పసివాడిన ప్రాణాలు!
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు.
రాష్ట్ర ఆసుపత్రుల్లో శిశువుల మరణ మృదంగం!
దుర్భరంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రాల పనితీరు
తిరుపతి రుయా, కర్నూలు, విజయవాడ ఆసుపత్రుల్లో 25 శాతం వరకూ మరణాలు
మినీ కేంద్రాల వైఫల్యంతో పెరుగుతున్న రిఫరల్ కేసులు, మృతుల సంఖ్య
వెక్కిరిస్తున్న వైద్యులు, సిబ్బంది కొరత
తల్లిదండ్రులకు శాపంగా మారిన జగన్ సర్కారు నిర్లక్ష్యం
ఈనాడు, అమరావతి
పెద్దవాళ్లయితే సమస్యను చెప్పగలరు.. కానీ, చిన్నపిల్లలు అలా కాదు.. వారి బాధను మనమే అర్థం చేసుకోవాలి.. అయితే.. జగన్ సర్కారుకు అంత తీరిక ఎక్కడుంది? అక్రమాలు, అవినీతి, ఓట్ల వేట తప్ప.. ఆయనకు మరో ధ్యాసే ఉండదు కదా.. అందుకే నవజాత శిశువుల సంరక్షణను గాలికొదిలేశారు. వైద్యులు లేక.. సిబ్బంది సరిపోక.. వసతుల లేమితో.. పసిపిల్లలు పొత్తిళ్లలోనే పిట్టల్లా రాలిపోతున్నారు. చిన్నారుల కోసమే ప్రత్యేకంగా ఆసపత్రులు నిర్మిస్తామని చెప్పి.. అయిదేళ్లయినా కట్టలేకపోయిందీ అమానవీయ సర్కారు.
ప్రతి ఒక్కరికీ ప్రాథమిక హక్కుగా అందాల్సిన వైద్యం మన రాష్ట్రంలో అంపశయ్యపై అల్లాడుతోంది. సర్కారు ఆసుపత్రుల్లో సేవలు రోజురోజుకు మృగ్యంగా మారుతున్నాయి. తల్లి గర్భం నుంచి అప్పుడే బాహ్య ప్రపంచంలోకి వచ్చిన శిశువులకూ కష్టాలు తప్పడం లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఉన్న నవజాత శిశు సంరక్షణ కేంద్రాలూ (ఎస్ఎన్సీయూ రెగ్యులర్-సిక్ న్యూబార్న్కేర్ యూనిట్) అసౌకర్యాలకు నెలవుగా మారాయి. కొన్ని ఆసుపత్రుల్లో మృతుల సంఖ్య పాతిక శాతం వరకూ ఉంటోంది. వైద్య నిపుణల కొరత, సరైన పరికరాలు లేకపోవడం ప్రధాన కారణాలు. అభం శుభం తెలియని చిన్నారులు పొత్తిళ్లలోనే కళ్లు మూస్తున్నా.. జగన్కు చీమ కుట్టినట్లయినా ఉండటం లేదు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో తిరుపతి రుయాలో 24.5శాతం, కర్నూలు జీజీహెచ్లో 23.2 శాతం శిశువులు ప్రాణాలు కోల్పోవడం వైకాపా ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతోంది. హైదరాబాద్లోని నిలోఫర్ మాదిరిగా రాష్ట్రంలోనూ ప్రత్యేక ఆసుపత్రి నిర్మిస్తామని గొప్పగా ప్రకటించినా.. కార్యరూపం దాల్చలేదు.
ఏలూరు నుంచి విజయవాడ, గుంటూరుకు..
ఏలూరు జిల్లాలో నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో సేవలు అగమ్యగోచరంగా మారాయి. సౌకర్యాలున్నా.. సిబ్బంది, వైద్యులు కరవయ్యారు. దీంతో పరిస్థితి విషమంగా ఉన్న చిన్నారులను విజయవాడ, గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. ఏలూరు సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో 20 ఇంక్యుబేటర్లు ఉన్నాయి. నిపుణులు అందుబాటులో లేకపోవటంతో వాటిని వినియోగించడం లేదు. ఇక్కడ వైద్యులు ఆరుగురు ఉండాల్సి ఉండగా నలుగురే ఉన్నారు. 14 మంది స్టాఫ్నర్సులకు ఆరుగురు మాత్రమే ఉన్నారు. నెలకు దాదాపు 15 నుంచి 20 కేసులను ఏలూరు నుంచి రిఫర్ చేస్తున్నారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న బుట్టాయిగూడెం, పోలవరం సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాటు చేసిన మినీ నవజాత శిశు కేంద్రాల్లోనూ వైద్యుల కొరత వెక్కిరిస్తోంది. దాంతో ఇక్కడి కేసులను జిల్లా కేంద్రానికి రిఫర్ చేస్తున్నారు.
రంపచోడవరంలో ఏరియా ఆసుపత్రి వైద్యుడే దిక్కు
మినీ ఎస్ఎన్సీయూల్లో సరిపడా వైద్యులు, సిబ్బంది, తగిన మౌలిక వసతులు లేకపోవడంతో పసివాళ్ల ప్రాణాలకు ముప్పుగా మారింది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూలో పూర్తిస్థాయిలో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు లేరు. స్థానిక ఏరియా ఆసుపత్రిలో పుట్టిన వారితోపాటు బయట పీహెచ్సీల నుంచీ శిశువులను మెరుగైన వైద్యం కోసం నిత్యం ఇక్కడకు తరలిస్తుంటారు. అయితే ఈ విభాగంలో ఇద్దరు వైద్యులు పనిచేయాల్సి ఉండగా ఒక్కరూ లేరు. ఆరుగురు స్టాఫ్ నర్సులకు ఇద్దరు మాత్రమే ఉన్నారు. దీంతో ఏరియా ఆసుపత్రిలోని వైద్యుడే ఇక్కడా సేవలు అందించాల్సి వస్తోంది. వైద్యులు లేని విషయాన్ని ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకువెళ్లామని ఏరియా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఊపిరి ఆడక చిన్నారుల గిజగిజ
కర్నూలు బోధనాసుపత్రిలోని ఎస్ఎన్సీయూకు 40 వెంటిలేటర్ల అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఐదింటిలో రెండు మరమ్మతులకు గురయ్యాయి. ఎస్ఎన్సీయూ, ఎన్ఐసీయూ విభాగాల్లో సరిపడినన్ని ఏసీలు లేకపోవడంతో శిశువులు సతమతమవుతున్నారు. కొవిడ్ సమయంలో కర్నూలు జీజీహెచ్కు వచ్చిన వెంటిలేటర్లలో 20 వినియోగించడం లేదు. ఒకే వార్మర్, ఒకే ఫొటో థెరపీ యూనిట్లో ఇద్దరు, ముగ్గురు పిల్లలను ఉంచాల్సిన దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. అదనపు వెంటిలేటర్ల అవసరం ఉండటంతో ఎస్ఎన్సీయూ-2ను ఏర్పాటు చేసినా, సౌకర్యాలు కల్పించకపోవడంతో ఇంకా వినియోగంలోకి రాలేదు. ఎస్ఎన్సీయూకి అనుబంధంగా పది పడకలతో ఎన్ఐసీయూ (నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)ను రెండు దశాబ్దాల కిందటే ప్రారంభించారు. ఆ తర్వాత మరో పది పడకలు అందుబాటులోకి తీసుకొచ్చినా, మరింత విస్తరించాల్సి ఉంది.
బాపట్లలోని ‘ఎస్ఎన్సీయూ’కు తాళాలు
బాపట్ల ప్రాంతీయ వైద్యశాలలో పసిబిడ్డలకు అత్యవసర వైద్యం మృగ్యంగా మారింది. నాలుగు పిల్లల వైద్యుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆసుపత్రిలోని ఎస్ఎన్సీయూ యూనిట్కు తాళం వేసేశారు. వార్మర్లు, ఫొటో థెరపీ యూనిట్లు నిరుపయోగంగా మారాయి. ఆర్థికంగా భారమైనా తల్లిదండ్రులు శిశువులను ప్రైవేటు ఆసుపత్రులకే తీసుకువెళ్తున్నారు.
నలుగురికి నలుగురూ..
తెనాలి ఆసుపత్రి మాతాశిశు సంరక్షణ కేంద్రంలోని ఎస్ఎన్సీయూలో నాలుగు వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓపీలో పిల్లలను చూసే వైద్యులే దిక్కుగా మారారు. చీకటి పడిన తర్వాత అత్యవసర వైద్యం కోసం వచ్చే వారిని గుంటూరుకు రిఫర్ చేస్తున్నారు. పోస్టుల భర్తీ విషయం ఉన్నతాధికారుల దృష్టిలో ఉందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఈ కేంద్రం అవసరాలకు ఒప్పంద విధానంలో ఏడాది కిందట నియమించిన నలుగురు వైద్యులు, ఉన్నతావకాశాలు రావడంతో ఒక్కొక్కరుగా విధుల నుంచి తప్పుకొన్నారు.
నిర్ధారణ పరీక్షలకే దిక్కు లేదు
రాష్ట్ర వ్యాప్తంగా బోధన, ఇతర ఆసుపత్రుల్లో కలిపి మొత్తం 27 ఎస్ఎన్సీయూలు పనిచేస్తున్నాయి. ఇందులో ఆరు మినహా మిగిలిన కేంద్రాలన్నింట్లో 20 చొప్పున పడకలు ఉన్నాయి. అనారోగ్యంతో వీటిల్లో చేరిన శిశువులను కంటికి రెప్పలా చూస్తేనే వారి విలువైన ప్రాణాలు నిలబడతాయి. అనంతపురం ఎస్ఎన్సీయూ-1, 2లో మూడు, చిత్తూరు జిల్లా ఆసుపత్రిలో నాలుగు, రంపచోడవరంలో రెండు, తెనాలి జిల్లా ఆసుపత్రిలో మూడు, విజయవాడ ఎస్ఎన్సీయూ 1, 2లో కలిపి మూడు చిన్నపిల్లల వైద్య నిపుణుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటికి అదనంగా జిల్లా ఆసుపత్రులు, ప్రాంతీయ, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో కలిపి 61 మినీ ఎస్ఎన్సీయూలు ఉన్నాయి. చాలా ఎస్ఎన్సీయూ కేంద్రాల్లో బ్లడ్ కల్చర్, యూరిన్ కల్చర్, మైక్రో ఈఎస్ఆర్ తదితర నిర్ధారణ పరీక్షలూ సక్రమంగా జరగడం లేదు.
రిఫరల్ కేసుల్లోనే మృతులు అధికం
ఇతర ఆసుపత్రుల నుంచి ఎస్ఎన్సీయూల్లో చేరిన (రిఫరల్) వారే ఎక్కువగా మృతి చెందుతున్నారు. మినీ ఎస్ఎన్సీయూల పనితీరు ఘోరంగా ఉండటమే కారణం.
2023-24లో వివిధ ఆసుపత్రుల్లోని ఎస్ఎన్సీయూల్లో మృతి చెందిన శిశువుల శాతం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!