కాకినాడకు..ఉత్తుత్తి హామీలేనా జగన్?
ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది.
ఏలేరు పనులు ఎప్పటికి పూర్తయ్యేనో?
ఉప్పాడ రేవు.. అలాగే వదిలేశారెందుకు?
ఆగిన ఐటీ పరుగులు
కాకినాడలో సీఎం జగన్ బస్సు యాత్ర నేడు
ఈనాడు, కాకినాడ: ముఖ్యమంత్రి హోదాలో హామీ ఇచ్చారంటే నెరవేరుతుందని భావించే ప్రజలను ఎంత సులువుగా మోసం చేయవచ్చో సీఎం జగన్ మాటలు చూస్తే అర్థం అవుతుంది. కాకినాడ జిల్లా ప్రజలకు అనేక హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకపోతే ఉపయోగమేంటి? వాళ్లు మాత్రం ఎంత కాలమని ఎదురు చూస్తారు? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదని నిలదీస్తే చెప్పుకునేందుకు మీ దగ్గర సమాధానం ఉందా ముఖ్యమంత్రిగారూ..? రైతులకు మేలు చేసే ప్రభుత్వం మాది అని మీరు చెప్పుకుంటూనే.. పొలాలు తడిపే ప్రాజెక్టులనే ముందుకు కదలకుండా అడ్డుపడుతున్నారంటే రైతులపై మీకున్న ప్రేమ ఏపాటిదో ఊహించుకోవచ్చు. మత్స్యకారులపై మమకారం ఎలాంటిదో చేపల రేవు పనుల పురోగతిని చూస్తే అర్థం అవుతుంది. అవకాశం ఉన్న అన్ని విధాలుగా విధ్వంసం చేసి ఇప్పుడు కల్లబొల్లి మాటలతో మరోసారి మోసం చేయాలని చూస్తే ప్రజలు నమ్మేస్తారనే అనుకుంటున్నారా జగన్?
ఏలేరు ప్రాజెక్టు పనులు ఎప్పుడు?
‘కొంప కొల్లేరు చేస్తావా’ అన్న నానుడి గురించి జిల్లా ప్రజలకు అప్పట్లో అంతగా తెలిసి రాలేదు. సీఎం జగన్ దాన్ని మార్చేసి ‘కొంప ఏలేరు చేస్తావా’ అన్న కొత్త నానుడిని కాకినాడ జిల్లా ప్రజలకు పరిచయం చేశారు. ఏలేరు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. జలాశయం ఆధునికీకరణ మిగులు పనులకు రూ.142 కోట్లు, రెండో దశ పనులకు రూ.150 కోట్లు ఇస్తున్నట్లు 2022 జులై 29న పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో జరిగిన ‘కాపునేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో సీఎం జగన్ ప్రకటించారు. ప్రాజెక్టు తొలిదశకు సంబంధించి గత తెదేపా ప్రభుత్వ హయాంలో పూర్తైన 52 శాతం పనులు మినహా.. జగన్ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో ఎలాంటి పురోగతీ లేదు. దీంతో గతంలో రూ.100 కోట్ల ఖర్చుతో చేసిన పనులు కూడా నిరుపయోగంగా మారాయి. మూడు దశాబ్దాల క్రితం రూ.15 కోట్ల అంచనాతో చేపట్టిన ప్రాజెక్టు వ్యయం ప్రస్తుతం రూ.350 కోట్లకు చేరింది. ప్రాజెక్టు కుడి కాలువ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు 2022 నవంబరు 4న గోకవరం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రకటించినా నేటికీ పైసా కూడా ఎందుకు విదల్చలేదని రైతులు అడిగితే ఏం సమాధానం ఇస్తారు జగన్?
ఫిషింగ్ హార్బర్ కంటే ముఖ్యమైనది ఏది?
చేపల రేవు పూర్తయితే 2,500 పడవలు నిలిపే ఏర్పాటు.. 1.10 లక్షల మెట్రిక్ టన్నుల మత్స్య సంపద.. 50 వేల మత్స్యకార కుటుంబాలకు ఉపాధి దొరుకుతుంది. ఇంత మందికి ప్రయోజనం కలిగించే ఉప్పాడలో రూ.422 కోట్లతో చేపట్టిన ఫిషింగ్ హార్బర్ నిర్మాణం కంటే ముఖ్యమైనది ఏముంటుంది? గత ఏడాది మార్చి నాటికే నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా అవసరమైన నిధులు ఇవ్వలేదు. నిర్మాణ సంస్థకు 36 ఎకరాలకు గాను 28 ఎకరాలను మాత్రమే అప్పగిస్తే పనులు ఎలా పూర్తవుతాయి? 2020 నవంబరులో వర్చువల్గా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టునూ నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయలేకపోవడం మీ వైఫల్యం కాదా జగన్?
ఐటీ రంగానికి ప్రోత్సాహమేది!
గత ప్రభుత్వం ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ అభివృద్ధిని ప్రోత్సహించడంతో జిల్లాలో ఐటీకి అడుగులు పడ్డాయి. అయిదేళ్లలో ఒక్క కొత్త ఐటీ సంస్థ కూడా కాకినాడ ముఖం చూడలేదు. అప్పట్లో వచ్చిన కంపెనీలు కూడా తరలిపోయే పరిస్థితి నెలకొంది. సర్పవరంలో ఐటీ కారిడార్ ఏర్పాటు అభివృద్ధి ప్రతిపాదన ఏమైంది జగన్? మౌలిక సదుపాయాలు సరిగా లేక సైయంట్ కంపెనీని కూడా నేడో రేపో తరలించే ప్రతిపాదన ఉందని తెలుస్తోంది. అదొక్కటీ వెళ్లిపోతే ఇక ఐటీ జాడ లేకుండా పోతుంది.
ఊళ్లే కడతానంటే.. నిజమే అనుకున్నారు!
సీఎం గారూ మీకు గుర్తుందా? రాష్ట్ర వ్యాప్తంగా పేదల ఇళ్ల పథకానికి అప్పట్లో కొత్తపల్లి మండలం కొమరగిరిలోనే శంకుస్థాపన చేశారు. ఇళ్లు కాదు.. ఊళ్లే కడతామని అప్పట్లో మీరు అంటే ప్రజలు అమాయకంగా నమ్మారు. అధికారంలో ఉండి అలా హామీలు ఇస్తుంటే నమ్మక తప్పలేదు. కాలనీలకు అనుసంధానంగా జనతా బజార్లు, క్లినిక్లు, పాఠశాల, పార్కులు.. ఇలా అన్నీ వచ్చేస్తాయంటే మరో ప్రపంచంలో విహరించారు. అయితే కాలనీల్లో చిన్న చినుకు పడితే చాలు ముంపు సమస్య వేధిస్తోంది. ఇవేనా మీరు కట్టే ఊళ్లు అని ప్రజలు నిలదీస్తే సమర్థించుకోగలరా?
ఈ హామీలకు.. మీరిచ్చే సమాధానమేంటి?
- కాండ్రకోట వద్ద డ్రాప్ కమ్ బెడ్ రెగ్యులేటర్ పునర్నిర్మాణానికి రూ.6 కోట్లతో పనులు చేపడతామన్న హామీ గుర్తుందా జగన్? నిధుల కోసం అధికారులు తిరిగితిరిగి వేసారి దస్త్రాన్ని పక్కన పడేశారు. నిధులు ఇవ్వలేకపోయానంటూ జిల్లా ప్రజల ముందు అంగీకరించే ధైర్యం మీకుందా?
- కాకినాడ జిల్లా పెద్దాపురం మండలంలోని కాండ్రకోట- తూర్పుపాకలకు వెళ్లే మార్గంలో శిథిలమైన హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్లు ఇస్తే రైతులు పడుతున్న బాధలు తప్పేవి. వంతెన కడితే వ్యవసాయ పనులకు వెళ్లడానికి 8 కి.మీ.ల దూరం తగ్గుతుందని ఆశపడిన రైతులకు ఎదురుచూపులే మిగిలాయి?
- సామర్లకోటలో జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాలగా మార్చేందుకు రూ.18 కోట్లు మంజూరు చేసే విషయం ఏమైందనే ప్రశ్న విద్యార్థుల నుంచి వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత సీట్లంటూ తాయిలం
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కొందరు ఉన్నతాధికారులు వాటిని ఉల్లంఘిస్తూ అధికార పార్టీకి మేలు చేయాలని చూడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
వసూల్ రాజాలు.. ఎన్నికలొచ్చాయని వెనక్కి తగ్గారు!
ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టల్లా తలూపుతూ గత ఐదేళ్లుగా అడ్డగోలుగా అనుమతులిచ్చి వారి ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా పని చేసిన పురపాలక, పట్టణాభివృద్ధిశాఖలోని ఒక అత్యున్నతాధికారి... ఎన్నికల కోడ్ అమలులో ఉన్న వేళ కూడా వైకాపాకు మేలు జరిగేలా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. -
ఇంటికెళ్లిన వారు నగదు ఇవ్వలేరా?
ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది. -
పట్టాభిషిక్తుడైన చివరిరాజు.. దానకర్ణుడు.. పీవీజీ
మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డాక్టర్ పీవీజీ రాజు శతజయంతి ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. -
జగనన్న వస్తున్నారు... మిద్దెలపైకి నోఎంట్రీ!
సీఎం జగన్ పర్యటన ఉందంటే చాలు... ఆ ప్రాంతాల్లో ఆంక్షలకు అడ్డూ, అదుపు ఉండనే ఉండదు. చెట్లు నరికి వేయడం, విద్యుత్తు సరఫరా తొలగించడం, ట్రాఫిక్ను అడ్డగోలుగా ఆపేయడం ఇవి సర్వసాధారణం. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
బకాయిలు కళ్ల చూడకుండానే చనిపోతున్నారు
రెండో ప్రపంచయుద్ధం తర్వాత మొదటిసారి జగన్ ప్రభుత్వ హయాంలోనే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు తగ్గించారని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ అధ్యక్షుడు సుబ్బరాయన్ తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడులు.. ‘ఎదిరిస్తే హత్యలు’
వారానికి నాలుగు హత్యలు.. మూడు అత్యాచారాలు.. ఆరు హత్యాయత్నాలు.. రోజుకు ఇద్దరిపై దాడులు.. ఆరు దురాగతాలు... అమానవీయ శిరోముండనాలు... అంతమొందించి డోర్ డెలివరీలు... గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని దుశ్చర్యలు వైకాపా జమానాలో ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో దళితులపై జరుగుతున్న అరాచకాల తీరిది. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రికార్డు
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు రోజుకో రికార్డు సృష్టిస్తున్నాయి. ఏప్రిల్లో 46 డిగ్రీలు నమోదు కావడమే అరుదనుకుంటే మంగళవారం అత్యధికంగా కర్నూలు జిల్లా జి.సింగవరంలో గరిష్ఠంగా 46.4 డిగ్రీలు, నంద్యాల జిల్లా గోస్పాడులో 46.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాజధాని గ్రామాల్లో భూసేకరణ ప్రకటన ఉపసంహరణ తగదు
రాజధాని అమరావతి పరిధిలోని వివిధ గ్రామాల్లో భూసేకరణ ప్రకటనను ఉపసంహరిస్తూ గుంటూరు జిల్లా కలెక్టర్ ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇచ్చిన నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. -
ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దెలు చెల్లించని సర్కారు
ఆరోగ్య ఉప కేంద్రాలకు గత ఆరేడు నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం అద్దె చెల్లించడంలేదు. విద్యుత్తు ఛార్జీల చెల్లింపులకూ నిధులు ఇవ్వడం లేదు. -
జగన్ పాలనలో హిందువులపై ముప్పేట దాడి
‘జగన్ అయిదేళ్ల పాలనలో రాష్ట్రంలోని హిందువులపై ముప్పేట దాడి జరిగింది. ఆలయాలను కూల్చేశారు. విగ్రహాలను పగులగొట్టారు. అర్చకులపై దౌర్జన్యాలు పెరిగాయి. -
అక్రమాల్లో బ‘కాసు’రుడు!
‘తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించడమెలా?’ .. జగన్ను ఈ ప్రశ్న అడగాలని ప్రతిపక్షాలు సూచిస్తుంటాయి. తానూ తక్కువేం కాదంటున్నారో పల్నాడు ప్రజాప్రతినిధి. -
రాష్ట్రంలో ముస్లింలపై 107 సార్లు దాడులు
జగన్ పాలనలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముస్లింలపై 107 సార్లు దాడులు జరిగాయని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షిబ్లీ అన్నారు. -
అంకెల గారడీ.. ‘అగ్ర’ పేదలకు బురిడీ
చూసి మురవ.. చెప్పుకొని ఏడువ.. అన్న చందంలా మారింది రాష్ట్రంలో అగ్రకులాల్లోని పేదల కోసం జగన్ ఏర్పాటుచేసిన కార్పొరేషన్ల పరిస్థితి. -
నిర్మించే జీవితాలను ‘కూల్చేశారు’!
రాజధాని నిర్మాణం నిలిపివేత... ఉచిత ఇసుక విధానం ఎత్తివేత! అధికారంలోకి వచ్చీ రావడంతోనే భవన నిర్మాణ కార్మికులను జగన్ కొట్టిన రెండు చావు దెబ్బలు! ఒకవైపు నిర్మాణాలు నిలిచిపోయి... ఇంకోవైపు మరో పనికి వెళ్లలేక... ప్రభుత్వం నుంచి సాయం అందక... ఐదేళ్లుగా వేల కుటుంబాలు అనుభవిస్తున్న బాధలు వర్ణనాతీతం! -
సీఎం సభలో వడదెబ్బ.. వృద్ధుడి మృతి
సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభకు వచ్చిన ఓ వ్యక్తి వడదెబ్బకు బలైన సంఘటన వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో చోటుచేసుకుంది. -
మాజీ సీఎం కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట
మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట భాజపా ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. -
ఎమ్మార్ కేసులో డిశ్ఛార్జి పిటిషన్ల కొట్టివేత
ఎమ్మార్ వ్యవహారంలో సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లను కొట్టివేస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెరపైకి రజనీకాంత్ జీవితం.. హీరోగా ఎవరంటే!
-
‘హార్దిక్ దృఢంగా ఉండు.. విమర్శించిన వాళ్లే నిన్ను ప్రశంసించే రోజు వస్తుంది’
-
యాంపియర్ నుంచి విద్యుత్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్తో 136 km
-
ఉత్తమ బాలనటిగా సుకుమార్ కుమార్తె.. ఏ చిత్రానికంటే?
-
ఆ శాస్త్రవేత్త ఆందోళనకు దిగొచ్చిన చైనా సర్కారు
-
అది దేవెగౌడ ప్లానే..: సీఎం సిద్ధరామయ్య