విశాఖలో ఏం మిగిల్చారని వస్తున్నారు జగన్!
బిగ్ బాస్కెట్లో పెట్టిన ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్.. ‘మీరు హెచ్ఎస్బీసీలో పనిచేశారు కదా? నన్ను గుర్తు పట్టారా’ అని నన్ను అడిగారు.
భూములన్నీ వైకాపా నాయకులు స్వాహా చేశారు
పరిశ్రమలు, పెట్టుబడుల్ని తరిమేశారు
ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేశారు
నేడు విశాఖకు సీఎం జగన్
బిగ్ బాస్కెట్లో పెట్టిన ఆర్డర్ ఇవ్వడానికి వచ్చిన డెలివరీ బాయ్.. ‘మీరు హెచ్ఎస్బీసీలో పనిచేశారు కదా? నన్ను గుర్తు పట్టారా’ అని నన్ను అడిగారు. తాను కూడా హెచ్ఎస్బీసీలో మాజీ ఉద్యోగినని చెప్పడంతో నేను షాక్ అయ్యాను. కార్పొరేట్ ఉద్యోగం వదిలి ఇలా డెలివరీ బాయ్గా ఎందుకు మారారని అడిగాను. హెచ్ఎస్బీసీ విశాఖలో కార్యకలాపాలు నిలిపివేయడంతో మానుకోవాల్సి వచ్చిందని, ఇతర రాష్ట్రాలకు వెళ్లలేక ఇలా డెలివరీ బాయ్గా మారానని.. ఒక్కో డెలివరీకి రూ.45 చొప్పున సంపాదిస్తున్నానని చెప్పారు. ఈ ప్రభుత్వం డెస్టినీ నగరానికి ఉజ్వల భవిష్యత్ను కల్పించిందని చెబుతోంది కదా? స్థానికంగా అవకాశాలు లేవా అని అడిగాను. ఎత్తైన భవనాలు నిర్మించడం, కూడళ్లలో బొమ్మలు పెట్టడం కాదని, అన్ని రకాల నైపుణ్య శిక్షణలతో ఉపాధి అవకాశాలు స్థానికంగా కల్పించడమే భవిష్యత్ అంటూ అతను సమాధానం ఇచ్చారు’
ఓ యువతి తన ఇన్స్టా పేజీలో పెట్టిన సందేశం ఇది. సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఈనాడు, విశాఖపట్నం: ‘వైకాపా ప్రజాప్రతినిధులు, నాయకులు విశాఖలోని భూములన్నీ స్వాహా చేసేసుకున్నారు..! పరిశ్రమలు, పెట్టుబడుల్నీ తరిమేశారు..సీఎం ముచ్చట తీర్చుకోవడం కోసం రుషికొండకు గుండు కొట్టారు. రూ.వందల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ముఖ్యమంత్రి నివాసం కోసం విలాసవంతమైన భవంతిని నిర్మించారు. పర్యాటక రంగాన్ని పడకేయించారు. ఐటీ రంగంలో చీకట్లు నింపారు.. అయిదేళ్ల పాలనలో విశాఖకు ఇవి తప్ప మీరేం చేశారు జగన్?’ ఆదివారం విశాఖ జిల్లాలో ‘సిద్ధం’ బస్సు యాత్రకు వస్తున్న ముఖ్యమంత్రికి ఇక్కడి ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలివి. దసపల్లా, హయగ్రీవ, రామానాయుడు స్టూడియో, సీబీసీఎన్సీ, ఎన్సీసీ.. ఇలా నగరంలో అత్యంత విలువైన భూములు, ప్రాజెక్టులనూ వైకాపా నేతలు కొట్టేశారు. పోనీ ఈ ప్రాంతానికి విపక్ష నేతగా పాదయాత్రలోను, ముఖ్యమంత్రి హోదాలోనూ ఇచ్చిన హామీలను ఏమైనా జగన్ నెరవేర్చారా అంటే అదీ లేదు? విశాఖ నుంచి ఎంత వీలైతే అంత పిండుకోవాలన్న ఆలోచన తప్ప నగరం అభివృద్ధికి చేసింది శూన్యమే. విశాఖలోని ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి రూ.23,200 కోట్ల రుణం తెచ్చేశారు. విశాఖను పరిపాలన రాజధాని చేస్తామంటూ అయిదేళ్లలో ఒక్క కొత్త ప్రాజెక్టును కూడా తేలేదు సరికదా, గత ప్రభుత్వ హయాంలో వచ్చిన లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ప్రాజెక్టులను, పెట్టుబడులనూ వెళ్లగొట్టారు. ఇప్పుడు మళ్లీ ఓట్లు కోసం వస్తున్న జగన్ను.. ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని నిలదీసేందుకు విశాఖ ప్రజలు ‘సిద్ధం’గా ఉన్నారు.
ఐటీలో చీకట్లు నింపిన జగన్..!
సాగరతీరంలో ‘ఐటీ వెలుగులు నింపుతాం’ అంటూ అప్పటి విపక్ష నేతగా జగన్ ఢంకాభజాయించి చెప్పారు. ఆయన అధికారంలోకి రాగానే, ఉన్న కంపెనీలను విశాఖపట్నాన్ని వదిలేలా చేసి ఐటీ రంగాన్ని చీకట్లలోకి నెట్టేశారు. కార్పొరేట్ ఉద్యోగాలు కోల్పోయిన యువత క్యాబ్ డ్రైవర్లుగా, డెలివరీ బాయ్స్గా మారారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పొరుగున ఉన్న ఒడిశాలోని భువనేశ్వర్లో గత అయిదేళ్లలో ఐటీ రెండింతలు అభివృద్ధి చెందింది. ఇన్ఫోసిస్ వంటి పెద్ద క్యాంపస్లతోపాటు, పలు బడా కంపెనీలు అక్కడ ఏర్పాటయ్యాయి. ఐటీ ఎగుమతులు పెరిగిపోయాయి. అదే అయిదేళ్లలో ఏపీలో చూస్తే జగన్ నాయకత్వలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించి రూ.100 కోట్లు బకాయిపెట్టారు. తొలివిడతగా విశాఖలోని 86 ఐటీ కంపెనీలకు సంబంధించి రూ.28 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే ఖాతాల్లో జమ చేస్తామంటూ ఐటీ మంత్రి అమర్నాథ్ కోతలు కోశారు. ఫలితం లేకపోవడంతో కొన్ని ఐటీ కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. 8 వారాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికీ రూపాయి అందించలేదు.
ఉత్తుత్తి శంకుస్థాపనలతో సరి..!
జగన్ 2019 డిసెంబరులో విశాఖకు వచ్చిన సందర్భంగా ఒకేసారి రూ.750 కోట్ల విలువైన జీవీఎంసీ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అయితే ఇప్పటి వరకు ఖర్చు చేసింది సుమారు రూ.130 కోట్లు మాత్రమే. ప్రతి నియోజకవర్గానికి ఈతకొలను, ఇండోర్ స్టేడియం హామీలు అటకెక్కాయి. రూ.37 కోట్లతో శంకుస్థాపన చేసిన ప్లానిటోరియం ప్రాజెక్టు చతికిలపడింది. తూర్పు నియోజకవర్గంలోని పాండురంగపురంలో రజకులకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్న హామీ అమలు కాలేదు. విశాఖ నగర తాగునీటి సమస్యను స్థానిక వైకాపా ప్రజాప్రతినిధులు తాడేపల్లిలో జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఏలేరు నుంచి పైపులైన్ల ద్వారా 300 ఎంఎల్డీ జలాలు నేరుగా నగరానికి సరఫరా అయ్యేలా రూ.3,338 కోట్లతో ప్రాజెక్టు చేపడతామని చెప్పి మాట ఇచ్చి నెరవేర్చలేదు. ఎప్పుడో పరుగులు పెట్టించాల్సిన విశాఖ మెట్రోను అటకెక్కించి, డీపీఆర్ మార్పు చేసి ఈ ఏడాది జనవరి 15న శంకుస్థాపన చేస్తామంటూ హడావుడి చేసి పక్కన పెట్టేశారు.
హనుమంతువాక పైవంతెనకు అతీగతీ లేదు
జగన్ 2022లో విశాఖ తూర్పు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు.. హనుమంతువాక వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ దీనికి అతీగతీ లేదు. నగరవాసులు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనకాపల్లి నుంచి ఆనందపురం మధ్య 58 కి.మీ.ల పరిధిలో వివిధ ప్రాంతాల్లో ఫ్లైఓవర్లను నిర్మించాలని ఎన్హెచ్ఏఐ కొన్ని నెలల క్రితం నిర్ణయించింది. గాజువాక, మద్దిలపాలెం/సత్యం జంక్షన్, హనుమంతువాక, కారుషెడ్ జంక్షన్లలో ప్రధానంగా నాలుగు వంతెనలను జీవీఎంసీ ప్రతిపాదించింది. ఆ ప్రాజెక్టులను ఎన్హెచ్ఏఐ పూర్తి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టకపోవడం, డీపీఆర్ ఖరారు చేయడంలో నిర్లక్ష్యం నగరవాసులకు శాపమైంది.
‘ఉక్కు’ ఊపిరితీసి ఓట్లెలా అడుగుతారు జగన్?
విశాఖ ఉక్కుకు ప్రత్యేక గనుల కేటాయింపుపై అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడతానని పాదయాత్ర సమయంలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంటుకు ప్రత్యేక గనులు కేటాయింపుపై కిక్కురుమనలేదు. పైగా విశాఖ ఉక్కు పరిశ్రమకు విజయనగరం జిల్లా గర్భాంలోని మాంగనీస్ గనుల లీజు పొడిగించకుండా నిలిపి వేశారు. రూ.2 వేల కోట్లు ఆర్థిక సాయం చేసి, ప్రతిగా ప్రభుత్వ పథకాలకు స్టీల్ను తీసుకెళ్లాలని అభ్యర్థించినా పట్టించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.