కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది.
ఏలేరు పనులు ఎప్పటికి పూర్తయ్యేనో?
ఉప్పాడ రేవు.. అలాగే వదిలేశారెందుకు?
ఆగిన ఐటీ పరుగులు
కాకినాడలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు
ఈనాడు, కాకినాడ: ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. కాకినాడ జిల్లా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోతే ఉపయోగమేంటి? వాళ్లు మాత్రం ఎంత కాలమని ఎదురు చూస్తారు? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని నిలదీస్తే చెప్పుకునేందుకు మీ దగ్గర సమాధానం ఉందా ముఖ్యమంత్రిగారూ..? రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది అని మీరు చెప్పుకుంటూనే.. పొలాలు తడిపే ప్రాజెక్టులనే ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నారంటే రైతులపై మీకున్న ప్రేమ ఏపాటిదో ఊహించుకోవచ్చు. మత్స్యకారులపై మమకారం ఎలాంటిదో చేపల రేవు పనుల పురోగతిని చూస్తే అర్థం అవుతుంది. అవకాశం ఉన్న అన్ని విధాలుగా విధ్వంసం చేసి ఇప్పుడు కల్లబొల్లి మాటలతో మరోసారి మోసం చేయాలని చూస్తే ప్రజలు నమ్మేస్తారనే అనుకుంటున్నారా జగన్?
ఏలేరు ప్రాజెక్టు పనులు ఎప్పుడు?
‘కొంప కొల్లేరు చేస్తావా’ అన్న నానుడి గురించి జిల్లా ప్రజలకు అప్పట్లో అంతగా తెలిసి రాలేదు. సీఎం జగన్ దాన్ని మార్చేసి ‘కొంప ఏలేరు చేస్తావా’ అన్న కొత్త నానుడిని కాకినాడ జిల్లా ప్రజలకు పరిచయం చేశారు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జలాశయం ఆధునికీకరణ మిగులు పనులకు రూ.142 కోట్లు, రెండో దశ పనులకు రూ.150 కోట్లు ఇస్తున్నట్లు 2022 జులై 29న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జరిగిన ‘కాపునేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో సీఎం జగన్ ప్రకటించారు. ప్రాజెక్టు తొలిదశకు సంబంధించి గత తెదేపా ప్రభుత్వ హయాంలో పూర్తైన 52 శాతం పనులు మినహా.. జగన్ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఎలాంటి పురోగతీ లేదు. దీంతో గతంలో రూ.100 కోట్ల ఖర్చుతో చేసిన పనులు కూడా నిరుపయోగంగా మారాయి. మూడు దశాబ్దాల క్రితం రూ.15 కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.350 కోట్లకు చేరింది. ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు 2022 నవంబరు 4న గోకవరం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించినా నేటికీ పైసా కూడా ఎందుకు విదల్చలేదని రైతులు అడిగితే ఏం సమాధానం ఇస్తారు జగన్?
ఫిషింగ్ హార్బర్ కంటే ముఖ్యమైనది ఏది?
చేపల రేవు పూర్తయితే 2,500 పడవలు నిలిపే ఏర్పాటు.. 1.10 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద.. 50 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. ఇంత మందికి ప్రయోజనం కలిగించే ఉప్పాడలో రూ.422 కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కంటే ముఖ్యమైనది ఏముంటుంది? గత ఏడాది మార్చి నాటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా అవసరమైన నిధులు ఇవ్వలేదు. నిర్మాణ సంస్థకు 36 ఎకరాలకు గాను 28 ఎకరాలను మాత్రమే అప్పగిస్తే పనులు ఎలా పూర్తవుతాయి? 2020 నవంబరులో వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టునూ నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయలేకపోవడం మీ వైఫల్యం కాదా జగన్?
ఐటీ రంగానికి ప్రోత్సాహమేది!
గత ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడంతో జిల్లాలో ఐటీకి అడుగులు పడ్డాయి. అయిదేళ్లలో ఒక్క కొత్త ఐటీ సంస్థ కూడా కాకినాడ ముఖం చూడలేదు. అప్పట్లో వచ్చిన కంపెనీలు కూడా తరలిపోయే పరిస్థితి నెలకొంది. సర్పవరంలో ఐటీ కారిడార్ ఏర్పాటు అభివృద్ధి ప్రతిపాదన ఏమైంది జగన్? మౌలిక సదుపాయాలు సరిగా లేక సైయంట్ కంపెనీని కూడా నేడో రేపో తరలించే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది. అదొక్కటీ వెళ్లిపోతే ఇక ఐటీ జాడ లేకుండా పోతుంది.
ఊళ్లే కడతానంటే.. నిజమే అనుకున్నారు!
సీఎం గారూ మీకు గుర్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల పథకానికి అప్పట్లో కొత్తపల్లి మండలం కొమరగిరిలోనే శంకుస్థాపన చేశారు. ఇళ్లు కాదు.. ఊళ్లే కడతామని అప్పట్లో మీరు అంటే ప్రజలు అమాయకంగా నమ్మారు. అధికారంలో ఉండి అలా హామీలు ఇస్తుంటే నమ్మక తప్పలేదు. కాలనీలకు అనుసంధానంగా జనతా బజార్లు, క్లినిక్లు, పాఠశాల, పార్కులు.. ఇలా అన్నీ వచ్చేస్తాయంటే మరో ప్రపంచంలో విహరించారు. అయితే కాలనీల్లో చిన్న చినుకు పడితే చాలు ముంపు సమస్య వేధిస్తోంది. ఇవేనా మీరు కట్టే ఊళ్లు అని ప్రజలు నిలదీస్తే సమర్థించుకోగలరా?
ఈ హామీలకు.. మీరిచ్చే సమాధానమేంటి?
- కాండ్రకోట వద్ద డ్రాప్ కమ్ బెడ్ రెగ్యులేటర్ పునర్నిర్మాణానికి రూ.6 కోట్లతో పనులు చేపడతామన్న హామీ గుర్తుందా జగన్? నిధుల కోసం అధికారులు తిరిగితిరిగి వేసారి దస్త్రాన్ని పక్కన పడేశారు. నిధులు ఇవ్వలేకపోయానంటూ జిల్లా ప్రజల ముందు అంగీకరించే ధైర్యం మీకుందా?
- కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని కాండ్రకోట- తూర్పుపాకలకు వెళ్లే మార్గంలో శిథిలమైన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లు ఇస్తే రైతులు పడుతున్న బాధలు తప్పేవి. వంతెన కడితే వ్యవసాయ పనులకు వెళ్లడానికి 8 కి.మీ.ల దూరం తగ్గుతుందని ఆశపడిన రైతులకు ఎదురుచూపులే మిగిలాయి?
- సామర్లకోటలో జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా మార్చేందుకు రూ.18 కోట్లు మంజూరు చేసే విషయం ఏమైందనే ప్రశ్న విద్యార్థుల నుంచి వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?