అవినీతి ‘వర్ధనం’!
ఆయన హయాంలో కొండలు లోయలయ్యాయి.. ఇసుక తోడేయడంతో నదులు గుల్లయ్యాయి.. వ్యాపారుల గల్లాపెట్టెలు ఘొల్లుమన్నాయి.. గుత్తేదారుల ఖాతాలు ఖాళీ అయ్యాయి.
వైకాపా ప్రజాప్రతినిధి భూదందాకు అధికారుల చెంచాగిరీ
అత్తగారి ఊళ్లోనూ అక్రమాల బాగోతం
గుత్తేదారు కమీషన్ ఇవ్వలేదని కాల్వ పనులనూ నిలిపి వేయించిన దాష్టీకం
నెల్లూరు జిల్లాలో ఓ కీలక నాయకుడి తీరు
ఈనాడు, అమరావతి
ఆయన హయాంలో కొండలు లోయలయ్యాయి..
ఇసుక తోడేయడంతో నదులు గుల్లయ్యాయి..
వ్యాపారుల గల్లాపెట్టెలు ఘొల్లుమన్నాయి..
గుత్తేదారుల ఖాతాలు ఖాళీ అయ్యాయి..
సర్కారులో పెద్ద పదవి వచ్చీ రావడంతోనే.. కోర్టులో ఆయన కేసుకు సంబంధించిన ఫైళ్లూ మాయమయ్యాయి..
భారీ వాహనాల నుంచి వసూళ్లు.. సర్కారు భూములపై కన్నేసి అనుచరులకు మేళ్లు..
మద్యం రాబడితో ప్యాలెస్ను తలదన్నేలా ఇల్లు..
ఆయన అవినీతి, అక్రమాలు తెలిసిన వారంతా వెళ్లబెడుతున్నారు నోళ్లు!
అవినీతి, అక్రమాల్లో ‘కాక’లు తీరిన నాయకుడాయన. తన పేరులో ఉన్న ‘కొండ’ంత స్థాయిలో అరాచకాలను సాగిస్తూ సార్థక నామధేయుడిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. అధికార వైకాపాకు చెందిన ఈ సీనియర్ ప్రజాప్రతినిధి రాష్ట్రస్థాయిలో ఉన్నత హోదాను వెలగబెడుతున్నారు. జిల్లాలో ఆయన పేరు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది పదేళ్ల కిందటి నకిలీ మద్యం అక్రమ రవాణా, పంపిణీ వ్యవహారం. క్వార్ట్జ్, మట్టి, గ్రావెల్, ఇసుక.. ఇలా సహజ వనరుల దోపిడీతో దండుకుంటున్నారీ నేత. నియోకజవర్గ పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు ఎక్కడ లేఅవుట్లు వేసినా ఎకరాకు కొంత చొప్పున ఈ నేతకు కప్పం కట్టాల్సిందే.
అంతర్జాతీయ స్మగ్లర్తో కలిసి..
2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించి తాను ఉంటున్న నియోజకవర్గంలో ఓటర్లకు పంచి పెట్టించారీ నేత. ఆ కల్తీ మద్యం తాగి కొందరు ప్రాణాలు కోల్పోయారని అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అందుకు కారణమైన ఈ నేతపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఇందులో అంతర్జాతీయ స్మగ్లర్ ప్రమేయమూ ఉండటం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయంతో నెల్లూరు నగరంలోని తన పాత నివాసం పక్కనే అధునాతన హంగులతో రూ.కోట్లు వెచ్చించి భారీ భవనం నిర్మించారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అందుకే ఆ నివాసాన్ని వ్యంగ్యంగా ‘రా...ప్యాలెస్’ అని పిలుస్తుంటారు. విచిత్రమేంటంటే.. వైకాపా నేతలూ అదే పేరుతో పిలుస్తుండడం గమనార్హం.
తవ్వుకో.. అమ్ముకో..
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నియోజకవర్గ పరిధిలో రూ.వందల కోట్ల విలువైన క్వార్ట్జ్, మట్టి, గ్రావెల్ను అక్రమంగా తరలించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కొండలను కొల్లగొట్టారు. ఈ ప్రజాప్రతినిధి అండతో అనుచరులే ఈ దందాను సాగిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇందులో ఈ నేతకు నేరుగా ముడుపులు అందుతున్నాయి. పక్క జిల్లాలో ఎంపీగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడికి తెలియకుండానే.. ఆయన పేరుతో అనుమతులు తీసుకుని సర్వేపల్లి రిజర్వాయరు నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించారు. దీనిపై కొందరు లోకాయుక్తాకు ఫిర్యాదు చేయగా.. విచారణ కొనసాగుతోంది. కనుపూరు చెరువు, ఈదగాలి, కంటేపల్లి, రామదాసుకండ్రిగ, మహ్మదాపురం తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో భారీగా గ్రావెల్ తవ్వేశారు. ఈ తవ్వకాలపై ప్రతిపక్ష నేతలు ఆందోళన చేయటంతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.
అడ్డంగా దోచేశారు..
ఈ ప్రజాప్రతినిధి సొంత మండలంలోని ఒక ‘గిరి’ కొండకు ఎంతో విశిష్టత ఉంది. గతంలో ఈ నేత ఆ కొండపైకి వెళ్లి ‘నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ ఈ కొండను ఎవరినీ తాకనివ్వను’ అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడే ఆయన తెలివిని ప్రదర్శించారు. తాను ఎక్కిన కొండను మాత్రం వదిలేసి.. దాని చుట్టూ ఉన్న గుట్టలను అనుచరుల సాయంతో కొల్లగొట్టేశారు. ఇదే మండలంలోని రీచ్లో అనుమతులు లేకుండానే భారీగా ఇసుకను అక్రమ రవాణా చేసి రూ.కోట్లు వెనకేసుకున్నారు.
కమీషన్ ఇవ్వలేదని..
నియోజకవర్గంలోని రెండు మండలాలకు ఉపయుక్తమైన ఒక కాలువను తెదేపా హయాంలో మంజూరు చేసి పనులు ప్రారంభించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక, తనకు కమీషన్ ఇవ్వలేదని గుత్తేదారును బెదిరించి పనులను నిలిపివేయించారు. ఒక మండలంలో తెదేపా హయాంలో రూ.4.5 కోట్లతో భారీ శుద్ధ జల ప్లాంటు ఏర్పాటు చేయగా.. వైకాపా అధికారంలోకి రావడంతోనే అక్కసుతో దాన్ని నిలిపివేయించారు. కనుపూరు చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్, మట్టి తవ్వేసి.. నెల్లూరులోని ప్రైవేటు లేఅవుట్లకు, ఈ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల ప్లాట్లకు, పొలాలకు తరలించారని స్థానికులే చెబుతున్నారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు, ఆయకట్టు రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో లోకాయుక్తా దృష్టికి తీసుకెళ్లారు. కోడూరు, పిడతాపోలూరు, వల్లూరు చెరువుల నుంచీ భారీగా మట్టి తరలించి సొమ్ము చేసుకున్నారు.
అనధికార టోల్
ముత్తుకూరు-వెంకటాచలం మండలాల సరిహద్దులో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై అనధికారికంగా టోల్ ఏర్పాటు చేయించారీ ప్రజాప్రతినిధి. ఆ మార్గంలో రాకపోకలు సాగించే భారీ వాహనాల నుంచి వసూళ్లు చేయడం ప్రారంభించారు. ముత్తుకూరు మండలంలోని థర్మల్ కేంద్రాల ద్వారా వచ్చే బూడిదనూ వదల్లేదు. కరోనా సమయంలో పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేసేందుకంటూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.
కరోనా కాలంలో..
ఆ ప్రాంతంలో 850 కేజీల ధాన్యాన్ని ఒక పుట్టిగా వ్యవహరిస్తుంటారు. కరోనా సమయంలో ఇక్కడి వైకాపా నాయకులు దళారుల అవతారమెత్తి, రైతుల నుంచి పుట్టికి వెయ్యి కేజీలకుపైగా ధాన్యాన్ని బలవంతంగా తీసుకున్నారు. మరోవైపు పంటకాల్వల్లో పూడికతీత, ఇతర పనులు చేయకుండానే బిల్లులు మింగేశారు. కనుపూరు కాల్వ పనులు, మంజూరైన నిధుల వివరాలను స.హ. చట్టం కింద అడిగినా అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం.
కోర్టులోని ఫైళ్లు మాయం
వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆయనకు విదేశాల్లో ఆస్తులున్నాయనీ, అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్లున్నాయంటూ కొన్ని డాక్యుమెంట్లనూ మీడియాకు విడుదల చేశారు. అవన్నీ అబద్ధాలనీ, నకిలీ డాక్యుమెంట్లతో ఆరోపణలు చేశారని ఆయన కేసు కూడా పెట్టారు. దాదాపు రెండేళ్ల కిందట ఈ ప్రజాప్రతినిధికి రాష్ట్రస్థాయిలో పదవి దక్కిన రెండు మూడు రోజులకే నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు అపహరణకు గురయ్యాయన్న వార్తలూ వచ్చాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా చేపట్టింది.
అత్తగారి సొమ్ములా భూముల ఆక్రమణ
నెల్లూరు గ్రామీణ మండలంలోని అత్తగారి ఊరిలోనూ ఈ ప్రజాప్రతినిధి తన పనితనాన్ని చూపించారు. ఆ గ్రామంలో ఆయనకు కొంత భూమిని అత్తింటివాళ్లు ఇచ్చారు. దానికి ఆనుకుని ఉన్న దళితుల భూములను తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడే ఈ ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు. అధికారులు సర్వే నిర్వహించి ఆక్రమణ నిజమేనని తేల్చి, ఆ భూములను తిరిగి దళితులకు ఇప్పించారు. అత్తగారిచ్చిన స్థలానికి మరో వైపున్న విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల స్థలాలనూ ఆయన ఆక్రమించారని ఆయా ప్లాట్ల యజమానులు కేసు పెట్టారు. ప్రభుత్వ, చెరువు భూములనూ అనుచరుల పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వంద ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చేసిన వ్యవహారంలో ఇప్పటికే ఇక్కడో తహసీల్దారు సస్పెన్షన్కు గురయ్యారు. కాకుటూరు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రూ.కోట్ల విలువైన సర్కారు భూములను, ఈ నేత ప్రైవేటు వాటిగా రికార్డులు మార్పించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆయన అనుచరుడితోపాటు మరికొందరిపై అధికారులు కేసు నమోదు చేసి, జైలుకు పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు