‘అమ్మఒడి’.. మామ కత్తెర!
పిల్లల్ని బడికి పంపండి చాలన్నారు.. అందరికీ ‘అమ్మఒడి’ సాయం అందిస్తామన్నారు.. ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ లబ్ధి కల్పిస్తామన్నారు.. తల్లులను ఆశల పల్లకీ ఎక్కించారు.. ఓట్లు వేయించుకొని అధికారం దక్కించుకున్నారు.. ఆ తర్వాత.. నిబంధనల కత్తి అందుకున్నారు.
నిబంధనల సుడిగుండంలో పథకం
ఇద్దరు పిల్లలకు ఇస్తామని చెప్పి.. ఒక్కరికేనని కొర్రీ
కత్తెరకు పదునుపెట్టి.. లబ్ధిదారుల సంఖ్యలో కోత
అయిదేళ్లలో నాలుగుసార్లే ఇచ్చిన సీఎం జగన్మోహన్రెడ్డి
బడుల నిర్వహణ పేరుతో సాయంలో మినహాయింపులు
ఈనాడు - అమరావతి
పిల్లల్ని బడికి పంపండి చాలన్నారు.. అందరికీ ‘అమ్మఒడి’ సాయం అందిస్తామన్నారు..
ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ లబ్ధి కల్పిస్తామన్నారు.. తల్లులను ఆశల పల్లకీ ఎక్కించారు..
ఓట్లు వేయించుకొని అధికారం దక్కించుకున్నారు.. ఆ తర్వాత.. నిబంధనల కత్తి అందుకున్నారు..
ఆదాయ పరిమితి తీసుకొచ్చారు.. విద్యుత్తు వాడకం లెక్క తీశారు..
అర్హుల సంఖ్యను కుదించేశారు.. బడుల నిర్వహణ పేరిట సాయంలోనూ కోతేశారు..
పేదిళ్లలో పిల్లల చదువులకు ఏ తల్లీ భయపడొద్దు. ఇంట్లో ఇద్దరు పిల్లలకు 1-5 తరగతి వరకు నెలకు రూ.వెయ్యి, 6-10 తరగతి వరకు రూ.1,500, ఇంటర్మీడియట్ చదువులకు
రూ.2 వేలు తల్లులకు అందిస్తాం.
2017 జులై 10న జగన్
సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నామని భుజాలు చరుచుకునే జగన్ మాటల్లోని డొల్లతనాన్ని ‘అమ్మఒడి’ పథకం బట్టబయలు చేసింది. చిన్నారులకు మేనమామనంటూ.. వారి చదువుల బాధ్యత తనదేనంటూ గొప్పలు చెప్పి చివరకు టోపీ పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు ఇద్దరు పిల్లల్ని బడికి పంపితే ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తామంటూ జగన్ సతీమణి భారతి ప్రచారం చేశారు. ప్రజలను నమ్మించారు. జగన్ సైతం 6-10 తరగతుల్లో ఇద్దరికి ఏడాదికి రూ.18వేలు, ఇంటర్మీడియట్లో ఇద్దరికి రూ.24వేలు చొప్పున ఇస్తామంటూ హామీలు గుప్పించారు. గెలిచాక ఒక్కరికే ఇస్తామంటూ నాలుక మడతేశారు. అధికార పీఠం దక్కిన తర్వాత ఇంక ప్రజలతో అవసరమేంటని అనుకున్నారో ఏమో.. లబ్ధిదారులను తగ్గించడంపైనే దృష్టిపెట్టారు. ఒక్కో ఏడాది ఒక్కో నిబంధన తీసుకొస్తూ కోతలకు పదునుపెట్టారు. ఐదేళ్ల పాలనలో 75శాతం హాజరు నిబంధనతో నాలుగేళ్లే పథకాన్ని అమలు చేసి.. దాదాపు రూ.6,300కోట్లు మిగుల్చుకున్నారు. పాఠశాలలు, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో పేదలకు ఇవ్వాల్సిన రూ.2,598 కోట్లను మిగుల్చుకున్నారు. తనలోని పెట్టుబడిదారి నైజాన్ని మరోసారి చాటుకున్నారు.
పొరుగు సేవల ఉద్యోగులకు సెగ
పొరుగుసేవల ఉద్యోగులకు రూ.15 వేల వేతనం ఇచ్చినట్లే ఇస్తూ.. జగన్ మార్కు షాక్ రుచి చూపించారు. వివిధ శాఖల పరిధిలో పని చేస్తున్న పొరుగుసేవల ఉద్యోగుల మేలు కోసమే ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్డ్ సర్వీసెస్(ఆప్కాస్) తెచ్చినట్లు గొప్పలు చెప్పి.. దీని పరిధిలోకి వచ్చిన లక్ష మందికి అమ్మఒడి పథకాన్ని దూరం చేశారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే, ప్రభుత్వ ఉద్యోగుల కేటగిరీలోకి వచ్చినట్లేనని అధికారులు సమాధానమిస్తుండడం గమనార్హం. అలాగని ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించేవన్నీ పొరుగుసేవల వారికి ఇస్తున్నారా.. అంటే అదీ లేదు. గ్రామీణంలో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నట్లు చూపుతూ.. నిధులను మిగుల్చుకున్నారు.
నిర్వహణ పేరుతో నొక్కేసి..
అమ్మఒడి పథకానికి సవాలక్ష నిబంధనలు పెట్టి అర్హులను తగ్గించేసిన జగన్ సర్కారు.. ఇచ్చే దాంట్లోనూ పాఠశాలల నిర్వహణ పేరుతో కోత పెట్టారు. ఆ లెక్కన రూ.2,598 కోట్లు మిగుల్చుకున్నారు. 2019-20లో పథకంలో భాగంగా రూ.15 వేల చొప్పున తల్లులకు ఇచ్చిన జగన్.. ఆ ఏడాదే మరుగుదొడ్ల నిర్వహణ పేరిట అందులోంచి రూ.వెయ్యి వసూలు చేశారు. ఈ క్రమంలో చాలా మంది ఆ మొత్తం వెనక్కి ఇవ్వకపోవడంతో, మరుసటి ఏడాది నుంచి ఆ రూ.వెయ్యి కోసిన తర్వాతే తల్లుల ఖాతాల్లోకి జమ చేయసాగారు. 2020-21లో రూ.వెయ్యి మినహాయించగా.. 2021-22, 2022-23లో మరుగుదొడ్ల నిర్వహణకు రూ.వెయ్యి, పాఠశాల నిర్వహణకు రూ.వెయ్యి అంటూ కోతను రూ.2 వేలకు పెంచేశారు. అలా నాలుగేళ్లలో ఒక్కో లబ్ధిదారు రూ.6 వేలు కోల్పోయారు. అలాగని కోత కోసిన డబ్బులను బడుల నిర్వహణకు ఇస్తున్నారా.. అంటే అదీ లేదు. వాటిని ఇతర అవసరాలకు మళ్లించేశారు. లబ్ధిదారులకు ఇచ్చేదాంట్లో కోత కోస్తేకానీ పాఠశాలల నిర్వహణ చేపట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందా? అని విమర్శలు వెల్లువెత్తాయి. ఎయిడెడ్ బడుల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు అందిస్తున్న సాయం నుంచీ రూ.2 వేలు మినహాయిస్తున్నా.. వాటిని తిరిగి ఆ పాఠశాలల నిర్వహణకు మాత్రం ఇవ్వడం లేదు. ఆ బాధ్యత యాజమాన్యాలదేనంటూ వైకాపా సర్కారు తప్పించుకుంది.
మూడేళ్లలో 1.86 లక్షల మంది తరుగుదల
గత ఎన్నికలకు ముందు పిల్లల్ని బడికి పంపే తల్లులందరికీ అమ్మఒడి ఇస్తామని జగన్ బాకాలు ఊదారు. సీఎం పీఠం ఎక్కిన తర్వాత.. లబ్ధిదారుల సంఖ్యను ఎలా తగ్గించాలి? సొమ్మును ఎలా మిగుల్చుకోవాలి? అన్నదానిపైనే దృష్టిపెట్టారు. దీనికోసం రకరకాల నిబంధనలు తీసుకొచ్చారు. నెలకు 300 యూనిట్లకు మించి విద్యుత్తు వాడకం ఉండకూదడనీ, నెల వేతనం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలు, పట్టణాల్లో రూ.12వేలకు మించి ఉండకూడదనీ నియమం పెట్టారు. ఆ తర్వాత విద్యార్థులకు 75 శాతం హాజరన్నారు. దీంతో 2020-21 నుంచి ఏటా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. గత మూడేళ్లలో 1.86 లక్షల మందిని జాబితా నుంచి తొలగించారు. ఎన్నికల ముందు అమ్మఒడి పథకానికి ఎలాంటి నిబంధనలు చెప్పలేదు. దీంతో పిల్లల్ని బడికి పంపితే ప్రయోజనం లభిస్తుందని తల్లులందరూ భావించారు. జగన్ పాలనా పగ్గాలు చేపట్టాక కానీ, ‘ఒక్క ఛాన్స్’ పేరిట ఆయన చేసిన మోసం జనానికి తెలిసిరాలేదు.
ల్యాప్టాప్లు ఇస్తామని మోసం
లబ్ధిదారులు కోరుకుంటే 9-12 తరగతుల పిల్లలకు అమ్మఒడి నగదు సాయానికి బదులుగా ల్యాప్టాప్లు ఇస్తామని 2021 జనవరి 11న జగన్ ప్రకటించారు. ఉన్నత చదువులకు ఉపయోగపడుతుందని.. 7 లక్షల మంది డబ్బులకు బదులు ల్యాప్టాప్ కావాలని దరఖాస్తు చేశారు. గుత్తేదారు ఒక్కో ల్యాప్టాప్కు రూ.26 వేలు కోట్ చేయడంతో అమ్మఒడి సాయానికి అదనంగా రూ.13 వేలు ఇవ్వాల్సి వస్తుందని జగన్ చేతులెత్తేశారు. పేదలపై అంత ప్రేమే ఉంటే, అదనపు భారం పడుతుందని ల్యాప్టాప్లు ఇస్తామన్న మాటను గాలికి వదిలేస్తారా?
హాజరు పేరిట ఏడాది ఎగ్గొట్టి..
పిల్లలు రకరకాల సాకులు చెప్పి బడికి ఎగ్గొట్టే తరహాలో.. జగన్ కూడా ఒక సంవత్సరం అమ్మఒడి పథకం నిధులను మిగుల్చుకున్నారు. ఐదేళ్ల పాలనలో ఐదు పర్యాయాలు ఇవ్వాల్సి ఉండగా.. నాలుగేళ్లే ఇచ్చారు. ఇందుకోసం విద్యార్థులకు 75శాతం హాజరు నిబంధనను తీసుకొచ్చారు. మొదటి రెండేళ్లు జనవరిలో పథకం డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం తర్వాత దాన్ని జూన్కు మార్చేసింది. 2021-22లో 75శాతం హాజరు పేరుతో విద్యా సంవత్సరం ప్రారంభమయ్యాక జూన్లో అమ్మఒడి డబ్బులు వేశారు. 2022-23కీ అదే లెక్కన గత జూన్లో జమ చేశారు. ఇలా నాలుగేళ్లు మాత్రమే ఇచ్చినట్లయింది. 2023-24 సాయం ఇవ్వకుండానే ఎన్నికలు వచ్చేశాయి. ఆ రకంగా ఒక ఏడాదికి పేదలకు ఇవ్వాల్సిన పథకం డబ్బులు రూ.6,300 కోట్లను మిగుల్చుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!