మాటలతో ఓదార్చి.. చేతల్లో ఏమార్చి..!
రైతుల కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలసి కలెక్టర్ వారింటికి వెళ్లాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం ఇవ్వాలి.
ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు దక్కని భరోసా
సాయం కోసం నెలలు, ఏళ్ల తరబడి ఎదురుచూపులే
బాధితులను ఓదార్చని కలెక్టర్లు, వైకాపా ఎమ్మెల్యేలు
43 జీవోపై మాట తప్పిన సీఎం జగన్
మళ్లీ రైతుల ముందుకు ఎలా వస్తున్నారు?
జగన్ గొప్పగా చెప్పిందేమిటంటే
రైతుల కుటుంబాల్లో జరగరానిది జరిగితే వెంటనే స్థానిక ఎమ్మెల్యేతో కలసి కలెక్టర్ వారింటికి వెళ్లాలి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7లక్షల పరిహారం ఇవ్వాలి. అదీ ఏడు రోజుల్లోనే అందించాలి. అన్నదాతల విషయంలో సానుభూతి, మానవీయతతో ఉండాలి. మనిషే చనిపోయిన తర్వాత మనం కూడా తోడుగా లేకుంటే సరైన సందేశం ఇచ్చినట్టు కాదు. బాధితులకు ఆత్మస్థైర్యం ఇవ్వడమే మన ఉద్దేశం’’ అంటూ 2019 జులై 10న స్పందన సమీక్ష సమావేశంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ ఎంతో మానవతావాదిగా గొప్పలు చెప్పారు.
వాస్తవంగా జరిగిందిదీ...
రాష్ట్రంలో ఏటా 1,100 మందికిపైగా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో కనీసం 1% మంది ఇళ్లకు కూడా కలెక్టర్, ఎమ్మెల్యేలు వెళ్లిన దాఖలాలు లేవు. సాయం కోసం బాధితులు నెలలు, ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఓదార్పులైనా లేవు. త్రీమెన్ కమిటీలు కూడా రైతుల్ని పరామర్శించలేదు. వైకాపా నేతల సిఫార్సులనే పరిగణనలోకి తీసుకున్నారు. వారి కరుణ లేకుంటే... ఆత్మహత్య చేసుకున్న వారిని అసలు రైతులుగా గుర్తించడం లేదు. 7రోజుల్లో సాయం నిబంధన అమలు కావడమే లేదు.
ఇంటి యజమానిని కోల్పోయి... కుటుంబం గడిచే మార్గం లేక, పిల్లల చదువులు సాగక, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న రైతు కుటుంబాలకు మేమున్నామనే ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కానీ, జగన్ మాటల్లో విన్పించే ఉదారత... సాయం విషయంలో లేశమాత్రమైనా కనిపించదు. సాగులో నష్టాల కారణంగా అన్నదాతలు ప్రాణాలను వదులుతుంటే.. దానికి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలూ ఒక కారణమనే ఆలోచనే చేయరు. సరికదా? రైతు కుటుంబాల్లో జగన్కు మాత్రం చిక్కటి చిరునవ్వులు కన్పిస్తున్నాయంట. బాధిత కుటుంబానికి వారంలో రూ.7లక్షల పరిహారం అందజేస్తామన్న హామీ గాలిలో దీపమైంది. పార్టీల ముసుగులో పరిహారం అందకుండా వైకాపా నేతలు కొర్రీలు పెడుతున్నారు.
పరిహారం ఇమ్మంటే పరిహాసపు మాటలు!
వందల సంఖ్యలో ఉన్న రైతు ఆత్మహత్యల నివేదికలను పరిశీలించకుండానే కార్యాలయాల్లో అధికారులు తొక్కిపట్టారు. ఆ వచ్చే డబ్బు కన్నబిడ్డల భవిష్యత్తుకు కొంతైనా భరోసా ఇస్తుందని, తమపై దయతలచాలని వేడుకుంటున్న బాధితులను వంకర మాటలతో అవహాళన చేస్తున్నారు. నెలల తరబడి తిరుగుతున్నా, స్పందనలో పలుమార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ప్రకాశం జిల్లాకు చెందిన మహిళ వాపోయారు. మీ ఆయన వ్యవసాయం చేసేందుకు తెచ్చిన అప్పుల కారణంగానే చనిపోయాడని రుజువేంటంటూ ఓ వ్యవసాయ అధికారి చులకనగా మాట్లాడారని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఒక రైతు భార్య విలపించారు. అనంతపురం జిల్లాకు చెందిన జయప్ప అనే రైతు టమాటా సాగుతో రూ.8 లక్షలు అప్పుచేసి తీర్చలేక.. పొలంలోనే బలవన్మరణం చెందారు. తన ఇద్దరు చిన్న పిల్లలను రూ.3000 వితంతు పింఛన్తోనే బతికిస్తున్నానంటూ రైతు భార్య శిరీష కన్నీరు పెట్టుకున్నారు.
శ్మశానంలోనే తనువు చాలించారు
పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరుకు చెందిన నంద్యాల గురవయ్య(62) కౌలు రైతు. భార్య దాసమ్మతో కలిసి పంటలు సాగు చేస్తున్నారు. తమ ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు. మూడేళ్లుగా పంటలు పండకపోవడంతో అప్పులు అధికమయ్యాయి. అవి రూ.8 లక్షలకు చేరుకున్నాయి. ఊళ్లోనే రూ.2 వడ్డీకి అప్పులు తెచ్చారు. వాటిని తీర్చే దారి కనిపించక... ఫిబ్రవరి 6న శ్మశానంలోనే పురుగుల మందు తాగి, ప్రాణాలు వదిలారు. పోలీసులు, వీఆర్వో సైతం అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు నివేదిక ఇచ్చారు. గురవయ్యకు కౌలుకార్డు లేదని, దీన్ని సాకుగా చూపి, పరిహారాన్ని ఆపొద్దని ఆయన భార్య అధికారులను వేడుకుంటున్నారు.
ఇదీ... అధికారులు చేయాల్సింది
ఆత్మహత్యలధిత రైతు కుటుంబాలకు సత్వరమే భరోసా ఇస్తామంటూ 2019 అక్టోబరు 14న జగన్ ప్రభుత్వం జీవో43 తీసుకొచ్చింది. దాని ప్రకారం... బాధిత కుటుంబాన్ని కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే పరామర్శించి, వారికి ధైర్యాన్నివ్వాలి. అదే రోజు వీఆర్వో సంఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి రైతు కుటుంబ వివరాలను సేకరించాలి.
- మండల స్థాయి కమిటీ విచారణ చేపట్టి 24 గంటల్లోపు డివిజన్ స్థాయి కమిటీకి ప్రాథమిక నివేదిక అందజేయాలి.
- రైతు ఇల్లు/పొలం పరిధి, ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, అప్పుల వివరాలను సేకరించి, వాటిని నిర్ధారించుకోవాలి. జాయింట్ కలెక్టర్/వ్యవసాయ శాఖ జేడీ నివేదిక రూపొందించాలి.
- డివిజన్ స్థాయి త్రిసభ్య కమిటీ ఏడు రోజుల్లోగా పరిశీలనను పూర్తి చేసి, బాధిత కుటుంబం ప్రభుత్వ పరిహారం పొందేలా ఆఖరి సిఫార్సు చేయాలి.
- తుది నివేదిక పూర్తయ్యాక రూ.7లక్షలు బాధితులకు అందించేలా వ్యవసాయశాఖ కమిషనర్/డైరెక్టర్కు జిల్లా కలెక్టర్ ప్రతిపాదన చేయాలి.
పరామర్శ లేదు.. సాయం చేయలేదు!
- రైతు ఆత్మహత్య తర్వాత బాధితులను కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శించడంలేదు. వారింటికి క్షేత్రస్థాయి అధికారులు వెళ్లడంలేదు.
- మండల, డివిజన్ స్థాయి త్రిసభ్య కమిటీల్లో అధికారుల మధ్య సమన్వయం లోపించింది. రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల వద్ద దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి.
- అధికార పార్టీ నేతల సిఫార్సులతోనే త్రిసభ్య కమిటీలు తమ నివేదికలను రూపొందిస్తున్నాయి.
- కమిటీలు... పార్టీలు, కులం, ప్రాంతాల ప్రభావానికి గురవుతూ పరిహారానికి సిఫార్సు చేస్తున్నాయి.
- 2019, 2020 సంవత్సరాలకు సంబంధించిన దరఖాస్తుల ఆలస్యానికి కారణాలు చూపుతూ వ్యవసాయ శాఖ కమిషనర్ జస్టిఫికేషన్ రిపోర్టులు కావాలంటున్నారు.
- బాధిత కుటుంబాలు స్పందనలో అర్జీలు ఇచ్చినా యంత్రాంగం స్పందించడం లేదు.
- కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేవనే సాకుతో నివేదికల తయారీ వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు.
రెండేళ్లుగా తిప్పుకొంటున్నారు...!
గుంటూరు జిల్లాకు చెందిన పులి వెంకటరెడ్డి, సుబ్బరత్తమ్మలు... బతుకుదెరువు కోసం ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ శివారు శివరాజ్నగర్కు వచ్చారు. వారికి శ్రీనివాసరెడ్డి(6 తరగతి), నాగేందర్రెడ్డి(4వ తరగతి) అనే ఇద్దరు పిల్లలు. పదేళ్లుగా పొలాలను కౌలుకు తీసుకుని, వ్యవసాయం చేస్తున్నారు. చందలూరు వద్ద ఐదెకరాల్లో మిరప, దర్శి ప్రాంతంలో 10 ఎకరాల్లో వరి వేశారు. ఎప్పుడూ నష్టాలే వచ్చాయి. అప్పులు రూ.12 లక్షలకు పెరిగాయి. వాటిని తట్టుకోలేక వెంకటరెడ్డి 2020 అక్టోబరు 1న పురుగుల మందు తాగారు. ఒంగోలులోని ప్రైవేటు ఆసుపత్రిలో రూ.3 లక్షల ఖర్చుతో 12 రోజులపాటు వైద్యం అందించారు. ఆరోగ్యం విషమించటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదే నెల 15న మరణించారు. మొత్తం రూ.15 లక్షల భారం ఆయన భార్య నెత్తిన పడింది. రైతు ఆత్మహత్య కింద పరిహారం పొందేందుకు రెండేళ్లుగా ఆమె కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడేమో ఫైల్ పోయిందంటున్నారని, 7రోజుల్లోనే డబ్బులొస్తాయని చెప్పి... రెండేళ్లుగా తిప్పించుకుంటున్నారని వాపోయారు. బిడ్డల కోసం సుబ్బరత్తమ్మ కూలీ పనులకు వెళ్తున్నారు.
రెండు నెలలైనా నివేదిక కదల్లేదు!
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు సమీపంలోని చౌటపల్లికి చెందిన గురజాల శ్రీనివాసరావు, సామ్రాజ్యం దంపతులకు చైతన్య, ప్రవల్లిక పిల్లలు. వ్యవసాయాన్ని నమ్ముకున్న ఆ కుటుంబానికి 13 ఎకరాల సొంత పొలముంది. మరో 20 ఎకరాలను కౌలుకు తీసుకొని మొక్కజొన్న, కంది, పత్తి, మిరప సాగు చేసేవారు. 2021లో తెగుళ్లు, తుపాన్లతో తీవ్ర నష్టం వచ్చింది. బ్యాంకులో తీసుకున్న రూ.25 లక్షల రుణం, బయట తెచ్చిన అప్పులతో మొత్తం రూ.కోటిన్నరకు చేరింది. గొప్పగా బతికిన చోట తలెత్తుకోలేననే బాధతో శ్రీనివాసరావు ఈ ఏడాది జనవరి 15న పురుగుమందు తాగారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత చనిపోయారు. వ్యవసాయ శాఖకు అన్ని వివరాలను సమర్పించి రెండు నెలలైనా నివేదిక ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదని ఆయన కుమారుడు చైతన్య వాపోతున్నారు.
స్పందించని మండలస్థాయి త్రిసభ్య కమిటీ
ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం భీమవరానికి చెందిన పిట్లంపల్లి కోటయ్య, త్రివేణి దంపతులకు సేద్యమంటే ప్రాణం. సొంత పొలం లేకున్నా... కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నారు. వారికి బాలకృష్ణ(9వ తరగతి), సాత్విక(5వ తరగతి) సంతానం. నాలుగేళ్లుగా ఐదెకరాల్లో పత్తి, మిరప సాగు చేస్తున్నారు. ఏనాడూ దిగుబడులు సరిగా రాలేదు. అప్పులు, వడ్డీలు కలిపి రూ.10 లక్షలకు చేరడంతో తీర్చలేననే భయంతో ఈ ఏడాది జనవరి 28న పురుగుల మందు తాగారు. రెండ్రోజులు మృత్యువుతో పోరాడి మరణించారు. కళ్లెదుటే పచ్చటి సంసారం కుప్పకూలడంతో త్రివేణి హతాశురాలైంది. మానసికంగా కుంగిపోయిన కొడుకు బడికి వెళ్లడం లేదు. రైతు ప్రాణపదంగా పెంచుకున్న ఎడ్లను పోషించలేక అమ్మేశారు. ఏడు రోజుల్లోనే నివేదిక పంపాల్సిన మండల త్రిసభ్య కమిటీ బాధితులకు న్యాయం చేయలేకపోయింది. తహసీల్దార్ నుంచి నివేదిక రాలేదని, తామేం చేయలేమంటూ ఆర్డీవో కార్యాలయం చేతులెత్తేసింది.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి