వైకాపా అవినీతి ‘పురం’పర!
వైకాపాలోని పెద్ద తలకాయలన్నీ.. గనులు, మద్యం, ఇసుకలో వేల కోట్లు కొల్లగొడితే.. ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఛోటా నాయకులు.. ఊళ్ల మీద పడి దోచుకుతింటున్నారు.
పట్టణ స్థానిక సంస్థల్లో జగన్ అనుచరుల దోపిడీ
అక్రమ వసూళ్లతో అవినీతి కూపాలుగా పురపాలికలు
ఈనాడు, అమరావతి
వైకాపాలోని పెద్ద తలకాయలన్నీ.. గనులు, మద్యం, ఇసుకలో వేల కోట్లు కొల్లగొడితే.. ఆ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఛోటా నాయకులు.. ఊళ్ల మీద పడి దోచుకుతింటున్నారు. నగరాలూ, పురపాలికల ఆధ్వర్యంలోని దుకాణాలు, కల్యాణ మండపాలు, మార్కెట్ల.. అద్దెలూ, లీజుల పునరుద్ధరణ, కొత్త కేటాయింపుల్ని ఆదాయ వనరులుగా మలుచుకుని.. తమ జేబుల్ని నింపుకొంటున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు అందక.. ఇప్పటికే పురపాలికల్లో అభివృద్ధి కుంటుపడింది. మూలిగే నక్కమీద తాడిపండు పడ్డట్టుగా.. స్థానికంగా వచ్చే కొద్దిపాటి ఆదాయాన్నీ పురపాలికలకు అందకుండా.. దోచుకుంటున్నారు వైకాపా నాయకులు. ‘పట్టణ స్థానిక సంస్థల్లో అవినీతి పోవాలి. నీతివంతమైన పాలన అందించాలి. ప్రజలకు ప్రభుత్వ వ్యవస్థలపై నమ్మకం కలిగించాలి..’ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన కొత్తలో పురపాలక సంస్థలపై నిర్వహించిన సమీక్షలో జగన్ వల్లించిన పాలనా సూక్తులు ఇవి. కానీ వాస్తవంలో ఆయన ప్రభుత్వ పనితీరు మొదటిరోజు నుంచీ.. ‘దోచుకోవడం, దాచుకోవడం’లా సాగింది. వైకాపా నేతలు కూడా తమ ముఖ్య నేత స్ఫూర్తితో రెచ్చిపోయారు. ఇసుకనుంచీ తైలం తీయవచ్చన్నట్లు... ప్రతి పనిలోనూ వసూళ్లకు బరి తెగిస్తున్నారు. రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఒక్కటి మినహా మిగిలినవన్నీ వైకాపా పాలనలోనే ఉన్నాయి. ఆ పార్టీ మేయర్లు, ఛైర్మన్ల నుంచి కార్పొరేటర్, కౌన్సిలర్ల వరకు అత్యధిక చోట్ల పట్టణ స్థానిక సంస్థలను అవినీతి కూపాలుగా మార్చేశారు. వీరేం చేసినా అధికారులు ‘జీ హుజూర్’ అనాల్సిందే. మొదట్లో సూక్తి ముక్తావళి వినిపించిన సీఎం జగన్కు ప్రస్తుతం ఈ అవినీతి అస్సలు కనిపించడం లేదు. అక్రమ వసూళ్లపై ప్రజలు పెడుతున్న గగ్గోలు వినిపించడం లేదు.
సీమలో అవినీతి ‘గేట్లు’ తెరిచారు..
తిరుపతి నగరపాలక సంస్థ ఆదాయానికి వైకాపా నేతలు భారీగా గండి కొడుతున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ మార్కెట్లో గేట్ల(ఆసీళ్లు) కాంట్రాక్టు తీసుకుని.. నగరంలో ఇతర చోట్లా చిరు వ్యాపారులు, రైతులు, వాహనదారుల నుంచి ముక్కుపిండి గేట్లు రాబడుతున్నారు. నగరపాలక సంస్థకు ఏడాదికి కట్టేది రూ.2.3 కోట్లయితే... దానికి రెండింతలు లాగించేస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆదోని జేఎల్బీ మార్కెట్లో గేటు వసూళ్ల కాంట్రాక్టును వైకాపా నేతలు చేజిక్కించుకుని పురపాలక ఆదాయానికి గండికొట్టేందుకు సిద్ధమయ్యారు. 2024-25 సంవత్సరానికి మార్కెట్ వేలం ఈపాటికే నిర్వహించాల్సిన అధికారులు వైకాపా నేతల ఒత్తిడితో జాప్యం చేశారు. ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని వేలం నిర్వహించకుండా పాత కాంట్రాక్టర్తో నెలకు రూ.6.25 లక్షలు చొప్పున కట్టేలా ఒప్పందం చేసుకున్నారు. వేలం నిర్వహిస్తే రూ.10 లక్షలకుపైగా ఆదాయం వచ్చేది.
కుప్పంలో రూ. 78 లక్షలు స్వాహా
వైకాపా నేత ఒకరికి కుప్పం పురపాలక సంఘం అధికారులు దాసోహమయ్యారు. సంతలు, మార్కెట్లు, రోడ్లపై వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారుల నుంచి పురపాలక సంఘానికి గేట్లు కింద ఏటా రూ.90 లక్షలకుపైగా ఆదాయం వచ్చేది. వ్యాపారుల తరఫున ఎంపీ మిథున్రెడ్డి అనుచరులు పురపాలికకు గత ఏడాది రూ.12 లక్షలు చెల్లించారు. దాంతో పురపాలక సంఘం రూ.78 లక్షలు నష్టపోయింది.
ఇదో రకమైన దందా...
- భీమవరం మార్కెట్ కూడలి వద్ద పురపాలక వాణిజ్య సముదాయంలో దుకాణాలు తీసుకున్న వైకాపా నేతలు అద్దెలు సరిగా చెల్లించడం లేదు. ఆపై భవనాల్లో ఇష్టారాజ్యంగా మార్పులు, చేర్పులు చేస్తున్నా అధికారులకు పట్టడం లేదు. కొందరైతే దుకాణాల ముందు వైకాపా జెండాలు పెట్టి అద్దె చెల్ల్లించకుండా ఉద్యోగులపై రుబాబు చేస్తున్నారు.
- కాకినాడ నగరపాలక సంస్థ షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాల్లో బినామీల హవా నడుస్తోంది. తొమ్మిది మున్సిపల్ కాంప్లెక్స్లలో 186 దుకాణాల నుంచి రూ.2.44 కోట్ల అద్దె బకాయిలు రావాలి. చెల్లించని వారిలో ఎక్కువగా వైకాపా నేతలే ఉన్నారు. గాంధీనగర్ కాంప్లెక్స్లో దుకాణం అద్దెకు తీసుకున్న వైకాపా నేత ఒకరు ఒప్పందానికి విరుద్ధంగా షాపుని రెండుగా విభజించి అద్దెకు ఇచ్చారు. పాత మున్సిపల్ కార్యాలయం కాంప్లెక్స్లో వైకాపా నేతలే ఇతురులకి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు.
- పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పురపాలక వాణిజ్య సముదాయంలో అద్దెకు తీసుకున్న దుకాణాన్ని వైకాపా నేత ఒకరు ప్రభుత్వ మద్యం షాపు నిర్వహణకు ఇచ్చారు. అక్కడ మద్యం షాపు నిర్వహించరాదని పాలకవర్గం తీర్మానం చేసినా బేఖాతర్ చేస్తున్నారు.
- పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పురపాలక లాడ్జి భవనంలో దుకాణాలు, గోదాములను వైకాపా నేతలు ఆక్రమించి వాటిని అద్దెలకు ఇచ్చి సొమ్ముచేసుకుంటున్నారు. విషయం అధికారులకు తెలిసినా వైకాపా పెద్దల ఒత్తిడితో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. నేతల ఆక్రమణలతో పురపాలిక ఆదాయానికి ఏటా రూ.లక్షల్లో గండి పడుతున్న విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళుతున్నా స్పందన లేదు.
గ‘లీజు’ పనులు...!
- విశాఖలో పూర్ణా మార్కెట్ నుంచి నగరపాలక సంస్థకు వెళ్లాల్సిన ఆదాయం కొందరి వైకాపా నేతల జేబుల్లోకి చేరుతోంది. అద్దెల రూపంలో 2022-23లో రూ.1.10 కోట్ల ఆదాయం రాగా.. 2023-24 నాటికి అది రూ.90 లక్షలకు తగ్గింది. దుకాణాల అద్దె పెరగకుండా వైకాపా నేతలు వ్యాపారులతో కుమ్మక్కయ్యారు. అధికారులకు విషయం తెలిసినా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.
- విజయవాడ నగరపాలక సంస్థలో ముఖ్య ప్రజాప్రతినిధి కుటుంబ సభ్యుడొకరు హవా చెలాయిస్తున్నారు. కొత్త షాపుల కేటాయింపు, కల్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్ల లీజుల పొడిగింపు, పార్కింగ్ స్థలాలు లీజులకు ఇవ్వడం, భవన నిర్మాణాలకు అనుమతులు వంటి అనేక విషయాలు ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. లీజు మొత్తం తగ్గించేందుకు, లీజు కాలాన్ని పొడిగించేందుకు.. ఇలా ప్రతి దానికీ బేరం పెట్టి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.
- కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు.. మార్కెట్ల లీజు వసూళ్ల వేలంలో వైకాపా నేతలే పాల్గొని కాంట్రాక్టు దక్కించుకున్నారు. వీరంతా ఆ పార్టీ నేత ఒకరు చెప్పినట్లుగా వేలం పాట పాడి వీటిని ఇటీవల సొంతం చేసుకున్నారు. వేలంలో ఇతరులు పాల్గొని ఉంటే వారి మధ్య పోటీ పెరిగి పురపాలక సంఘానికి ఆదాయం ఎక్కువగా వచ్చేది.
నగరపాలక ఆదాయం నేతల జేబుల్లోకే...!
- విశాఖ నగరపాలక సంస్థలో చక్రం తిప్పే వైకాపా నేత, సీనియర్ కార్పొరేటర్ ఒకరు అక్రమ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తూ అందిన మేరకు దోచుకుంటున్నారు. తన డివిజన్తోపాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలకు అండగా నిలుస్తున్నారు. ఆయన ఉన్నారంటే పట్టణ ప్రణాళిక విభాగం అధికారులూ అనుమతులు తీసుకోని భవన నిర్మాణాల జోలికి వెళ్లడం లేదు. నగరపాలక సంస్థకు కట్టాల్సిన ఫీజుల్ని వైకాపా నాయకుడే తన జేబులో వేసుకుంటున్నారు.
- తిరుపతి నగరపాలక సంస్థలో వైకాపా యువ నేత ఒకరు సాగిస్తున్న అక్రమ వ్యవహారాలు అన్నీ ఇన్నీ కావు. నగరపాలక సంస్థ నుంచి వివిధ పనులకు ఇచ్చే అనుమతుల నుంచి లీజుల వరకు ఆయనదే హవా. అధికారుల పాత్ర నామమాత్రమే. ఆయన నిర్ణయమే శాసనం. ప్రత్యేకించి భవన నిర్మాణ అనుమతులు కావాలంటే ఆయనకు ముడుపులు చెల్లించుకోవాల్సిందే. యువ నేత అవినీతి, అక్రమాలతో నగరపాలక సంస్థ ఆదాయం కోల్పోతున్నా అధికారులకు పట్టదు. ఎందుకంటే అలాంటి అధికారులనే ఆయన ఏరికోరి నియమించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలవరంలో జగన్ సర్కార్ తప్పటడుగులు..
2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించేందుకు రూ.55,656 కోట్ల అంచనా వ్యయంతో డీపీఆర్ను కేంద్రానికి సమర్పించారు. -
వైకాపా నేతల స్థిరాస్తి దందాకు బ్రేక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని మొన్నటి వరకు వైకాపా నేతలు సాగించిన స్థిరాస్తి దందాకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. మాజీ మంత్రి అమర్నాథ్, వైకాపా జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ కనుసన్నల్లో జరుగుతున్న విస్సన్నపేట లేఅవుట్ వ్యవహారాలకు విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్డీయే) అడ్డుకట్ట వేసింది. -
ఎస్టీగా నా హక్కులు హరించారు: రాష్ట్రపతికి శాంతి భర్త ఫిర్యాదు
ఒక గిరిజన మహిళతో చట్టవ్యతిరేకంగా వివాహేతర సంబంధం పెట్టుకొని అక్రమంగా బిడ్డను కన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ ప్రభుత్వ న్యాయవాది పోతిరెడ్డి సుభాష్రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ వివాదాస్పద అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్త మణిపాటి మదన్మోహన్, సోషియల్ డెమొక్రటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు మాదిగాని గురునాథం డిమాండ్ చేశారు. -
ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలకు.. ఆధారాలు చూపండి
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని, హత్యలు, దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ చెప్పిన లెక్కలకు ఆధారాలు చూపాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నిర్దేశించారు. -
విశాఖ పోర్టుకు అతిపెద్ద నౌక
విశాఖపట్నం పోర్టుకు గురువారం అతిపెద్ద సరకు రవాణా నౌక వచ్చింది. ఇది 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ (నీటిమట్టం నుంచి నౌక లోతు) కలిగి ఉంది. -
అమరావతిలో ల్యాండ్ పూలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరడం, అమరావతి పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అగ్రప్రాధాన్యం ఇస్తుండడంతో సమీకరణ విధానంలో భూములు ఇచ్చేందుకు పలువురు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. -
‘అంగళ్లు ఘటనలో చంద్రబాబుపై కేసులు పెట్టింది గంగాధరే!’
అంగళ్లు ఘటనలో నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు సహా తెదేపా నేతలపై హత్యాయత్నం కేసులు నమోదుచేసిన అప్పటి అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్కు ఎన్డీయే ప్రభుత్వంలో కృష్ణా జిల్లా ఎస్పీగా ఎలా పోస్టింగ్ ఇచ్చారంటూ తెదేపా ఎమ్మెల్యేల మధ్య అసెంబ్లీ లాబీల్లో గురువారం చర్చ జరిగింది. -
ఎమర్జెన్సీని మించిన అరాచకం
‘దేశంలో ఎమర్జెన్సీ సమయంలోనూ కొంతమందే బాధితులుగా ఉండి ఉంటారేమో.. కానీ గత ఐదేళ్ల వైకాపా పాలనలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం బారిన పడ్డారు. శారీరకంగా, మానసికంగా ఎన్నెన్నో బాధలు అనుభవించారు’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. -
2026 మార్చికల్లా పోలవరం
తాజా అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులు 2026 మార్చి నాటికి పూర్తవుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్పటికల్లా 41.15 మీటర్ల మినిమం డ్రా డౌన్ లెవెల్ వరకు నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన పనులు పూర్తవుతాయని వెల్లడించింది. -
వెల్లువలా పెద్దిరెడ్డి భూ బాధితులు!
అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయానికి గురువారం భూ బాధితులు పోటెత్తారు. వైకాపా హయాంలో జరిగిన కబ్జాలు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు సాగించిన దందాలపై అధికారులకు ఫిర్యాదు చేశారు. -
‘జీరో వేకెన్సీ’ ప్రచారమంతా ఉత్తదే
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో అసలు ఖాళీలు అనేవే లేకుండా ‘జీరో వేకెన్సీ’ విధానంలో పోస్టులు భర్తీ చేశామని నాటి వైకాపా ప్రభుత్వం ఊదరగొట్టిందంతా ఉత్తదేనని తేలింది. మంజూరైన పోస్టుల్లో నేటికీ 25% వరకు ఖాళీగా ఉన్నాయి. -
రెవెన్యూ రికార్డుల తారుమారు..!
రెవెన్యూ రికార్డులు తారుమారు చేశారు. దాదాపు 133 ఎకరాల పట్టాభూమి, మరో వంద ఎకరాల రెవెన్యూ పోరంబోకును మాయం చేశారు. పట్టాలు ఉన్న రైతులకే ఇప్పుడు భూమి లేదనే పరిస్థితి తీసుకొచ్చారు. -
ఏపీలో 73.46% ఇళ్లకు జల్జీవన్ మిషన్ ద్వారా తాగునీరు
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది జులై 23 నాటికి 73.46% గ్రామీణ ఇళ్లకు జల్జీవన్ మిషన్ పథకం కింద తాగునీరు అందించినట్లు కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ వెల్లడించారు. -
ఐసెట్ కౌన్సెలింగ్ నేటి నుంచి
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఐసెట్ కౌన్సెలింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్ ఉమామహేశ్వరిదేవి తెలిపారు. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష
ప్రభుత్వ భూముల పంపిణీపై పునఃసమీక్ష చేయాలని అధికారులను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోదియా ఆదేశించారు. తప్పులుంటే సవరించుకోవాలని, లేనిపక్షంలో బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పోలవరానికి పూర్తి నిధులు కేంద్రమే ఇవ్వాలి
‘ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి, ఆ స్థాయిలో నీరు నిలబెట్టేందుకు అవసరమైన మొత్తం నిధులను కేంద్రమే ఇవ్వాలి. -
తణుకు, తిరుపతి, విశాఖ, గుంటూరుల్లో టీడీఆర్ బాండ్ల కుంభకోణాలు
తణుకు పురపాలక సంఘం పరిధిలో టీడీఆర్ బాండ్ల జారీలో రూ.691.43 కోట్ల కుంభకోణం చోటుచేసుకున్నట్లు శాఖాపరమైన విచారణలో తేలిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. -
పోలవరం పూర్తి నిధుల కోసమే ఇక పట్టు!
పోలవరం ప్రాజెక్టు యావత్తు పూర్తిచేసి పూర్తిస్థాయిలో నీళ్లు నిలబెట్టేందుకు అవసరమైన నిధులన్నీ కేంద్రం ఇవ్వాల్సిందే అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. -
నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం దిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన శనివారం జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. -
ఇదీ సంగతి!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కార్గిల్ పోరు వేళ యుద్ధ భూమిలో మోదీ.. పాతికేళ్ల నాటి ఫొటోలు వైరల్
-
రివ్యూ: పురుషోత్తముడు.. రాజ్తరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్