అన్నా.. సున్నా అంటే ఇంత భారమా?
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు.
డ్వాక్రా మహిళా సంఘాలకు జగన్ పచ్చిమోసం
రుణ విప్లవం తెస్తామని కుదేలుచేశారు
రూ.5 లక్షల రాయితీ కుదింపు
సంఘాలపై రూ.70 వేల కోట్లకు పైగా అప్పులు
ఈనాడు, అమరావతి
నరం లేని నాలుకలా వరాలు గుప్పించడం అవసరాలు తీరాక ఏమీ ఎరుగనట్లు నటించడం జగన్కు మాత్రమే సాధ్యం! సున్నా వడ్డీ రుణాలిస్తాం అంటూ ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళలను నమ్మించిన ఆయన అధికార పీఠం ఎక్కాక ఆ హామీని చుట్టచుట్టి అటకెక్కించారు. గత ప్రభుత్వ హయాంలో సున్నా వడ్డీకి ఉన్న పరిమితిని కుదించి డ్వాక్రా వనితల వెన్నువిరిచారు.
‘సున్నా వడ్డీకే రుణాల విప్లవం’ తీసుకొస్తానని డ్వాక్రా మహిళల ఓట్లు దండుకున్న జగన్.. అధికారంలోకి వచ్చాక తన టక్కుటమార విద్యలన్నింటినీ ప్రదర్శించారు. పథకాన్ని అమలు చేసినట్టు నటించి దాని వెనుక అలవిమాలిన కుయుక్తులు పన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన సున్నావడ్డీ రాయితీ పరిమితిని మరింత పెంచాల్సింది పోయి కుదించారు. డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులు తీసుకున్న రూ.5 లక్షల వరకు రుణాలకు అప్పట్లో సున్నావడ్డీ రాయితీ వర్తించేది. ఏదేని ఒక వర్గం తెదేపా ప్రభుత్వం ద్వారా లబ్ధిపొందిందంటే జగన్ కళ్లల్లో నిప్పులు కురుస్తాయి కదా..! డ్వాక్రా సంఘాల విషయంలోనూ ఇదే జరిగింది. ఆ సంఘాల సభ్యులకు మేలు చేయడం ఇష్టంలేని ఆయన సున్నా వడ్డీ రాయితీకి రుణ పరిమితిని రూ.3 లక్షలకు తగ్గించారు. తద్వారా మహిళల నెత్తిన భారీగా వడ్డీల భారం మోపారు. ఇలా డ్వాక్రా సంఘాల్ని కుదేలు చేయడమే జగన్ దృష్టిలో విప్లవమేమో..! పైగా ఈ పథకం గతంలోనే రద్దయినట్టు, తాను అధికారం చేపట్టిన తర్వాత దీనికి మళ్లీ పురుడుపోసినట్టు నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లెవేశారు.
రూ.2,100 కోట్ల బకాయిల ఎగవేత....
ఉమ్మడి రాష్ట్రంలో 2004-09 మధ్య అప్పటి ప్రభుత్వం డ్వాక్రా సంఘాల సభ్యులు తీసుకునే రుణానికి ‘పావలా వడ్డీ’ పథకాన్ని అమలుచేసింది. కిరణ్కుమార్రెడ్డి సీఎం అయ్యాక దాన్ని ‘సున్నా వడ్డీ’కి మార్చారు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలు తీసుకున్న రుణానికి రూ.5 లక్షల వరకు ‘సున్నా వడ్డీ’ని వర్తింపజేసింది. తెదేపా తన ఐదేళ్ల పాలనాకాలంలో డ్వాక్రా సంఘాల్లోని సభ్యులకు సున్నా వడ్డీ కింద రూ.2,836 కోట్ల వరకు రాయితీని అందించింది. కానీ, అప్పటికే అమలులో ఉన్న ‘సున్నా వడ్డీ’ రుణ సదుపాయాన్ని తానే కొత్తగా తీసుకొస్తున్నట్టుగా జగన్ తన మ్యానిఫెస్టోలో ప్రకటించడం గమనార్హం. వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చేనాటికి అప్పటి తెదేపా ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.2,100 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. మ్యానిఫెస్టోలో తానే కొత్తగా పెట్టినట్లు పథకాన్ని ప్రకటించిన జగన్.. అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిల చెల్లింపునకు తోకముడవడం శోచనీయం. సాధారణంగా ఏ ప్రభుత్వమైనా.. రాష్ట్రాభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం గత ప్రభుత్వాలు వెచ్చించిన మొత్తాలకు సంబంధించిన బకాయిలను చెల్లించడం పరిపాటి. కానీ, వైకాపా సర్కారు గత తెదేపా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న దుర్బుద్ధితో రూ.2,100 కోట్ల సున్నా వడ్డీ రాయితీ బకాయిలను చెల్లించకుండా మొండికేసింది. బకాయిల చెల్లింపునకు మనసు రాని జగన్.. 30 ఏళ్ల నుంచి వివిధ ప్రభుత్వాలు బడుగు, బలహీనవర్గాల ఇళ్ల కోసం ఇచ్చిన రుణాన్ని మాత్రం ఓటీఎస్ పేరుతో ముక్కుపిండి వసూలు చేశారు.
వడ్డీ అధికమవుతున్నా...
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి దాదాపుగా 9 లక్షల డ్వాక్రా మహిళా సంఘాలు ఉన్నాయి. వాటిలో కోటి మందికిపైగా సభ్యులు ఉన్నారు. వీరికి జీవనోపాధి కల్పించడానికి బ్యాంకు లింకేజీ రుణాలే కీలకం. గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఒక్కో డ్వాక్రా సంఘానికి బ్యాంకులు ఇచ్చే రుణ పరిమితి రూ.10 లక్షల వరకు ఉండేది. జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం అప్పట్లో అంతవరకే అనుమతి ఇచ్చింది. 2021లో దేశవ్యాప్తంగా ఈ నిబంధనల్ని సడలించింది. ఎలాంటి తనఖా లేకుండా డ్వాక్రా సంఘాలకు ఇచ్చే రుణ పరిమితిని రూ.20 లక్షలకు పెంచింది. రుణ పరిమితి పెరిగినప్పుడు సభ్యులపై వడ్డీ భారం అధికంగా ఉండటం సహజం. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సున్నా వడ్డీ రాయితీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకో, అంతకంటే ఎక్కువకో పెంచాలి. జగన్.. అలా చేయలేదు. వడ్డీల భారం తడిసిమోపెడై డ్వాక్రా మహిళలు విలవిల్లాడిపోయినా చూస్తూ రాక్షసత్వాన్ని ప్రదర్శించారేగానీ వడ్డీ రాయితీ పరిమితిని పెంచి, బకాయిలు చెల్లించి వారికి ఊరట కలిగించలేదు. ఇదీ.. సున్నా వడ్డీ పథకానికి జగన్ ‘సున్నా’ చుట్టిన తీరు!
ఆరు జిల్లాలకు 7% కేంద్రం రాయితీ
జాతీయ జీవనోపాధుల కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం గతం నుంచే దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని అమలుచేస్తోంది. దీని పరిధిలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. సంఘాలు రూ.3 లక్షలకు వరకు తీసుకున్న రుణానికి కేంద్రమే 7% వడ్డీని బ్యాంకులకే నేరుగా జమ చేస్తుంది. ఆయా జిల్లాల పరిధిలో రూ.3 లక్షలు తీసుకున్న ఒక్కో సంఘానికి బ్యాంకులు సరాసరి 11 శాతం వడ్డీని విధిస్తాయనుకుంటే.. అందులో కేంద్రమే 7% చెల్లిస్తుంది. మిగిలిన 4 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. మిగిలిన జిల్లాల్లో మాత్రం సంఘాల సభ్యులు రూ.20 లక్షల రుణ పరిమితి మించకుండా ఎంత రుణం తీసుకున్నా.. రూ.3 లక్షల వరకు రాష్ట్ర ప్రభుత్వమే వడ్డీ భారాన్ని భరిస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న రూ.3 లక్షల పరిమితినే వైకాపా ప్రభుత్వం ప్రాతిపదికగా తీసుకుని గతంలో అమలు అయిన రూ.5 లక్షల రాయితీ రుణ పరిమితిని తగ్గించింది. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం ఏటా విడుదల చేస్తున్న సున్నా వడ్డీ రాయితీలోనూ ఈ ఆరు జిల్లాల పరిధిలోని గ్రామీణ ప్రాంత సంఘాలకు సంబంధించి కేంద్రం వాటా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం సాయాన్ని ఎక్కడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
మహిళలపై రూ.70 వేల కోట్ల అప్పు
తెదేపా ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాలపై రూ.27 వేల కోట్లు అప్పులు ఉన్నాయని, ఆ సంఘాలను కుదేలు చేశారని ఎన్నికలకు ముందు జగన్ ఊరూరా ప్రచారం చేశారు. జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు(గత జనవరి వరకు) వారిపై అప్పు అక్షరాల రూ.70 వేల కోట్లకు చేరింది. ఆ తర్వాత కూడా డ్వాక్రా మహిళలు భారీగా రుణాలు తీసుకున్నారు. ఇదీ కాకుండా తెదేపా హయాంలో డ్వాక్రా రుణాలకు వర్తింపజేసిన సున్నా వడ్డీ రాయితీ పరిమితిని వైకాపా సర్కారు రూ.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు కుదించింది. జగన్ చేసిన ఈ నిర్వాకంతో డ్వాక్రా సంఘాల సభ్యులపై వడ్డీల భారం మరింత పెరిగింది. ఇలా ఉద్దేశపూర్వకంగా డ్వాక్రా సంఘాలను కుదేలు చేసిన జగన్.. ఇప్పుడు తాజాగా తన హయాంలో డ్వాక్రా సంఘాలు అద్భుతంగా ఉన్నాయంటూ కొత్తపల్లవి ఎత్తుకోవడం విడ్డూరం. తెదేపా ప్రభుత్వంతో పోలిస్తే జగన్ హయాంలో డ్వాక్రా సంఘాలపై అప్పు దాదాపు మూడు రెట్లు పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కొందరు ఉన్నతాధికారులు వాటిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి మేలు చేయాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!
ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలూపుతూ గత ఐదేళ్లుగా అడ్డగోలుగా అనుమతులిచ్చి వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోని ఒక అత్యున్నతాధికారి... ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ కూడా వైకాపాకు మేలు జరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. -
ఇంటికెళ్లిన వారు నగదు ఇవ్వలేరా?
ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది. -
పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. -
జగనన్న వస్తున్నారు... మిద్దెలపైకి నోఎంట్రీ!
సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు... ఆ ప్రాంతాల్లో ఆంక్షలకు అడ్డూ, అదుపు ఉండనే ఉండదు. చెట్లు నరికి వేయడం, విద్యుత్తు సరఫరా తొలగించడం, ట్రాఫిక్ను అడ్డగోలుగా ఆపేయడం ఇవి సర్వసాధారణం. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు
రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడులు.. ‘ఎదిరిస్తే హత్యలు’
వారానికి నాలుగు హత్యలు.. మూడు అత్యాచారాలు.. ఆరు హత్యాయత్నాలు.. రోజుకు ఇద్దరిపై దాడులు.. ఆరు దురాగతాలు... అమానవీయ శిరోముండనాలు... అంతమొందించి డోర్ డెలివరీలు... గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దుశ్చర్యలు వైకాపా జమానాలో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న అరాచకాల తీరిది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రికార్డు
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాజధాని గ్రామాల్లో భూసేకరణ ప్రకటన ఉపసంహరణ తగదు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. -
ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దెలు చెల్లించని సర్కారు
ఆరోగ్య ఉప కేంద్రాలకు గత ఆరేడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించడంలేదు. విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకూ నిధులు ఇవ్వడం లేదు. -
జగన్ పాలనలో హిందువులపై ముప్పేట దాడి
‘జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి. -
అక్రమాల్లో బ‘కాసు’రుడు!
‘తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడమెలా?’ .. జగన్ను ఈ ప్రశ్న అడగాలని ప్రతిపక్షాలు సూచిస్తుంటాయి. తానూ తక్కువేం కాదంటున్నారో పల్నాడు ప్రజాప్రతినిధి. -
రాష్ట్రంలో ముస్లింలపై 107 సార్లు దాడులు
జగన్ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై 107 సార్లు దాడులు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. -
అంకెల గారడీ.. ‘అగ్ర’ పేదలకు బురిడీ
చూసి మురవ.. చెప్పుకొని ఏడువ.. అన్న చందంలా మారింది రాష్ట్రంలో అగ్రకులాల్లోని పేదల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి. -
నిర్మించే జీవితాలను ‘కూల్చేశారు’!
రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత! అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్ కొట్టిన రెండు చావు దెబ్బలు! ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం! -
సీఎం సభలో వడదెబ్బ.. వృద్ధుడి మృతి
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బకు బలైన సంఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. -
మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట
మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. -
ఎమ్మార్ కేసులో డిశ్ఛార్జి పిటిషన్ల కొట్టివేత
ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
-
ఆఫ్లైన్లోనే గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష: టీఎస్పీఎస్సీ
-
ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్లేలో ఇకపై సన్ నెక్స్ట్..
-
మన ప్రేమలన్నీ శృంగారం కోసమే: పూరి జగన్నాథ్
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
లైంగిక దౌర్జన్యం కేసు - తొలిసారి స్పందించిన ప్రజ్వల్ రేవణ్ణ