జీ‘వి’తాలతో ఆడుకున్నారు
జగన్ ‘ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం’లో ఇవి నిత్యకృత్యం. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్.. ఉద్యోగుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు.
వైకాపా హయాంలో ఉద్యోగులకు ఆర్థిక కష్టాలు
వేతనాల కోసం రోడ్డెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు
సమయానికి ఇచ్చేలా చట్టం చేయాలని గవర్నర్కు వినతి
పీఆర్సీలో తీవ్ర మోసం.. బకాయిలు ఇవ్వకుండా ఉత్తుత్తి చర్చలు
పెన్షన్లు అందక అల్లాడిన పండుటాకులు
ఈనాడు, అమరావతి
‘ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాలి..’
ఓ సీనియర్ మంత్రి హెచ్చరిక లాంటి హితబోధ!
‘నిధుల్ని ప్రజలకు పంచాలా.. లేక ఉద్యోగులకు ఇవ్వాలా?’
చిట్టాపద్దుల శాఖా మంత్రి సూటిప్రశ్న!
ఇక సకల శాఖల మంత్రి అయితే.. పైవారికి తానేం తీసిపోననేలా..
‘కంట్రోల్లో ఉండండి...’ అంటూ ఉచిత సలహాలాంటి బెదిరింపు!
సకాలంలో జీతాలు ఇవ్వాలనీ, పీఆర్సీ అమలు చేయాలనీ.. అడిగినందుకే ఈ పెడసర మాటలూ, కూతలూ! వైకాపా ఐదేళ్ల పాలనలో.. ఉద్యోగులకు రోజూ ఇలాంటి అవమానాలే!
- జీతాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనలు, ర్యాలీలు నిర్వహించిన పరిస్థితి ఎప్పుడైనా వచ్చిందా?
- పీఆర్సీ సక్రమంగా అమలు చేయలేదనీ, ఉన్న ప్రయోజనాలనే ప్రభుత్వం తొలగించిందని ఉద్యోగులు నిరసన తెలిపిన పరిస్థితి ఎప్పుడైనా కనిపించిందా?
- ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు రాక ఉద్యోగులు తమ పిల్లల పెళ్లిళ్లు వాయిదాలు వేసుకున్నది ఎప్పుడైనా చూశారా?
జగన్ ‘ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం’లో ఇవి నిత్యకృత్యం. తన అనుచరగణానికి సలహాదారుల పదవులు కట్టబెట్టి కోట్లు దోచిపెట్టిన జగన్.. ఉద్యోగుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా.. ‘నాకు జీతం వచ్చింది’ అని నెల తొలిరోజే ఆనందంతో వాట్సప్ గ్రూపుల్లో పెట్టడమనేది... జగన్ పాలనలో ఊహించుకోవటానికే సాధ్యం కాని పరిస్థితి! ప్రభుత్వం దివాలా తీసినట్లుగా కొన్నిసార్లు 12వ తేదీ వరకూ జీతాలు ఇవ్వని దుస్థితి ఏర్పడింది. జీతాల కోసం పొరుగుసేవల సిబ్బంది, ఒప్పంద ఉద్యోగులు ఇబ్బంది పడడం లాంటివి ఒకటీ అరా చూసుంటాం. రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కూడా ‘జీతాలు ఇప్పించండి మహాప్రభో’ అంటూ వేడుకునే పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేదు. అందుకే ఘనత వహించిన జగన్ పాలనలో జీతాల కోసం ఉద్యోగులు రోడ్డెక్కారు. ఉద్యోగుల సంఘం ఏకంగా జీతాలు ఇప్పించేందుకు చట్టం చేయాలంటూ గవర్నర్కు వినతిపత్రం సమర్పించింది. దీంతో ప్రభుత్వం పరువుపోయింది. ఈ వినతిపత్రం ఇచ్చినందుకు ఆ నాయకుడిని జగన్ సర్కారు తీవ్ర వేధింపులకు గురి చేసింది. ప్రతినెలా ‘ప్రభుత్వానికి అప్పు పుట్టిందా?’, ‘ఈ నెల మనకు జీతం అందుతుందా?’ అంటూ ఉద్యోగులు సామాజిక మాధ్యమాల్లో చర్చలు పెట్టిన దుస్థితి జగన్ పాలనలో కొనసాగింది. జీతం వస్తే పండగే అనే పరిస్థితి కనిపించింది. ఇక పెన్షనర్ల పరిస్థితైతే వర్ణనాతీతం. పెన్షన్లు ఆలస్యంగా ఇవ్వడంతో మందులు కొనుక్కోవడానికి పండుటాకులు అల్లాడిపోయారు. ఆర్థిక ప్రయోజనాల మాట దేవుడెరుగు.. ఒకటో తేదీన జీతం, పెన్షన్లు ఇస్తే చాలు అనే దుస్థితిని జగన్... ఉద్యోగులకు కల్పించారు.
‘సమగ్ర శిక్ష..’లో చెప్పలేని బాధ..
‘జగనన్నా.. సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ)లో ఉద్యోగులం.. మాకు మూడు నెలలుగా జీతాలివ్వడం లేదు. అప్పుల కోసం ప్రయత్నించినా పుట్టలేదు. దసరా పూట పస్తులు ఉండలేక పిల్లల డిబ్బీని పగలగొట్టి డబ్బులు వాడుకుంటున్నాం’ అంటూ.. ఓ ఉద్యోగి తన బాధను గతేడాది వీడియో తీసి, సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఎస్ఎస్ఏకు కేంద్ర ప్రభుత్వం 60% నిధులు ఇస్తుంది. వీటిని ట్యాబ్లు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్, స్మార్ట్టీవీలు, విద్యాకానుకలు, నాడు-నేడుకు మళ్లించి, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు. ఇదే కాదు.. పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు చాలామంది జీతాలు సకాలంలో రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పని చేస్తున్న సిబ్బందికి రెండు నెలలుగా, డీఅడిక్షన్ కేంద్రాల్లో పని చేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాల్లేవు. ఇలా అనేక మంది ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు.. పడుతున్నారు.
పీఆర్సీలో పచ్చి మోసం..
జగన్ ప్రభుత్వం 11వ పీఆర్సీలో ఉద్యోగులను మోసం చేసింది. ఎప్పుడూ లేనివిధంగా మధ్యంతర భృతి(ఐఆర్) 27% ఉంటే 4% తగ్గించి 23% ఫిట్మెంట్ ఇచ్చింది. పీఆర్సీ చరిత్రలో ఇలా ఇవ్వడం ఇదే మొదటిసారి. ఐఆర్తో తీసుకున్న జీతం కంటే ఫిట్మెంట్తో తీసుకున్న జీతం తగ్గిపోయింది.
- ఇంటి అద్దె భత్యంలో కోత వేసింది. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు తెదేపా ప్రభుత్వంలో 30% హెచ్ఆర్ఏ ఉంటే జగన్ వచ్చాక 24శాతానికి.. జిల్లా కేంద్రాల్లో గతంలో 20% హెచ్ఆర్ఏ ఉండగా.. దీన్ని 16 శాతానికి కుదించేశారు.
- పీఆర్సీ సిఫార్సు చేసిన పేస్కేళ్లను పూర్తిస్థాయిలో అమలు చేయకుండానే 12వ పీఆర్సీ కమిషన్ వేశారు. పీఆర్సీ పేస్కేళ్లను పట్టించుకోకుండా ప్రభుత్వం కరస్పాండింగ్ స్కేల్స్ ఇచ్చేసింది. ఏ పేస్కేళ్లను ప్రామాణికంగా తీసుకొని 12వ పీఆర్సీ కమిషనర్ కొత్తవి నిర్ణయిస్తారు?
- 12వ పీఆర్సీ కమిషన్ వేసినా ఇది ఇంతవరకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. నిబంధనల ప్రకారం 2023 జులై నుంచి కొత్త పీఆర్సీ అమలు కావాలి. పీఆర్సీ నివేదిక వచ్చేలోపు ఆలస్యమవుతుందని ప్రతిసారీ ఐఆర్ ఇస్తారు. ఈసారి ఐఆర్కూ జగన్ సర్కారు మంగళం పాడేసింది.
పెత్తనం చేయడమే పనిగా..
ఉద్యోగుల సమస్యలపై సంఘాల నాయకులను చర్చలకు పిలిపించడం.. దాంట్లో ఏమీ తేల్చకుండా పంపించి వేయడం.. ఇది జగన్ పాలనలో సాగిన ఎడతెరిపిలేని చర్చల సారాంశం. ‘ప్రభుత్వ ఉద్యోగులకు కాళ్లు పట్టుకునే నేర్పు ఉండాల’ని మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ‘కంట్రోల్లో ఉండండి’ అంటూ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏపీఎన్జీఓ సంఘం నాయకుడిని ఫోన్లో బెదిరించారు. ‘నిధుల్ని 90శాతం ప్రజలకు పంచాలా.. లేక ఉద్యోగులకు ఇవ్వాలా?’ అని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన వ్యాఖ్యానించారు.. ఇలా వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు ఉద్యోగులపై పెత్తనం చేశారు. జగన్ సీఎం పీఠం ఎక్కినప్పటి నుంచి ఉద్యోగులను ముప్పుతిప్పలు పెట్టారు. సీఎంను కలిసి సమస్యలు విన్నవించుకుందామన్నా ఆయన దర్శనం లభించని దుస్థితి. 2019 ఎన్నికల ముందు ఉద్యోగులపై ప్రేమ కురిపించిన ఆయన అధికారంలోకి వచ్చాక వారిని దగ్గరకు కూడా రానివ్వలేదు. సర్వం సలహాలదారుడు సజ్జలనే అనేట్లు తయారు చేశారు. 11వ పీఆర్సీ కమిషన్ నివేదిక కోసం ఉద్యోగులు సచివాలయంలో నిరసన చేయాల్సి వచ్చింది. బీఆర్టీఎస్ రోడ్డు ముట్టడి తర్వాత గాని పీఆర్సీ నివేదిక ఇవ్వలేదు. అందులోనూ కొన్ని పేజీలను తొలగించి ఇచ్చారు.
ప్రభుత్వాన్ని గడగడలాడించి..
పీఆర్సీ అమల్లో జగన్ సర్కార్ చేసిన అన్యాయంపై ఉద్యోగులు 2022 ఫిబ్రవరి 3న నిర్వహించిన గర్జన జగన్కు ముచ్చెమటలు పట్టించింది. బీఆర్టీఎస్ రోడ్డు దిగ్బంధాన్ని విఫలం చేయడానికి జగన్ ప్రభుత్వం.. పోలీసులను ప్రయోగించినా ఉద్యోగులు లెక్క చేయలేదు. నిర్బంధాల్ని ఛేదించి.. అడ్డంకుల్ని అధిగమించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఉద్యమాల పురిటిగడ్డ బెజవాడకు వెల్లువెత్తి వచ్చారు. దాదాపు 4 కి.మీ. పొడవున్న బీఆర్టీఎస్ రహదారి మొత్తం వేల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పింఛనుదారులతో కిక్కిరిసి పోయింది. చీకటి పీఆర్సీ జీఓలు రద్దు చేయాలంటూ నినదించారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం కొన్ని సదుపాయాలను కల్పించింది. ఈ ఉద్యమం తర్వాత ‘విభజించు.. పాలించు’ సూత్రాన్ని అమలు చేశారు జగన్. సంఘాలను విడగొట్టి నిరసనలు జరగకుండా అణచి వేశారు. జగన్ చెప్పినట్లు వైకాపాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమైతే ‘చలో విజయవాడ’లాంటి పెద్ద కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది. సలహాదారులంటూ.. తన అనుచరగణానికి దోచిపెడుతూ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలేమో ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెట్టారు జగన్.. ఫలితమే అసంతృప్తులూ, నిరసనలూ!
బకాయిలు దేవుడికే తెలియాలి..
ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు దాదాపు రూ.19వేల కోట్లు ఉన్నాయి. ఇంత మొత్తాన్ని ఈ ప్రభుత్వం చెల్లిస్తుందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
- పదవీ విరమణ తర్వాత ఇస్తామన్న డీఏ, పీఆర్సీ బకాయిలు రూ.7,500 కోట్లు ఉన్నాయి. వీటిని రాబోయే ప్రభుత్వంపైకి నెట్టేశారు. 2027లోగా చెల్లిస్తామని నోటి మాటగా చెప్పడం తప్ప ఉత్తర్వులు ఇవ్వలేదు.
- ఉద్యోగుల టీఏ, డీఏ బకాయిలు రూ.274 కోట్ల వరకు ఉన్నాయి. సరెండర్ లీవుల బకాయిలు రూ.2,250కోట్లు, ఇవికాకుండా 2021-22 నాటికి చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.300కోట్లుఉన్నాయి.
- మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు రూ.118కోట్లు పెండింగ్లో ఉన్నాయి. ఇవికాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల జీతాల నుంచి మినహాయించిన సీపీఎస్ మొత్తాన్ని ప్రాన్ ఖాతాకు జమ చేయలేదు. ఇలా అనేక బిల్లులను ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది.
- ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 62ఏళ్లకు పెంచింది. ప్రస్తుతం పదవీ విరమణలు కొనసాగుతున్నాయి. పాత బకాయిలే ఇవ్వలేదు.. ఈ చెల్లింపులు చేస్తుందా? పదవీ విరమణ పొందితే ప్రయోజనాలు ఎలా? అని ఉద్యోగులు మధనపడే దుస్థితి కల్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్