నాడు అప్పుల ‘నగరి’.. నేడు సిరుల ఝరి!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది.
చిత్తూరులో సెలెబ్రిటీ ప్రజాప్రతినిధి దోపిడీ పర్వమిదీ..
భర్త, సోదరులకు మండలాల వారీగా బాధ్యతల అప్పగింత
మట్టి, ఇసుక అక్రమ రవాణాతో రూ.కోట్లు దండుకున్న వైనం
అప్పుల నుంచి పుట్టినరోజున బెంజ్ కొనే స్థాయికి ఎదిగిన తీరు..
ఈనాడు, అమరావతి
ఆమె పేరు వినగానే.. ప్రతిపక్షనేతలేమో ‘ఆ నోటికి ఎదురెళ్లలేం బాబోయ్..’ అనీ.. రియల్ ఎస్టేట్ వ్యాపారులైతే ‘కప్పం కట్టలేక చస్తున్నాం’ అనీ.. కొండలకే మాటలొస్తే ‘కుళ్లబొడుస్తూ గుల్ల చేస్తున్నారు’ అనీ.. నదులేమో ‘ఇసుకను తోడేస్తూ కొల్లగొట్టేస్తున్నారు’ అనీ.. స్థానిక నేతలేమో ‘మేమూ ముడుపులు చెల్లించాల్సి వస్తోంది’ అనీ.. ..గగ్గోలు పెట్టేలా ఉంటుందా మహానటి తీరు. రాజకీయాల్లోనూ సెలెబ్రిటీగా భావిస్తుంటారు. ఒకప్పుడు అప్పుల్లో మునిగిన ఆమె ఇప్పుడు కోట్లకు పడగలెత్తారు. జగనన్నా... అంటూ అవినీతి, అక్రమాల్లో ఆయన్నే స్ఫూర్తిగా తీసుకున్నారు!
చలనచిత్ర రంగంలోనే కాదు.. ఉమ్మడి చిత్తూరు జిల్లాతోపాటు రాష్ట్ర రాజకీయ ‘సినిమా’లోనూ ఆమెకో గుర్తింపు ఉంది. రెండోసారి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా విజయం సాధించారు. కానీ, ఆ వైకాపా ప్రజాప్రతినిధికి నోటి దురుసు కాస్త అనడం కంటే ఎక్కువ అనడమే సబబేమో! ప్రతిపక్ష నేతలపై ఇష్టమొచ్చినట్లు విరుచుకుపడే ఫైర్ బ్రాండ్. అందుకే ఆమె పేరు చెబితేనే.. ‘వామ్మో.. ఆ నోటికి ఎదురెళ్లగలమా?’ అంటూ అధికార పార్టీ వారూ ఉలిక్కిపడతారు. అప్పట్లో సినిమాల్లో, ఇప్పట్లో టీవీ కార్యక్రమాల్లో మెరిసినా.. రెండుసార్లు ప్రజాప్రతినిధిగా పనిచేసే అవకాశాన్ని ప్రజలు ఇచ్చినా.. వెనకబడిన నియోజకవర్గాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదనే విమర్శను మూటగట్టుకున్నారు. అసభ్య పదజాలాన్నీ నిరభ్యంతరంగా వినియోగించడంలో ముందుండే ఈ నేతకు.. అయిదేళ్ల కిందట ఎటు చూసినా అప్పులే. 2019 ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రావడంతో ఆమె జాతకం మారిపోయింది. అనతి కాలంలోనే రూ.వందల కోట్ల ఆస్తులను కూడబెట్టారు.
నియోజకవర్గాన్ని ప్రజలంతా ఆమెకు రాసిచ్చారని అనుకున్నారేమో.. రాష్ట్రస్థాయి పదవి దక్కడంతో దాన్ని అడ్డుపెట్టుకుని దోపిడీకి రాచబాటలు వేశారు. మండలాలు, పురపాలక సంఘం లెక్కన భర్త, సోదరులకు ధారాదత్తం చేశారు. కొండల్ని పిండి చేసి మట్టిని, నదుల నుంచి తోడేసి ఇసుకను తరలించి రూ.కోట్లలో ఆర్జించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన అసభ్య వ్యాఖ్యలతో శాసనసభ పవిత్రతనూ మంటగలిపిన ఘనతను మూటగట్టుకున్నారు. సీఎం సహాయనిధి కింద ఇచ్చే చెక్కుల్నీ ఈ ప్రజాప్రతినిధి వదల్లేదు. అప్పలాయగుంటలో సహాయనిధి కింద రూ.3లక్షలు వస్తే, అది ఇచ్చేందుకు రూ.35వేలు వసూలు చేశారు.
డబ్బు ఇవ్వనిదే చెక్కు బాధితుల చేతికి ఇవ్వలేదంటే ఆమె అరాచకం ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో దొరికినచోటల్లా అక్రమాలకు పాల్పడి.. అనతి కాలంలోనే హైదరాబాద్, తిరుపతి, అమరావతి, బెంగళూరు, చెన్నైలలో ఇళ్లు, స్థలాలు, భూములను వెనకేసుకున్నారు. గతంలో అంతా నష్టపోయి అప్పుల్లో మునిగిన ఆమె.. ఇటీవల పుట్టినరోజు సందర్భంగా బెంజ్ కొనే స్థాయికి ఎదిగిన తీరు చూసిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఆ చిత్రాలు సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అయ్యాయి.
భూసేకరణ పేరుతో.. భారీ దోపిడీ
వైకాపా నుంచి ఈ సెలెబ్రిటీ రెండోసారి ప్రజాప్రతినిధి అయ్యాక.. ప్రతి పనికీ వసూలు చేసే విధానంతో భారీగా దండుకున్నారు. ఆమె దోపిడీపై ప్రజల్లోనే తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తింది. తనకు వ్యతిరేకంగా మాట్లాడే సొంత పార్టీ నేతలనే దూరంగా పెట్టారు. పాదిరేడు అరణ్యం, విజయపురంలోని కోసలనగరంలో పారిశ్రామిక వాడలు తీసుకొస్తామని భూములు సేకరించి.. రూ.కోట్లలో అక్రమాలకు పాల్పడ్డారు. విజయపురంలో తన అనుచరుల పేరుతో భూములకు నకిలీ పట్టాలు సృష్టించి.. ఆ తర్వాత వాటిని ఏపీఐఐసీకి అప్పగించి రూ.కోట్లు మింగేశారు. ఇదొక్కటే కాదు.. రాష్ట్రస్థాయిలో చాలా చోట్ల ఏపీఐఐసీ ద్వారా జరిగిన భూసేకరణలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి-చెన్నై రహదారిపై ఎస్వీపురం టోల్ప్లాజా సమీపంలోని భూదానోద్యమ భూమికి ప్రభుత్వం నుంచి ఎన్వోసీ ఇప్పించేందుకు భారీగా ప్రయోజనం పొందినట్లు తెలిసింది.
సోదరులొకవైపు.. భర్త మరో వైపు..
మండలాల వారీగా వసూళ్ల బాధ్యతల్ని భర్త, సోదరులకు అప్పగించారామె. తమ పరిధిలోని మండలాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కడైనా కొత్త వెంచర్ వేశారంటే.. ఈ బంధు గణానికి కప్పం గట్టాల్సిందే. పుత్తూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన ఓ మాజీ ప్రతినిధికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆపివేయించి.. ఆ తర్వాత ముడుపులతో సర్దుబాటు చేసుకున్నారు. లెక్కలు తేలకపోవడంతో పుత్తూరు సమీపంలో తిరుపతి-చెన్నై జాతీయ రహదారి పక్కనే ఉన్న మరో భూమికి సంబంధించి రిజిస్ట్రేషన్ నిలిపేయించారు. అంజేరమ్మ కనుమ వద్ద తుడా లేఅవుట్ పక్కనే డి.పట్టా భూముల కొనుగోలు వ్యవహారంలోనూ ప్రజాప్రతినిధి సోదరుడి ప్రమేయం ఉందని చెబుతుంటారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఆమె అనుచరులు సాగించే రేషన్ బియ్యం దందా అంతా ఇంతా కాదు. క్షేత్రస్థాయి నుంచి సేకరించిన బియ్యాన్ని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు తరలించి రూ.కోట్లు గడిస్తున్నారు.
ప్రకృతి వనరులను కొట్టి.. రూ.కోట్లు కూడబెట్టి..
విజయపురం మండలంలోని మహారాజపురం తదితర ప్రాంతాల్లో కొంత విస్తీర్ణంలో తవ్వకాలకు గ్రావెల్ క్వారీకి అనుమతి తీసుకుని.. అనధికారికంగా పెద్ద మొత్తంలో తవ్వేశారు. ఒక్క విజయపురం ప్రాంతం నుంచే తమిళనాడుకు రోజుకు 300 ట్రిప్పుల గ్రావెల్ను తరలించారు. బినామీ పేర్లతో అనుమతులు తీసుకొని చెన్నైలో విక్రయించారు. ఒక్కో లారీకి రూ.20వేల వరకు వసూలు చేశారు. అన్ని ఖర్చులు పోను రోజుకు
రూ.2 లక్షల మేర వెనకేసుకున్నారు. వడమాలపేట మండలంలోని అప్పలాయగుంట, అంజేరమ్మ కనుమ వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టలను పిప్పి చేశారు. ఆ రాళ్లు, మట్టిని పూతలపట్టు-నాయుడుపేట రోడ్డు పనులు చేపడుతున్న గుత్తేదారులకు తరలించి భారీ ఎత్తున ఆర్జించారు. మండలాల్లోని చిన్నాచితకా నాయకులు కూడా ప్రజాప్రతినిధి సోదరులకు కప్పం కట్టాల్సిందే. కంకర, గ్రానైట్ క్వారీల యజమానుల నుంచి నెలవారీ మూమూళ్లు వసూలు చేయడంతోపాటు అధికారుల బదిలీల్లోను చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు వెనకేసుకున్నారు. నగరి నుంచి విజయపురం మండలంలోని కేవీ శ్రీరామపురం వరకు కుశస్థలి నదీ పరివాహక ప్రాంతంలో ఇసుకను అక్రమంగా తవ్వేసి తమిళనాడుకు తరలించారు. అలా ఒక్కో లారీ ఇసుకకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకు వసూలు చేసి భారీగా లబ్ధి పొందారు.
పోస్టుకో రేటు
విద్యుత్తు సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ ఒక్కో పోస్టును రూ.10లక్షల నుంచి రూ.15లక్షలకు అమ్ముకున్నారు. ఆఖరికి అంగన్వాడీ సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తల నియామకంలోనూ ఆమె చేతివాటం ప్రదర్శించారు. పుత్తూరు మున్సిపల్ ఛైర్పర్సన్గా అవకాశం ఇస్తామని చెప్పి ఏకంగా రూ.53లక్షలు వసూలు చేసి చివరకు మోసం చేశారని ఓ మహిళ మీడియా సమక్షంలోనే వాపోయింది. విషయం బయటకు పొక్కడంతో రూ.13 లక్షలు తిరిగిచ్చారు. మిగిలిన సొమ్ము ఇవ్వకపోగా.. పోలీసులతో బాధితురాలిని బెదిరించడం గమనార్హం.
ట్రస్టు పేరుతో దోపిడీ
ఈ ప్రజాప్రతినిధి తన పేరుతో ఓ ట్రస్టును ఏర్పాటు చేశారు. దాని పేరిట ఆమె చేపట్టే సేవా కార్యక్రమాలేంటో ఎవరికీ తెలియదు. దానికి రిజిస్ట్రేషన్ ఉందో లేదో కూడా అంతుచిక్కని రహస్యమే. రాష్ట్రస్థాయి ముఖ్య పదవిలో నియమితులయ్యాక.. విశాఖపట్నంలోనే భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టారు. పుత్తూరు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్ట కుంగిపోవడంతో తాత్కాలికంగా పనులు చేపట్టాలని అప్పటి కలెక్టర్ ఆదేశించారు. దీంతో మున్సిపల్ సాధారణ నిధులు రూ.42 లక్షలు ఖర్చు చేశారు. చేసిన పనుల విలువ రూ.5లక్షలు కూడా లేదనీ, తాను బిల్లు చేయలేనని డీఈ ససేమిరా అనడంతో ఆయన్ను బదిలీ చేయించారు. తర్వాత వచ్చిన అధికారితో బిల్లులు చేయించుకున్నారామె.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.