బకాయిలే ‘దీవెన’...!
ప్రతి సభలోనూ విద్యాదీవెన, వసతి దీవెనంటూ మాట్లాడే జగన్ చేతలు చూస్తే విస్తుపోవాల్సిందే.
ఫీజుల డబ్బులు ఎగ్గొట్టిన వైకాపా సర్కారు
పేద తల్లిదండ్రులపై రూ.3వేల కోట్ల భారం
యాజమాన్యాల ఒత్తిడితో ఆత్మహత్యలకు యత్నిస్తున్న తల్లిదండ్రులు
విధానాన్ని మార్చి.. పేదలకు అప్పులు మిగిల్చి..
ఈ ఏడాది ఒక్క రూపాయీ ఇవ్వని దుస్థితి
పేదలను పెద్ద చదువులకు దూరం చేసిన జగన్
ప్రతి సభలోనూ విద్యాదీవెన, వసతి దీవెనంటూ మాట్లాడే జగన్ చేతలు చూస్తే విస్తుపోవాల్సిందే. 2019 ఎన్నికల ముందు ఎంత ఖర్చైనా పేద పిల్లలను చదివించే బాధ్యత తనదంటూ ఊదరగొట్టిన ఆయన.. అధికారంలోకి వచ్చాక నిలువునా ముంచేశారు. ప్రభుత్వం నేరుగా కళాశాలలకు ఫీజులు చెల్లించే విధానాన్ని మార్చేసి.. తల్లుల ఖాతాలో వేసే విధానాన్ని తెచ్చి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, పేద తల్లులకు భారీగా అప్పులు మిగిల్చారు. ఆకలితో అలమటిస్తున్న వారికి అరకొర ముద్దపెట్టి.. కడుపు నింపేశామన్నట్లు ప్రచారం చేసుకుంటూ వసతి దీవెనను గాలిలో కలిపేశారు. రెండు విడతలుగా ఇవ్వాల్సిన ఈ డబ్బులను గతేడాది ఒకసారే ఇవ్వగా.. ఈసారి ఒక్క రూపాయీ లేదు. జగన్ మాత్రం ఏ త్రైమాసికం ఫీజు ఆ త్రైమాసికంలో ఇస్తున్నామంటూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు.
పేద తల్లులపై ఆర్థిక భారం మోపి..
జగన్ ఐదేళ్ల పాలనలో పేద విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల డబ్బుల రూపంలో రూ.3,174 కోట్ల భారం పడింది. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు త్రైమాసికాలుగా ఫీజులను విడుదల చేయాల్సి ఉండగా.. జగన్ ఒక్కసారి మాత్రమే బటన్ నొక్కారు. అదీ ఉత్తుత్తిదే కావడంతో ఆ ఒక్క త్రైమాసికం ఫీజుల డబ్బులు దాదాపు 50% మందికి ఇప్పటికీ బ్యాంకు ఖాతాల్లో పడలేదు. మరో మూడు త్రైమాసికాల ఫీజును బకాయి పెట్టి, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అప్పుల్లోకి నెట్టేశారు. ఈ ఏడాది మూడు విడతలకు సంబంధించి రూ.2,124 కోట్లు విద్యార్థులే కట్టుకున్నారు.
కరోనా సమయంలో తరగతులు నిర్వహించలేదని 2020-21లో ఒక త్రైమాసికం ఫీజులను ప్రభుత్వం ఎగ్గొట్టింది. ఆన్లైన్, ఆఫ్లైన్లో పాఠాలు చెప్పి, పరీక్షలు పెట్టి విద్యా సంవత్సరం పూర్తి చేసినందున మొత్తం ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి దండుకున్నాయి. అలా పిల్లలపై రూ.600 కోట్ల భారం పడింది. ఇది కాకుండా పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజుల బకాయిలు రూ.450 కోట్లు ఉన్నాయి.
ఆత్మహత్యలకు యత్నించినా.. ఆందోళనలు చేసినా..
ఫీజుల డబ్బులు ఇవ్వకపోవడంతో ఫీజులు కట్టలేక విశాఖపట్నంలో ఓ విద్యార్థిని తల్లి ఏప్రిల్ 16న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న కుమార్తె ఫీజు రూ.25వేలు బకాయి ఉందని, ఆ మొత్తం చెల్లిస్తేనే హాల్టికెట్ ఇస్తామని యాజమాన్యం చెప్పింది. కొద్ది రోజుల్లో అప్పు చేసైనా నగదు చెల్లిస్తానని,
హాల్టికెట్ ఇవ్వాలని వేడుకున్నా యాజమాన్యం వినకపోవడంతో కుమార్తె ఆవేదన చూడలేక ఆమె బలవన్మరణానికి యత్నించారు.
బకాయి చెల్లించకుండా బెదిరించి..
ఏ కోర్సయినా.. ఎక్కడ చదివినా నేనున్నానంటూ ప్రగల్భాలు పలికిన జగన్... పోస్టుగ్రాడ్యుయేషన్ కోర్సులకు ప్రైవేటు కళాశాలల్లో ఫీజుల చెల్లింపు పథకాన్ని 2020-21 నుంచి నిలిపివేసింది. పీజీలకూ ప్రైవేటులో బోధన రుసుములను నిలిపివేశారు. పీజీ కళాశాలలకు చెల్లించాల్సిన రూ.450కోట్ల బకాయిలు చెల్లించకుండా.. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డి ద్వారా ప్రభుత్వం వన్ టైమ్ సెటిల్మెంట్ ప్రక్రియను నిర్వహించింది. బకాయిల్లో 75% మాత్రమే ఇస్తామని, దీనికే అంగీకరించాలంటూ కళాశాలలను బెదిరించింది. ఈ మొత్తమే చాలని... న్యాయస్థానాలకు వెళ్లబోమని యాజమాన్యాల నుంచి లేఖలు తీసుకుంది. చివరకు ఆ 75% కూడా ఇవ్వకుండా యాజమాన్యాలను, గతంలో పీజీలు చదివిన పిల్లల్ని నిలువునా ముంచేసింది. ఉద్యోగాలు, పై చదువుల కోసం సర్టిఫికెట్లు కావాల్సిన వారు మాత్రమే అప్పులు చేసి, ఫీజులు కట్టి తీసుకువెళ్లారు.
వసతి దీవెనలోనూ మోసమే...
ఫీజుల సంగతి ఇలా ఉంటే... హాస్టల్ ఖర్చులదీ అదే గతి! ప్రతీ విద్యార్థికీ హాస్టల్ ఖర్చుల నిమిత్తం ఏటా రూ.20వేలు ఇస్తామని చెప్పిన జగన్ ఏ సంవత్సరంలోనూ పూర్తిగా ఆ డబ్బులు విడుదల చేయలేదు. విద్యార్థుల వసతి, భోజనం కోసమని కళాశాలలు ఏడాదికి రూ.70వేలకుపైగా వసూలు చేస్తుంటే దీవెన పేరుతో జగన్ ఇస్తోంది రూ.20వేల లోపే. ఈ మొత్తం ఎటూ చాలకపోయినా పేదలకు ఏదో సాయం చేస్తున్నట్లు జగన్ గొప్పలు చెబుతున్నారు. వీటినైనా సకాలంలో ఇస్తున్నారా? అంటే అదీ లేదు.
- వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, వైద్య తదితర కోర్సుల వారికి రూ.20వేల చొప్పున ఇస్తామని జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చారు.
- విద్యా దీవెన రెండు విడతల్లో ఇవ్వాల్సి ఉండగా.. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఒక్క విడతే ఇచ్చారు. 2023-24కు ఒక్క విడతా ఇవ్వలేదు.
- ప్రభుత్వ విద్యా సంస్థలైన ట్రిపుల్ఐటీల్లో జగన్ ఇచ్చే వసతి దీవెన సరిపోవడం లేదని, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక్కడ చదువుతున్న వారికి ఏడాదికి రూ.25వేల నుంచి రూ.30వేల బిల్లులు వేస్తున్నారు.
జగన్ దమనకాండలో పేదలే సమిధలు..
ఫీజు రీయింబర్స్మెంట్ కింద గత ప్రభుత్వాలు డబ్బులను నేరుగా కళాశాలల యాజమాన్యాల ఖాతాలకు వేసేవి. దీన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలని చూసిన జగన్ పాత విధానాన్ని మార్చేశారు. కళాశాలల ఖాతాలకు కాకుండా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసే విధానాన్ని తెచ్చారు. ఎన్నికలకు ముందు దీన్నీ మార్చేశారు. తల్లుల ఓట్లతోపాటు విద్యార్థుల ఓట్లపైన దృష్టిపెట్టిన జగన్ తల్లి, విద్యార్థి సంయుక్త బ్యాంకు ఖాతాకు వేస్తామంటూ మరో కొత్త విధానాన్ని తెచ్చారు. దీంతో బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు ఎక్కడో దూరంగా ఉన్న విద్యార్థులు కళాశాలలకు సెలవు పెట్టి, ఇళ్లకు రావాల్సి వచ్చింది. ఇంటికి వచ్చి వెళ్లేందుకు రూ.వేలల్లో ఖర్చులు అయ్యాయి. తరగతులూ నష్టపోవాల్సి వచ్చింది.
- గతంలో కళాశాలల ఖాతాలకే ప్రభుత్వం నేరుగా ఫీజులు వేయడం వల్ల విద్యార్థులకు ఫీజుల తలనొప్పి ఉండేది కాదు. ప్రభుత్వం, కళాశాలల మధ్యే ఫీజుల బకాయిలు వ్యవహారం కొనసాగేది. కానీ ఓట్ల కోసం జగన్ సాగించిన దమనకాండలో ఇప్పుడు పేద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సమిధలుగా మారారు. ఫీజుల డబ్బులను తల్లుల ఖాతాల్లో వేసినా.. వేయకపోయినా తమకు సంబంధం లేదని, మొత్తం ఫీజులు కట్టాలంటూ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి చేసి... ముక్కుపిండి మరీ వసూలు చేశాయి.
- ప్రభుత్వం ఫీజుల డబ్బులు ఇచ్చినా ‘మీ బ్యాంకు ఖాతాల్లోనే పడతాయి. అప్పుడు వాటిని మీరే తీసుకోండి. ఇప్పుడు ఫీజు కడితేనే హాల్టికెట్’ అంటూ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేశాయి. డబ్బులు చెల్లించలేని పేదవారు కొన్నిచోట్ల ఆత్మహత్యయత్నానికి పాల్పడగా.. కొన్నిచోట్ల విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు.
ప్రభుత్వ కళాశాలకే దయలేని వేళ...
- ప్రభుత్వం ఫీజులు జమ చేశాక కడతామని చెప్పినా యాజమాన్యం అంగీకరించకపోవడంతో గతేడాది డిసెంబరు 16న నర్సింగ్ విద్యార్థులు నెల్లూరులో రోడ్డుపైకి వచ్చి, ఆందోళన చేశారు.
- విద్యా దీవెన, వసతి దీవెన డబ్బులు అందక శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో నిరుడు ఆగస్టు 25న మూడు విభాగాల్లో నాలుగో సెమిస్టర్ పరీక్షలకు విద్యార్థులను అనుమతించ లేదు. ప్రభుత్వ వర్సిటీలోనే పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేటులో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు!
- ఏలూరు జిల్లాలోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో కన్వీనర్ కోటా, జేఎన్టీయూ వర్సిటీ కామన్ ఫీజు కట్టాలని, లేకపోతే పరీక్షలకు హాజరుకానివ్వమని యాజమాన్యం తేల్చిచెప్పింది. దీంతో విద్యార్థులంతా అప్పులు చేసి, ఫీజులు కట్టారు.
- విజయవాడకు చెందిన ఓ విద్యార్థి స్థానికంగా ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు. మొత్తం ఫీజు చెల్లిస్తేనే చివరి సెమిస్టర్ పరీక్షలకు అనుమతిస్తామని హెచ్చరించడంతో అప్పు చేసి, రూ.70వేలు చెల్లించారు.
- ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రాకపోవడంతో 2022లో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన ఓ యువతి ఒకటో పట్టణ పోలీస్స్టేషన్ ముందే ఆత్మహత్యకు ప్రయత్నించింది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు