వైకాపా అవినీతి ‘పురం’పర!
వైకాపాలోని పెద్ద తలకాయలన్నీ.. గనులు, మద్యం, ఇసుకలో వేల కోట్లు కొల్లగొడితే.. ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఛోటా నాయకులు.. ఊళ్ల మీద పడి దోచుకుతింటున్నారు.
పట్టణ స్థానిక సంస్థల్లో జగన్ అనుచరుల దోపిడీ
అక్రమ వసూళ్లతో అవినీతి కూపాలుగా పురపాలికలు
ఈనాడు, అమరావతి
వైకాపాలోని పెద్ద తలకాయలన్నీ.. గనులు, మద్యం, ఇసుకలో వేల కోట్లు కొల్లగొడితే.. ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఛోటా నాయకులు.. ఊళ్ల మీద పడి దోచుకుతింటున్నారు. నగరాలూ, పురపాలికల ఆధ్వర్యంలోని దుకాణాలు, కల్యాణ మండపాలు, మార్కెట్ల.. అద్దెలూ, లీజుల పునరుద్ధరణ, కొత్త కేటాయింపుల్ని ఆదాయ వనరులుగా మలుచుకుని.. తమ జేబుల్ని నింపుకొంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అందక.. ఇప్పటికే పురపాలికల్లో అభివృద్ధి కుంటుపడింది. మూలిగే నక్కమీద తాడిపండు పడ్డట్టుగా.. స్థానికంగా వచ్చే కొద్దిపాటి ఆదాయాన్నీ పురపాలికలకు అందకుండా.. దోచుకుంటున్నారు వైకాపా నాయకులు. ‘పట్టణ స్థానిక సంస్థల్లో అవినీతి పోవాలి. నీతివంతమైన పాలన అందించాలి. ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించాలి..’ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కొత్తలో పురపాలక సంస్థలపై నిర్వహించిన సమీక్షలో జగన్ వల్లించిన పాలనా సూక్తులు ఇవి. కానీ వాస్తవంలో ఆయన ప్రభుత్వ పనితీరు మొదటిరోజు నుంచీ.. ‘దోచుకోవడం, దాచుకోవడం’లా సాగింది. వైకాపా నేతలు కూడా తమ ముఖ్య నేత స్ఫూర్తితో రెచ్చిపోయారు. ఇసుకనుంచీ తైలం తీయవచ్చన్నట్లు... ప్రతి పనిలోనూ వసూళ్లకు బరి తెగిస్తున్నారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ వైకాపా పాలనలోనే ఉన్నాయి. ఆ పార్టీ మేయర్లు, ఛైర్మన్ల నుంచి కార్పొరేటర్, కౌన్సిలర్ల వరకు అత్యధిక చోట్ల పట్టణ స్థానిక సంస్థలను అవినీతి కూపాలుగా మార్చేశారు. వీరేం చేసినా అధికారులు ‘జీ హుజూర్’ అనాల్సిందే. మొదట్లో సూక్తి ముక్తావళి వినిపించిన సీఎం జగన్కు ప్రస్తుతం ఈ అవినీతి అస్సలు కనిపించడం లేదు. అక్రమ వసూళ్లపై ప్రజలు పెడుతున్న గగ్గోలు వినిపించడం లేదు.
సీమలో అవినీతి ‘గేట్లు’ తెరిచారు..
తిరుపతి నగరపాలక సంస్థ ఆదాయానికి వైకాపా నేతలు భారీగా గండి కొడుతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ మార్కెట్లో గేట్ల(ఆసీళ్లు) కాంట్రాక్టు తీసుకుని.. నగరంలో ఇతర చోట్లా చిరు వ్యాపారులు, రైతులు, వాహనదారుల నుంచి ముక్కుపిండి గేట్లు రాబడుతున్నారు. నగరపాలక సంస్థకు ఏడాదికి కట్టేది రూ.2.3 కోట్లయితే... దానికి రెండింతలు లాగించేస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని జేఎల్బీ మార్కెట్లో గేటు వసూళ్ల కాంట్రాక్టును వైకాపా నేతలు చేజిక్కించుకుని పురపాలక ఆదాయానికి గండికొట్టేందుకు సిద్ధమయ్యారు. 2024-25 సంవత్సరానికి మార్కెట్ వేలం ఈపాటికే నిర్వహించాల్సిన అధికారులు వైకాపా నేతల ఒత్తిడితో జాప్యం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని వేలం నిర్వహించకుండా పాత కాంట్రాక్టర్తో నెలకు రూ.6.25 లక్షలు చొప్పున కట్టేలా ఒప్పందం చేసుకున్నారు. వేలం నిర్వహిస్తే రూ.10 లక్షలకుపైగా ఆదాయం వచ్చేది.
కుప్పంలో రూ. 78 లక్షలు స్వాహా
వైకాపా నేత ఒకరికి కుప్పం పురపాలక సంఘం అధికారులు దాసోహమయ్యారు. సంతలు, మార్కెట్లు, రోడ్లపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల నుంచి పురపాలక సంఘానికి గేట్లు కింద ఏటా రూ.90 లక్షలకుపైగా ఆదాయం వచ్చేది. వ్యాపారుల తరఫున ఎంపీ మిథున్రెడ్డి అనుచరులు పురపాలికకు గత ఏడాది రూ.12 లక్షలు చెల్లించారు. దాంతో పురపాలక సంఘం రూ.78 లక్షలు నష్టపోయింది.
ఇదో రకమైన దందా...
- భీమవరం మార్కెట్ కూడలి వద్ద పురపాలక వాణిజ్య సముదాయంలో దుకాణాలు తీసుకున్న వైకాపా నేతలు అద్దెలు సరిగా చెల్లించడం లేదు. ఆపై భవనాల్లో ఇష్టారాజ్యంగా మార్పులు, చేర్పులు చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. కొందరైతే దుకాణాల ముందు వైకాపా జెండాలు పెట్టి అద్దె చెల్ల్లించకుండా ఉద్యోగులపై రుబాబు చేస్తున్నారు.
- కాకినాడ నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల్లో బినామీల హవా నడుస్తోంది. తొమ్మిది మున్సిపల్ కాంప్లెక్స్లలో 186 దుకాణాల నుంచి రూ.2.44 కోట్ల అద్దె బకాయిలు రావాలి. చెల్లించని వారిలో ఎక్కువగా వైకాపా నేతలే ఉన్నారు. గాంధీనగర్ కాంప్లెక్స్లో దుకాణం అద్దెకు తీసుకున్న వైకాపా నేత ఒకరు ఒప్పందానికి విరుద్ధంగా షాపుని రెండుగా విభజించి అద్దెకు ఇచ్చారు. పాత మున్సిపల్ కార్యాలయం కాంప్లెక్స్లో వైకాపా నేతలే ఇతురులకి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక వాణిజ్య సముదాయంలో అద్దెకు తీసుకున్న దుకాణాన్ని వైకాపా నేత ఒకరు ప్రభుత్వ మద్యం షాపు నిర్వహణకు ఇచ్చారు. అక్కడ మద్యం షాపు నిర్వహించరాదని పాలకవర్గం తీర్మానం చేసినా బేఖాతర్ చేస్తున్నారు.
- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక లాడ్జి భవనంలో దుకాణాలు, గోదాములను వైకాపా నేతలు ఆక్రమించి వాటిని అద్దెలకు ఇచ్చి సొమ్ముచేసుకుంటున్నారు. విషయం అధికారులకు తెలిసినా వైకాపా పెద్దల ఒత్తిడితో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నేతల ఆక్రమణలతో పురపాలిక ఆదాయానికి ఏటా రూ.లక్షల్లో గండి పడుతున్న విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళుతున్నా స్పందన లేదు.
గ‘లీజు’ పనులు...!
- విశాఖలో పూర్ణా మార్కెట్ నుంచి నగరపాలక సంస్థకు వెళ్లాల్సిన ఆదాయం కొందరి వైకాపా నేతల జేబుల్లోకి చేరుతోంది. అద్దెల రూపంలో 2022-23లో రూ.1.10 కోట్ల ఆదాయం రాగా.. 2023-24 నాటికి అది రూ.90 లక్షలకు తగ్గింది. దుకాణాల అద్దె పెరగకుండా వైకాపా నేతలు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు. అధికారులకు విషయం తెలిసినా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
- విజయవాడ నగరపాలక సంస్థలో ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడొకరు హవా చెలాయిస్తున్నారు. కొత్త షాపుల కేటాయింపు, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల లీజుల పొడిగింపు, పార్కింగ్ స్థలాలు లీజులకు ఇవ్వడం, భవన నిర్మాణాలకు అనుమతులు వంటి అనేక విషయాలు ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. లీజు మొత్తం తగ్గించేందుకు, లీజు కాలాన్ని పొడిగించేందుకు.. ఇలా ప్రతి దానికీ బేరం పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.. మార్కెట్ల లీజు వసూళ్ల వేలంలో వైకాపా నేతలే పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్నారు. వీరంతా ఆ పార్టీ నేత ఒకరు చెప్పినట్లుగా వేలం పాట పాడి వీటిని ఇటీవల సొంతం చేసుకున్నారు. వేలంలో ఇతరులు పాల్గొని ఉంటే వారి మధ్య పోటీ పెరిగి పురపాలక సంఘానికి ఆదాయం ఎక్కువగా వచ్చేది.
నగరపాలక ఆదాయం నేతల జేబుల్లోకే...!
- విశాఖ నగరపాలక సంస్థలో చక్రం తిప్పే వైకాపా నేత, సీనియర్ కార్పొరేటర్ ఒకరు అక్రమ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అందిన మేరకు దోచుకుంటున్నారు. తన డివిజన్తోపాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. ఆయన ఉన్నారంటే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులూ అనుమతులు తీసుకోని భవన నిర్మాణాల జోలికి వెళ్లడం లేదు. నగరపాలక సంస్థకు కట్టాల్సిన ఫీజుల్ని వైకాపా నాయకుడే తన జేబులో వేసుకుంటున్నారు.
- తిరుపతి నగరపాలక సంస్థలో వైకాపా యువ నేత ఒకరు సాగిస్తున్న అక్రమ వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. నగరపాలక సంస్థ నుంచి వివిధ పనులకు ఇచ్చే అనుమతుల నుంచి లీజుల వరకు ఆయనదే హవా. అధికారుల పాత్ర నామమాత్రమే. ఆయన నిర్ణయమే శాసనం. ప్రత్యేకించి భవన నిర్మాణ అనుమతులు కావాలంటే ఆయనకు ముడుపులు చెల్లించుకోవాల్సిందే. యువ నేత అవినీతి, అక్రమాలతో నగరపాలక సంస్థ ఆదాయం కోల్పోతున్నా అధికారులకు పట్టదు. ఎందుకంటే అలాంటి అధికారులనే ఆయన ఏరికోరి నియమించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు
‘పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా హింసించారు. డిగ్రీ పరీక్షలు రాయనివ్వకుండా నా భవిష్యత్తును నాశనం చేశారు’ అని దళిత విద్యార్థి శశాంక్ వాపోయారు. -
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
గులకరాయి ఘటనను ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం సీఎం జగన్ సహా వైకాపా నేతలు వాడుకుంటున్నారనీ, దీనిని నిలువరించాలని కోరుతూ విజయవాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. -
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో తలెత్తిన ఒక భూవివాదంలో రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడు బొత్స సందీప్ పేరు తెరపైకి వచ్చింది. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
ఇటీవల కన్నుమూసిన తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి ఆహ్వానం
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ట్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. -
సీఎం జగన్ను ఓడించడమే మా లక్ష్యం
ఈ ఎన్నికల్లో సీఎం జగన్ను ఓడించడమే 35మాదిగ సంఘాల ఐక్యవేదిక లక్ష్యమని.. ఆ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అన్నారు. -
యువత పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోంది
‘ఓటేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించండి.. ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారో.. వారినే ముఖ్యమంత్రిగా చేయండి’ అని సౌదీ అరేబియాలోని ఆరామ్కో సంస్థతో కలిసి ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ నిర్వహిస్తున్న రావి రాధాకృష్ణ ఓటర్లకు పిలుపునిచ్చారు. -
పేదల ఇళ్లపై దా‘గూడు’ మూతలు!
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన్నాటి నుంచి... అభివృద్ధి మరచి తెదేపాపై అక్కసుతో వ్యవహరించిన జగన్... పేదలకిచ్చే ఇళ్లలోనూ ఆ అవలక్షణాన్నే ప్రదర్శించారు. -
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
సీఎం జగన్ను ఓటమి భయం పట్టుకుందా? కొన్ని నెలల క్రితం ‘వైనాట్.. 175’ అంటూ ధీమా ప్రదర్శించిన ఆయనలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లిందా? ఎందుకీ ఎదురుగాలి.. అని మదన పడుతున్నారా? -
వేసవిలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు
వేసవి సెలవుల్లో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. -
‘ఉత్తర్వుల ఎత్తివేత’పై త్వరగా విచారించండి
మాజీ మంత్రి వివేకా హత్య విషయంలో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయెద్దంటూ వెలువరించిన ఉత్తర్వులను ఎత్తివేయాలని (స్టే వెకేట్) కోరుతూ మృతుడి కుమార్తె నర్రెడ్డి సునీత, పీసీసీ అధ్యక్షురాలు, కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిల, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)లు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై త్వరగా విచారణ చేసి, ఈ నెల 8లోపు నిర్ణయం వెల్లడించాలని కడప జిల్లా న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. -
పింఛన్ పెంచలే.. కానుకకు కరుణించలే!
ముఖ్యమంత్రి జగన్ తన ఐదేళ్ల పాలనాకాలంలో దివ్యాంగులపై ఎనలేని వివక్ష చూపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం దివ్యాంగ పింఛనుదారులు 8.07 లక్షల మంది ఉన్నారు. -
అవినాష్రెడ్డి ముందస్తు బెయిలు రద్దుకు నిరాకరణ
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిలును రద్దు చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. -
పోస్టల్ బ్యాలట్ వినియోగానికి గడువు పొడిగించాలి
పోలింగ్ ముందు రోజు వరకు పోస్టల్ బ్యాలట్ వినియోగానికి అనుమతించాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్, ఏపీ ఉపాధ్యాయ సంఘం వేర్వేరు ప్రకటనల్లో ఎన్నికల సంఘాన్ని కోరాయి. -
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు నమోదవుతోంది. వడగాలులు సైతం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. -
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
సీఎం జగన్ ఎక్కడ సిద్ధం సభలు నిర్వహించినా... అక్కడ విధ్వంసం పరిపాటిగా మారింది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో శుక్రవారం సిద్ధం సభ జరిగింది. -
మీ భూమి మీది కాదు
ఆ ఆస్తి మాదే... రికార్డుల్లో మా పేరే ఉంది, మాకేం భయం... అనుకుంటే పొరపాటే. రాత్రికి రాత్రే రికార్డులు మారిపోవచ్చు. -
పింఛను కుట్ర.. తీస్తోంది ప్రాణం
సీఎం గారూ.. పండుటాకులు ఎంత ఘోష అనుభవిస్తున్నారో కనిపిస్తోందా? అభాగ్యులు పడే వేదన వినిపిస్తోందా? పదవిలో ఉండి ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేయకుండా వికృత రాజకీయ క్రీడ నడుపుతూ పింఛనుదారులపై ఇంత కిరాతకంగా వ్యవహరిస్తారా? -
సీఈఓ మౌనం.. వైకాపాకు లాభం!
ఫుట్బాల్ క్రీడలో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. -
‘అ’భివృద్ధి ‘నిల్’.. అవినీతి ఫుల్!
ఆయనో యువ ప్రజాప్రతినిధి.. బెట్టింగ్ అనగానే టక్కున గుర్తుకొస్తారు. జిల్లాలోని సహజ వనరులను సొంతవాటిలా భావించారు.. ఈ ఐదేళ్లలో యథేచ్ఛగా కొల్లగొట్టేశారు. -
జగన్ వంచనకు ఏడు ప్రాణాలు బలి
పింఛన్ల రాజకీయ క్రీడ ఏడుగురిని బలి తీసుకుంది. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పంపిణీలో నిర్లక్ష్యంతోపాటు ముఖ్యమంత్రి జగన్, ఉన్నతాధికారుల వైఫల్యం పేద కుటుంబాలకు పెద్దదిక్కును దూరం చేస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
జగన్ను వెంటాడుతోన్న ఓటమి భయం..? తాడేపల్లి ప్యాలెస్లో వాస్తుమార్పులు!
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్