ఉద్యోగమే ‘సోర్స్..’ పథకాలు ‘అవుట్’
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు.
పొరుగు సేవల సిబ్బందికి జగన్ దగా
‘సమాన పనికి సమాన వేతనం’ అని కుట్ర
సంక్షేమ పథకాలకూ దూరం చేశారు
కుటుంబాలను పోషించలేక ఉద్యోగులు సతమతం
ఈనాడు, అమరావతి
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకుసమాన పనికి సమాన వేతనం ఇచ్చి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తామని 2019 ఎన్నికల మ్యానిఫెస్టోలో జగన్ పేర్కొన్నారు. ఈ హామీని మాత్రం నెరవేర్చారు. ‘అదేంటీ..’ అని నమ్మలేకపోతున్నారా? ఔను.. అధికారంలోకి వచ్చాక జగన్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగానే చూశారు!! అయితే.. వేతనాలు, ఇతర ప్రయోజనాల విషయంలో కాదు.. వారిని సంక్షేమ పథకాలకు అనర్హులుగా తేల్చడంలో..! అవసరం ఉన్నప్పుడు కొమ్ము కాయడం పని పూర్తయ్యాక గొంతు కోయడం జగన్కు అలవాటే కదా..!!
రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇచ్చి న్యాయం చేస్తామని ఎన్నికల ముందు గొప్పగా చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక వారిని నిండా ముంచేశారు. ‘సమాన వేతనం’ సరికాదు కదా.. 11వ పీఆర్సీ కమిషన్, అధికారుల కమిటీ 30% జీతం పెంచమని సిఫార్సు చేస్తే 23% మాత్రమే పెంచి వారికి దగా చేశారు. అరకొర జీతాలు ఇచ్చి ఇంతకంటే ఎక్కువ చేయలేం అని చేతులెత్తేశారు. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే.. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపి సంక్షేమ పథకాలకు వారిని అనర్హులుగా తేల్చారు. అధికారంలోకి రావడం కోసం గత ఎన్నికల ముందు వారిపై ప్రేమ కురిపించిన జగన్.. సీఎం అయ్యాక విషం కుమ్మరించారు.
తాము అధికారంలోకి వస్తే పొరుగు సేవల (అవుట్ సోర్సింగ్) ఉద్యోగుల కొలువులను క్రమబద్ధీకరిస్తామని శాసనసభలో ప్రతిపక్షనేతగా జగన్ ఢంకా భజాయించారు. వారి సేవలను మరచిపోకూడదు అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పిస్తామనీ బీరాలు పలికారు. అధికారంలోకి రాగానే నాలుక మడతేశారు. ఉద్యోగ భద్రత అనేది పనిచేసే విధానాన్ని బట్టే ఉంటుందని ‘యూ’ టర్న్ తీసుకున్నారు. అవుట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలు పెంచాలని పీఆర్సీ కమిషన్ సిఫార్సు చేసింది. దాన్ని మూలకు పడేసి వేతనాల పెంపును అడ్డుకున్నారు. అసలే పెరిగిన నిత్యావసరాల ధరలతో వారు సతమతమవుతుంటే కేవలం రూ.3 వేలు మాత్రమే పెంచి తన నియంతృత్వాన్ని చాటుకున్నారు. వైకాపా శ్రేణులు, తన అనుచరగణానికి కాంట్రాక్టులు, నామినేటెడ్ పదవులు కట్టబెట్టి రూ. కోట్ల ప్రజాధనాన్ని దోచిపెట్టిన జగన్.. బొటాబొటి వేతనాలతో కుటుంబాలను పోషించలేక ఆపసోపాలు పడుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు అందకుండా కుట్ర పన్నారు.
వేతనాల్లో వ్యత్యాసం
- వివిధ శాఖల్లో కొనసాగుతున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు ఒక్కో జిల్లాలో ఒక్కో మాదిరిగా ఉన్నాయి. వ్యత్యాసం లేకుండా అన్ని జిల్లాల్లోనూ ఒకేస్థాయి వేతనం ఉండేలా చూడాలని పొరుగు సేవల సిబ్బంది ఎప్పటి నుంచో కోరుతున్నారు. జగన్ సర్కారు వారి వేదనను పెడచెవిన పెట్టింది. ఉదాహరణకు ఒక కేటగిరీలో విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వారికి ఒకలా, విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న వారికి మరోలా వేతనాలు చెల్లిస్తున్నారు.
- పొరుగు సేవలకు సంబంధించి ప్రస్తుతం మూడు కేటగిరీల్లో జీతాలు ఇస్తున్నారు. అయితే, కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారిని, కొత్తగా ఉద్యోగంలో చేరిన వారిని ఒకేగాటన కట్టి ఒకేస్థాయి వేతనాలు చెల్లిస్తున్నారు. ప్రభుత్వం సీనియారిటీని ప్రాతిపదికన తీసుకోకుండా అందరికీ ఒకే రకంగా జీతాలు చెల్లించడం ఎంతవరకు సమంజసమని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
- సర్వీసు రూల్స్ను అయినా రూపొందించాలని పొరుగు సేవల ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్నో వినతులు ఇచ్చారు. మెప్మా, సెర్ప్ ప్రాజెక్టు ఉద్యోగుల మాదిరిగా తమకు హెచ్ఆర్ పాలసీ తీసుకురావాలన్న విజ్ఞాపనలు కూడా బుట్టదాఖలాలయ్యాయి.
- తమకు ఏటా 5% వేతనాలు పెంచాలని ‘పొరుగు’ ఉద్యోగులు ఎంతో కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయినా వారి వేదన జగన్ చెవికెక్కలేదు.
రేషన్కార్డు, పింఛను రద్దు
- అసలే అరకొర వేతనాలతో కుటుంబాలను వెళ్లదీస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు వైకాపా సర్కారు సంక్షేమ పథకాలను దూరం చేసింది. విజయవాడలాంటి నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు గతంలో రూ.12 వేల వేతనం ఉండేది. దాన్ని రూ.3 వేలు పెంచారు. వేతనం రూ.15 వేలకు చేరిందన్న ఉద్దేశంతో పొరుగు సేవల ఉద్యోగులకు సంక్షేమ పథకాలు తొలగించారు. అంటే రూ.3 వేలు పెంచి ఉద్యోగుల పేర్లపై ఉన్న రేషన్కార్డులను రద్దు చేశారన్నమాట. వారి కుటుంబసభ్యులకు ‘అమ్మఒడి’ అందించడం లేదు. ఆ ఉద్యోగుల ఇళ్లలో ఉండే వికలాంగులు, వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదు. ఇతర ప్రయోజనాలను కూడా నిర్దాక్షిణ్యంగా దూరం చేసింది వైకాపా సర్కారు.
- పొరుగు సేవల సిబ్బందికి వేతనాలను సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లిస్తూ వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా చూపుతున్నారు. పోనీ వీరికి ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న సదుపాయాలు కల్పిస్తున్నారా? అంటే.. అదీ లేదు.
- వీరికి ఎలాంటి ఆరోగ్య పథకాలను వర్తింపజేయడం లేదు. దీంతో అనారోగ్యానికి గురైన సందర్భాల్లో సొంత డబ్బులు పెట్టి వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి.
మంత్రి, కలెక్టర్ చెప్పిన వారినే..
- ఉద్యోగ భద్రత కోసమంటూ జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సుడ్ సర్వీసెస్ (ఆప్కాస్) నిరుద్యోగులను నిలువునా ముంచింది. దీని ద్వారానే పారదర్శకంగా నియామకాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం అక్రమ విధానాలకు తెరలేపింది. నియామకాల్లో ఎక్కడా పారదర్శకత పాటించలేదు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా కలెక్టరు సిఫార్సు చేసిన వారినే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించారు. నియామకాల్లో రిజర్వేషన్ రోస్టర్ను గానీ, అభ్యర్థుల ప్రతిభను గానీ చూడలేదు. వైకాపా సానుభూతిపరులకే ఉద్యోగాలు ఇచ్చారు.
- ఆప్కాస్ పరిధిలో ప్రస్తుతం లక్షకుపైగా ఉద్యోగులు ఉన్నారు. దీని పరిధిలోకి రాని వివిధ విభాగాలు, శాఖలకు చెందిన వారు మరో 1.50 లక్షల వరకు ఉంటారు. ఆర్టీసీ, గురుకులాలు, పర్యాటక, అటవీ, నీటిపారుదల శాఖల్లో పని చేస్తున్న అవుట్ సోర్సింగ్ వారిని ఇంతవరకు ఈ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకురాలేదు.
- ఆప్కాస్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఉద్యోగ నియామకాలకు ప్రకటన విడుదల చేయలేదు. మంత్రులు, ప్రజాప్రతినిధుల సిఫార్సులతో జరిగిన నియామకాలనే కార్పొరేషన్ జాబితాలో చేర్చారు.
- పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పిన జగన్.. ఆప్కాస్ ఏర్పాటుతోనే తన పనైపోయినట్లు చేతులెత్తేశారు.
ఈఎస్ఐ, పీఎఫ్కు గతి లేదు..
జగన్ సర్కారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఎఫ్, ఈఎస్ఐ కూడా సక్రమంగా చెల్లించడం లేదు. గతంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్న ఉద్యోగులకు సంబంధించిన రూ.370 కోట్ల పీఎఫ్ డబ్బును సకాలంలో చెల్లించకపోవడంతో కార్పొరేషన్కు పీఎఫ్ విభాగం రూ.5 కోట్ల జరిమానా విధించింది. కార్పొరేషన్ వద్ద ప్రస్తుతం ఎలాంటి నిధులు లేవు. దీని వల్ల ఉద్యోగులకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది.
ఆప్కాస్కు ఇప్పటివరకు ఎలాంటి బడ్జెట్ కేటాయింపులు లేవు. ఆయా విభాగాలు డబ్బులు ఇస్తేనే ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నారు. కొన్ని శాఖలు ఆలస్యంగా డబ్బులు ఇస్తున్నాయి. దీంతో ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో జాప్యం చోటుచేసుకుంటోంది. అలాంటప్పుడు కార్పొరేషన్ ఉండి ఏం లాభం అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..