వెయ్యి పెంచి.. లక్షలు ముంచి
అన్న వస్తున్నాడు అంటే... ఆనందపడ్డాం... మాట తప్పడు అంటే మురిసిపోయాం... అధికారంలోకి వచ్చాక మా వేతనాలు పెంచితే..మా ఇళ్లలో రెండు పూటల పొయ్యి వెలుగుతుందనుకున్నాం.
అంగన్వాడీలకు జగన్ వెన్నుపోటు
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ గాలికి
వేతనం పెంపు వేలల్లో.. దోపిడి లక్షల్లో
ఒంటరి, వితంతు, దివ్యాంగుల పింఛన్లూ దూరం
ఐదేళ్లలో అష్టకష్టాలు పడ్డ అంగన్వాడీలు
తెదేపా ప్రభుత్వం రూ.6,300 చొప్పున పెంచినా పథకాలను దూరం చేయలేదు
ఈనాడు, అమరావతి
అన్న వస్తున్నాడు అంటే... ఆనందపడ్డాం...
మాట తప్పడు అంటే మురిసిపోయాం...
అధికారంలోకి వచ్చాక మా వేతనాలు పెంచితే..
మా ఇళ్లలో రెండు పూటల పొయ్యి వెలుగుతుందనుకున్నాం..
కానీ ఈతాకు ఇచ్చి... తాటాకు తీసుకున్నట్లు.. మా సంక్షేమాలను రద్దు చేశావు..
వేతనాలు పెంచాలన్న మా వేదనలను వెక్కిరిస్తూ.. మా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపావ్!
ఇదీ.. ఆంధ్రాలోని అంగన్వాడీల ఆవేదన.. ఆక్రందన!
పాలన అంటే సచ్ఛీలత. చేసే పని..చెప్పే మాట నిక్కచ్చిగా ఉండాలి. ఇవే నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు. కానీ ముఖ్యమంత్రి జగన్లో ఇవి ఇసుమంతైనా కనిపించవు. ఆయనలో కనిపించేదంతా జిత్తులమారి తనమే. అడుగడుగునా కుయుక్తి పన్నడమే. ఒక చేత్తో ఇచ్చినట్టే ఇచ్చి మరో చేత్తో లాక్కోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ఏ వర్గానికైనా సరే ఐదేళ్ల పాలనలో ఆయన చేసిందిదే. అక్క చెల్లెమ్మలంటూనే అంగన్వాడీలను ఇదే తరహా వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి రాగానే తెలంగాణలో కంటే వేతనాలు పెంచి అమలు చేస్తామని గత ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్ హామీనిచ్చారు. ఎన్నికల్లో గెలవగానే ఆయన తీరు ‘బోడి మల్లయ్య’ చందంగా మారింది. అంగన్వాడీల వేతనం రూ.1000 పెంచి.. దానికి మించి వారికి అందే సంక్షేమ పథకాలల్లో కోత విధించారు.
నవరత్నాలు - అందని ద్రాక్షలు
రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. 1.03 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలున్నారు. పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అంగన్వాడీ కేంద్రాలు అధికంగా ఉన్నాయి. జగన్ వచ్చాక వీరికి వేతనాన్ని రూ.వెయ్యి పెంచారు. అంగన్వాడీలు సంబరపడ్డారు. కానీ ఆ పెంపు వెనక... ముప్పును వారు ఊహించలేకపోయారు. ఇటు వేతనం పెంచుతూనే... అటు సంక్షేమ పథకాలు, నవరత్నాల అమలుపై జగన్ సర్కారు కొన్ని నిబంధనలు పెట్టింది. వాటిలో కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలు మించకూడదనేది ఒకటి! ఈ ఆదాయపరిమితి అస్త్రాన్ని అంగన్వాడీలపై ప్రయోగించారు. వేతనం రూ.10 వేలకు మించిందంటూ గ్రామాల్లో ఉన్న అంగన్వాడీల సంక్షేమ పథకాలకు కోత పెట్టారు. అప్పటికిగాని అంగన్వాడీలకు జగన్మాయ అర్థం కాలేదు.
