పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు.
రాష్ట్ర ఆసుపత్రుల్లో శిశువుల మరణ మృదంగం!
దుర్భరంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రాల పనితీరు
తిరుపతి రుయా, కర్నూలు, విజయవాడ ఆసుపత్రుల్లో 25 శాతం వరకూ మరణాలు
మినీ కేంద్రాల వైఫల్యంతో పెరుగుతున్న రిఫరల్ కేసులు, మృతుల సంఖ్య
వెక్కిరిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
తల్లిదండ్రులకు శాపంగా మారిన జగన్ సర్కారు నిర్లక్ష్యం
ఈనాడు, అమరావతి
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. వైద్యులు లేక.. సిబ్బంది సరిపోక.. వసతుల లేమితో.. పసిపిల్లలు పొత్తిళ్లలోనే పిట్టల్లా రాలిపోతున్నారు. చిన్నారుల కోసమే ప్రత్యేకంగా ఆసపత్రులు నిర్మిస్తామని చెప్పి.. అయిదేళ్లయినా కట్టలేకపోయిందీ అమానవీయ సర్కారు.
ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కుగా అందాల్సిన వైద్యం మన రాష్ట్రంలో అంపశయ్యపై అల్లాడుతోంది. సర్కారు ఆసుపత్రుల్లో సేవలు రోజురోజుకు మృగ్యంగా మారుతున్నాయి. తల్లి గర్భం నుంచి అప్పుడే బాహ్య ప్రపంచంలోకి వచ్చిన శిశువులకూ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రాలూ (ఎస్ఎన్సీయూ రెగ్యులర్-సిక్ న్యూబార్న్కేర్ యూనిట్) అసౌకర్యాలకు నెలవుగా మారాయి. కొన్ని ఆసుపత్రుల్లో మృతుల సంఖ్య పాతిక శాతం వరకూ ఉంటోంది. వైద్య నిపుణల కొరత, సరైన పరికరాలు లేకపోవడం ప్రధాన కారణాలు. అభం శుభం తెలియని చిన్నారులు పొత్తిళ్లలోనే కళ్లు మూస్తున్నా.. జగన్కు చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తిరుపతి రుయాలో 24.5శాతం, కర్నూలు జీజీహెచ్లో 23.2 శాతం శిశువులు ప్రాణాలు కోల్పోవడం వైకాపా ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. హైదరాబాద్లోని నిలోఫర్ మాదిరిగా రాష్ట్రంలోనూ ప్రత్యేక ఆసుపత్రి నిర్మిస్తామని గొప్పగా ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదు.
ఏలూరు నుంచి విజయవాడ, గుంటూరుకు..
ఏలూరు జిల్లాలో నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో సేవలు అగమ్యగోచరంగా మారాయి. సౌకర్యాలున్నా.. సిబ్బంది, వైద్యులు కరవయ్యారు. దీంతో పరిస్థితి విషమంగా ఉన్న చిన్నారులను విజయవాడ, గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో 20 ఇంక్యుబేటర్లు ఉన్నాయి. నిపుణులు అందుబాటులో లేకపోవటంతో వాటిని వినియోగించడం లేదు. ఇక్కడ వైద్యులు ఆరుగురు ఉండాల్సి ఉండగా నలుగురే ఉన్నారు. 14 మంది స్టాఫ్నర్సులకు ఆరుగురు మాత్రమే ఉన్నారు. నెలకు దాదాపు 15 నుంచి 20 కేసులను ఏలూరు నుంచి రిఫర్ చేస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బుట్టాయిగూడెం, పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మినీ నవజాత శిశు కేంద్రాల్లోనూ వైద్యుల కొరత వెక్కిరిస్తోంది. దాంతో ఇక్కడి కేసులను జిల్లా కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు.
రంపచోడవరంలో ఏరియా ఆసుపత్రి వైద్యుడే దిక్కు
మినీ ఎస్ఎన్సీయూల్లో సరిపడా వైద్యులు, సిబ్బంది, తగిన మౌలిక వసతులు లేకపోవడంతో పసివాళ్ల ప్రాణాలకు ముప్పుగా మారింది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూలో పూర్తిస్థాయిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు లేరు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో పుట్టిన వారితోపాటు బయట పీహెచ్సీల నుంచీ శిశువులను మెరుగైన వైద్యం కోసం నిత్యం ఇక్కడకు తరలిస్తుంటారు. అయితే ఈ విభాగంలో ఇద్దరు వైద్యులు పనిచేయాల్సి ఉండగా ఒక్కరూ లేరు. ఆరుగురు స్టాఫ్ నర్సులకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో ఏరియా ఆసుపత్రిలోని వైద్యుడే ఇక్కడా సేవలు అందించాల్సి వస్తోంది. వైద్యులు లేని విషయాన్ని ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళ్లామని ఏరియా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఊపిరి ఆడక చిన్నారుల గిజగిజ
కర్నూలు బోధనాసుపత్రిలోని ఎస్ఎన్సీయూకు 40 వెంటిలేటర్ల అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఐదింటిలో రెండు మరమ్మతులకు గురయ్యాయి. ఎస్ఎన్సీయూ, ఎన్ఐసీయూ విభాగాల్లో సరిపడినన్ని ఏసీలు లేకపోవడంతో శిశువులు సతమతమవుతున్నారు. కొవిడ్ సమయంలో కర్నూలు జీజీహెచ్కు వచ్చిన వెంటిలేటర్లలో 20 వినియోగించడం లేదు. ఒకే వార్మర్, ఒకే ఫొటో థెరపీ యూనిట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలను ఉంచాల్సిన దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అదనపు వెంటిలేటర్ల అవసరం ఉండటంతో ఎస్ఎన్సీయూ-2ను ఏర్పాటు చేసినా, సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇంకా వినియోగంలోకి రాలేదు. ఎస్ఎన్సీయూకి అనుబంధంగా పది పడకలతో ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)ను రెండు దశాబ్దాల కిందటే ప్రారంభించారు. ఆ తర్వాత మరో పది పడకలు అందుబాటులోకి తీసుకొచ్చినా, మరింత విస్తరించాల్సి ఉంది.
బాపట్లలోని ‘ఎస్ఎన్సీయూ’కు తాళాలు
బాపట్ల ప్రాంతీయ వైద్యశాలలో పసిబిడ్డలకు అత్యవసర వైద్యం మృగ్యంగా మారింది. నాలుగు పిల్లల వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ యూనిట్కు తాళం వేసేశారు. వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లు నిరుపయోగంగా మారాయి. ఆర్థికంగా భారమైనా తల్లిదండ్రులు శిశువులను ప్రైవేటు ఆసుపత్రులకే తీసుకువెళ్తున్నారు.
నలుగురికి నలుగురూ..
తెనాలి ఆసుపత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రంలోని ఎస్ఎన్సీయూలో నాలుగు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓపీలో పిల్లలను చూసే వైద్యులే దిక్కుగా మారారు. చీకటి పడిన తర్వాత అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. పోస్టుల భర్తీ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేంద్రం అవసరాలకు ఒప్పంద విధానంలో ఏడాది కిందట నియమించిన నలుగురు వైద్యులు, ఉన్నతావకాశాలు రావడంతో ఒక్కొక్కరుగా విధుల నుంచి తప్పుకొన్నారు.
నిర్ధారణ పరీక్షలకే దిక్కు లేదు
రాష్ట్ర వ్యాప్తంగా బోధన, ఇతర ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 27 ఎస్ఎన్సీయూలు పనిచేస్తున్నాయి. ఇందులో ఆరు మినహా మిగిలిన కేంద్రాలన్నింట్లో 20 చొప్పున పడకలు ఉన్నాయి. అనారోగ్యంతో వీటిల్లో చేరిన శిశువులను కంటికి రెప్పలా చూస్తేనే వారి విలువైన ప్రాణాలు నిలబడతాయి. అనంతపురం ఎస్ఎన్సీయూ-1, 2లో మూడు, చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో నాలుగు, రంపచోడవరంలో రెండు, తెనాలి జిల్లా ఆసుపత్రిలో మూడు, విజయవాడ ఎస్ఎన్సీయూ 1, 2లో కలిపి మూడు చిన్నపిల్లల వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అదనంగా జిల్లా ఆసుపత్రులు, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కలిపి 61 మినీ ఎస్ఎన్సీయూలు ఉన్నాయి. చాలా ఎస్ఎన్సీయూ కేంద్రాల్లో బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్, మైక్రో ఈఎస్ఆర్ తదితర నిర్ధారణ పరీక్షలూ సక్రమంగా జరగడం లేదు.
రిఫరల్ కేసుల్లోనే మృతులు అధికం
ఇతర ఆసుపత్రుల నుంచి ఎస్ఎన్సీయూల్లో చేరిన (రిఫరల్) వారే ఎక్కువగా మృతి చెందుతున్నారు. మినీ ఎస్ఎన్సీయూల పనితీరు ఘోరంగా ఉండటమే కారణం.
2023-24లో వివిధ ఆసుపత్రుల్లోని ఎస్ఎన్సీయూల్లో మృతి చెందిన శిశువుల శాతం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి