అవినీతి ‘వర్ధనం’!
ఆయన హయాంలో కొండలు లోయలయ్యాయి.. ఇసుక తోడేయడంతో నదులు గుల్లయ్యాయి.. వ్యాపారుల గల్లాపెట్టెలు ఘొల్లుమన్నాయి.. గుత్తేదారుల ఖాతాలు ఖాళీ అయ్యాయి.
వైకాపా ప్రజాప్రతినిధి భూదందాకు అధికారుల చెంచాగిరీ
అత్తగారి ఊళ్లోనూ అక్రమాల బాగోతం
గుత్తేదారు కమీషన్ ఇవ్వలేదని కాల్వ పనులనూ నిలిపి వేయించిన దాష్టీకం
నెల్లూరు జిల్లాలో ఓ కీలక నాయకుడి తీరు
ఈనాడు, అమరావతి
ఆయన హయాంలో కొండలు లోయలయ్యాయి..
ఇసుక తోడేయడంతో నదులు గుల్లయ్యాయి..
వ్యాపారుల గల్లాపెట్టెలు ఘొల్లుమన్నాయి..
గుత్తేదారుల ఖాతాలు ఖాళీ అయ్యాయి..
సర్కారులో పెద్ద పదవి వచ్చీ రావడంతోనే.. కోర్టులో ఆయన కేసుకు సంబంధించిన ఫైళ్లూ మాయమయ్యాయి..
భారీ వాహనాల నుంచి వసూళ్లు.. సర్కారు భూములపై కన్నేసి అనుచరులకు మేళ్లు..
మద్యం రాబడితో ప్యాలెస్ను తలదన్నేలా ఇల్లు..
ఆయన అవినీతి, అక్రమాలు తెలిసిన వారంతా వెళ్లబెడుతున్నారు నోళ్లు!
అవినీతి, అక్రమాల్లో ‘కాక’లు తీరిన నాయకుడాయన. తన పేరులో ఉన్న ‘కొండ’ంత స్థాయిలో అరాచకాలను సాగిస్తూ సార్థక నామధేయుడిగా నెల్లూరు జిల్లాలో చక్రం తిప్పుతున్నారు. అధికార వైకాపాకు చెందిన ఈ సీనియర్ ప్రజాప్రతినిధి రాష్ట్రస్థాయిలో ఉన్నత హోదాను వెలగబెడుతున్నారు. జిల్లాలో ఆయన పేరు చెప్పగానే ఎవరికైనా టక్కున గుర్తొచ్చేది పదేళ్ల కిందటి నకిలీ మద్యం అక్రమ రవాణా, పంపిణీ వ్యవహారం. క్వార్ట్జ్, మట్టి, గ్రావెల్, ఇసుక.. ఇలా సహజ వనరుల దోపిడీతో దండుకుంటున్నారీ నేత. నియోకజవర్గ పరిధిలో స్థిరాస్తి వ్యాపారులు ఎక్కడ లేఅవుట్లు వేసినా ఎకరాకు కొంత చొప్పున ఈ నేతకు కప్పం కట్టాల్సిందే.
అంతర్జాతీయ స్మగ్లర్తో కలిసి..
2014 ఎన్నికల సమయంలో గోవా నుంచి కల్తీ మద్యం తెప్పించి తాను ఉంటున్న నియోజకవర్గంలో ఓటర్లకు పంచి పెట్టించారీ నేత. ఆ కల్తీ మద్యం తాగి కొందరు ప్రాణాలు కోల్పోయారని అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. అందుకు కారణమైన ఈ నేతపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఇందులో అంతర్జాతీయ స్మగ్లర్ ప్రమేయమూ ఉండటం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో మద్యం విక్రయాలపై వచ్చే ఆదాయంతో నెల్లూరు నగరంలోని తన పాత నివాసం పక్కనే అధునాతన హంగులతో రూ.కోట్లు వెచ్చించి భారీ భవనం నిర్మించారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. అందుకే ఆ నివాసాన్ని వ్యంగ్యంగా ‘రా...ప్యాలెస్’ అని పిలుస్తుంటారు. విచిత్రమేంటంటే.. వైకాపా నేతలూ అదే పేరుతో పిలుస్తుండడం గమనార్హం.
తవ్వుకో.. అమ్ముకో..
వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ నియోజకవర్గ పరిధిలో రూ.వందల కోట్ల విలువైన క్వార్ట్జ్, మట్టి, గ్రావెల్ను అక్రమంగా తరలించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, కొండలను కొల్లగొట్టారు. ఈ ప్రజాప్రతినిధి అండతో అనుచరులే ఈ దందాను సాగిస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఇందులో ఈ నేతకు నేరుగా ముడుపులు అందుతున్నాయి. పక్క జిల్లాలో ఎంపీగా ఉన్న నెల్లూరు జిల్లాకు చెందిన ఒక నాయకుడికి తెలియకుండానే.. ఆయన పేరుతో అనుమతులు తీసుకుని సర్వేపల్లి రిజర్వాయరు నుంచి అక్రమంగా గ్రావెల్ తరలించారు. దీనిపై కొందరు లోకాయుక్తాకు ఫిర్యాదు చేయగా.. విచారణ కొనసాగుతోంది. కనుపూరు చెరువు, ఈదగాలి, కంటేపల్లి, రామదాసుకండ్రిగ, మహ్మదాపురం తదితర గ్రామాల్లోని ప్రభుత్వ భూముల్లో భారీగా గ్రావెల్ తవ్వేశారు. ఈ తవ్వకాలపై ప్రతిపక్ష నేతలు ఆందోళన చేయటంతో వెంకటాచలం పోలీసులు కేసు నమోదు చేశారు.
అడ్డంగా దోచేశారు..
ఈ ప్రజాప్రతినిధి సొంత మండలంలోని ఒక ‘గిరి’ కొండకు ఎంతో విశిష్టత ఉంది. గతంలో ఈ నేత ఆ కొండపైకి వెళ్లి ‘నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ ఈ కొండను ఎవరినీ తాకనివ్వను’ అని ప్రతిజ్ఞ చేశారు. అక్కడే ఆయన తెలివిని ప్రదర్శించారు. తాను ఎక్కిన కొండను మాత్రం వదిలేసి.. దాని చుట్టూ ఉన్న గుట్టలను అనుచరుల సాయంతో కొల్లగొట్టేశారు. ఇదే మండలంలోని రీచ్లో అనుమతులు లేకుండానే భారీగా ఇసుకను అక్రమ రవాణా చేసి రూ.కోట్లు వెనకేసుకున్నారు.
కమీషన్ ఇవ్వలేదని..
నియోజకవర్గంలోని రెండు మండలాలకు ఉపయుక్తమైన ఒక కాలువను తెదేపా హయాంలో మంజూరు చేసి పనులు ప్రారంభించారు. 2019లో వైకాపా అధికారంలోకి వచ్చాక, తనకు కమీషన్ ఇవ్వలేదని గుత్తేదారును బెదిరించి పనులను నిలిపివేయించారు. ఒక మండలంలో తెదేపా హయాంలో రూ.4.5 కోట్లతో భారీ శుద్ధ జల ప్లాంటు ఏర్పాటు చేయగా.. వైకాపా అధికారంలోకి రావడంతోనే అక్కసుతో దాన్ని నిలిపివేయించారు. కనుపూరు చెరువు నుంచి అక్రమంగా గ్రావెల్, మట్టి తవ్వేసి.. నెల్లూరులోని ప్రైవేటు లేఅవుట్లకు, ఈ ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుల ప్లాట్లకు, పొలాలకు తరలించారని స్థానికులే చెబుతున్నారు. గ్రావెల్ అక్రమ తవ్వకాలపై గ్రామస్థులు, ఆయకట్టు రైతులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోకపోవడంతో లోకాయుక్తా దృష్టికి తీసుకెళ్లారు. కోడూరు, పిడతాపోలూరు, వల్లూరు చెరువుల నుంచీ భారీగా మట్టి తరలించి సొమ్ము చేసుకున్నారు.
అనధికార టోల్
ముత్తుకూరు-వెంకటాచలం మండలాల సరిహద్దులో కృష్ణపట్నం పోర్టు రోడ్డుపై అనధికారికంగా టోల్ ఏర్పాటు చేయించారీ ప్రజాప్రతినిధి. ఆ మార్గంలో రాకపోకలు సాగించే భారీ వాహనాల నుంచి వసూళ్లు చేయడం ప్రారంభించారు. ముత్తుకూరు మండలంలోని థర్మల్ కేంద్రాల ద్వారా వచ్చే బూడిదనూ వదల్లేదు. కరోనా సమయంలో పేద ప్రజలకు బియ్యం పంపిణీ చేసేందుకంటూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.
కరోనా కాలంలో..
ఆ ప్రాంతంలో 850 కేజీల ధాన్యాన్ని ఒక పుట్టిగా వ్యవహరిస్తుంటారు. కరోనా సమయంలో ఇక్కడి వైకాపా నాయకులు దళారుల అవతారమెత్తి, రైతుల నుంచి పుట్టికి వెయ్యి కేజీలకుపైగా ధాన్యాన్ని బలవంతంగా తీసుకున్నారు. మరోవైపు పంటకాల్వల్లో పూడికతీత, ఇతర పనులు చేయకుండానే బిల్లులు మింగేశారు. కనుపూరు కాల్వ పనులు, మంజూరైన నిధుల వివరాలను స.హ. చట్టం కింద అడిగినా అధికారులు ఇవ్వకపోవడం గమనార్హం.
కోర్టులోని ఫైళ్లు మాయం
వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికార పార్టీకి చెందిన ఒక సీనియర్ ప్రజాప్రతినిధిపై అవినీతి ఆరోపణలు చేశారు. ఆయనకు విదేశాల్లో ఆస్తులున్నాయనీ, అక్కడి బ్యాంకుల్లో డిపాజిట్లున్నాయంటూ కొన్ని డాక్యుమెంట్లనూ మీడియాకు విడుదల చేశారు. అవన్నీ అబద్ధాలనీ, నకిలీ డాక్యుమెంట్లతో ఆరోపణలు చేశారని ఆయన కేసు కూడా పెట్టారు. దాదాపు రెండేళ్ల కిందట ఈ ప్రజాప్రతినిధికి రాష్ట్రస్థాయిలో పదవి దక్కిన రెండు మూడు రోజులకే నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు అపహరణకు గురయ్యాయన్న వార్తలూ వచ్చాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కూడా చేపట్టింది.
అత్తగారి సొమ్ములా భూముల ఆక్రమణ
నెల్లూరు గ్రామీణ మండలంలోని అత్తగారి ఊరిలోనూ ఈ ప్రజాప్రతినిధి తన పనితనాన్ని చూపించారు. ఆ గ్రామంలో ఆయనకు కొంత భూమిని అత్తింటివాళ్లు ఇచ్చారు. దానికి ఆనుకుని ఉన్న దళితుల భూములను తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నపుడే ఈ ప్రజాప్రతినిధి ఆక్రమించేశారు. అధికారులు సర్వే నిర్వహించి ఆక్రమణ నిజమేనని తేల్చి, ఆ భూములను తిరిగి దళితులకు ఇప్పించారు. అత్తగారిచ్చిన స్థలానికి మరో వైపున్న విశ్రాంత ఉద్యోగుల ఇళ్ల స్థలాలనూ ఆయన ఆక్రమించారని ఆయా ప్లాట్ల యజమానులు కేసు పెట్టారు. ప్రభుత్వ, చెరువు భూములనూ అనుచరుల పేర్లతో ఆన్లైన్లో నమోదు చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వంద ఎకరాల ప్రభుత్వ భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చేసిన వ్యవహారంలో ఇప్పటికే ఇక్కడో తహసీల్దారు సస్పెన్షన్కు గురయ్యారు. కాకుటూరు పంచాయతీ పరిధిలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న రూ.కోట్ల విలువైన సర్కారు భూములను, ఈ నేత ప్రైవేటు వాటిగా రికార్డులు మార్పించారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఆయన అనుచరుడితోపాటు మరికొందరిపై అధికారులు కేసు నమోదు చేసి, జైలుకు పంపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాలుగు సంవత్సరాలు ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా: నాగ్ అశ్విన్
-
చర్చకు సిద్ధమేనన్న కమలాహారిస్.. అప్పటివరకు వద్దన్న ట్రంప్
-
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
-
జోబైడెన్ మెదడు అద్భుతంగా పనిచేస్తోంది: శ్వేతసౌధం డాక్టర్ల సర్టిఫికెట్
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
-
లాభాల్లో మార్కెట్లు.. 82,260 పైన సెన్సెక్స్.. 24,500 చేరువలో నిఫ్టీ