సీఎం బస్సు ఆగగానే ఎస్పీలు, సీపీలు డోర్ దగ్గరకు వెళ్లాలి..
ముఖ్యమంత్రి జగన్.. ఏ జిల్లాకు వెళితే అక్కడి ఎస్పీ లేదా పోలీసు కమిషనర్ ఆయన ఎన్నికల ప్రచార వాహనం (బస్సు) వెన్నంటే ఉండాలట.
ప్రచారంలో వాహనం వెన్నంటే ఉండాలి
రోప్ పార్టీలు సరిగ్గా ఉన్నాయా? లేదా అనేది దగ్గరుండి చూసుకోవాలంటూ డీజీపీ హుకుం
వైకాపాకు అనుకూల ఆదేశాలివ్వడంలో తగ్గని రాజేంద్రనాథరెడ్డి
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్.. ఏ జిల్లాకు వెళితే అక్కడి ఎస్పీ లేదా పోలీసు కమిషనర్ ఆయన ఎన్నికల ప్రచార వాహనం (బస్సు) వెన్నంటే ఉండాలట. ప్రచారం కోసం ఎక్కడైనా ఆ బస్సు ఆగితే.. మరుక్షణమే దాని ప్రవేశద్వారం వద్దకు చేరుకుని బందోబస్తులో పాల్గొనాలట. రోప్ పార్టీలు ఉండాల్సిన చోట ఉన్నాయా? లేదా అనేది దగ్గరుండి మరీ చూసుకోవాలట! పూర్తిగా వైకాపా కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే ఫిర్యాదులు, అభియోగాలు ఎదుర్కొంటున్న డీజీపీ కేవీ రాజేంద్రనాథరెడ్డి.. ఎన్నికల కోడ్ ఉన్నా సరే జగన్ పట్ల తన స్వామిభక్తిని, వీరవిధేయతను ప్రదర్శించడంలో ఏ మాత్రమూ తగ్గట్లేదు. ఎన్నికల సంఘం చర్యల కత్తి ఆయనపై వేలాడుతున్నా.. వైకాపాకు రాజకీయంగా అనుచిత లబ్ధి కలిగే ఆదేశాలిచ్చి అమలు చేయించడంలో ఎక్కడా కూడా వెనుకంజ వేయడంలేదు. అందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లకు తాజాగా ఈ ఆదేశాలిచ్చారు. నిష్పక్షపాతంగా, తటస్థంగా పనిచేసే పోలీసు అధికారుల నుంచి ఈ ఆదేశాలపై తీవ్ర అభ్యంతరాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైకాపా రాజకీయ ప్రయోజనాల కోసం ఎస్పీలు, సీపీలను ముఖ్యమంత్రికి కాపలాదారులుగా మార్చేయడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇదేమైనా రాచరికమా? జగన్ ఏమైనా చక్రవర్తా? ఆయనకేమైనా ప్రత్యేకంగా ప్రతిపత్తి కల్పించారా? లేకపోతే ఇలాంటి ఆదేశాలివ్వడం ఏమిటి? డీజీపీని ఎన్నికల సంఘం ఆ పోస్టు నుంచి తప్పించడానికి ఈ ఒక్క కారణం చాలు’ అని విశ్రాంత ఐపీఎస్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు.
కట్టడి విధుల్లో ఉండాల్సిన వారిని.. కట్టిపడేస్తారా?
ముఖ్యమంత్రికి భద్రతగా రోప్ పార్టీని నిర్వహించడానికి ఎస్పీ, సీపీ స్థాయి అధికారులను ప్రచార వాహనం ప్రవేశ ద్వారం వద్ద కాపలా పెడతారా? ఇది వాళ్ల ప్రాథమిక విధులైన శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ వంటి వాటి నుంచి దూరం చేయడం కాదా? ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులు ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వైకాపా నాయకుల ఆధ్వర్యంలో మద్యం, నగదు, ఇతర ప్రలోభాల
పంపిణీ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇలాంటి వాటిని సమర్థంగా కట్టడి చేయాల్సిన విధుల్లో బిజీగా గడపాల్సిన ఎస్పీలు, సీపీలను చివరికి ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార వాహనం చుట్టూ తిరిగేలా చేస్తున్న ఘనత డీజీపీకే దక్కింది. ఎస్పీలు, సీపీలను ముఖ్యమంత్రి రాజకీయ కార్యకలాపాలకు దగ్గరగా చేయటం, వారి వృత్తిపరమైన బాధ్యతలు, రాజకీయనాయకులతో సంబంధాల మధ్యనున్న సున్నితమైన విభజన రేఖను చెరిపేసేందుకే ఈ ఆదేశాలిచ్చినట్లు కనిపిస్తోందని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి ‘ఈనాడు’కు వివరించారు.
ముఖ్యమంత్రి భద్రత, బందోబస్తు నిర్వహణ కోసమే ప్రత్యేకంగా ఎస్పీ స్థాయి అధికారితో పాటు సీఎం సెక్యూరిటీ గ్రూపు (సీఎంఎస్జీ) సిబ్బంది ఉన్నారు. వీళ్లు కాకుండా ఎక్కడికక్కడ ఆయా జిల్లాల పోలీసులు బందోబస్తు విధులు చేపడుతున్నారు. అయినా సరే జిల్లా ఎస్పీలు ఈ బందోబస్తు విధుల్లో పాల్గొనాలని డీజీపీ ఆదేశాలిచ్చారు. ఇటు పోలీసు అధికారులకు, అటు ముఖ్యమంత్రికీ మధ్య అనవసరమైన అనుబంధం ఏర్పరచాలన్న ఉద్దేశంతోనే ఈ ఆదేశాలు జారీ చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రాజకీయ ప్రచారంలో పోలీసు ఉన్నతాధికారులు అనుసంధానమై ఉన్నారనే భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నం ఇదన్న అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. పోలీసు అధికారుల నిష్పాక్షికత, తటస్థతకు భంగం కలిగించే చర్య అని చెబుతున్నారు.
నలిగిపోతున్న ఎస్పీలు.. వారిలో తీవ్ర ఆందోళన
నిబంధనల మేరకు వృత్తిపరమైన విధులు నిర్వర్తించడమా? లేక వైకాపా పట్ల పక్షపాత ధోరణితో డీజీపీ ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చడమా అనేది తేల్చుకోలేక పలు జిల్లాల ఎస్పీలు సతమతమవుతున్నారు.
తప్పనిసరిగా పాల్గొనాలని ఎలా ఆదేశిస్తారు?
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక.. ముఖ్యమంత్రి సహా ఏ వీవీఐపీ భద్రతా, బందోబస్తు విధుల్లోనైనా పాల్గొనాలా? లేదా అనేది ఆయా ఎస్పీల విచక్షణాధికారంపై ఆధారపడి ఉంటుంది. భద్రతాపరంగా వాళ్లు అక్కడ ఉండాల్సిన అవసరం ఉందనుకుంటేనే వెళ్లాలి. లేకుంటే వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ ఇకపై ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు.. ముఖ్యమంత్రి బందోబస్తు విధుల్లో ఉండి తీరాల్సిందేనని డీజీపీ ఆదేశాలిచ్చారు. సాధారణంగా ఈ విధులు నిర్వహించేందుకు డీఎస్పీ స్థాయి అధికారి సరిపోతారు. ఎస్పీలు, నగర పోలీసు కమిషనర్లు ఈ బందోబస్తు విధుల్లో పాల్గొనాలని ఆదేశాలివ్వడమంటే.. వారిపై ఒక రకంగా ఒత్తిడి తీసుకురావడమేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది వైకాపాకు అనుకూలంగా వ్యవహరించడమేనని, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమేనని విశ్రాంత పోలీసు అధికారులు కొందరు అభిప్రాయపడుతున్నారు. ఎంతో మంది సీనియర్లను కాదని మరీ డీజీపీ పదవిని కట్టబెట్టినంత మాత్రాన ఇలాంటి ఆదేశాలివ్వడమేంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం