ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు.
పొరుగు సేవల సిబ్బందికి జగన్ దగా
‘సమాన పనికి సమాన వేతనం’ అని కుట్ర
సంక్షేమ పథకాలకూ దూరం చేశారు
కుటుంబాలను పోషించలేక ఉద్యోగులు సతమతం
ఈనాడు, అమరావతి
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. ఈ హామీని మాత్రం నెరవేర్చారు. ‘అదేంటీ..’ అని నమ్మలేకపోతున్నారా? ఔను.. అధికారంలోకి వచ్చాక జగన్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగానే చూశారు!! అయితే.. వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో కాదు.. వారిని సంక్షేమ పథకాలకు అనర్హులుగా తేల్చడంలో..! అవసరం ఉన్నప్పుడు కొమ్ము కాయడం పని పూర్తయ్యాక గొంతు కోయడం జగన్కు అలవాటే కదా..!!
రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి న్యాయం చేస్తామని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వారిని నిండా ముంచేశారు. ‘సమాన వేతనం’ సరికాదు కదా.. 11వ పీఆర్సీ కమిషన్, అధికారుల కమిటీ 30% జీతం పెంచమని సిఫార్సు చేస్తే 23% మాత్రమే పెంచి వారికి దగా చేశారు. అరకొర జీతాలు ఇచ్చి ఇంతకంటే ఎక్కువ చేయలేం అని చేతులెత్తేశారు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే.. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపి సంక్షేమ పథకాలకు వారిని అనర్హులుగా తేల్చారు. అధికారంలోకి రావడం కోసం గత ఎన్నికల ముందు వారిపై ప్రేమ కురిపించిన జగన్.. సీఎం అయ్యాక విషం కుమ్మరించారు.
తాము అధికారంలోకి వస్తే పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) ఉద్యోగుల కొలువులను క్రమబద్ధీకరిస్తామని శాసనసభలో ప్రతిపక్షనేతగా జగన్ ఢంకా భజాయించారు. వారి సేవలను మరచిపోకూడదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామనీ బీరాలు పలికారు. అధికారంలోకి రాగానే నాలుక మడతేశారు. ఉద్యోగ భద్రత అనేది పనిచేసే విధానాన్ని బట్టే ఉంటుందని ‘యూ’ టర్న్ తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు పెంచాలని పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసింది. దాన్ని మూలకు పడేసి వేతనాల పెంపును అడ్డుకున్నారు. అసలే పెరిగిన నిత్యావసరాల ధరలతో వారు సతమతమవుతుంటే కేవలం రూ.3 వేలు మాత్రమే పెంచి తన నియంతృత్వాన్ని చాటుకున్నారు. వైకాపా శ్రేణులు, తన అనుచరగణానికి కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవులు కట్టబెట్టి రూ. కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టిన జగన్.. బొటాబొటి వేతనాలతో కుటుంబాలను పోషించలేక ఆపసోపాలు పడుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందకుండా కుట్ర పన్నారు.
వేతనాల్లో వ్యత్యాసం
- వివిధ శాఖల్లో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ఒక్కో జిల్లాలో ఒక్కో మాదిరిగా ఉన్నాయి. వ్యత్యాసం లేకుండా అన్ని జిల్లాల్లోనూ ఒకేస్థాయి వేతనం ఉండేలా చూడాలని పొరుగు సేవల సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. జగన్ సర్కారు వారి వేదనను పెడచెవిన పెట్టింది. ఉదాహరణకు ఒక కేటగిరీలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వారికి ఒకలా, విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వారికి మరోలా వేతనాలు చెల్లిస్తున్నారు.
- పొరుగు సేవలకు సంబంధించి ప్రస్తుతం మూడు కేటగిరీల్లో జీతాలు ఇస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ఒకేగాటన కట్టి ఒకేస్థాయి వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సీనియారిటీని ప్రాతిపదికన తీసుకోకుండా అందరికీ ఒకే రకంగా జీతాలు చెల్లించడం ఎంతవరకు సమంజసమని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
- సర్వీసు రూల్స్ను అయినా రూపొందించాలని పొరుగు సేవల ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్నో వినతులు ఇచ్చారు. మెప్మా, సెర్ప్ ప్రాజెక్టు ఉద్యోగుల మాదిరిగా తమకు హెచ్ఆర్ పాలసీ తీసుకురావాలన్న విజ్ఞాపనలు కూడా బుట్టదాఖలాలయ్యాయి.
- తమకు ఏటా 5% వేతనాలు పెంచాలని ‘పొరుగు’ ఉద్యోగులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయినా వారి వేదన జగన్ చెవికెక్కలేదు.
రేషన్కార్డు, పింఛను రద్దు
- అసలే అరకొర వేతనాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైకాపా సర్కారు సంక్షేమ పథకాలను దూరం చేసింది. విజయవాడలాంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు గతంలో రూ.12 వేల వేతనం ఉండేది. దాన్ని రూ.3 వేలు పెంచారు. వేతనం రూ.15 వేలకు చేరిందన్న ఉద్దేశంతో పొరుగు సేవల ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తొలగించారు. అంటే రూ.3 వేలు పెంచి ఉద్యోగుల పేర్లపై ఉన్న రేషన్కార్డులను రద్దు చేశారన్నమాట. వారి కుటుంబసభ్యులకు ‘అమ్మఒడి’ అందించడం లేదు. ఆ ఉద్యోగుల ఇళ్లలో ఉండే వికలాంగులు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదు. ఇతర ప్రయోజనాలను కూడా నిర్దాక్షిణ్యంగా దూరం చేసింది వైకాపా సర్కారు.
- పొరుగు సేవల సిబ్బందికి వేతనాలను సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారు. పోనీ వీరికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సదుపాయాలు కల్పిస్తున్నారా? అంటే.. అదీ లేదు.
- వీరికి ఎలాంటి ఆరోగ్య పథకాలను వర్తింపజేయడం లేదు. దీంతో అనారోగ్యానికి గురైన సందర్భాల్లో సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి.
మంత్రి, కలెక్టర్ చెప్పిన వారినే..
- ఉద్యోగ భద్రత కోసమంటూ జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సుడ్ సర్వీసెస్ (ఆప్కాస్) నిరుద్యోగులను నిలువునా ముంచింది. దీని ద్వారానే పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం అక్రమ విధానాలకు తెరలేపింది. నియామకాల్లో ఎక్కడా పారదర్శకత పాటించలేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టరు సిఫార్సు చేసిన వారినే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించారు. నియామకాల్లో రిజర్వేషన్ రోస్టర్ను గానీ, అభ్యర్థుల ప్రతిభను గానీ చూడలేదు. వైకాపా సానుభూతిపరులకే ఉద్యోగాలు ఇచ్చారు.
- ఆప్కాస్ పరిధిలో ప్రస్తుతం లక్షకుపైగా ఉద్యోగులు ఉన్నారు. దీని పరిధిలోకి రాని వివిధ విభాగాలు, శాఖలకు చెందిన వారు మరో 1.50 లక్షల వరకు ఉంటారు. ఆర్టీసీ, గురుకులాలు, పర్యాటక, అటవీ, నీటిపారుదల శాఖల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ వారిని ఇంతవరకు ఈ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురాలేదు.
- ఆప్కాస్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేయలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో జరిగిన నియామకాలనే కార్పొరేషన్ జాబితాలో చేర్చారు.
- పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన జగన్.. ఆప్కాస్ ఏర్పాటుతోనే తన పనైపోయినట్లు చేతులెత్తేశారు.
ఈఎస్ఐ, పీఎఫ్కు గతి లేదు..
జగన్ సర్కారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు. గతంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన రూ.370 కోట్ల పీఎఫ్ డబ్బును సకాలంలో చెల్లించకపోవడంతో కార్పొరేషన్కు పీఎఫ్ విభాగం రూ.5 కోట్ల జరిమానా విధించింది. కార్పొరేషన్ వద్ద ప్రస్తుతం ఎలాంటి నిధులు లేవు. దీని వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది.
ఆప్కాస్కు ఇప్పటివరకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేవు. ఆయా విభాగాలు డబ్బులు ఇస్తేనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. కొన్ని శాఖలు ఆలస్యంగా డబ్బులు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. అలాంటప్పుడు కార్పొరేషన్ ఉండి ఏం లాభం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం