ఉక్కపోత, వడగాలులు తీవ్రతరం

రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.

Updated : 19 Apr 2024 05:33 IST

16 జిల్లాల్లో 44 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: రాష్ట్రంలో వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా అల్లూరి సీతారామరాజు జిల్లా యర్రంపేట, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో 45.8, నంద్యాల జిల్లా నందవరంలో 45.6, విజయనగరం జిల్లా జామి 45.5, శ్రీకాకుళం జిల్లా కొవిలం, వైయస్‌ఆర్‌ జిల్లా కొంగలవీడులో 45.4, తిరుపతి జిల్లా రేణిగుంట, ప్రకాశం జిల్లా దరిమడుగులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 16 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 120 మండలాల్లో వడగాలులు వీచాయి. శుక్రవారం 91 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. శని, ఆది, సోమవారాల్లో పలు ప్రాంతాల్లో పిడుగులు పడొచ్చని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

శుక్రవారం తీవ్ర వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు: విజయనగరం 21, పార్వతీపురం మన్యం 13, శ్రీకాకుళం 11, పల్నాడు 9, అనకాపల్లి 7, గుంటూరు 6, కాకినాడ 5,  ఎన్టీఆర్‌ 5, అల్లూరి సీతారామరాజు 5, ప్రకాశం 4, తూర్పు గోదావరి 2, ఏలూరు 2, బాపట్ల 1.

వడగాలులు వీచే అవకాశమున్న మండలాలు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ఏలూరు 22, ప్రకాశం 19, తూర్పు గోదావరి 17, కృష్ణా, తిరుపతి 16, శ్రీకాకుళం, పల్నాడు 15, బాపట్ల, కాకినాడ 14, అల్లూరి సీతారామరాజు, వైయస్‌ఆర్‌, ఎన్టీఆర్‌ 11, గుంటూరు 10, అన్నమయ్య 2, చిత్తూరు, పార్వతీపురం మన్యం 1.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని