సంక్షిప్తవార్తలు(8)
పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు.
పోస్టల్ బ్యాలట్ దరఖాస్తు గడువు పొడిగింపు
ఈ నెల 26 వరకు అవకాశం
ఈనాడు డిజిటల్, అమరావతి: పోస్టల్ బ్యాలట్ దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 26 వరకు గడువును పెంచుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగులు ఎక్కడ ఉన్నా.. పనిచేసే చోటే ఫాం-12 ఇవ్వవచ్చని తెలిపారు. పోస్టల్ బ్యాలట్ సమర్పణ విషయంలో ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో సీఈఓ ఈ మేరకు శనివారం స్పష్టతనిచ్చారు.
నిధులు లేవని బీబీఏ, బీసీఏ కోర్సులను రద్దు చేసిన ప్రభుత్వం
బీబీఏ కోర్సులను బీకాంలో పెట్టాలంటూ ఆదేశాలు
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యను అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు పేద విద్యార్థులకు బీబీఏ కోర్సులు లేకుండా చేసేందుకు సిద్ధమైంది. వాటిని రద్దు చేయాలని సూచించింది. దేశంలో బీబీఏ, బీసీఏ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 24 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఈ కోర్సులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇవి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) పరిధిలో ఉండగా ఇటీవల ఏఐసీటీఈ పరిధిలోకి తీసుకొచ్చారు. వీటిని నిర్వహిస్తున్న కళాశాలలు.. కోర్సుకు రూ.20వేల చొప్పున చెల్లించాలని ఏఐసీటీఈ సూచిస్తూ భవిష్యత్తులో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. ఈ నిధులు చెల్లించేందుకు ఇష్టపడని కళాశాల విద్యాశాఖ.. ఆ కోర్సులను మూసివేయాలంటూ కళాశాలలను ఆదేశించింది. ప్రస్తుతం ఈ కోర్సులు చేస్తున్న విద్యార్థుల చదువు పూర్తయిన అనంతరం పొడిగించొద్దని సూచించింది. బీబీఏ కోర్సులను మూసేసి వీటి స్థానంలో బీకాం లాజిస్టిక్స్, మేనేజ్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని కళాశాల విద్యాశాఖ ఆదేశించింది. అనంతపురంలోని డిగ్రీ కళాశాలలో ఈ ఏడాది కొత్తగా బిజినెస్ డేటా అనలిటిక్స్ ప్రవేశపెట్టేందుకు ప్రతిపాదన పంపించగా.. కమిషనరేట్ వద్దని తిరస్కరించింది. బీకాంలోనే పెట్టుకోవాలని సూచించింది.
విద్యాదీవెన జమ కాక.. హాల్టికెట్ అందక.. ఉర్దూ వర్సిటీ విద్యార్థుల ఆందోళన
కర్నూలు విద్య, న్యూస్టుడే: ఫీజు మొత్తం చెల్లిస్తేనే పరీక్షలకు హాల్టికెట్ ఇస్తామని కటువుగా చెప్పడం ప్రైవేటు విద్యాసంస్థల్లో చూస్తుంటాం. కానీ, ప్రభుత్వ ఆధీనంలో కర్నూలులో నెలకొల్పిన డాక్టర్ అబ్దుల్హక్ ఉర్దూ యూనివర్సిటీలోనూ రుసుము చెల్లిస్తేనే హాల్టికెట్ ఇస్తామని అధికారులు చెప్పడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పలువురు శనివారం ప్రిన్సిపల్ వద్దకెళ్లి తమ గోడు చెప్పుకొన్నారు. ఈనెల 23 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు రెండో సెమిస్టర్లో 87 మంది, నాలుగో సెమిస్టర్లో 168 మంది హాజరు కావాల్సి ఉంది. డిగ్రీ విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన ఇస్తామని సీఎం జగన్ చెప్పినప్పటికీ, ఎన్నికల కోడ్ రావడంతో ఆ సొమ్ములు జమ కాలేదు. ఫీజు చెల్లించిన విద్యార్థులకే హాల్టికెట్ ఇస్తామని అధికారులు నోటీసులిచ్చారు. దీనిపై విద్యార్థులు వర్సిటీ ఉన్నతాధికారిని సంప్రదించగా, ఈ ఏడాది కాకుంటే వచ్చే ఏడాది విద్యా దీవెన సొమ్ములు వచ్చాకే పరీక్ష రాసుకోండని వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ విషయమై రిజిస్ట్రార్ బాయినేని శ్రీనివాసులు మాట్లాడుతూ ఫీజు చెల్లించిన వారిలో సగం మంది విద్యార్థులకు హాల్టికెట్లు ఇచ్చామని చెప్పారు. రుసుములో కొంతైనా కట్టాలని సూచించామన్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు రేపు
ఈనాడు, అమరావతి: పదోతరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు దేవానందరెడ్డి తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో ఉదయం 11గంటలకు ఫలితాలను విద్యా కమిషనర్ సురేష్కుమార్ విడుదల చేస్తారని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వరకు పది పరీక్షలు జరిగాయి. మొత్తం 6,54,553మంది ఫీజు చెల్లించగా.. 6.23లక్షల మంది హాజరయ్యారు. ప్రైవేటుగా 1.02లక్షల మంది పరీక్షలు రాశారు. ఫలితాలను www.eenadu.net, www.eenadupratibha.net, https://results.bse.ap.gov.in/ వెబ్సైట్లలో పొందవచ్చు.
రేషన్ వాహనాల ద్వారా నగదు పంచకుండా చూడండి
కలెక్టర్లకు పౌరసరఫరాలశాఖ ఆదేశాలు
ఈనాడు, అమరావతి: ఎన్నికల ప్రచారం, డబ్బు కరపత్రాల పంపిణీ తదితర వ్యవహారాల్లో ఎండీయూ ఆపరేటర్లు పాల్గొనకుండా పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లకు పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్కుమార్ సూచించారు. గుంటూరు జిల్లాలో ఎండీయూ ఆపరేటర్ల ద్వారా రేషన్కార్డుదారులకు రూ.5వేల చొప్పున పంపిణీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందిన నేపథ్యంలో.. ఈసీ ఆదేశాలను ఉటంకిస్తూ ఆయన ఉత్తర్వులు ఇచ్చారు. లబ్ధిదారులకు నిత్యావసరాలు పంపిణీ చేయడంతో పాటు ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలయ్యేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. రేషన్ వాహనాల ద్వారా నగదు పంపిణీ జరిగే అవకాశం ఉందనే అభ్యంతరాలపై చర్యలు తీసుకోవాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివి లీలామాధవరావు ఓ ప్రకటనలో డిమాండు చేశారు.
ఏపీఎస్బీసీఎల్ ఎండీగా చేతన్
ఈనాడు డిజిటల్, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్బీసీఎల్) నూతన ఎండీగా 2016 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి టీఎస్ చేతన్ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) నియమించింది. ఈ మేరకు ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాశ్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల వరకు ఆ కార్పొరేషన్కు ఎండీగా కొనసాగిన డి.వాసుదేవరెడ్డి.. వైకాపాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు ఆయనపై ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే.
రెండ్రోజుల్లో ప్రొగ్రెస్ సిద్ధం చేయడం కష్టం..
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధ్యాయులంతా ప్రమోషన్ జాబితా తయారీ, ఎస్ఏ2 పేపర్ల మూల్యాంకనం పూర్తిచేసే పనిలో నిమగ్నమై ఉన్న నేపథ్యంలో అన్ని వివరాలతో కూడిన ప్రొగ్రెస్ కార్డు ఈనెల 23లోపు రూపొందించడం కష్టమని నవ్యాంధ్ర ఉపాధ్యాయుల, ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పేర్కొన్నాయి. ఇప్పటికే అన్ని మార్కులు ఆన్లైన్లో నమోదు చేసి ఉన్నాయని.. వాటిని ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారానే ప్రొగ్రెస్ కార్డులను రూపొందించాలని పాఠశాల విద్యాశాఖను శనివారం వేర్వేరు ప్రకటనలో కోరాయి.
ముడుపులు తీసుకుని సీహెచ్ఓలకు బదిలీలు.. ప్రభుత్వ అనుమతి లేక నిలిచిన వేతనాలు
ఈనాడు-అమరావతి: ముడుపులు తీసుకుని బదిలీ చేసిన కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల (సీహెచ్ఓ)లకు అయిదారు నెలలుగా వేతనాలు నిలిచిపోయాయి. జీతాలు చెల్లించాలంటూ వారు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో ఒప్పంద విధానంలో పనిచేసే సీహెచ్ఓలకు బదిలీలు జరగాలంటే.. ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఇక్కడే అక్రమాలకు తెరలేచింది. రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్లపై ఒత్తిడి తెచ్చి.. సుమారు 300 మందిని బదిలీ చేయించారు. రాయలసీమలో కీలక మంత్రి సిఫార్సులతో ఎక్కువ బదిలీలు జరిగాయి. ఒక్కో సీహెచ్ఓ రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ముడుపులు సమర్పించుకున్నారు. ఏ ఉద్యోగినైనా ఒక చోటు నుంచి మరో చోటుకు బదిలీ చేస్తే.. వేతనాల చెల్లింపులకు తగ్గట్లు ఆన్లైన్లో మార్పులు చేయాలి. అప్పుడే బదిలీలు పొందిన వారికి వేతనాలు ఇవ్వడానికి వీలవుతుంది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా వీరి బదిలీలు జరిగినందున ఆన్లైన్లో వివరాలు మార్చలేదు. దీంతో వేతనాలు నిలిచిపోయాయి. కలెక్టర్ల ఆమోదంతో ఆర్జేడీ సంతకాలతో బదిలీలు పొందిన తాము విధులకు హాజరవుతూ, రోగులకు సేవలు అందిస్తున్నా వేతనాలు చెల్లించడం లేదని సీహెచ్ఓలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అక్రమ బదిలీల వ్యవహారంపై ప్రభుత్వం.. ప్రాంతీయ సంచాలకులకు సంజాయిషీ నోటీసులు జారీ చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే