మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం.
బాల సాహిత్యంలో ప్రత్యేక ఒరవడి
పిల్లల్లో పఠనాసక్తి పెంచడమే లక్ష్యం
రెండు దశాబ్దాలుగా అక్షరసేద్యం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. పిల్లల మనోవికాసానికి 20 ఏళ్లుగా కృషి చేస్తోందీ సంస్థ. బాల్యం నుంచీ పఠనాసక్తి పెంపొందించేలా కథలు, విజ్ఞాన ప్రచురణలు తేట తెలుగులో ముద్రిస్తోంది. సొంత ప్రచురణలకు తోడు.. ఇతర సంస్థలు ముద్రణను ఆపేసిన పుస్తకాలను కూడా కొనుగోలు చేసి మరీ పంపిణీ చేస్తోంది. దేశ, విదేశీ భాషల్లోని మంచి బాల సాహిత్యాన్ని అనువాదం చేసి ఈ తరం పిల్లలకు అందిస్తోంది. ఈ నెలాఖరుతో ఆ సంస్థ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనుంది. తార్నాకలోని సెయింట్ యాన్స్ జెనరలేట్లో ఈ నెల 27వ తేదీన రెండు దశాబ్దాల వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రస్టీల్లో ఒకరైన కొసరాజు సురేశ్తో ‘ఈనాడు’ ముచ్చటించగా.. సంస్థ ప్రస్థానాన్ని వివరించారు.
అలా శ్రీకారం..
తెలుగులో పిల్లల పుస్తకాలు పెద్దగా రాని రోజుల్లో స్నేహితుల తోడ్పాటుతో కొసరాజు సురేశ్ 2002లో ‘పుస్తకాలతో స్నేహం’ పేరిట హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రచురణ సంస్థలు, రచయితల నుంచి అందుబాటులో ఉన్న బాల సాహిత్యాన్ని సేకరించి ప్రదర్శించారు. అక్కడ లభించిన ప్రోత్సాహంతో ‘మంచి పుస్తకం’ ప్రచురణ ప్రస్థానం మొదలైంది. అంతకంటే ముందు బాలసాహితి పేరుతో కొన్ని పుస్తకాలు ప్రచురించిన అనుభవం వీరికుంది. ఇప్పటివరకు 500కు పైగా పుస్తకాలను ప్రచురిస్తే అందులో పిల్లల కోసం ఉద్దేశించినవే 383 ఉన్నాయి.
కార్డు మీద కథ
చిన్నారులకు పఠనం విసుగు అనిపించకుండా.. చదవడం అలవాటు చేసే క్రమంలో కథా కదంబం పేరుతో సరికొత్త ప్రయోగం చేశారు. కేవలం నాలుగు పేజీలుండే కార్డుపై ఒక్కో పేజీలో ఒకటి రెండు వాక్యాలతో బొమ్మల కథ ఉండేలా 50 కార్డు కథలను ప్రచురించారు. 5 నుంచి 8 ఏళ్ల చిన్నారులను ఈ ప్రయోగం బాగా ఆకట్టుకుంది. కార్డు కథల నుంచి క్రమంగా పుస్తకంలోని కథల్లోకి తీసుకు వచ్చారు. ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో వేర్వేరు వయసు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని 16 నుంచి 64 పేజీల వరకు ఉండే రచనలను ప్రచురించారు. ఇలా ఇప్పటివరకు 85 పుస్తకాలు ముద్రించారు. కథలు, బొమ్మల పుస్తకాలతో పాటు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలకు తెలుగు అనువాదాలు తెచ్చారు. జన విజ్ఞాన వేదికతో కలిసి ఉమ్మడిగా ప్రచురిస్తుండడంతో తమపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు.. రచనలు ఎక్కువ మందికి చేరువయ్యాయని ట్రస్ట్ కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి తెలిపారు.
అనువాదాలతో ఆరంభించి..
తొలినాళ్లలో పరిమిత ఆర్థిక వనరుల కారణంగా.. అనువాద రచనలను ఎక్కువగా ప్రచురించేవారు. రష్యన్, ఆఫ్రికన్ తదితర భాషల అనువాదాలు అందుబాటులోకి తెచ్చారు. క్రమేణా తెలుగు మూల రచనలను ప్రోత్సహించారు. 2017 నుంచి తానా సంస్థతో కలిసి తెలుగు కథల రచనలను ఆహ్వానిస్తున్నారు. పదేళ్లలోపు పిల్లల కోసం బొమ్మల కథలు, ఆ పై వయసు వారికి సాహస, సైన్స్, కాల్పనిక, హాస్య నవలలను ఎంపిక చేసి ప్రచురించడం మొదలెట్టారు. 21 నవలలు, 28 బొమ్మల కథలు ప్రచురించారు. తెలంగాణ తియ్యని పలకరింపు పేరుతో బడి పిల్లల కథలను ప్రచురిస్తున్నారు. పిల్లలు రాసిన 306 కథల్లో 51 రచనలను ఎంపిక చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
ఎక్కువగా అడిగే పుస్తకాలు
చిన్న పిల్లల కోసం బొమ్మల కథలు, పెద్ద పిల్లల కోసం నీతికథలు, జీవితగాథలు, స్ఫూర్తిదాయక, జీవన నైపుణ్యాలకు సంబంధించిన పుస్తకాలు, నిఘంటువులు ఎక్కువగా అడుగుతుంటారని సురేశ్ చెప్పారు. ప్రైవేటు బడుల్లోని పిల్లలు ఆంగ్ల మాధ్యమం కారణంగా తెలుగులో ధారాళంగా చదవలేకపోతున్నారని.. ప్రభుత్వ బడుల్లోని పిల్లలు వనరులు సరిగా లేక తెలుగు నేర్చుకోవడంలో తడబడుతున్నారని అన్నారు. పిల్లలకు తెలుగు నేర్పాలనే తపన ప్రైవేటు బడుల్లో చదివిస్తున్న తల్లిదండ్రుల్లో కనిపిస్తోందని, వారు పుస్తకాలు కొంటున్నారని తెలిపారు. పిల్లల పుస్తకాల కోసమైనా, గ్రంథాలయాలు, పాఠశాలలకు వాటిని ప్రదానం చేయాలనుకున్నా.. తార్నాకలోని ‘మంచి పుస్తకం’ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఆన్లైన్లోనూ ఆర్డర్ చేయవచ్చు. కార్యాలయ వేళల్లో కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మిని 94907 46614 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
బాలసాహితి నుంచి మొదలై..: కొసరాజు సురేశ్, ట్రస్టీ, మంచి పుస్తకం
‘మంచి పుస్తకం’ కంటే ముందు 1990లో బాల్రెడ్డి, సుబ్బయ్య, రాజేంద్రప్రసాద్, నేనూ కలిసి బాల సాహితి అనే సంస్థను ప్రారంభించాం. ఎవరికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ.. దాదాపు పదేళ్ల పాటు 35 పుస్తకాలను ప్రచురించాం. ‘ఈనాడు’ రైతేరాజులో నేను ఉప సంపాదకుడిగా అనువాదాలు చేసిన అనుభవం బాల సాహితికి ఉపయోగపడింది. తర్వాత వాసన్ స్వచ్ఛంద సంస్థలో చేరాను. నా అభిరుచిని గమనించి అక్కడ ఒక అల్మారాలో పుస్తకాలు పెట్టుకునేందుకు స్థలం కేటాయించారు. ఇక్కడే మిత్రుల సహకారంతో మంచి పుస్తకానికి బీజం పడింది. రవీంద్ర, ఎస్.ఎస్.లక్ష్మి, నేను ట్రస్టీలుగా 2004 ఏప్రిల్ 29వ తేదీన ‘మంచి పుస్తకం’ ప్రయాణం ప్రారంభమైంది. అంతకుముందు పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బును మూలధనంగా పెట్టాం. పాఠకులు, స్వచ్ఛంద సంస్థల ఆదరణ ఫలితంగా ‘మంచి పుస్తకం’ ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో 20 ఏళ్లుగా సాఫీగా నిర్వహిస్తున్నాం. ఎంవీ ఫౌండేషన్, రెడ్డీస్ ఫౌండేషన్ సహా పలు స్వచ్ఛంద సంస్థలు పుస్తకాలను కొని పాఠశాలలు, గ్రంథాలయాలకు అందిస్తున్నాయి. తార్నాకలో కార్యాలయం అద్దెకు తీసుకున్నాం. నాతో పాటు కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి పూర్తికాలం పనిచేస్తున్నారు. బాలల్లో పఠనంపై ఆసక్తి, పుస్తకాలపై ప్రేమ కల్పించాలనేది మా ప్రయత్నం.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.