మల్లన్న సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె.మహేశ్వరి

శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె.మహేశ్వరి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు.

Published : 22 Apr 2024 05:27 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: శ్రీశైలం మహాక్షేత్రంలో కొలువైన భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జె.కె.మహేశ్వరి దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వీరికి ముందుగా ఆలయ మహాద్వారం వద్ద దేవస్థానం ఈవో డి.పెద్దిరాజు స్వాగతం పలికారు. అనంతరం న్యాయమూర్తి దంపతులు స్వామివార్లకు రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి దంపతులకు అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు, వేదపండితులు వేదాశీర్వనాలు, ఈవో స్వామివార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. న్యాయమూర్తి వెంట కర్నూలు జిల్లా న్యాయమూర్తి ఎన్‌.శ్రీనివాసరావు, నంద్యాల జూనియర్‌ సివిల్‌ జడ్జి వి.ఆదినారాయణ, ఆత్మకూరు డీఎస్పీ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని