీర్చడానికే అక్కడ కూలి పనులు చేస్తుండటం గమనార్హం.
ఆత్మహత్యల్లో మూడో స్థానం... ఇదేనా వైకాపా ఘనత?
వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వారిలో అత్యధికంగా ఆత్మహత్యలు జరుగుతున్న రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర, కర్ణాటకల తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ)-2022 నివేదిక ఈ కఠోర వాస్తవాన్ని వెల్లడించింది. ఏపీలో 2022 సంవత్సరంలో 917 మంది రైతులు, రైతు కూలీలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారిలో 309 మంది సొంత భూములున్న పట్టాదారులు, 60 మంది కౌలుదారులు. మిగిలిన వారంతా రైతు కూలీలు. అంటే జగన్ పాలనలో రోజుకో రైతు ఆత్మహత్య చేసుకున్నారు.
- 2019లో 628 మంది, 2020లో 564, 2021లో 481 మంది అన్నదాతలు ఆంధ్రప్రదేశ్లో అర్ధంతరంగా తనువు చాలించారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజ్యసభలో వెల్లడించారు.
- వివిధ నివేదికలు, మానవ హక్కుల వేదిక, రైతుస్వరాజ్య వేదికల గణాంకాల ప్రకారం... 2019 జూన్ నుంచి 2021 చివరివరకు 2,112 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగ్గా... 2022 ఏప్రిల్ నాటికి 718 మందికే జీవో 43 ప్రకారం ఆర్థిక సాయం అందింది. ప్రభుత్వం మాత్రం 2023 జులై వరకు 1,197 మందికి పరిహారం ఇచ్చినట్లు ప్రకటించింది.
జగన్ పాలనలో సాగు డీలా..
పంటల పెట్టుబడి వ్యయం ఐదేళ్లలో భారీగా పెరిగింది. 2018-19లో ఎకరం వరికి రూ.25 వేల పెట్టుబడి అయ్యేది. ఇప్పుడది రూ.40 వేలకు చేరింది. మిరప రూ.లక్షన్నర నుంచి రూ.2.75 లక్షలకు పెరిగింది.
- దిగుబడి ఏమాత్రం పెరగడం లేదు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర దక్కడం లేదు. ఒకవేళ ధర తగ్గితే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడం లేదు.
- ఉచిత పంటల బీమా పథకం బ్రహ్మ రహస్యమే. రాష్ట్రంలో 2023 ఖరీఫ్లో 1.38 కోట్ల ఎకరాల్లో పంటలు సాగైతే... 64 లక్షల ఎకరాలకే బీమా చేశారు. మిరప రైతుల్లో అత్యధికులకు బీమానే దక్కడం లేదు. మామిడికైతే పథకాన్నే ఎత్తేశారు.
- సూక్ష్మ సేద్య పథకాన్ని తొలి మూడేళ్లు అటకెక్కించి చివరి రెండేళ్లు నామమాత్రంగా అమలు చేశారు. ఫలితంగా రాయలసీమలాంటి మెట్ట ప్రాంత రైతులు అప్పులపాలయ్యారు.
- రైతుల కోసం ఉచితంగా 2లక్షల బోర్లను వేయిస్తామని జగన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చినా ఇప్పటివరకు 25 వేలకు మించలేదు. మరోవైపు లక్షల మంది రైతులు పదేపదే బోర్లు వేయిస్తూ రూ.లక్షల అప్పుల్లో మునుగుతున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం షేక్షానుపల్లికి చెందిన వడ్డే నాగరాజు రూ.5లక్షలు పెట్టి తన పొలంలో 15సార్లు బోర్లు వేయగా చివరిసారి నీళ్లు పడ్డాయి.
- ప్రకృతి విపత్తులు పంటల్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. 2023 డిసెంబరులో మిగ్జాం తుపాను రైతుల ఆశలను చిదిమేసింది. ఎకరాకు రూ.12 వేల చొప్పున సాయం ఇవ్వాలని రైతులు మొరపెట్టుకున్నా... సగటున రూ.6వేలు నిర్ణయించారు. వాటికి జగన్ బటన్ నొక్కినా సాయం ఇంకా అందలేదు.
ఆకలికేం తెలుసు... ఆ ఇంటి పెద్ద చనిపోయారని..!
ఇల్లు గడవడమే కష్టంగా ఉంది!
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం మందాడికి చెందిన మాలంరెడ్డి శ్రీనివాసరెడ్డి(53) తనకున్న మూడెకరాలకు తోడు పదెకరాలను కౌలుకు తీసుకొని మిర్చి, పత్తి సాగు చేసేవారు. ఏళ్లుగా దిగుబడి సరిగా రాక అప్పులే మిగిలాయి. 2022 డిసెంబరులో విరుచుకుపడిన తుపాన్తో సమస్యలు పెరిగాయి. మొత్తం అప్పు రూ.20 లక్షలకు చేరింది. పొలం అమ్మినా రుణం తీరదనే బాధతో ఈ ఏడాది ఫిబ్రవరి 28న పురుగుల మందు తాగారు. అధికారులు రైతు ఆత్మహత్యగా కేసు రాసుకున్నా భార్య వెంకట్రావమ్మకు పరిహారం అందలేదు. ఆకలిదప్పులను తీర్చుకోవడమే ఆ కుటుంబానికి కష్టంగా మారింది. బీటెక్ చదివిన కుమారుడు హైదరాబాద్లో ఉద్యోగ వేటలో ఉన్నారు.
తల్లి కూలీకి... కుమారుడు ముఠా పనికి!
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడుకు చెందిన గంగారపు హనుమంతురావు(49) కుటుంబానికి వ్యవసాయమే జీవనాధారం. సొంతంగా 1.75 ఎకరాల పొలముంది. పదెకరాలను కౌలుకు తీసుకొని ఎక్కువగా మిర్చిని వేసేవారు. ఏటా అప్పులే దిగుబడులుగా వచ్చాయి. ప్రైవేటుగా రూ.5.50 లక్షలు, బ్యాంకులో రూ.3.12 లక్షల రుణముంది. ఏంచేయాలో పాలుపోని స్థితిలో తన ఇంట్లోనే 2020 నవంబరు 18న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబానికి ఇప్పటికీ పరిహారం దక్కలేదు. ఆకలి తీర్చుకోవడానికి హనుమంతురావు భార్య వ్యవసాయ పనులకు, కుమారుడు ముఠా పనికి వెళ్తున్నారు.
పేపర్ ప్లేట్ల పరిశ్రమలో కార్మికురాలిగా...
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం ఆర్.కురవపల్లికి చెందిన సురేంద్రకు 2.67 ఎకరాల పొలముంది. సాగునీటి కోసం బోర్లు వేసినా నీళ్లు పడలేదు. అప్పటికే రూ.11 లక్షల అప్పు చేశారు. దాన్ని తీర్చే మార్గం కనిపించక 2020 జనవరి 28న ఇంట్లోనే ఉరేసుకున్నారు. అధికారులు రైతు ఆత్మహత్యగా నివేదిక ఇచ్చినా సురేంద్ర భార్య చంద్రకళకు సాయం అందలేదు. ఇప్పుడామె కల్లూరులో పేపర్ ప్లేట్ల పరిశ్రమలో రోజుకూలీకి వెళుతున్నారు. ఇద్దరు పిల్లలకు వివాహమవగా చిన్న కూతురు ఇంటర్ చదువుతోంది.
భర్త ఉన్నప్పుడు యజమానురాలు.. నేడు కూలీ
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నమశ్శివాయపురం గ్రామ రైతు అవులూరి ఏడుకొండలరెడ్డికి ఎనిమిదెకరాల భూమి ఉంది. నాలుగెకరాల్లో దానిమ్మ, జామ తోటలు వేసి భారీగా నష్టపోయారు. మొత్తంగా రూ.15 లక్షలు అప్పులయ్యాయి. భూమంతా అమ్మేసినా అవి తీరలేదు. 2021 సెప్టెంబరు 15న పురుగుల మందు తాగి మరణించారు. భార్య వెంకటలక్ష్మిని, కూతుళ్లు దేవిక(8వ తరగతి), నీలిమ(5వ తరగతి)లను వీధినపడేశారు. బిడ్డల ఆకలి తీర్చేందుకు ఆ అభాగ్యురాలు తమ పొలంలోనే కూలీగా పనిచేస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వ పరిహారం అందలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎడారి దేశాల్లో.. గాయపడిన గుండెలెన్నో!
-
కొడవలితో కొడుకు ఛాతీని గాయపరిచిన తల్లిదండ్రులు
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు