అన్నదాతలను బలిచేసి.. అస్మదీయులకు ధారపోసి
అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు.
షిర్డీసాయి, అదానీ సంస్థలకు సాగునీటి వనరులు
జగన్ నిర్వాకంతో ప్రమాదంలో రైతుల భవిష్యత్తు
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై హామీలన్నీ గాలికి
నేడు అనకాపల్లి జిల్లాలో సీఎం బస్సుయాత్ర
ఈనాడు, అనకాపల్లి: అరచేతిలో స్వర్గం చూపించడంలో ముఖ్యమంత్రి జగన్ది అందెవేసిన చెయ్యి..! 2019 ఎన్నికలకు ముందు బోలెడు హామీలిచ్చిన ఆయన.. తర్వాత యథావిధిగా వాటిని విస్మరించారు. అంతటితో ఆగకుండా అనకాపల్లి జిల్లాలోని సాగునీటి వనరులను తన అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టి.. అన్నదాతల భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేశారు. సహకార చక్కెర కర్మాగారాల్ని మూసివేసి చెరకు రైతుల నోట్లో మట్టికొట్టారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుకు నిధులు కేటాయించకుండా పక్కన పెట్టారు. అయిదేళ్లు అధికారంలో ఉండి ఒక్క హామీ నెరవేర్చని జగన్.. మళ్లీ ఓట్లు అడగడానికి శనివారం జిల్లాకు రానున్నారు.
జలవనరులశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా..
- రాష్ట్రంలో పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం జరుగుతోందని, తాను పేదల పక్షాన ఉన్నానంటూ జగన్ ఊదరగొడుతుంటారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో నీటిని షిర్డీసాయి, అదానీ వంటి అస్మదీయ కంపెనీలకు కట్టబెట్టి.. పేద రైతుల గొంతుకోసిన జగన్ పేదల పక్షాన ఉన్నట్టా? పెత్తందార్లకు ఊడిగం చేస్తున్నట్టా? జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టయిన తాండవ రిజర్వాయర్ కింద.. అనకాపల్లి, కాకినాడ జిల్లాల పరిధిలో 51,465 ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ జలాశయంలో సరిపడినన్ని నీళ్లు ఉండవని జలవనరులశాఖ అధికారులే చెబుతున్నారు. గత ఖరీఫ్లోనూ ఈ రిజర్వాయర్ కింద వారబందీ విధానంలో నీళ్లు విడిచిపెట్టారంటే సాగునీటికి ఎంత ఇక్కట్లు పడుతున్నారో అర్థమవుతుంది. అలాంటి ప్రాజెక్టుకు ఎగువున కొయ్యూరు మండలం ఎర్రవరం వద్ద షిర్డీసాయి ఎలక్ట్రికల్స్ నెలకొల్పనున్న వెయ్యి మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రో ప్రాజెక్టుకు 0.56 టీఎంసీ నీళ్లు కేటాయించారు. ఆ మేరకు తాండవ జలాశయంలోకి ఎగువ నుంచి వచ్చే నీరు తగ్గిపోతుందని జలవనరులశాఖ అభ్యంతరం వ్యక్తం చేసినా జగన్ పెడచెవిన పెట్టారు.
- రైవాడ జలాశయం నీటిని పూర్తిగా సాగునీటి అవసరాలకే వినియోగించేలా చూస్తామని, అదనపు ఆయకట్టుకు నీరందిస్తామని జగన్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. రైవాడ జలాశయం కింద 44 గ్రామాల పరిధిలో 15,344 ఎకరాల ఆయకట్టు ఉంది. జీవీఎంసీ తాగునీటి అవసరాలకు రోజూ 50 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టు నుంచే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జలాశయానికి ఎగువున అనంతగిరి మండలంలోని పెదకోట వద్ద అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఏర్పాటు చేయనున్న వెయ్యి మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ హైడ్రోపవర్ ప్రాజెక్టుకు 0.39 టీఎంసీ నీళ్లు కేటాయించారు.
ప్రాజెక్టుకు నిధులివ్వలేదు
‘మా నాన్న శంకుస్థాపన చేసిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పరుగులు పెట్టిస్తాను. ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో పెట్టి రెండు దశల్లో పూర్తి చేస్తాం’ అని గొప్పగా చెప్పిన జగన్, అయిదేళ్లలో ఒక్క పైసా నిధులివ్వలేదు. ఉత్తరాంధ్రలోని 8 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 గ్రామాల్లో 30 లక్షల మందికి తాగునీరందించే ఈ ప్రాజెక్టు తొలిదశ పనులకు తెదేపా హయాంలో రూ.2,022 కోట్లు కేటాయించారు. టెండర్లు పిలిచి గుత్తేదారులకు పనులు అప్పగించారు. ప్రభుత్వం మారిన తర్వాత మిగతా దశ పనులకు టెండర్లు పూర్తి చేసినా నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 16,046 ఎకరాలు సేకరించాల్సి ఉంది. సర్వే చేసి ల్యాండ్ పొజిషన్ షెడ్యూల్ విడుదల చేశారు. నిధుల్లేక పనులు ముందుకు కదల్లేదు. ప్రాజెక్టు పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థల్లో కొన్ని ఇక్కడి నుంచి వెళ్లిపోయాయి.
చక్కెర కర్మాగారాలు మూసేసి..
- జగన్ పాలనలో మూడు సహకార చక్కెర కర్మాగారాలు మూసేశారు. తుమ్మపాల కర్మాగారాన్ని విక్రయించాలని నిర్ణయించారు. లిక్విడేటర్ని పెట్టి ఆస్తులు అంచనా వేయించారు. రైతులు అడ్డుకుని కోర్టుకు వెళ్లడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది.
- పాయకరావుపేటలోని తాండవ సహకార చక్కెర కర్మాగారాన్ని 2021లో మూసేశారు. రైతులకు బకాయిలు చెల్లించకుండా ఇబ్బంది పెట్టారు. బకాయిల కోసం జరిగిన ఉద్యమంలో ఒక రైతు గుండెపోటుతో మరణించారు. ఆ తర్వాత ఎప్పటికో చెల్లించారు. 350 మంది ఉద్యోగులకు నేటికీ పూర్తిస్థాయిలో జీతాలు ఇవ్వలేదు. ఇంకా రూ.13.50 కోట్లు పెండింగ్లో ఉంచారు.
- ఏటికొప్పాక చక్కెర కర్మాగారం సిబ్బందికి రూ.8.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. తాండవ, ఏటికొప్పాక పరిశ్రమల పరిధిలో తుని, పాయకరావుపేట, నర్సీపట్నం, ఎలమంచిలి, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని 15 వేల మంది అన్నదాతలు చెరకు సాగుకు దూరమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం