ఆయనే ఓ విపత్తు!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది.
ఐదేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులను విస్మరించిన సీఎం
ఆనకట్టల నిర్వహణలో అడుగడుగునా నిర్లక్ష్యం
ఫలితంగా తొమ్మిదిసార్లు అనూహ్య దుర్ఘటనలు
జలాశయాల విధ్వంస రచనలో జగన్ది చెరిగిపోని రికార్డు
ఈనాడు, అమరావతి
మీటలు నొక్కే మాటల సారు... చెప్పనివీ చేశానంటూ బాకాలు ఊదుతారు! అత్యవసర పనులను మాత్రం వదిలేశారు... ఆంధ్రావనిని అన్నపూర్ణగా మార్చిన... ఆకలిగొన్న కడుపులకు పట్టెడన్నం పెట్టిన... అమూల్యమైన ఆనకట్టలను గాలికొదిలేశారు... గ్రీజు పూయలేదు... సిమెంటు రుద్దనూలేదు! వరదలొస్తాయని తెలిసీ గురక పెట్టారు... డ్యాంలు కొట్టుకుపోయినా... జనం అసువులు బాసినా...ఆయన బాధపడలేదు... బాధ్యత వహించలేదు!!
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్లో సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసమే సాగింది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణం దేవుడెరుగు ఉన్నవాటి నిర్వహణకు నిధులివ్వక ఏకంగా ఆనకట్టలే కొట్టుకుపోయాయి. నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచి... కృత్రిమ విపత్తుల్లో రికార్డు సృష్టించారాయన.విపత్తులు సంభవిస్తే ఒక నాయకుడు ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించాలి. ప్రాణ, ధననష్టం అతి తక్కువగా వాటిల్లేలా చూడాలి. ఈ ఐదేళ్ల పాలనలో ఆయనే ఒక విపత్తుగా మారిన భయాందోళన పరిస్థితులు రాష్ట్రానికి దాపురించాయి. ఇందుకు ప్రజల కళ్లముందే సంభవించిన దుర్ఘటనలు సాక్ష్యాలుగా నిలిచాయి.
ముందు చూపా... ఠాట్ అదెందుకు...?
వాతావరణ శాఖ, కేంద్ర జల సంఘం, కేంద్ర ప్రభుత్వం అందించే సమాచారం ఆధారంగా జగన్ సర్కారు స్పందించి... విపత్తు నిర్వహణపై ఏనాడూ దృష్టి పెట్టిన పాపాన పోలేదు. సాగునీటి రంగంలో ఎక్కడ... ఏ అధికారిని నియమించుకోవాలి... ఏ ప్రాజెక్టు నిర్వహణలో ఎవరికి అనుభవముందన్న పరిశీలన జరగలేదు. వరదల సమయంలో డ్యాంల నిర్వహణ తెలియని, ఏ కాలువలోకి ఎంత పరిమాణంలో నీటిని వదలాలో కూడా అవగాహన లేని ‘‘తన’’ వాళ్లకు ఇష్టారాజ్యంగా పదవులు కట్టబెట్టి... రాష్ట్ర ప్రజలకు చేతులారా కష్టాలు కొనితెచ్చిన పాలకుడిని ఏమనాలి? అలాంటి వారి పాలనలో ఏం జరుగుతుంది...? అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట కొట్టుకుపోయి 39 మంది ప్రాణాలు కోల్పోయారు. డ్యాం దిగువనున్న గ్రామంలో కొందరు అనుభవజ్ఞులు.... వందల మంది ప్రజలను అప్రమత్తం చేసి కొండలు, గుట్టలు ఎక్కించి వారి ప్రాణాలను కాపాడారు. విపత్తును ఊహించినా... జగన్ నాయకత్వంలో పనిచేస్తున్న అధికారులు మాత్రం చేష్టలుడిగి చూశారు.
ఇవీ జగన్ సృష్టించిన కృత్రిమ విపత్తులు
- 2020లో కృష్ణా నదికి వచ్చిన వరదను ఏపీలో సరిగ్గా నిర్వహించని ఫలితంగా ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 51 గ్రామాలు మునిగిపోయి వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ (అతి భారీ వర్షాలు) ఉందని వాతావరణ శాఖ హెచ్చరించినా, అక్కడి నీరంతా నది నుంచి దిగువకే వస్తుందని తెలిసినా... ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు.
- 2020 ఆగస్టు, 2021 సెప్టెంబరు నెలల్లో శ్రీశైలం జలాశయం నిర్వహణ తీరుపైనా తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ రెండేళ్లలోనూ క్రస్ట్ గేట్లపై నుంచి నీరు పొంగి పొర్లింది.
- 2020లో వచ్చిన భారీ వరదలకు పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ ధ్వంసమైంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఎగువ కాఫర్డ్యాంలోని గ్యాప్లను సకాలంలో పూడ్చకపోవడమే ఇందుకు కారణం. దాంతో డయాఫ్రం వాల్ను మళ్లీ రూ.వందల కోట్లు వెచ్చించి కొత్తగా నిర్మించాల్సి వచ్చింది.
- 2021 ఆగస్టు 5న పులిచింతల ప్రాజెక్టులో 16వ నంబరు గేటు కొట్టుకుపోయింది. టైప్లాట్లు పూర్తిగా తెగిపోయాయి. అప్పటికి రెండేళ్లుగా గేట్ల నిర్వహణను పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని నిపుణులు తేల్చారు.
- 2021లోనే భారీ వర్షాలకు పింఛా ప్రాజెక్టు మట్టికట్ట కూడా కొట్టుకుపోయింది.
- 2021లో అన్నమయ్య జలాశయం మట్టి డ్యాం కొట్టుకుపోయి, 39 మంది చనిపోయారు. ఇళ్లు మునిగి, వందల కుటుంబాలు ఆశ్రయం కోల్పోయాయి. ప్రాజెక్టు గేట్లు సరిగా పనిచేయడం లేదని తెలిసినా వాటిని బాగు చేయడానికి వైకాపా సర్కారు నిధులు ఇవ్వలేదు. భారీ వరదపై సమాచారమున్నా గేట్లు ఎత్తడంలో నిర్లక్ష్యం చేశారు.
- 2022 ఆగస్టు 31 రాత్రి గుండ్లకమ్మలో మూడో నంబరు గేటు కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నిర్వహణ, మరమ్మతుల కోసం రూ.3 కోట్లు కావాలని ప్రతిపాదించినా... జగన్ సర్కారు స్పందించకనే ఈ పరిస్థితి ఎదురైంది.
- 2023 డిసెంబరు 8న రాత్రి గుండ్లకమ్మ ప్రాజెక్టులో గేటు రెండోసారి కొట్టుకుపోయింది. అంతకుముందే కొట్టుకుపోయిన గేటును కూడా జగన్ సర్కారు మళ్లీ బిగించకలేకపోయింది.
- ‘పోలవరం’లో నిర్మించిన గైడ్బండ్ 2023 ఆగస్టులో కుంగిపోయింది. వైకాపా సర్కారు వచ్చాక చేపట్టిన ఈ నిర్మాణంలో నాణ్యత లేకపోవడం, డిజైన్లకు అనుగుణంగా పనులు చేపట్టకపోవడం, తగిన సమయంలో కట్టడాన్ని పూర్తి చేయకపోవడమే కారణమని తేల్చారు.
బాధపడరు... బాధ్యత వహించరు
ప్రాజెక్టులకు గ్రీజు పెట్టడానికి డబ్బులు కావాలని, శ్రీశైలం జలాశయంలో చేసిన పనులకు బిల్లులివ్వాలని విన్నవించుకున్నా అధినేత స్పందించరు. వానాకాలానికి ముందే ప్రాజెక్టులకు ఏ అవసరాలు ఉన్నాయో సమీక్షించరు. నిధులను సర్దుబాటు చేయరు. ఫలితంగా శ్రీశైలం గేట్ల మీది నుంచి వరద నీరు ప్రవహించింది. గుండ్లకమ్మ ప్రాజెక్టులో ఒక్కసారి కాదు ఏకంగా రెండు పర్యాయాలు గేట్లు కొట్టుకుపోయాయి. పులిచింతల గేటూ వరదపాలైంది. ఏమైనా జరగనివ్వండి మేం బాధపడం... బాధ్యత వహించం... అనేది వైకాపా సర్కారు సిద్ధాంతం.
గుత్తేదారులూ ముందుకు రావడం లేదు
జగన్ సర్కారులో బిల్లుల చెల్లింపులు సరిగా లేకపోవడంతో చిన్నచిన్న పనులు చేసేందుకు సైతం గుత్తేదారులు ముందుకు రావడం లేదు. తక్కువ మొత్తంలోని బిల్లులకూ ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తుండటంతో వారు కొత్త పనులు చేయడానికి భయపడుతున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు పలుమార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు.
రాష్ట్రంలో డ్యాం భద్రతా కమిటీ తరఫున ప్రతి సంవత్సరం కొన్ని ప్రాజెక్టులను సందర్శించి వాటి నిర్వహణ, ఇతర సమస్యలను పరిశీలించి... చేపట్టాల్సిన పనులపై నివేదికలిచ్చినా అందుకు తగ్గ చర్యల్లేవు. డ్యాంలు, గేట్లు కొట్టుకుపోయినప్పుడు నిపుణుల కమిటీ నివేదికల ఆధారంగా చర్యలు తీసుకున్న దాఖలాలూ లేవు.
కొద్దిపాటి నిధుల విడుదలపైనా నిర్లక్ష్యం
ప్రాజెక్టుల నిర్వహణకు కొద్దిపాటి నిధులనూ జగన్ సర్కారు ఇవ్వడం లేదు. అత్యంత విలువైన ఈ డ్యాంలను కాపాడుకునేందుకు ప్రతి ఏటా నిర్వహణ పనులను తప్పనిసరి చేపట్టాలి. అన్ని పరికరాలను తనిఖీ చేసుకోవాలి. గ్రీజు పెట్టుకోవాలి. తలుపులు ఎత్తే వ్యవస్థలను పరీక్షించుకోవాలి. వాటికి తుప్పు పట్టిందా... గట్టిగా ఉన్నాయా... అనేది పరిశీలించి ఎప్పటికప్పుడు బాగు చేసుకోవాలి. ఇలాంటి పనులకు నిధులు కావాలని అధికారులు ప్రతిపాదించినా పట్టించుకునే నాథులే లేరు.
- విశాఖలోని మేహాద్రిగడ్డ రిజర్వాయర్ స్పిల్ వే గేట్లు దెబ్బతిన్నాయి. ఆరు గేట్లలో రెండు పూర్తిగా తెరవడానికి వీల్లేని దుస్థితికి చేరాయి. వీటి మరమ్మతుకు రూ.3.4 కోట్లు అవసరమని అధికారులు నివేదించినా లాభం లేకపోయింది.
- ఉత్తరాంధ్రలోని రైవాడ జలాశయంలోనూ గేట్లు పాడయ్యాయి. వీటికీ నిధులివ్వడం లేదు. కోనాం జలాశయంలో స్పిల్వే గేటు కుంగిపోయింది. పెద్దేరు జలాశయంలోనూ నీరు లీకవుతోంది.
- రాయలసీమలోని అనేక ప్రాజెక్టులు దుస్థితిలో ఉన్నాయి. ఈ ప్రాంతానికి కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నిర్వహణకు సైతం నిధులు ఇవ్వలేదు. సుంకేశుల ప్రాజెక్టూ సమస్యల్లోనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు శ్రీశైలానికీ అన్నీ సవాళ్లే. ప్రాజెక్టులో మూడు సబ్ డివిజన్ల కింద నిర్వహణకు నిధులు అవసరమని ప్రతిపాదించినా స్పందించలేదు. మొత్తానికి రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్నాయి.
ఆదేశాలే తప్ప ఆచరణ లేదు
‘‘రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల భద్రత, నిర్వహణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అన్ని ప్రాజెక్టులపై సమగ్ర అధ్యయనం చేయాలి. అవసరమైన చర్యలు తీసుకోవాలి’’ అని జగన్ 2021 డిసెంబరు 9న తన యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఒక కమిటీని వేశారు. వీటివల్ల రాష్ట్రంలోని సాగునీటి రంగానికి ఎలాంటి ప్రయోజనం ఒనగూరలేదు. ప్రాజెక్టుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం డ్రిప్ పథకం కింద నిధులిస్తున్నా... జగన్ వాటినీ సాధించలేకపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్