ఇసుక అక్రమ తవ్వకాలు నిజమే
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు.
నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి
గుత్తేదారు సంస్థ జీసీకేసీపై చర్య తీసుకోకపోతే ఖజానాకు నష్టం
కృష్ణా జిల్లా గనులశాఖ సంచలన నివేదిక
బిత్తరపోయిన ఉన్నతాధికారులు
ఆ నివేదిక మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు?
ఈనాడు - అమరావతి
అనుమతులు లేకపోయినా భారీ యంత్రాలతో ఇష్టానుసారం ఇసుక తవ్వకాల దందా నిజమేనని ఓ గనులశాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆ శాఖలో సంచలనంగా మారింది. అన్ని జిల్లాల అధికారులూ.. అక్రమాలను కప్పిపుచ్చుతూ నివేదికలు పంపితే, కృష్ణా జిల్లా అధికారి మాత్రం ఉల్లంఘనలు వాస్తవమేనంటూ ఉన్నది ఉన్నట్లు పంపారు. ‘ఇసుక గుత్తేదారు సంస్థ జీసీకేసీ.. తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడింది. లీజు విస్తీర్ణాన్ని దాటి తవ్వేసింది. అసలు లీజు మంజూరు కానిచోట్ల కూడా తవ్వింది’ అంటూ తన నివేదికలో పేర్కొన్నారు. దీంతో ఆ శాఖ ఉన్నతాధికారులకు దిక్కుతోచట్లేదు. కోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేస్తే ఇబ్బందులు తప్పవని, అందుకే ఆ నివేదికను మార్చేందుకు తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్నారని తెలిసింది.
భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలకు పర్యావరణ సంస్థ అనుమతి ఇవ్వకపోయినా, లీజు మంజూరు కాకపోయినా తవ్వేస్తున్నారంటూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. అయితే కొన్నినెలల క్రితం జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలతో అన్ని జిల్లాల్లో కలెక్టర్లు ఇసుక తవ్వకాలు లేని రీచ్లనే పరిశీలించి, అక్రమ తవ్వకాలు లేవంటూ నివేదికలు ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల సూచనలతో.. గనులశాఖ ఉన్నతాధికారులు చెప్పినచోటే కలెక్టర్లు తనిఖీలు చేసి మమ అనిపించారు. అనంతరం వారంతా ఒకేలా ఎన్జీటీకి నివేదిక ఇచ్చారు. కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖ అధికారులు మాత్రం రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో భారీగా ఉల్లంఘనలు జరిగాయంటూ ఆధారాలతో నివేదిక అందజేశారు. దీంతో కలెక్టర్ల తీరును ఎన్జీటీ ఆక్షేపించింది. హైకోర్టులో పిల్పై విచారణ సందర్భంగా.. ఎన్జీటీకి కలెక్టర్లు ఇచ్చిన తప్పుడు నివేదిక అంశం ప్రస్తావనకు వచ్చింది. దీంతో కలెక్టర్ల బృందం మరోసారి రీచ్లను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు రీచ్ల్లో మళ్లీ తనిఖీలు చేసి, ఎక్కడా అక్రమ తవ్వకాలు లేవని ధ్రువీకరించాలంటూ గనులశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది గత నెల 22న మెమో జారీచేశారు. ఈ నివేదికలు అన్నీ వచ్చేలా గనులశాఖ సంచాలకులు పర్యవేక్షించాలని పేర్కొన్నారు.
మళ్లీ అక్రమాలు లేవంటూ...
అన్నమయ్య, అనంతపురం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, తిరుపతి, చిత్తూరు, కర్నూలు, వైయస్ఆర్, విజయనగరం జిల్లాల కలెక్టర్లు నివేదిక ఇవ్వాలి. అన్ని జిల్లాల్లో ఇసుక గుత్తేదారులకు ముందే చెప్పి, తనిఖీలు చేశారు. ఎక్కడా ఉల్లంఘనలు లేవని, కొన్నిచోట్ల నదుల్లో గుంతలు ఉన్నా, స్థానికులు ఇళ్లు కట్టుకునేందుకు ఇసుక తవ్వి, ఎడ్లబండ్లలో తరలించుకున్నారని నివేదిక ఇచ్చినట్లు సమాచారం.
అక్రమాలు జరిగాయన్న కృష్ణా జిల్లా అధికారి
కృష్ణా జిల్లా గనులశాఖ అధికారితో కూడిన బృందం ఇటీవల రొయ్యూరు, పాపవినాశనం, లంకలపల్లి, అప్పారావుపేట తదితర రీచ్లు పరిశీలించింది. ఇందులో రెండు అనుమతి లేని రీచ్లని గుర్తించింది. భారీ యంత్రాలతో కొన్ని నెలలుగా తవ్వినట్లు తేల్చింది. రెవెన్యూ, పోలీసు, సెబ్ అధికారులతో కూడా ధ్రువీకరణ తీసుకొని, అక్రమాలు నిజమంటూ నివేదిక ఇచ్చింది. ఈ జిల్లా ఇసుక గుత్తేదారైన జీసీకేసీ సంస్థ ఎన్నో తప్పులు చేసిందని, అనుమతిచ్చిన రీచ్ బయట తవ్వేసిందని, అసలు అనుమతులు లేనిచోటా తవ్విందని జిల్లా గనులశాఖ అధికారి తుది నివేదిక ఇచ్చారు. తప్పుచేసిన జీసీకేసీ సంస్థపై చర్యలు తీసుకోవాలని, ఆ సంస్థ తీరుతో ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగిందని నివేదికలో స్పష్టం చేసినట్లు తెలిసింది.
హైకోర్టుకు ఏం చెప్పాలి?
ఈ నివేదికతో గనులశాఖ ఉన్నతాధికారులు తల పట్టుకుంటున్నారు. దీన్ని హైకోర్టుకు సమర్పిస్తే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని భావిస్తున్నారు. దీంతో కృష్ణా జిల్లా గనులశాఖ అధికారి ద్వారా మరోసారి అనుకూల నివేదిక ఇప్పించేందుకు ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. ఆయన మాత్రం.. వాస్తవాలు దాచితే మున్ముందు ఇబ్బందని, అందుకే ఉన్నది ఉన్నట్లు నివేదిక ఇచ్చానని, దాన్ని మార్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకు కూర్చున్నట్లు సమాచారం. ఆయన్ను సెలవుపై పంపి, వేరే అధికారిని నియమించి, అనుకూల నివేదిక తెప్పించాలని చూస్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఈ కేసు ఈ నెల మొదటివారంలోనే హైకోర్టులో విచారణకు రాగా, కలెక్టర్ల నివేదికలు అన్నీ రాకపోవడంతో వచ్చే నెల 8కి వాయిదా వేశారు. ఆలోపు కృష్ణా జిల్లా నివేదికను మార్చేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించకపోతే వారి ఫ్లాట్లకు కరెంట్ కట్ చేస్తామని రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో పనిచేస్తూ ఉచిత వసతి సదుపాయాన్ని వినియోగించుకుంటున్న ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. -
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
జగన్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఉద్యోగులపై 1,500కుపైగా కేసులు పెట్టారని, చివరికి ధర్నా చేశారంటూ 80ఏళ్ల వయసుపైబడిన పెన్షనర్లపైనా కేసులు నమోదు చేశారని అఖిల భారత రాష్ట్ర పెన్షనర్ల సమాఖ్య మాజీ ప్రధాన కార్యదర్శి పూర్ణచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(బీఈడీ) ప్రవేశాల కౌన్సెలింగ్ను ఉన్నత విద్యామండలి ఏడాది పొడవునా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
బ్యాంకుల్లో నగదు జమకాని వారికి.. 4న ఇంటింటికీ పింఛన్ పంపిణీ
బ్యాంకు ఖాతాలు మనుగడలో లేని కారణంగా పింఛను నగదు జమకాని వారికి మే 4వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటింటికీ పంపిణీ చేయనున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్కుమార్ వెల్లడించారు. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై సీఎం వెనక్కి తగ్గరు: మంత్రి పెద్దిరెడ్డి
ల్యాండ్ టైటిలింగ్ యాక్టును సీఎం జగన్ కచ్చితంగా అమలు చేసి తీరుతారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
అన్నం ముద్దపైనా అక్కసే!
అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టుగా.. విపక్షాలపైన తనకున్న ఉక్రోషాన్ని.. నిర్భాగ్యులమీద చూపారు జగన్... గత తెదేపా ప్రభుత్వం తెచ్చిన అన్న క్యాంటీన్లను వచ్చీరాగానే మూసేయించారు... రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటుచేసిన ఆ క్యాంటీన్లు.. రోజూ వేల మంది క్షుద్భాద తీర్చేవి. దీనిపై విమర్శలు పెరిగాక.. ‘ఆహా’ క్యాంటీన్లు తెచ్చినా... జగన్ పాలనలానే.. దిక్కూదివానం లేనట్లుంది వాటి పరిస్థితి. -
‘అన్నపూర్ణ’ అప్పుల కుప్ప
అద్భుత రాజధానిగా రూపుదిద్దుకుంటున్న అమరావతి... 70 శాతం పూర్తయిన పోలవరం... ఆశతో దూసుకొచ్చిన వందలాది ఐటీ పరిశ్రమలతో... ... కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన బిడ్డలా... ఐదేళ్ల కిందట జగన్ చేతికొచ్చింది ఆంధ్రావని! -
‘భీమ్లీ’ ఖల్ నాయక్!
‘‘నాయక్ నహీ.. ఖల్ నాయక్ మై హూ..!’’ అంటూ ఆయన చేసే హడావుడి అంతాఇంతా కాదు. ‘‘ఏం చేస్తున్నావ్? యూనిఫామ్ తీసేయ్..!’’ అంటూ పోలీసులపైనే రుసరుసలాడతారు. -
అంతా.. ఆ ఏడు చేపలకే!
వడ్డించే వాడు జగన్ అయితే... కేటాయింపులు ఇలాగే ఉంటాయి మరి. తన తండ్రి హయాంలోనే కంపెనీలతో రూ.లక్షల కోట్ల ‘క్విడ్ప్రోకో’ లావాదేవీలకు తెరతీసిన ఆయన... తాను గద్దెనెక్కాక ‘గంపగుత్త’ సూత్రాన్ని అనుసరించారు. -
వైకాపా హయాంలో ఎస్సీ కమిషన్ నిర్వీర్యం
వైకాపా హయాంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు కట్టెపోగు బసవరావు ధ్వజమెత్తారు. సమతా సైనిక్దళ్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
14 నియోజకవర్గాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్
అత్యంత సమస్యాత్మకమైన 14 నియోజకవర్గాల పరిధిలో మొత్తం అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ పెడతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
పథకాలకు గండికొట్టి.. గొంతెండబెట్టి!
ధ్వంసరచనే తప్ప దార్శనికత లేని జగన్ పాలనలో పట్టణాల్లో గుక్కెడు తాగునీళ్లూ కరవయ్యాయి. తెదేపా తెచ్చిందన్న ఏకైక కారణంతో రూ.వేల కోట్ల పథకాలను ఎండబెట్టిన ఈ నీరో చక్రవర్తి ఎండల్లో జనం గొంతెండి అలమటిస్తుంటే... తాడేపల్లి ప్యాలెస్లో ఫిడేల్ వాయిస్తూ కూర్చున్నారు... కేవలం తన పంతం కోసం జనం సంక్షేమాన్ని వదిలేసిన ఈ ప్రభుత్వాధినేతను ఏమని పిలవాలి? -
పార్టీలకు కొమ్ముకాస్తున్న కొందరు ఐఏఎస్ అధికారులు
‘ప్రజలకు మేలు చేయాల్సిన కొందరు ఐఏఎస్లు... తమ స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలకు కొమ్ముకాస్తున్నారు. అలాంటి వారిని రాజద్రోహులుగా ప్రకటించాలి’ అని ఆర్థిక నిపుణుడు, ప్రభుత్వ మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీవీ రమేష్ డిమాండ్ చేశారు. -
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887
రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,14,01,887కు చేరింది. ఈ ఏడాది జనవరి 22న విడుదల చేసిన తుది జాబితాలో 4,08,07,356 మంది ఓటర్లు ఉన్నారు. -
ప్రకాశం జిల్లా ఎండ్రపల్లిలో 47.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
భగభగ మండే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కర్నూలు, కావలి, నంద్యాల, ఆరోగ్యవరం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుంచి 5 డిగ్రీలు పెరిగాయి. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్పై వింత నాటకం
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రచారం చేసే ఎన్నికల సంఘం.. ఉద్యోగులపై మాత్రం కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. -
బకాయిలు చెల్లించకపోతే వైద్యం అందించలేం
బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 4 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) నగదు రహిత సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ (ఆశా) ప్రకటించింది. -
కేజీబీవీ సిబ్బంది సేవల్లో ప్రభుత్వం కొత్త మెలిక
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయా(కేజీబీవీ)ల ఒప్పంద ఉపాధ్యాయినుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..