మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం.
బాల సాహిత్యంలో ప్రత్యేక ఒరవడి
పిల్లల్లో పఠనాసక్తి పెంచడమే లక్ష్యం
రెండు దశాబ్దాలుగా అక్షరసేద్యం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. పిల్లల మనోవికాసానికి 20 ఏళ్లుగా కృషి చేస్తోందీ సంస్థ. బాల్యం నుంచీ పఠనాసక్తి పెంపొందించేలా కథలు, విజ్ఞాన ప్రచురణలు తేట తెలుగులో ముద్రిస్తోంది. సొంత ప్రచురణలకు తోడు.. ఇతర సంస్థలు ముద్రణను ఆపేసిన పుస్తకాలను కూడా కొనుగోలు చేసి మరీ పంపిణీ చేస్తోంది. దేశ, విదేశీ భాషల్లోని మంచి బాల సాహిత్యాన్ని అనువాదం చేసి ఈ తరం పిల్లలకు అందిస్తోంది. ఈ నెలాఖరుతో ఆ సంస్థ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకోనుంది. తార్నాకలోని సెయింట్ యాన్స్ జెనరలేట్లో ఈ నెల 27వ తేదీన రెండు దశాబ్దాల వేడుక నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ట్రస్టీల్లో ఒకరైన కొసరాజు సురేశ్తో ‘ఈనాడు’ ముచ్చటించగా.. సంస్థ ప్రస్థానాన్ని వివరించారు.
అలా శ్రీకారం..
తెలుగులో పిల్లల పుస్తకాలు పెద్దగా రాని రోజుల్లో స్నేహితుల తోడ్పాటుతో కొసరాజు సురేశ్ 2002లో ‘పుస్తకాలతో స్నేహం’ పేరిట హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రచురణ సంస్థలు, రచయితల నుంచి అందుబాటులో ఉన్న బాల సాహిత్యాన్ని సేకరించి ప్రదర్శించారు. అక్కడ లభించిన ప్రోత్సాహంతో ‘మంచి పుస్తకం’ ప్రచురణ ప్రస్థానం మొదలైంది. అంతకంటే ముందు బాలసాహితి పేరుతో కొన్ని పుస్తకాలు ప్రచురించిన అనుభవం వీరికుంది. ఇప్పటివరకు 500కు పైగా పుస్తకాలను ప్రచురిస్తే అందులో పిల్లల కోసం ఉద్దేశించినవే 383 ఉన్నాయి.
కార్డు మీద కథ
చిన్నారులకు పఠనం విసుగు అనిపించకుండా.. చదవడం అలవాటు చేసే క్రమంలో కథా కదంబం పేరుతో సరికొత్త ప్రయోగం చేశారు. కేవలం నాలుగు పేజీలుండే కార్డుపై ఒక్కో పేజీలో ఒకటి రెండు వాక్యాలతో బొమ్మల కథ ఉండేలా 50 కార్డు కథలను ప్రచురించారు. 5 నుంచి 8 ఏళ్ల చిన్నారులను ఈ ప్రయోగం బాగా ఆకట్టుకుంది. కార్డు కథల నుంచి క్రమంగా పుస్తకంలోని కథల్లోకి తీసుకు వచ్చారు. ‘పుస్తకాలతో స్నేహం’ పేరుతో వేర్వేరు వయసు పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని 16 నుంచి 64 పేజీల వరకు ఉండే రచనలను ప్రచురించారు. ఇలా ఇప్పటివరకు 85 పుస్తకాలు ముద్రించారు. కథలు, బొమ్మల పుస్తకాలతో పాటు విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలకు తెలుగు అనువాదాలు తెచ్చారు. జన విజ్ఞాన వేదికతో కలిసి ఉమ్మడిగా ప్రచురిస్తుండడంతో తమపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు.. రచనలు ఎక్కువ మందికి చేరువయ్యాయని ట్రస్ట్ కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి తెలిపారు.
అనువాదాలతో ఆరంభించి..
తొలినాళ్లలో పరిమిత ఆర్థిక వనరుల కారణంగా.. అనువాద రచనలను ఎక్కువగా ప్రచురించేవారు. రష్యన్, ఆఫ్రికన్ తదితర భాషల అనువాదాలు అందుబాటులోకి తెచ్చారు. క్రమేణా తెలుగు మూల రచనలను ప్రోత్సహించారు. 2017 నుంచి తానా సంస్థతో కలిసి తెలుగు కథల రచనలను ఆహ్వానిస్తున్నారు. పదేళ్లలోపు పిల్లల కోసం బొమ్మల కథలు, ఆ పై వయసు వారికి సాహస, సైన్స్, కాల్పనిక, హాస్య నవలలను ఎంపిక చేసి ప్రచురించడం మొదలెట్టారు. 21 నవలలు, 28 బొమ్మల కథలు ప్రచురించారు. తెలంగాణ తియ్యని పలకరింపు పేరుతో బడి పిల్లల కథలను ప్రచురిస్తున్నారు. పిల్లలు రాసిన 306 కథల్లో 51 రచనలను ఎంపిక చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
ఎక్కువగా అడిగే పుస్తకాలు
చిన్న పిల్లల కోసం బొమ్మల కథలు, పెద్ద పిల్లల కోసం నీతికథలు, జీవితగాథలు, స్ఫూర్తిదాయక, జీవన నైపుణ్యాలకు సంబంధించిన పుస్తకాలు, నిఘంటువులు ఎక్కువగా అడుగుతుంటారని సురేశ్ చెప్పారు. ప్రైవేటు బడుల్లోని పిల్లలు ఆంగ్ల మాధ్యమం కారణంగా తెలుగులో ధారాళంగా చదవలేకపోతున్నారని.. ప్రభుత్వ బడుల్లోని పిల్లలు వనరులు సరిగా లేక తెలుగు నేర్చుకోవడంలో తడబడుతున్నారని అన్నారు. పిల్లలకు తెలుగు నేర్పాలనే తపన ప్రైవేటు బడుల్లో చదివిస్తున్న తల్లిదండ్రుల్లో కనిపిస్తోందని, వారు పుస్తకాలు కొంటున్నారని తెలిపారు. పిల్లల పుస్తకాల కోసమైనా, గ్రంథాలయాలు, పాఠశాలలకు వాటిని ప్రదానం చేయాలనుకున్నా.. తార్నాకలోని ‘మంచి పుస్తకం’ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఆన్లైన్లోనూ ఆర్డర్ చేయవచ్చు. కార్యాలయ వేళల్లో కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మిని 94907 46614 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చు.
బాలసాహితి నుంచి మొదలై..: కొసరాజు సురేశ్, ట్రస్టీ, మంచి పుస్తకం
‘మంచి పుస్తకం’ కంటే ముందు 1990లో బాల్రెడ్డి, సుబ్బయ్య, రాజేంద్రప్రసాద్, నేనూ కలిసి బాల సాహితి అనే సంస్థను ప్రారంభించాం. ఎవరికి వారు ఉద్యోగాలు చేసుకుంటూ.. దాదాపు పదేళ్ల పాటు 35 పుస్తకాలను ప్రచురించాం. ‘ఈనాడు’ రైతేరాజులో నేను ఉప సంపాదకుడిగా అనువాదాలు చేసిన అనుభవం బాల సాహితికి ఉపయోగపడింది. తర్వాత వాసన్ స్వచ్ఛంద సంస్థలో చేరాను. నా అభిరుచిని గమనించి అక్కడ ఒక అల్మారాలో పుస్తకాలు పెట్టుకునేందుకు స్థలం కేటాయించారు. ఇక్కడే మిత్రుల సహకారంతో మంచి పుస్తకానికి బీజం పడింది. రవీంద్ర, ఎస్.ఎస్.లక్ష్మి, నేను ట్రస్టీలుగా 2004 ఏప్రిల్ 29వ తేదీన ‘మంచి పుస్తకం’ ప్రయాణం ప్రారంభమైంది. అంతకుముందు పుస్తకాలు అమ్మగా వచ్చిన డబ్బును మూలధనంగా పెట్టాం. పాఠకులు, స్వచ్ఛంద సంస్థల ఆదరణ ఫలితంగా ‘మంచి పుస్తకం’ ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో 20 ఏళ్లుగా సాఫీగా నిర్వహిస్తున్నాం. ఎంవీ ఫౌండేషన్, రెడ్డీస్ ఫౌండేషన్ సహా పలు స్వచ్ఛంద సంస్థలు పుస్తకాలను కొని పాఠశాలలు, గ్రంథాలయాలకు అందిస్తున్నాయి. తార్నాకలో కార్యాలయం అద్దెకు తీసుకున్నాం. నాతో పాటు కో ఆర్డినేటర్ భాగ్యలక్ష్మి పూర్తికాలం పనిచేస్తున్నారు. బాలల్లో పఠనంపై ఆసక్తి, పుస్తకాలపై ప్రేమ కల్పించాలనేది మా ప్రయత్నం.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
-
మాట నిలబెట్టుకున్న రాజమౌళి- మహేశ్.. ‘SSMB29’ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది