సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్వోకు చెప్పారట!
ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు.
అక్కడ వాంగ్మూలాలు నమోదు చేసి, ఆ తర్వాత పోలీసులకు సమాచారం
తమకు అనుకూలంగా రాయించుకునేందుకు పోలీసుల కట్టుకథలు!
గులకరాయి కేసులో సాక్షుల స్టేట్మెంట్లలో చిత్రవిచిత్రాలు
ఈనాడు, అమరావతి: ఏదైనా నేరానికి సంబంధించిన సమాచారం తెలిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? శాంతిభద్రతల అంశం కాబట్టి సంబంధిత పోలీస్స్టేషన్కు వెళ్లి ఆ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేస్తారు. ఎక్కడైనా వీఆర్వో వద్దకు వెళ్లి సమాచారం పంచుకోవడం చూశామా? అక్కడ ఆ వ్యక్తి స్టేట్మెంట్ను వీఆర్వో నమోదు చేసి దానిపై పోలీసులకు సమాచారం ఇవ్వడం విడ్డూరంగా లేదూ? పోనీ ఇది ఎక్కడో మారుమూల తండాలో జరిగింది కాదు. పరిపాలన కేంద్రమైన విజయవాడ నగరంలో అదీ పోలీస్స్టేషన్కు కిలోమీటరున్నర దూరంలో ఉండే వ్యక్తి ఇలా చేశారంటే నమ్మశక్యంగా ఉందా? ఘనమైన విజయవాడ నగర పోలీసులు దీనిని నిజం చేసి చూపించారు. గులకరాయి కేసులో నగర పోలీసులు కోర్టుకు సమర్పించిన కేస్ డైరీ రెండో భాగంలోని ఇద్దరు సాక్షుల వాంగ్మూలాలను పరిశీలిస్తే అదేంటో ఇట్టే అర్థమవుతోంది.
భయపడి వీఆర్వో వద్దకు!
ఈ నెల 13న రాత్రి ‘మేమంతా సిద్ధం’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి విజయవాడ శివారు సింగ్నగర్లోని డాబాకొట్ల రోడ్డులో గుంపులో నుంచి వచ్చిన రాయి తగిలి స్వల్పగాయమైన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో విద్యుత్తు సరఫరా నిలిపివేయడంతో అంతా చీకటిగా ఉంది. రాయి విసిరిన సమయంలో ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేకపోవడంతో కేసు తేలిపోకుండా ఉండేందుకు పోలీసులు నానా తిప్పలు పడినట్లు కనిపిస్తోంది. 16వ తేదీన సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన అయిదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో మేజర్ అయిన సతీష్ను ఏ1గా చూపించారు. మిగిలినవారు మైనర్లు. ఇందులో ఇద్దర్ని సాక్షులుగా చేర్చారు. ‘జగన్పై రాయితో దాడి చేస్తే పెద్ద మొత్తంలో డబ్బులిస్తానని సతీష్కు తెదేపా నాయకుడు దుర్గారావు ఆశ చూపించారు’ అని వారు స్టేట్మెంట్లో చెప్పినట్లు పేర్కొన్నారు. సతీష్ రాయి విసిరాడని తొమ్మిదో సాక్షిగా ఉన్న బాలుడు తన తండ్రి ఎల్లయ్యకు చెప్పాడట. ఇది విని భయపడిన ఎల్లయ్య వెంటనే కుమారుణ్ని నార్త్ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. జగన్పై సతీష్ రాయి విసిరాడని చెప్పగానే.. అక్కడున్న వీఆర్వో తండ్రీకుమారుల స్టేట్మెంట్లను రికార్డు చేసి, వాటిని పోలీసులకు పంపినట్లు కోర్టుకు సమర్పించిన స్టేట్మెంట్లలో ఉంది. దీంతో పోలీసులు తమకు అనుకూలంగా స్టేట్మెంట్లు రాయించుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.
12 మంది సాక్షులు
గులకరాయి కేసులో పోలీసులు 12 మందిని సాక్షులుగా చేర్చారు. ఇందులో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ రుహుల్లా, డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి, వైకాపా నేత పోతిన మహేష్, జగన్ వ్యక్తిగత సహాయకుడు మనోహర్ నాయుడిని చూపించారు. ఏడు, ఎనిమిదో సాక్షులుగా నందిగామ ఏసీపీ రవికాంత్, నందిగామ సీఐ హనీష్ పేర్లను చేర్చారు. ఇద్దరు బాలురు, వీఆర్వో స్వర్ణలత, ఓ బాలుడి తండ్రి దుర్గారావును సాక్షుల జాబితాలో పెట్టారు.
న్యాయాధికారికి అడ్వొకేట్ కమిషనర్ నివేదిక
వడ్డెర కాలనీకి చెందిన వారి ఆచూకీ కోసం కోర్టు అనుమతితో అడ్వొకేట్ కమిషనర్ శ్రీకాంత్ గురువారం రాత్రి సింగ్నగర్ స్టేషన్, పశ్చిమ ఏసీపీ కార్యాలయం, సీపీ కార్యాలయాల్లో తనిఖీలు చేశారు. ఈ మూడు చోట్లా ఎవరూ లేరని ఆయన న్యాయాధికారి రమణారెడ్డికి నివేదిక సమర్పించారు. రిమాండ్ పడిన ఏ1 సతీష్ను నెల్లూరు కేంద్ర కారాగారానికి పంపించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఎస్కార్ట్ లేకపోవడంతో గురువారం రాత్రి నుంచి నిందితుణ్ని విజయవాడ కారాగారంలోనే ఉంచారు.
3 రోజులు దాటినా తెదేపా నాయకుడి జాడ లేదు
ఈ నెల 16న సాయంత్రం 5 గంటలకు సింగ్నగర్ నుంచి వడ్డెర కాలనీకి చెందిన దుర్గారావును పోలీసులు తీసుకెళ్లారు. మూడు రోజులవుతున్నా పోలీసులు ఆయన అరెస్టు చూపలేదు. కుటుంబసభ్యులకు సమాచారమూ ఇవ్వలేదు. ఆయన్ను విచారించి ఇంకా ఎవరినైనా ఈ కేసులో ఇరికించే అవకాశం ఉందని, అందుకే పోలీసులు జాప్యం చేస్తున్నారనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఒప్పంద ఉద్యోగులకు పోలింగ్ డ్యూటీ వేసిన అధికారులు.. వారు పోస్టల్ బ్యాలట్ వినియోగించుకోకుండా చేశారు. -
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో ఐటీని పూర్తిగా నిర్వీర్యం చేసింది. హెచ్ఎస్బీసీ, ఐబీఎం వంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే విశాఖను వదిలి వెళ్లిపోయాయి. -
ఓట్ల బేరానికి కోట్లు కుమ్మరిస్తున్నారు
వివిధ రకాల స్కీములు పెట్టి ప్రజల జేబుల్ని కొల్లగొట్టే గొలుసుకట్టు కంపెనీల కథలెన్నో విన్నాం కదా? ఎన్నికల్ని వ్యాపారంగా మార్చేసిన ఒక రాజకీయ పార్టీ ఇప్పుడు.. రాష్ట్రంలో అదే తరహాలో వ్యవహరిస్తోంది. -
జగన్ పంతం.. జలయజ్ఞ విధ్వంసం!
తడిచెమ్మ తగలని కృష్ణా డెల్టా చేలు బీడుపడ్డాయి. ‘కాలువ నీరెప్పుడు వస్తుందంటే చెప్పరు.. ఈ కష్టాల సాగు మావల్ల కాదు’ అంటూ గోదావరి రైతు పంట విరామం ప్రకటించాడు. -
జగన్ జమానాలో.. ఆశా ‘నిరాశై’..!
ప్రజారోగ్యంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల బతుకులతో సీఎం జగన్ ఆడుకున్నారు. పని భారాన్ని పెంచి, వారితో వెట్టిచాకిరీ చేయించారు. తాత్కాలిక పద్ధతిలో పనిచేసే వీరికి సంక్షేమ పథకాలను దూరం చేశారు. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
ఎన్నికల వేళ ‘జగన్మాయ’!
ఎన్నికల వేళ రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం దిమ్మదిరిగే షాకిచ్చింది..! బుధవారం ఉదయం నుంచే సెల్ఫోన్కి వస్తున్న మెసేజ్లు చూసి ఉద్యోగులు బెంబేలెత్తిపోయారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
ఆంధ్రా పారిస్లో అ‘న్న’న్నా!
‘నాకు మంచి స్నేహితుడు’ అని ముఖ్యమంత్రి జగన్ ఆ ప్రజాప్రతినిధిని ఇటీవల ఓ సభలో ప్రజలకు పరిచయం చేశారు. -
అత్యవసర వాహనానికి ఆపద!
తిరుపతి నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న ఓ 108 వాహనం బుధవారం ఉదయం ఇలా నడిరోడ్డుమీదే ఆగిపోయింది. -
21 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు
రాష్ట్రంలో బుధవారం 79 మండలాల్లో తీవ్ర వడగాలులు, 118 మండలాల్లో వడగాలులు వీచాయి. 21 జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటాయి. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
విజ్ఞతతో ఓటేద్దాం.. అభివృద్ధికి బాటేద్దాం
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు ప్రాధాన్యాన్ని తెలియజేసేందుకు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోస్టుమ్యాన్ పురుష్తోతం తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. -
మద్యం ఆదాయం.. ఐదేళ్లలో నాలుగు రెట్లు!
‘రాష్ట్రానికి ఏటా సుమారు రూ.1.45 లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే.. అందులో రూ.72వేల కోట్లు జీఎస్టీ, వ్యాట్, రిజిస్ట్రేషన్లు, మద్యం అమ్మకాల ద్వారా వస్తోంది. -
నేరచరిత్ర, ఆస్తుల వివరాలను అభ్యర్థులు ప్రకటించుకోవాల్సిందే
సుప్రీంకోర్టు తీర్పునకు కట్టుబడి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర, ఆస్తుల వివరాలను స్వతంత్రంగా పత్రికల్లో ప్రచురించుకోవాలని, ఆయా పార్టీల వెబ్సైట్లో వివరాలను ఉంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. -
పంచాయతీ భవనంలో మద్యం నిల్వలు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఏకంగా పంచాయతీ భవనంలోనే మద్యం నిల్వలు దాచిపెట్టిన ఉదంతం కలకలం రేపింది. -
రూ.80 లక్షల విలువైన మద్యం ధ్వంసం
ఎన్నికల్లో పంపిణీ చేయడానికి అక్రమంగా నిల్వ ఉంచిన రూ.80 లక్షల విలువైన 58,032 క్వార్టర్ల గోవా మద్యం సీసాలను కృష్ణా జిల్లా పోలీసులు బుధవారం ధ్వంసం చేశారు. -
చందనోత్సవం వేళ.. సింహాచలం డీసీకి కమిషనరేట్లో బాధ్యతలు
సింహాచలంలో ఈనెల 10న సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరగనుంది. గతేడాది ఇదే చందనోత్సవంలో అధికార యంత్రాంగం విఫలమై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. -
హోంగార్డుల వేతనాల్లో కోతపై గగ్గోలు
తమిళనాడులో ఎన్నికల విధులకు వెళ్లిన హోంగార్డుల వేతనాల్లో కోత పడింది. బుధవారం ఖాతాల్లో పడిన వేతనం చూసి వారు హతాశులయ్యారు. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి