మార్కుల వెల్లడిలో గోప్యత ఏల?
ఉద్యోగ నియామకాల రాత పరీక్ష, మౌఖిక పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల వెల్లడిలో ఏపీపీఎస్సీ గోప్యత పాటిస్తుండగా యూపీఎస్సీ మాత్రం పారదర్శకంగా వ్యవహరిస్తోంది.
యూపీఎస్సీ అలా.. ఏపీపీఎస్సీ ఇలా..
ఈనాడు, అమరావతి: ఉద్యోగ నియామకాల రాత పరీక్ష, మౌఖిక పరీక్షల్లో అభ్యర్థులకు వచ్చిన మార్కుల వెల్లడిలో ఏపీపీఎస్సీ గోప్యత పాటిస్తుండగా యూపీఎస్సీ మాత్రం పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఎవరికెన్ని మార్కులు వచ్చాయో బహిర్గతం చేయకుండా.. నియామకాలు మాత్రం పారదర్శకంగానే జరిపామంటూ ఏపీపీఎస్సీ డప్పు కొట్టుకుంటోంది. మార్కులను బహిర్గతం చేయాలన్న విజ్ఞప్తులను పట్టించుకోవడంలేదు. దీనిపై విమర్శలు రావడంతో గ్రూపు-1 అభ్యర్థులకు వ్యక్తిగతంగా మాత్రమే తెలుసుకునే అవకాశం ఇస్తోంది. అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఇలాంటి మెలికలేవీ పెట్టకుండా అభ్యర్థులకు ప్రధాన పరీక్షలు, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను వెబ్సైట్ ద్వారా బహిర్గతం చేసింది. సబెక్టులవారీగా వచ్చిన మార్కులను వ్యక్తిగతంగా కూడా పంపుతోంది. దీనివల్ల అభ్యర్థులకు తమ సన్నద్ధతపై అవగాహన పెరుగుతుంది. నియామకాలు పారదర్శకంగా జరిగాయా.. లేదా అనే అంచనాకు కూడా వీలుంటుంది.
2018 నోటిఫికేషన్ నుంచి
ఏపీపీఎస్సీ 36/2016 గ్రూప్-1 నోటిఫికేషన్ను అనుసరించి ప్రధాన పరీక్షలు ముగిశాక అభ్యర్థులకు ఒక్కో సబ్జెక్టులో 150కి వచ్చిన మార్కుల వివరాలను వెల్లడించింది. 2018 నోటిఫికేషన్పై కోర్టు విచారణను అడ్డం పెట్టుకుని మార్కుల వెల్లడి సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. 2022 గ్రూప్-1 నోటిఫికేషన్లో ఎంపిక జరిగిన నెలరోజుల తర్వాత.. కోరినవారికి మార్కులు అందిస్తామని పేర్కొన్నా, అదీ చేయలేదు. విమర్శలు రావడంతో గతనెల 19న జారీ చేసిన ప్రకటనలో నిర్దేశిత తేదీల్లో దరఖాస్తు చేసుకుంటే ఓటీపీ విధానంలో మార్కులు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించింది. ఆ తరువాత రెండు రోజులకు దరఖాస్తు చేయనక్కర్లేదని, ఓటీపీ విధానంలో మార్కులు తెలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామని వెల్లడించింది. అంతేకానీ ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో అందరూ తెలుసుకునే అవకాశాన్ని మాత్రం ఇప్పటివరకు కల్పించలేదు.
1,016 మంది మార్కుల వెల్లడి
య´పీఎస్సీ శుక్రవారం సివిల్స్ నోటిఫికేషన్ అనుసరించి ఎంపిక చేసిన 1,016 మంది అభ్యర్థులకు ప్రధాన పరీక్ష, మౌఖిక పరీక్షల్లో వచ్చిన మార్కులను ర్యాంకులవారీగా వెల్లడించింది. అలాగే సబ్జెక్టులవారీగా వచ్చిన మార్కుల వివరాలను అభ్యర్థులకు వ్యక్తిగతంగా పంపింది. మౌఖిక పరీక్షలకు ఎంపిక కాని వారికి కూడా మార్కులు తెలిపింది. ఏపీపీఎస్సీ మాత్రం ఈ విషయంలో కప్పదాటు వైఖరితో వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సివిల్స్ ర్యాంకర్లకు ప్రధాన పరీక్షల్లో ఎక్కువ మార్కులు.. ఇంటర్వ్యూలో తక్కువ!
యూపీఎస్సీ సివిల్స్లో తొలి ర్యాంకర్ ఆదిత్య శ్రీవాస్తవకు ప్రధాన పరీక్షల్లో 1,750కు 899 మార్కులు వచ్చాయి. మౌఖిక పరీక్షలో 225కు 200 మార్కులు వచ్చాయి. 12వ ర్యాంకర్ ఎ.శాండిల్యకు ప్రధాన పరీక్షల్లో 826 రాగా, మౌఖిక పరీక్షల్లో అందరికంటే అత్యధికంగా 215 మార్కులు రావడం గమనార్హం. రెండో ర్యాంకర్ అనిమేష్ ప్రధాన్కు ప్రధాన పరీక్షల్లో 892, మౌఖిక పరీక్షలో 175 చొప్పున మార్కులు వచ్చాయి. మూడో ర్యాంకర్ అనన్యరెడ్డి (ఈడబ్ల్యూఎస్ కేటగిరి)కి ప్రధాన పరీక్షల్లో 875, మౌఖిక పరీక్షలో 190 చొప్పున మార్కులు వచ్చినట్లు యూపీఎస్సీ వెబ్సైట్ ద్వారా తెలిపింది. యూపీఎస్సీ 21 కేటగిరిల కింద ఎంపిక చేసిన 1,016 మందికి ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్.తోపాటు ఐ.ఆర్.ఎస్., ఇండియన్ డిఫెన్స్ ఆడిట్, ఇతర కేటగిరిల్లోనూ ఉద్యోగాలు లభించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..