తెదేపా హయాంలో 150% మేర పెంపు...
2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ను విభజన కష్టాలు వెంటాడుతున్నా... అంగన్వాడీలకు అప్పటి తెదేపా ప్రభుత్వం వేతనాల పెంపులో ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. ఒకవైపు రాజధాని అమరావతి నిర్మాణం, పేదల సంక్షేమాన్ని చూస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చింది. ఐదేళ్ల పాలనలో తెదేపా అంగన్వాడీ కార్యకర్తల వేతనాన్ని రూ.4,200 నుంచి రూ.10,500కి పెంచింది. రెండు విడతల్లో వీరికి 150%(6,300) మేర పెంచి వేతనాన్ని తెలంగాణతో సమం చేసింది. మినీ అంగన్వాడీ కార్యకర్తలకు 103%, ఆయాలకు 172% పెంచింది. అప్పటి నిబంధనల ప్రకారం వారి వేతనం ఆదాయ పరిమితిని దాటి సంక్షేమ పథకాల లబ్ధి దూరమయ్యే అవకాశం ఉన్నా కోత మాత్రం విధించలేదు. వెసులుబాటు ఇచ్చి అన్ని పథకాలను వారికి వర్తింపచేసింది.
జగన్ పెంచింది 9.5 శాతమే..
జగన్ అధికారంలోకి రాగానే అంగన్వాడీల వేతనం రూ.10,500 నుంచి రూ.11,500 పెంచారు. ఏతావాతా ఆయన పెంచింది 9.5 శాతమే. అది కూడా 2019 జూన్లో పెంచారు. ఆ తర్వాత ఐదేళ్లపాటు ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఓవైపు సంక్షేమ పథకాలు అందక.. మరోవైపు నిత్యావసరాల ధరలు అమాంతం పెరిగి అంగన్వాడీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. కొన్ని నిత్యావసరాల ధరలు దాదాపు 100 శాతం పెరిగాయి. దీన్ని పరిగణనలోకి తీసుకునే తెలంగాణ ప్రభుత్వం 2021లో అక్కడి అంగన్వాడీ కార్యకర్తలకు రూ.3,150 చొప్పున వేతనం పెంచింది. ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ కన్నా ఎక్కువ జీతాలిస్తామన్న జగన్ మాత్రం కిమ్మనకుండా ఉన్నారు. చివరికి హామీని నెరవేర్చాలంటూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అంగన్వాడీలు సమ్మె బాట పట్టినా..కనీసం వారి మాట కూడా ఆలకించలేదు. పోలీసులతో ఉక్కుపాదం మోపించారు. వారికి వర్తించని ఎస్మాను కూడా ప్రయోగించి బెదిరింపులకు దిగారు. ఉద్యోగాలను తొలగిస్తామని మెడ మీద కత్తిపెట్టినట్లుగా దారుణంగా వ్యవహరించారు.
అంగన్వాడీ పోస్టా? సంక్షేమ పథకాలా?
అంగన్వాడీల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించిన జగన్ ప్రభుత్వం.. వితంతు, ఒంటరి మహిళ, దివ్యాంగ పింఛన్లు కూడా నిలిపి వేసింది. అమ్మఒడి సాయాన్ని అందించకుండా వారి పిల్లల చదువులకు ఇబ్బందిపెట్టింది. ఇళ్లపట్టాలు, ఇళ్ల నిర్మాణ రాయితీ ఎత్తేసింది. వారు పదవీ విరమణ పొందే వరకు ఇదే నిబంధన వర్తిస్తుందని ఆదేశించింది. అంటే అంగన్వాడీ పోస్టు కావాలా? సంక్షేమ పథకాలు కావాలా? అనే పరిస్థితిని వారికి కల్పించింది.
రూ.12వేలిచ్చి...
తెదేపా ప్రభుత్వ హయాంలోనే అంగన్వాడీ కార్యకర్తలకు రూ.10,500 వేతనం అందేది. జగన్ పెంచింది రూ.1000. ఈ మొత్తాన్ని ఏడాదికి లెక్కేస్తే వారికి అదనంగా అందేది రూ.12 వేలు. అదే ఒక్క దివ్యాంగ పింఛను(నెలకు రూ.3 వేలు) తీసేయడంతో ఏడాదికి రూ.36 వేలు నష్టపోయారు. ఇంటి నిర్మాణ రాయితీ వర్తించక రూ.1.50 లక్షలు అందలేదు. ఇళ్ల పట్టాలు ఇవ్వకపోవడంతో రూ.లక్షల్లో కోల్పోయారు. ఇక విద్యాదీవెన, వసతి దీవెన అందక పిల్లల భవిష్యత్తే ఇబ్బందుల్లో పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
‘సౌదీ అరేబియా నుంచి నేను ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు. అక్కడి ఎడారిలో సరైన ఆహారం, నిద్ర లేకుండా కఠినమైన పనులు చేయించారు. శారీరకంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. -
రూ.12,93,261 కోట్ల ఆర్థిక విధ్వంసం
ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం రూ.12,93,261 కోట్లు. జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం, ఆయన మిగిల్చిన అప్పులు, చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది. గత ఐదేళ్లలో రూ.6.94 లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది. -
కర్షకుల కష్టం గోదారి పాలు
ఎగువ ప్రాంతాల నుంచి గోదావరికి భారీగా వస్తున్న వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంకలను జలదిగ్బంధంలో ముంచేసింది. శుక్రవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్ద గోదావరిలో ప్రవాహం పెరిగి 47.90 అడుగులకు చేరగా, ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 13.60 అడుగులుగా ఉంది. -
వైకాపా నేత మాధవరెడ్డి కోసం విస్తృత గాలింపు
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత ఆదివారం రాత్రి 11.30 గంటల సమయంలో రెవెన్యూ దస్త్రాలు దహనమైన ఘటనపై విచారణ ముమ్మరంగా సాగుతుండగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరుల భూదందాలు వెలుగు చూస్తున్నాయి. -
రెండో రోజూ తండోపతండాలుగా
వైకాపా ప్రభుత్వంలో నంబర్-2గా చలామణి అయిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భూదందాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్లో దస్త్రాల దహనం కేసులో తీగ లాగితే, పెద్దిరెడ్డి పాపాల డొంక కదిలి అక్రమాలన్నీ చీమల పుట్టల్లా బయట పడుతున్నాయి. -
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కాకినాడ-విశాఖ పీసీపీఐఆర్లో రూ.58వేల కోట్ల పెట్టుబడులు
కాకినాడ-విశాఖపట్నం పెట్రోలియం, కెమికల్, పెట్రోకెమికల్స్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్లో ఇప్పటివరకు రూ.58,918.70 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. -
ఈ ఏడాది లోటు రూ.1,46,909 కోట్లు!
జగన్ ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం వల్ల ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ భయానక పరిస్థితుల్లో చిక్కుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చే ఆదాయాన్ని, అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులను ప్రభుత్వం వెలికితీసింది. -
ప్రాజెక్టుల విధ్వంసం.. పెట్టుబడులకు శాపం
జగన్ ప్రభుత్వం అమరావతి, పోలవరంతో పాటు విద్యుత్ రంగాన్ని విధ్వంసం చేయడం వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి దూరమయ్యారని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఐదేళ్లలో ఒక్క భారీ పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. -
ఆదిశేషు విశ్రాంతి గృహంలో శ్రీవాణి టికెట్ల జారీ తాత్కాలిక కేంద్రం
శ్రీవాణి ట్రస్టు భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని తితిదే ఈవో శుక్రవారం పరిశీలించి అక్కడ వసతులు లేకపోవడాన్ని గుర్తించారు. -
మహిళా సాధికారతే లక్ష్యం
మహిళా సాధికారతే లక్ష్యంగా ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి తెలిపారు. -
త్వరలోనే పలువురు రెవెన్యూ అధికారుల సస్పెన్షన్
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైకాపా నేతలు చెప్పినట్లుగా తలాడించి భూ అక్రమాలకు ఆస్కారమిచ్చిన రెవెన్యూ అధికారులపై వేటు పడనున్నట్లు తెలిసింది. ఇద్దరు ఆర్డీవో స్థాయి అధికారులతో పాటు పలువురు తహసీల్దార్లను సస్పెండ్ చేయనున్నట్లు సమాచారం. -
సుంకేసుల గేట్లకు వరద ముప్పు
కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయం వద్ద గేట్లు తుప్పుపట్టి ఒక గేటు వద్ద తాడు (రోప్) తెగిపోయింది. ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి భారీగా వస్తున్న వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదల్లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. -
భీమిలి బీచ్ వద్ద నిర్మాణాలపై సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు
విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి సమీపంలో కాంక్రీట్ నిర్మాణాల కూల్చివేత విషయంలో జీవీఎంసీ సహాయ సిటీ ప్లానర్ తుది ఉత్తర్వులను సవాలు చేస్తూ వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సింగిల్ జడ్జి విచారణ చేయడం సబబు అని హైకోర్టు సీజే నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. -
వైద్య విద్యార్థినికి లోకేశ్ ఆర్థికసాయం
విదేశాల్లో వైద్య విద్యనభ్యసిస్తున్న గుంటూరు జిల్లా విద్యార్థినికి మంత్రి నారా లోకేశ్ ఆర్థిక సాయం అందజేశారు. మంగళగిరి మండలం చినకాకానికి చెందిన గండికోట కార్తీక ఉజ్బెకిస్తాన్లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీలో నాలుగో ఏడాది చదువుతోంది. -
జగన్ పాలనంతా అరాచకమే
‘జగన్ పాలన ఐదేళ్లూ అరాచకమే.. నిత్యం దళితులు, మైనార్టీలు, మహిళలు అందరిపై వైకాపా నాయకులు దాడులు చేసి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేశారు. -
విజయవాడ దంతవైద్య కళాశాల సీట్లు ఇకపై రాష్ట్ర విద్యార్థులకే
విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలకు రాష్ట్రస్థాయి హోదాను తొలగిస్తూ (డీ నోటిఫై) ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన నుంచి ఇప్పటివరకు ఈ కళాశాలకు ఉన్న హోదా రీత్యా.. -
ఆ నిబంధనను సవరించాలి
ప్రతి పది లక్షల మందికి 100 ఎంబీబీఎస్ సీట్లు పరిమితం చేయాలని జాతీయ వైద్య కమిషన్ 2023 ఆగస్టు 16న తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒంగోలు తెదేపా ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
జలగండంలోనూ పోరాటమే!
మన్యంలో వాగులు, గెడ్డలు ఉప్పొంగడంతో రాకపోకలకు గిరిజనులు సాహసమే చేస్తున్నారు. అత్యవసర సేవలందించేందుకు ప్రభుత్వ సిబ్బంది కష్టాలూ వర్ణనాతీతం. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం సున్నంపాడు నుంచి నూరుపూడి వెళ్లే విద్యుత్తు లైను దెబ్బతిని సరఫరా నిలిచింది. -
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసు పునరుద్ధరణ
బెంగళూరు నుంచి కర్నూలుకు విమాన సర్వీసును పునరుద్ధరించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి శుక్రవారం వెల్లడించారు. గతంలో ఇండిగో ఎయిర్లైన్స్ బెంగళూరు నుంచి కర్నూలు (ఓర్వకల్లు విమానాశ్రయం)కు సర్వీసు నడిపేదని, అనివార్య కారణాలతో దీన్ని రద్దు చేసినట్లు పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?