20 లక్షల పేద కుటుంబాల ‘ఉపాధి’పై జగన్ వేటు
రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది.
అయిదేళ్లలో అడ్డగోలుగా జాబ్ కార్డుల తొలగింపు
జాతీయ స్థాయిలో తొలగించినవి 11%.. ఏపీలో అసాధారణంగా 24.6%
సాంకేతిక సమస్యలు పరిష్కరించకుండా పేదలపై వైకాపా సర్కార్ వేటు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గత అయిదేళ్లలో 20.05 లక్షల కుటుంబాలను జగన్ ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి దూరం చేసింది. జాతీయ స్థాయిలో 2019-20 నుంచి 2023-24 మధ్య జాబ్కార్డులు తొలగించిన కుటుంబాలు 11.1% ఉంటే.. ఏపీలో అసాధారణంగా 24.6% ఉండటం పేదలపట్ల వైకాపా సర్కారు ఆపేక్షకు నిదర్శనం! నరేగా అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఆధారిత చెల్లింపుల స్థానంలో ఆధార్ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆధార్కార్డు, జాబ్కార్డులను అనుసంధానించే పద్ధతిని తీసుకొచ్చింది. ఆధార్, జాబ్కార్డుల్లో కూలీల పేర్లలో స్వల్ప తేడాలున్నా అనుసంధానం కావడం లేదు. ఇది పూర్తయినా జాతీయ చెల్లింపుల సంస్థ (ఎన్పీసీఐ) అనుసంధానపరంగానూ సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిని అధిగమించాలంటే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి. కానీ సాంకేతిక సమస్యల పరిష్కారంలో జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యం కూలీలకు శాపమైంది. ఫలితంగా రాష్ట్రంలో 2022-23 నుంచి 2023-24 మధ్య ఏడాది వ్యవధిలోనే 53 వేల కుటుంబాలు జాబ్కార్డులు కోల్పోయాయి. నరేగా అమలును ఏటా విశ్లేషించే ‘లిబ్టెక్ ఇండియా’ సంస్థ గురువారం విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది.
బతికున్న కూలీని చంపేశారు: కూలీలు బతికున్నా చనిపోయినట్లుగా చూపించి ఉపాధి హామీ పథకం జాబ్ కార్డులు తొలగించడం జగన్ ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ఠ. 2022-23లో పెద్దఎత్తున జాబ్ కార్డుల తొలగింపుపై మానవ హక్కుల వేదిక (హెచ్ఆర్ఎఫ్) ప్రతినిధులు పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల పరిశీలించినప్పుడు విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లోని చింతలపాడు, వాలేసు, దుర్బిలి ఆదివాసీ గ్రామాల్లో వివిధ కారణాలతో 30 మంది జాబ్కార్డులు తొలగించారు. సాంకేతిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా.. 2022-23లో పెద్ద సంఖ్యలో కూలీలను ఇతర కారణాలతో ఉపాధికి దూరం చేసిందని మానవ హక్కుల వేదిక విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.అనురాధ అన్నారు.
2022-23లో కూలీలకు కనీస వేతన నష్టం రూ.1,055 కోట్లు: ఉపాధి కూలీలకు కేంద్రం ప్రకటించిన కనీస వేతనమూ రావడం లేదు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వపరంగా చేస్తున్న కృషి అంతంత మాత్రమే. తెదేపా ప్రభుత్వ హయాంలో కూలీలకు కేంద్రం ప్రకటించిన కనీస వేతనం అందేది. గత అయిదేళ్లలో కూలీలకు కనీస వేతనం వచ్చిన దాఖలాల్లేవు. 2022-23, 2023-24లో లోటు మరీ ఎక్కువగా ఉంది. 2022-23లో కేంద్రం ప్రకటించిన కనీస వేతనం ప్రకారం ఒక కూలీకి ఏడాదిలో రూ.13,433 వేతనంరావాల్సి ఉంటే రూ.11,053 అందింది. రూ.2,380 నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఏడాది పనులకు హాజరైన మొత్తం కూలీలు రూ.1,055.18 కోట్లు కోల్పోయారని లిబ్టెక్ ఇండియా సంస్థ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. -
జగనన్న వస్తున్నారు... మిద్దెలపైకి నోఎంట్రీ!
సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు... ఆ ప్రాంతాల్లో ఆంక్షలకు అడ్డూ, అదుపు ఉండనే ఉండదు. చెట్లు నరికి వేయడం, విద్యుత్తు సరఫరా తొలగించడం, ట్రాఫిక్ను అడ్డగోలుగా ఆపేయడం ఇవి సర్వసాధారణం. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
ఇంటికెళ్లిన వారు నగదు ఇవ్వలేరా?
ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు
రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడులు.. ‘ఎదిరిస్తే హత్యలు’
వారానికి నాలుగు హత్యలు.. మూడు అత్యాచారాలు.. ఆరు హత్యాయత్నాలు.. రోజుకు ఇద్దరిపై దాడులు.. ఆరు దురాగతాలు... అమానవీయ శిరోముండనాలు... అంతమొందించి డోర్ డెలివరీలు... గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దుశ్చర్యలు వైకాపా జమానాలో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న అరాచకాల తీరిది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రికార్డు
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాజధాని గ్రామాల్లో భూసేకరణ ప్రకటన ఉపసంహరణ తగదు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. -
ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దెలు చెల్లించని సర్కారు
ఆరోగ్య ఉప కేంద్రాలకు గత ఆరేడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించడంలేదు. విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకూ నిధులు ఇవ్వడం లేదు. -
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కొందరు ఉన్నతాధికారులు వాటిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి మేలు చేయాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
జగన్ పాలనలో హిందువులపై ముప్పేట దాడి
‘జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి. -
అక్రమాల్లో బ‘కాసు’రుడు!
‘తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడమెలా?’ .. జగన్ను ఈ ప్రశ్న అడగాలని ప్రతిపక్షాలు సూచిస్తుంటాయి. తానూ తక్కువేం కాదంటున్నారో పల్నాడు ప్రజాప్రతినిధి. -
రాష్ట్రంలో ముస్లింలపై 107 సార్లు దాడులు
జగన్ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై 107 సార్లు దాడులు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. -
అంకెల గారడీ.. ‘అగ్ర’ పేదలకు బురిడీ
చూసి మురవ.. చెప్పుకొని ఏడువ.. అన్న చందంలా మారింది రాష్ట్రంలో అగ్రకులాల్లోని పేదల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి. -
నిర్మించే జీవితాలను ‘కూల్చేశారు’!
రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత! అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్ కొట్టిన రెండు చావు దెబ్బలు! ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం! -
సీఎం సభలో వడదెబ్బ.. వృద్ధుడి మృతి
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బకు బలైన సంఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. -
మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట
మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. -
ఎమ్మార్ కేసులో డిశ్ఛార్జి పిటిషన్ల కొట్టివేత
ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
దాల్మియాకు చుక్కెదురు
జగన్ అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న దాల్మియా సిమెంట్స్, పునీత్ దాల్మియాలకు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.